tag:blogger.com,1999:blog-68921034544199783802024-02-20T06:54:33.860+05:30....తెలుగు మీడియా కబుర్లు....నైతిక జర్నలిజం ధ్యేయంగా...నిజాయితీపరులకు వెన్నుదన్నుగా...Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger873125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-36201680916816260642024-02-09T08:25:00.005+05:302024-02-09T08:25:36.902+05:30 టైసన్ కుమార్ శర్మ-గడ్డం-ఇంస్టా కథా కమామీషు!<p><b>కూరగాయలు ఎప్పుడూ ఒకరి దగ్గరే కొనడం. </b></p><p><b>కిరాణా సరుకులు ఒకే దుకాణం నుంచి తేవడం. </b></p><p><b>షూ పాలిషింగ్ కు ఒక వ్యక్తి దగ్గరికే వెళ్లడం. </b></p><p><b>కటింగ్ ఒక సెలూన్ లోనే, ఒకే వ్యక్తితో చేయించుకోవడం. </b></p><p>--ఇలాంటి పనులన్నీ సరదా కలిగించేవి. ఖైరతాబాద్ చౌరస్తా మూలలో రోడ్డు మీద చిన్నచెప్పుల దుకాణం నడిపిన అయన దగ్గరకు 20 ఏళ్లకు పైగా వెళ్ళాను. చెప్పులు/షూ తీసుకుపోవడం... ఇరిగిపోయిన స్టూల్ మీద కూర్చొని ఆయన పనిలో నిమగ్నమై చేస్తుండగానే మంచీ చెడూ, వర్తమాన రాజకీయ సామాజిక అంశాలు మాట్లాడడం... పిల్లల గురించి అడగడం... అయిన దానికన్నా కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇవ్వడం... తాగుడు మంచిది కాదని చెప్పడం-ఇదీ తంతు. నెలలో ఒకటి రెండు సార్లు ఇది జరిగేది. ఒక గంట ఈ పనికి పోయినా ఆయన దగ్గరికే వెళ్ళే కబుర్లాడితే అదో తృప్తిగా అనిపించేది. కానీ, ఆయన కనిపించకపోయేసరికి ఏదో వెలితి, ఏదో కోల్పోయిన భావన. కేపీహెచ్బీ కి ఒక మూడేళ్ళ కిందట మారినా ఖైరతాబాద్ వెళ్ళినప్పుడల్లా అయన కనిపిస్తాడేమోనని షాపులో తొంగి చూసి భంగపడ్డా, బాధపడ్డా. వాళ్ళ అబ్బాయి విద్యుత్ శాఖలో పనిచేస్తాడని తెలిసి అక్కడికి వెళ్లాలని, మనోడి గురించి వాకబు చేయాలని అనుకున్నా కానీ కుదరలేదు. </p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjHElr5GYcykGn-1RnyGQOCWR5TD4U7tOMaTT9tbHBZ2WUZNOqLv0zwT4RcvR9jUHXcQPBn02BZvFCI0PqQ4OX0-EKB31oXaaImPJbMKiV2-T_1OTleBG3PKg0AiZ4jAftY85TcZswLmwkuT20s38Q3Lmug3SLU9Z6IIOvWkTg_zqkprD3xcFw0VtjSwSU/s1449/WhatsApp%20Image%202024-02-09%20at%2008.23.55.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="1449" data-original-width="1080" height="640" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjHElr5GYcykGn-1RnyGQOCWR5TD4U7tOMaTT9tbHBZ2WUZNOqLv0zwT4RcvR9jUHXcQPBn02BZvFCI0PqQ4OX0-EKB31oXaaImPJbMKiV2-T_1OTleBG3PKg0AiZ4jAftY85TcZswLmwkuT20s38Q3Lmug3SLU9Z6IIOvWkTg_zqkprD3xcFw0VtjSwSU/w478-h640/WhatsApp%20Image%202024-02-09%20at%2008.23.55.jpeg" width="478" /></a></div><br /><p><br /></p><p>కేపీహెచ్బీ లో షూ పాలిషింగ్ కు ఒకాయనను పట్టాను. అయన దగ్గర కూర్చుని ఖైరతాబాద్ మిత్రుడి గురించి చాలా ఆవేదనతో చెప్పాను ఒక రెండు నెల్ల కిందట. ఆశ్చర్య పోవడం అయన వంతయ్యింది. నేను చెప్పిన గుర్తులు విన్నాక--'సార్... మా కాకా మీకు తెలుసా? నాకు వరసకు బాబాయి. మొన్ననే కాలం చేశాడు,' అని కేపీహెచ్బీ మిత్రుడు చెబితే చాలా బాధేసింది. అయన గురించి మేము చాలా సేపు మాట్లాడుకున్నాం. అప్పట్లో ఆయనా, నేను ఖైరతాబాద్ షాపు దగ్గర ఎన్ని విషయాలు మాట్లాడుకున్నామో... అన్నీ గిర్రున బుర్రలో తిరిగాయి. మంచి శ్రమ జీవి. ఎక్కువ హిందీలో మాట్లాడేవాడు. పాపం తాగుడు దెబ్బతీసిందేమో? అని నేను కేపీహెచ్బీ మిత్రుడితో అన్నాను. 'సార్, అదే పెద్ద తప్పయింది. తాగినన్ని రోజులు మా కాకా కు ఏమీ గాలే! మస్తుగ ఉండే. రెండేళ్ల కిందట తాగుడు ఆపిండు. రెండు నెల్లకే కలిసిపోయిండు," అని చావు కబురు చెప్పాడు. నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. మనసులోనే ఆయనకు నివాళి అర్పించి కకావికలమైన మనసుతో ఇంటికి వచ్చా. బక్క పలచటి వ్యక్తి. అయన చెప్పులు కుట్టడం గానీ, పాలిష్ చేయడం గానీ దగ్గరుండి చూస్తుంటే ఒక కళాకారుడు చిత్రం వేసినట్లే ఉండేది. ఎంతో శ్రద్ధతో, ఏకాగ్రతతో ఆ పనిచేసి మన చెప్పులు/ షూ మనకు ఇస్తున్నప్పుడు ఆ కళ్ళలో ఒక మెరుపు ఉండేది. 'భాయ్... బహుత్ అఛ్ఛా కామ్ కియా ఆప్. ఫిర్ మిలేంగే,' అని చెప్పి ఇరవయ్యో, ముప్పయ్యో ఎక్కువ ఇస్తుంటే ఆ కళ్ళతో ఒక గర్వం ఉండేది. మన పనితనం వల్లనే కదా... ఈ సారు ఎప్పుడూ వచ్చేది, అయిన దానికన్నా ఎక్కువ ఇచ్చేది... అన్న ఫీలింగ్ కనిపించేది. పాపం, తాగుడు ఆపి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళాడు నా పాత మిత్రుడు. మరణానికి కారణమైన వాస్తవం ఇదై ఉండదు కానీ ప్రస్తుతానికి ఈ కుటుంబం నమ్ముతున్నట్లు మనమూ నమ్మడమే. ఐ మిస్ యూ, భాయ్. </p><p>ఇంకా నేను నయం, నా ప్రియ మిత్రుడు రమేష్ (ఖమ్మం మెడికల్ శాఖ) గడిచి 30 ఏళ్ల కు పైగా ఒకే బార్బర్ దగ్గరకు వెళ్తున్నాడు. బార్బర్ అనే మాట వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని దూరం చేస్తుంది కాబట్టి ఆ మాటను విరమించుకోవడం సబబు. కొత్తగూడెం లో మాకు డిగ్రీలో కటింగ్ చేసిన రామకృష్ణ దగ్గర తప్ప మా వాడు ఎక్కడా చేయించడు. వాడికి వేరే ఊరికి బదిలీ అయినా వందో, రెండొందలో బస్సుకు పెట్టి వెళ్ళి మరీ రామకృష్ణ దగ్గర కటింగ్ చేయించుకుంటాడు. ఈ మధ్య నేను కొత్తగూడెం మీదుగా వెళ్తుంటే నన్ను కూడా ఆపి రామకృష్ణ దగ్గరకు తీసుకుపోయి పాత దోస్తానా ను పునః స్థాపించాడు. రమేష్, రఫీ, నేను-ముగ్గురం ఈ పాత మిత్రుల గురించి, వాళ్ళ బాగోగుల గురించి లోతుగా తన్మయత్వంతో చర్చించుకుంటాం. వాళ్లకు మనమేమి చేయగలమా? అని ఆలోచిస్తాం. అదో తృప్తి! మా ఊళ్ళో గంప తో తెచ్చి కూరలు అమ్మిన ఆమె చెప్పిన కబుర్లు, నా బాపతు అయిన నా భార్య నల్గొండలో తాను తరచూ వెళ్లే ఆకుకూరల ఆమె కూతురు పెళ్లికి డబ్బులు సర్దిన విషయం గుర్తుకు వచ్చాయి. </p><p>కేపీహెచ్బీ లో మూడేళ్ళ కిందట సెలూన్ లో ఒక ఉత్తరాది యువకుడు ఇట్లనే పరిచయం అయ్యాడు. పేరు-టైసన్ కుమార్ శర్మ అని చెప్పాడు. క్రీడలపై ఆసక్తి ఉన్న నేను అడిగాను-"మీ నాన్న గారు బాక్సర్ టైసన్ అభిమానా?" </p><p>"నహీ సార్. మేరా అస్లీ నామ్ హై గుడ్డూ శర్మ. తెల్గు మీ 'గుడ్డు' బోలెతో ఎగ్ హైనా. ఇదర్ అనేకే బాద్ పతా చాలా. ఇసీలియే మై నామ్ చేంజ్ కియా," అని తన పేరు వెనక మతలబు చెప్పాడు, అమాయకంగా ఇకిలిస్తూ. 23 ఏళ్ల పిల్లవాడు. ఒక సంక్రాంతి పండగ రోజు అరిసెలు తీసుకెళ్లి ఇస్తే భలే ఆనందించాడు. ఇంకో సారి టీ షర్ట్ లు (పాతవే కానీ మంచివి) తీసుకెళ్లి ఇచ్చా. ఐదారు తీసుకెళ్తే రెండు చాలని తీసుకున్నాడు. </p><p>ఈ గుడ్డూ శర్మ అలియాస్ టైసన్ కుమార్ శర్మ నిన్న రాత్రి నా గడ్డం ట్రిమ్ చేసి ఇంస్టా గ్రామ్ లో పెట్టుకుంటానని చెప్పి తీసుకున్న ఫోటో ఇది. రాత్రి తొమ్మిది గంటలకు షాపు మూసే సమయం లో సైతం శ్రద్దగా గడ్డం చేసి, ఫోటో తీసి, అప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టాడు. ఇలాంటి ఆత్మీయులకు మనం ఎంత చేసినా తక్కువే కదా! ఇలాంటి వాళ్లు-మనకు ఆత్మబంధువులు. </p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6892103454419978380.post-18726653241305162242022-10-22T15:36:00.002+05:302022-10-22T15:36:29.266+05:30పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలంటే...<p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhRqk4x4j5ApWMf_XqCDQ-sPdFrI3yKiTCDmWA-bgJFK_C8oJ0TBGFhU6XP3CnLd49uasI0i_Hg0g08_zHLWcI3BVYz280PCMynYGJ4rNQlt7ogMcE9Lp5-grOVX1CRvOilSbxd6Sv3wspKpZbywPjD-thB6kH65i1b1am07zuCv2yfpus0Hty_nh09/s2000/aram-9.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="2000" data-original-width="1414" height="640" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhRqk4x4j5ApWMf_XqCDQ-sPdFrI3yKiTCDmWA-bgJFK_C8oJ0TBGFhU6XP3CnLd49uasI0i_Hg0g08_zHLWcI3BVYz280PCMynYGJ4rNQlt7ogMcE9Lp5-grOVX1CRvOilSbxd6Sv3wspKpZbywPjD-thB6kH65i1b1am07zuCv2yfpus0Hty_nh09/w452-h640/aram-9.jpg" width="452" /></a></div><br /> <p></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6892103454419978380.post-72891990428664390812022-10-22T15:33:00.002+05:302022-10-22T15:33:51.946+05:30లోక్ సత్తా జేపీ గారికి ఆరు సూచనలు<p> </p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLUn1eK1ZqhcTx0N9PotZIBW6JYtrxv2-r82EBzNW1sJ7IfG3XiisRak5dZ-Te8UIHNe-iST1R4EuYxOptNu7GAhqp2d6m_OcrQ_lPUW-jOkFwFS5j_k9Q9ZJSVjWB4aDPIIAjUjnu64xU9j_ofcsO8Bx8sBvEQBeM7R0L6d5HnEwbM-R-eTfLDBMV/s2000/test.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="2000" data-original-width="1414" height="640" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLUn1eK1ZqhcTx0N9PotZIBW6JYtrxv2-r82EBzNW1sJ7IfG3XiisRak5dZ-Te8UIHNe-iST1R4EuYxOptNu7GAhqp2d6m_OcrQ_lPUW-jOkFwFS5j_k9Q9ZJSVjWB4aDPIIAjUjnu64xU9j_ofcsO8Bx8sBvEQBeM7R0L6d5HnEwbM-R-eTfLDBMV/w452-h640/test.jpeg" width="452" /></a></div><br /><p></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6892103454419978380.post-23530186607980873082022-10-22T15:30:00.002+05:302022-10-22T15:30:30.640+05:30మునుగోడులో 5 W, 1 H లెక్కే వేరు షా...మీ!<p> మిత్రులారా... నమస్తే,</p><p>నేను ఈ నెల 8 వ తేదీ నుంచి 'ఆరామ్ సే' పేరులో వర్తమాన రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, క్రీడాంశాలపై క్విక్ ఎడిట్స్ శీర్షికన కామెంటరీ రాస్తున్నాను. ఒక నిమిషంలో చదివేలా సంక్షిప్తంగా, సూటిగా, నిష్పాక్షికంగా ఉండడం దాని ప్రత్యేకత. </p><p>సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రయోగం ఇది. ఇకపై వాటిని మీతో ఈ బ్లాగ్ లో కూడా పంచుకుంటాను. </p><p>రాము </p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjKhCUm4h22mDAj1mWWAUxu_HRVkPHC5QWu1LXFiw49o6TFi3wOkKSHsIkj0NhhxqaqTUIwOFDhCG1LY3LtNyOWMqag88IwBGnxtH-XgJ7dIKcGwRbIPEkRhnbPSi0T971IQz3OiZGCvffeBLrEWDLqu_pEqcPwZvVfm1AiNJeRzVwUTNu_1NSJenFW/s2000/aram-10.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="2000" data-original-width="1414" height="821" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjKhCUm4h22mDAj1mWWAUxu_HRVkPHC5QWu1LXFiw49o6TFi3wOkKSHsIkj0NhhxqaqTUIwOFDhCG1LY3LtNyOWMqag88IwBGnxtH-XgJ7dIKcGwRbIPEkRhnbPSi0T971IQz3OiZGCvffeBLrEWDLqu_pEqcPwZvVfm1AiNJeRzVwUTNu_1NSJenFW/w581-h821/aram-10.jpeg" width="581" /></a></div><br /><p><br /></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-10775335704483629862022-10-01T19:56:00.002+05:302022-10-01T20:19:00.346+05:30ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే: 'వీక్షణం' ఎడిటర్ ఎన్.వేణుగోపాల్<p><span style="font-size: medium;">కత్తి అంచున ఉన్న దేశ ప్రజలలో ప్రగతిశీల విశాల భావజాలాన్నినింపేందుకు, సామాజిక చైతన్యం తెచ్చేందుకు పత్రికలు ప్రయత్నించాలని గత రెండు దశాబ్దాలుగా తెలుగులో ప్రత్యామ్నాయ మీడియాగా ప్రఖ్యాతి పొందిన 'వీక్షణం' పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు. </span></p><p><span style="font-size: medium;">మార్క్సిస్టు భావజాల వ్యాప్తి ధ్యేయంగా పెట్టుకున్న 'దారిదీపం' మాసపత్రికను శనివారం (అక్టోబర్ 1, 2022) సాయంత్రం జూమ్ సమావేశంలో వేణుగోపాల్ ఆవిష్కరించి ప్రసంగించారు. 'పత్రికలు-సామాజిక చైతన్యం' అనే అంశంపై అయన మాట్లాడుతూ ఈ శీర్షికలో ఉన్న రెండు పదాలూ (పత్రికలూ, సామాజిక చైతన్యం) దుష్ట సమాసంగా, విరోధ భాసలా ఇప్పుడున్నాయని అయనఆవేదన వెలిబుచ్చారు. ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే అని స్పష్టం చేశారు. </span></p><p><span style="font-size: medium;"></span></p><div class="separator" style="clear: both; text-align: center;"><span style="font-size: medium;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhaOYS-MtcB3HiCA7gKWOG0Vq1Ba4WsCnKT39EakjfWLrSQbKei91lzgmZ8VQXwKbE-cQRYNCNDx6Lft5RvPo6ZOTCP3K0-rz-6_YAX-yBBe20SnZ50jfxJi2LjkIT4paEHKx0M_rE6NzYOoYwYSwx-yb4W-s9_kq_Q5cDLps-W0PBtkyt7gcTV5Q_g/s1225/venugopal.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="931" data-original-width="1225" height="486" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhaOYS-MtcB3HiCA7gKWOG0Vq1Ba4WsCnKT39EakjfWLrSQbKei91lzgmZ8VQXwKbE-cQRYNCNDx6Lft5RvPo6ZOTCP3K0-rz-6_YAX-yBBe20SnZ50jfxJi2LjkIT4paEHKx0M_rE6NzYOoYwYSwx-yb4W-s9_kq_Q5cDLps-W0PBtkyt7gcTV5Q_g/w640-h486/venugopal.jpg" width="640" /></a></span></div><span style="font-size: medium;"><br /> </span><span style="font-size: large;">1984లో తను జర్నలిజం లోకి అడుగుపెట్టినప్పుడు 'ఆబ్జెక్టివ్ న్యూట్రాలిటీ' ముఖ్యమని జర్నలిజం మొదటి క్లాసులో హితవుగా చెప్పేవారని, ఇప్పుడు అది ఆవిరైపోయింది వేణుగోపాల్ చెప్పారు. వార్త లో ఉండాల్సిన 5 డబ్ల్యూ, 1 హెచ్ సూత్రంలో ముఖ్యమైన 'ఎందుకు' అన్న ప్రశ్నకు తావులేకుండా పత్రికలు వార్తలు నింపుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. 1955 ఉప ఎన్నికల్లో రెండు ప్రధాన తెలుగు పత్రికల వైఖరి చూసి 'పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు-పత్రికలు' అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని అయన గుర్తుచేశారు. 1960 నుంచి 80 వరకూ సామాజిక చైతన్యం కొద్దోగొప్పో ఉన్నా, 1990 నుంచి మూడు దశాబ్దాలుగా తిరోగమన పథంలో పత్రికలు పయనిస్తున్నాయని చెప్పారు. </span><p><span style="font-size: large;">ప్రపంచీకరణ తర్వాత తిరోగమనంలో పత్రికల ప్రయాణం సాగుతున్నదని, ప్రగతిశీలభావాలు ఉండడం చాదస్తం గా పరిగణింపబడుతున్నదని చెప్పారు. 'న్యూస్ పేపర్ ఈజ్ ఏ ప్రోడక్ట్, నాట్ ఏ సోషల్ సర్వీస్' అని వక్కాణించిన తాను పనిచేసిన పత్రిక యజమాని మాటలు ఉటంకిస్తూ-రెండు రాష్ట్రాల్లో తెలుగు పత్రికల ధోరణులను ప్రస్తావించారు. "ఏదైనా ఒక పత్రిక చదివితే వాస్తవం తెలియదు. ప్రతి ఒక్కరు రెండో మూడో పత్రికలు చదివి బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోవాలి. ఇందువల్ల కొందరు పత్రికలు చదవడం మానేశారు," అని వేణుగోపాల్ చెప్పారు. ఆ తర్వాత వచ్చిన టెలివిజన్ ఒక 'మాదక ద్రవ్యం' అనీ, తర్వాత విజృంభించిన సాంకేతిక పరిజ్ఞానం మేలు-కీడుల కలయిక అన్నారు. "టెక్నాలజీ వచ్చి రచనను ప్రజాస్వామీకరించి మేలు చేసింది. కానీ అనియంత్రింత వ్యక్తీకరణ వల్ల కీడు జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు వెబ్ లో అబద్ధాలపై బాగా వెచ్చిస్తూ పెద్ద పెద్ద కార్యాలయాలను నెలకొల్పడంతో మహా సముద్రంలో గుక్కెడు మంచినీళ్లు దొరకని నావికుడికిలా పాఠకుడయ్యారని అభిప్రాయపడ్డారు. ఈ నిరంతర వార్తా స్రవంతిలో మొత్తం మురికినీరేనన్నారు. </span></p><p><span style="font-size: medium;">రెండు దశాబ్దాలుగా తాము ఎన్నో ఒడిదొడుకుల మధ్య నిర్వహిస్తున్న 'వీక్షణం' పత్రికకు ఉన్న మూడు లక్ష్యాలను (1. ప్రధాన వార్తా స్రవంతి లో వస్తున్న వార్తల వెనుక ప్రజా కోణాలు ప్రస్తావించడం 2. ప్రచార సాధనాల మౌనం వహిస్తున్న, విస్మరిస్తున్న ప్రజాకోణాలు చర్చించడం 3) సామాజిక ఘటనలను అర్థం చేసుకోనేలా ప్రజలకు దృక్పథం ఇవ్వడం) వివరించారు. <span style="background-color: white; color: #181818; font-family: Merriweather, Georgia, serif;">“A good newspaper is a nation talking to itself” అన్న </span><span class="authorOrTitle" face="Lato, "Helvetica Neue", Helvetica, sans-serif" style="background-color: white; color: #333333;">Arthur Miller </span>ను కోట్ చేస్తూ- తప్పుడు </span><span class="authorOrTitle" face="Lato, "Helvetica Neue", Helvetica, sans-serif" style="background-color: white; color: #333333; font-size: large;">చైతన్యాన్ని ప్రతిఘటించడం ఎలా? అన్నది </span><span face="Lato, "Helvetica Neue", Helvetica, sans-serif" style="background-color: white; color: #333333; font-size: large;">సత్యానంతర యుగంలో </span><span face="Lato, "Helvetica Neue", Helvetica, sans-serif" style="background-color: white; color: #333333; font-size: large;">పెద్ద సవాలన్నారు. </span></p><p><span style="font-size: medium;"><span class="authorOrTitle" face="Lato, "Helvetica Neue", Helvetica, sans-serif" style="background-color: white; color: #333333;">యాజమాన్యపు కేంద్రీకరణ దుష్ప్రభావాన్ని వివరిస్తూ--90 శాతం మీడియా కేవలంనలుగురు ధనిక పారిశ్రామికవేత్తల చేతిలో ఉందని వేణుగోపాల్ చెప్పారు. </span>విష విద్వేష భావజాలాన్ని పెంచుతున్న, పంచుతున్న సంఘ్ పరివార్ కమ్మేస్తున్న కారుచీకటిలో 'దారిదీపం' వెలుగు దివ్వె కావాలన్న అభిలాషను వెలిబుచ్చారు. </span></p><p><span style="font-size: medium;">Karl Marx ఫ్రీ ప్రెస్ గురించి చెప్పిన ఈ కింది ఒక మంచి మాటతో వేణుగోపాల్ ప్రసంగం ముగిసింది. </span></p><p style="background-color: white; box-sizing: inherit; color: #282828; font-family: "PT Serif script=all rev=5"; letter-spacing: 0.2px; line-height: 1.3em; padding-left: 40px;"><span style="font-size: medium;">‘‘The free Press is the ubiquitous vigilant eye of a people’s soul, the embodiment of a people’s faith in itself, the eloquent link that connects the individual with the State and the world, the embodied culture that transforms material struggles into intellectual struggles and idealises their crude material form. It is a people’s frank confession to itself… It is the spiritual mirror in which a people can see itself… It is the spirit of the State, which can be delivered into every cottage, cheaper than coal gas. It is all-sided, ubiquitous, omniscient.”</span></p><p><span style="font-size: large;">విశాలాంధ్ర ఎడిటర్, ఆర్వీ రామారావు మాట్లాడుతూ సమాచారానికి, వ్యాఖ్యకు మధ్య రేఖ చెరిగిపోయింది చెప్పారు. గతంలో 'జాతీయ స్ఫూర్తి' అనే పత్రికను విజయవంతంగా నడిపి, ఇప్పుడు 'దారిదీపం' సంపాదకుడిగా ఉన్న డీవీవీఎస్ వర్మ ప్రసంగించారు. </span></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6892103454419978380.post-82881643477315629992022-10-01T18:10:00.002+05:302022-10-01T18:10:30.821+05:30లక్ష్మణ మూర్తి సార్ కు అశ్రు-అక్షర నివాళి <p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgj9dMKLC5oWhIauw1DMudUL7RhZ7Gy1ROcyhuX0ui7rHTsOa-A6h89-445sqqQ9EV2QktQM88_atoNrx3d6ixDq0IQljRUz73lnRTGF6l3q4tN1OZn5-BRiP76kbVRDfWzmR2NQJ4lDTVv5YAbKUmqA687zhfLBNqKiFG_8Jo_p9CT6OIDp5_IqdNp/s1280/ML1.jpeg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"><b><img border="0" data-original-height="1280" data-original-width="1024" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgj9dMKLC5oWhIauw1DMudUL7RhZ7Gy1ROcyhuX0ui7rHTsOa-A6h89-445sqqQ9EV2QktQM88_atoNrx3d6ixDq0IQljRUz73lnRTGF6l3q4tN1OZn5-BRiP76kbVRDfWzmR2NQJ4lDTVv5YAbKUmqA687zhfLBNqKiFG_8Jo_p9CT6OIDp5_IqdNp/s320/ML1.jpeg" width="256" /></b></a></div><p></p><p><span style="color: #134f5c;"><b>అది 1989 వ సంవత్సరం. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఖమ్మం జిల్లా కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ మూడో లైన్. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వీధి ఆరంభంలో మేము అద్దెకు ఉండేవాళ్ళం. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వీధి చివర్లో ఉన్న ఇంట్లో లక్ష్మణ మూర్తి గారు ఉండేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారు ప్రభుత్వ లెక్చరర్. ఇంగ్లీష్ బాగా చెప్పేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>చిన్నా పెద్దా తేడా లేకుండా ఆప్యాయంగా మాట్లాడేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ప్రతి పదం స్పష్టంగా, విషయం విశదీకరించి మాట్లాడడం వారి ప్రత్యేకత. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఎవరినైనా ఇంటి పేరుతో సహా నోరారా పిలిచేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>లక్ష్మణ మూర్తి గారి కుటుంబం ప్రత్యేకమైనది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>సార్ బాల్యం కష్టాలతో కూడినందనుకుంటా. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఆ కష్టం ఎవ్వరికి వచ్చినా అండగా నిలబడేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారిని నేను ఎప్పుడూ సార్ అనే అనేవాడ్ని.</b></span></p><p><span style="color: #134f5c;"><b>మా అన్నయ్య, తమ్ముడు మామయ్య గారు అనేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>దానికి ఒక కారణం ఉంది. చివర్లో చెబుతాను. </b></span></p><p><span style="color: #134f5c;"><b>సార్ సతీమణి భారతి అత్తయ్య గారు గొప్ప మనసున్న మనిషి. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వీధిలో ఉండే దాదాపు డజను మంది పిల్లలను సొంత పిల్లల్లా చూసుకునేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారి వంటిల్లు ఎవరి కోసమైనా తెరిచి ఉండేది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>గట్టు గోపాలకృష్ణ గారనే కమ్యూనిస్టు యోధుడి కూతురు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>నిజంగా మహా తల్లి. చేతులెత్తి దండం పెట్టవచ్చు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>నవ్వుతూ గలగలా మాట్లాడడం ఆమెఅలవాటు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అమాయకత్వం, భోళాతనం కలబోత. </b></span></p><p><span style="color: #134f5c;"><b>సార్, అత్తయ్య గారు మాట్లాడుకుంటుంటే చూడముచ్చటగా ఉండేది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఎంత పరాచికంగా, హాస్యంగా మాట్లాడేవారో! </b></span></p><p><span style="color: #134f5c;"><b>చిలకాగోరింకల్లా ఉండేవారు.</b></span></p><p><span style="color: #134f5c;"><b>సార్ కాస్త తగ్గినట్లు నటించి మాట్లాడేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఆ దంపతులకు ఐదుగురు పిల్లలు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అందరికీ వారు ఆప్యాయత, ప్రేమలు మాత్రమే పంచారు.</b></span></p><p><span style="color: #134f5c;"><b>వారి ఇల్లు మా అందిరికీ ఒక పెద్ద అడ్డా, ఒక కోలాహలం. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అక్కడ ట్యూషన్ చదువుకోడానికి చాలామంది వచ్చేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>తెలిసిన వాళ్ళ అబ్బాయి ఫణి కుమార్ ను ఇంట్లో ఉంచుకున్నారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>కన్న కొడుకులా చూసుకున్నారు, కల్మషం లేకుండా. </b></span></p><p><span style="color: #134f5c;"><b>గోపాల కృష్ణ గారి మనమడూ అక్కడే చదువుకున్నాడు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఎవరెవరికో ఆశ్రయం ఇచ్చేవారా దంపతులు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>పిల్లలూ వారితో తోబుట్టువుల్లా ఉండేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఎవరైనా వచ్చి మేము ఇక్కడ ఉంటామంటే వారిద్దరూవద్దనలేరు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఈ రోజుల్లో ఇది కనీసం ఊహించగలమా? </b></span></p><p><span style="color: #134f5c;"><b>సార్ ప్రేమ పంచిన శిష్యులుపెద్ద సంఖ్యలో ఉన్నారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b> </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారి పెద్దబ్బాయి మూర్తి. సింగరేణిలో అధికారి. </b></span></p><p><span style="color: #134f5c;"><b>మేధావి లక్షణాలు బాగా ఉండేవి. </b></span></p><p><span style="color: #134f5c;"><b>రెండో అమ్మాయి ఝాన్సీ. ప్రభుత్వ టీచర్. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అక్క ఒక ప్రేమ మూర్తి. నవ్వుమొహం.</b></span></p><p><span style="color: #134f5c;"><b>మూడో అబ్బాయి శీనన్న. ప్రయివేట్ ఉద్యోగం. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అన్న సంఘ జీవి, మాకు చాలా ఆప్తుడు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>మా అన్నయ్యకు క్లాస్ మెట్, ధారాళంగా మాట్లాడతాడు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>నాలుగో అమ్మాయి సుధారాణి. అడ్వొకేట్.</b></span></p><p><span style="color: #134f5c;"><b>తల్లిగారిలా గలగలా మాట్లాడే మనిషి. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఐదో అబ్భాయి రాజు, ఐటీ ఫీల్డు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఆటపాటలతో హాయిగా గడిపేవాడు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అందరికీ సార్ స్వాతంత్య్రం ఇచ్చారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారి ఇష్టాయిష్టాల ప్రకారమే ఎదగనిచ్చారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>మా అమ్మా, నాన్నలకు ఎంతో ఇష్టమైన కుటుంబం వారిది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అమ్మ-అత్తయ్య గారు, అమ్మ-శీనన్న మాట్లాడుకుంటుంటే చూడాలి. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఈ అద్భుతమైన కుటుంబం మాకు ఒక తీపి జ్ఞాపకం. </b></span></p><p><span style="color: #134f5c;"><b>మాకే కాదు వారిని కలిసిన ఎవ్వరికైనా ఇదే అనిపిస్తుంది. </b></span></p><p><span style="color: #134f5c;"><b><br /></b></span></p><p><span style="color: #134f5c;"><b>ఒక మింగలేని చేదు నిజం-సార్ ఇప్పుడు భౌతికంగా వెళ్లిపోవడం. </b></span></p><p><span style="color: #134f5c;"><b>విధివశాత్తూ ఆ పెద్దదిక్కు పోయారు, సెప్టెంబర్ 19 న.</b></span></p><p><span style="color: #134f5c;"><b>అత్తయ్య గారు ఎంత డీలా పడ్డారో కదా! </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఈ పదిరోజుల్లో సార్ గుర్తుకురాని రోజు లేదు.</b></span></p><p><span style="color: #134f5c;"><b>అమృతప్రాయమైన పెద్దాయనను పాడు షుగర్ ఇబ్బంది పెట్టింది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>మళ్ళిన వయస్సును మరింత కుంగదీసి దెబ్బతీసింది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అనివార్యమైన కారణాల వల్ల నేను అంతిమ దర్శనం చేసుకోలేకపోయా. </b></span></p><p><span style="color: #134f5c;"><b>29 నాడు శ్రద్ధాంజలి ఘటించి వద్దామంటే ఒక ఆటంకం వచ్చింది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>నాకు జీవితంలో వెలితి మిగిల్చే అంశాల్లోఇది ఒకటి. </b></span></p><p><span style="color: #134f5c;"><b> </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారు నాకు సార్, డిగ్రీలో ఏడాదికి దాదాపు నెల చొప్పున ఇంగ్లిష్ చెప్పారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>భయం కలిగించే భాషను అరటిపండు ఒలిచినట్లు చెప్పేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఉదయం 5 గంటలకే లేచి టీ తాగుతూ ప్రేమగా చెప్పారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఇంగ్లిష్ పట్ల భయం లేకుండా చేసింది సారే. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఒక మంచిస్నేహితుడిలాగా ఆత్మస్థైర్యం ఇచ్చేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>'యూ కెన్,' అంటూ ప్రోత్సహించేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఇదంతా ఫ్రీగానే, ప్రేమతోనే. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అదీ లక్ష్మణ మూర్తి సార్ ప్రత్యేకత. </b></span></p><p><span style="color: #134f5c;"><b><br /></b></span></p><p><span style="color: #134f5c;"><b>ఆఖరుగా ఒక మూడు నెల్ల కిందట ఖమ్మంలో కలిసాను. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అదొక ఫంక్షన్, హడావుడిగా ఉంది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>సార్ లో ఓపిక ఏ మాత్రం తగ్గలేదు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>హాస్య సంభాషణ, మాట చతురత అంతే ఉన్నాయి. </b></span></p><p><span style="color: #134f5c;"><b>సార్, అత్తయ్య గారు ఇద్దరూ ఎంతో ప్రేమగా మాట్లాడారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారిద్దరినీ అక్కడే ఉండమని చెప్పి నేను భోజనం తెచ్చాను. </b></span></p><p><span style="color: #134f5c;"><b>దగ్గరుండి వారికి అడిగి వడ్డించాను. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారు ఆనందించారు, చాలా మందికి ఇది చెప్పారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారిద్దరినీ కలిసుండగా అదే చూడడం. </b></span></p><p><span style="color: #134f5c;"><b>సదా నవ్వుతూ మాట్లాడే సార్ ను వారింట్లో ఒక విషాదం కుంగతీసింది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అయినా, ఝాన్సీ అక్కకు వెన్నంటి ఉండి అండనిచ్చారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>అక్క కొడుకు మహంత్ గురించి బాగా తపనపడేవారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>సార్ నాకొక విషయం చెప్పి కంట తడిపెట్టారు. నా గుండె తరుక్కుపోయింది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారిని నేను ఏమని ఓదార్చను? అన్నీ సర్దుకుంటాయని చెప్పాను. </b></span></p><p><span style="color: #134f5c;"><b>పని అయిపోయిందని అంటే... అట్లా అనకండని వారించాను. </b></span></p><p><span style="color: #134f5c;"><b>మధ్యలో సార్ ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నదని శీనన్న చెప్పాడు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>సార్ అందరినీ విడిచి తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఎనభై ఏళ్ల పెద్ద మనిషి...</b></span></p><p><span style="color: #134f5c;"><b>ఒక అద్భుతమైన టీచర్... </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఒకగొప్ప మనిషి...</b></span></p><p><span style="color: #134f5c;"><b>ఒక అద్భుతమైన కష్టజీవి... </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఒక సంఘ ప్రేమికుడు... </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఒక ప్రేమ మూర్తి... </b></span></p><p><span style="color: #134f5c;"><b>లక్ష్మణ మూర్తి సార్ ఇక లేరు-ఇది జీర్ణించుకోలేని సత్యం. </b></span></p><p><span style="color: #134f5c;"><b>సార్ కు నేను ఎప్పుడూ రుణ పడి ఉంటాను. </b></span></p><p><span style="color: #134f5c;"><b>ఒకటి, ఇంగ్లిష్ చెప్పినందుకు. </b></span></p><p><span style="color: #134f5c;"><b>వారి కారణంగా ఇంగ్లిష్ వచ్చింది, నాకు వృత్తిలో లాభించింది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>రెండు, కాలనీలో సిఫార్సు చేసి ఇల్లు ఇప్పించినందుకు.</b></span></p><p><span style="color: #134f5c;"><b>వారి కారణంగా ఇల్లు దొరికింది, అందులోనే నా జీవిత భాగస్వామి లభించింది. </b></span></p><p><span style="color: #134f5c;"><b>నోరారా పిలిచే సార్ లేకపోవడం పెద్ద వెలితి. </b></span></p><p><span style="color: #134f5c;"><b>కాలపురుషుడి కాఠిన్యం ఎవరికైనా తప్పదు కదా! </b></span></p><p><span style="color: #134f5c;"><b>నా బాధ అత్తయ్య గారి గురించి. అయ్యో... పాపం. </b></span></p><p><span style="color: #134f5c;"><b>లక్ష్మణ మూర్తి సార్ కు వినయపూర్వక అశ్రు-అక్షర నివాళి. ఓం శాంతి. </b></span></p><p><span style="color: #134f5c;"><b>Dear Sir, Love you అండ్ Miss you. </b></span></p><p><span style="color: #134f5c;"><b>May God give strength to Attayya garu and the family to cope with the tragedy.</b></span></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-64087221075549739822022-05-07T17:48:00.004+05:302022-05-07T18:00:35.595+05:30ప్రొఫెసర్ బాలస్వామి... అమర్ హై !<div class="separator" style="clear: both;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiGOEVC7bDiWie6O6Ids-iVXju14jwZqWH8isxao3-XppfNXOlE-lWZ4cOQd-bAJiEqxswizeSwDmgtmhkVmob9QaZ2Bd9YDmPprSgDP-4BhyN2nxi0RnACOO_xsJvb8EZIPRhV9AA3xYZ_feSwnD7FVicCg1rtarB6BKtqmhf7HtuiJ-lwpJSvz4to/s680/Professor-Balaswamy-.jpg" style="clear: left; display: block; float: left; padding: 1em 0px; text-align: center;"><img alt="" border="0" data-original-height="370" data-original-width="680" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiGOEVC7bDiWie6O6Ids-iVXju14jwZqWH8isxao3-XppfNXOlE-lWZ4cOQd-bAJiEqxswizeSwDmgtmhkVmob9QaZ2Bd9YDmPprSgDP-4BhyN2nxi0RnACOO_xsJvb8EZIPRhV9AA3xYZ_feSwnD7FVicCg1rtarB6BKtqmhf7HtuiJ-lwpJSvz4to/s400/Professor-Balaswamy-.jpg" width="400" /></a></div>
<b>ఒక మనిషిని మనమెందుకు ఇష్టపడతాం?</b><div><b><br /></b></div><div><b>తనుకున్న డబ్బు, హోదా, పలుకుబడి వంటి వాటిని బట్టి ఇష్టపడేవాళ్ళు (స్వార్థపరులు) పెద్దసంఖ్యలో ఉంటారు. </b></div><div><b>తన కులం, గోత్రం, ప్రాంతం బట్టి ఇష్టపడేవాళ్లు (అస్మదీయులు) కూడా పుష్కలంగా ఉంటారు.</b></div><div><b><br /></b></div><div><b>తనకున్న విద్వత్తు, ప్రతిభా సామర్ధ్యాలు, తెలివితేటలను బట్టి ఇష్టపడేవాళ్లకు (అభిమానులు) కూడా కొదవలేదు. </b></div><div><b><br /></b></div><div><b>తన వ్యక్తిత్వం, గుణగణాలు, నడవడిక, సేవాభావం, విశ్వజనీన దృక్పథం, బాధితుల పక్షాన నిలిచే తత్త్వం వంటి కారణాల రీత్యా ఇష్టపడేవాళ్లు (ఆరాధకులు) కూడా ఉంటారు.</b></div><div><b><br /></b></div><div><b>ఇవన్నీ కాకుండా, ఎదుటి మనిషిని ఉన్నది ఉన్నట్లు లోపాలు, శాపాలు సహా (యాజ్ ఇట్ ఈజ్ గా) ఎలాంటి భావోద్వేగాలకు, పూర్వ ఉద్దేశాలకు తావివ్వకుండా మానవత్వం, ప్రేమ, ఆనందం పంచే వాళ్ళు (మహనీయులు) బహు కొద్దిమంది మన జీవన యానంలో కనిపిస్తారు. </b></div><div><b><br /></b></div><div><b>ఎదుటి మనిషికి వంద శాతం మనిషిగా గౌరవం ఇస్తూ, పూర్తిగా స్వేచ్ఛనిస్తూ, అభిప్రాయాలకు ఎంతో విలువనిస్తూ, అమితమైన ప్రేమ పంచుతూ, ఊహించని ఊరట ఇస్తూ చిరునవ్వుతో సంభాషించే (మహోత్కృష్టమైన మనీషి) ఒక్కరైనా మనకు తారసపడితే అదే గొప్ప.
అలాంటి మహోత్కృష్టమైన మనీషి ప్రొఫెసర్ బండి బాలస్వామి గారు. ఇజాల చట్రంలో ఇలాంటి వ్యక్తిత్వాన్ని ఫిట్ చేయలేం. </b></div><div><b>మాయదారి కరోనా ఆయన్ను మన నుంచి దూరం చేసి ఈ రోజుకు సరిగ్గా ఏడాది అయినా వారు నా లాంటి అభిమానులు, ఆరాధకుల గుండెల్లో నిరంతరం సజీవంగా ఉంటారు. ఈ ఏడాదిలో సార్ గుర్తుకురాని రోజుగానీ, ఆయనతో గడిపిన ఘడియలు స్ఫురణకు రాని రోజుగానీ లేవు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా ఉన్న అయన అకాల మరణం తీరని లోటు. విద్యార్థి లోకానికి పెద్ద నష్టం. </b></div><div><b><br /></b></div><div><b>మరణం సత్యమైనా, సార్ లేరన్న విషయాన్ని జీర్ణించుకోవడం నాకే కాదు, అయన పరిచయం ఉన్న ఎవ్వరికైనా చాలా కష్టంగా ఉంటుంది. ఒక పాతికేళ్ళు జర్నలిస్టుగా, మరో పదేళ్లు కార్పొరేట్ కమ్యూనికేషన్స్, జర్నలిజం టీచింగ్ లో ఉన్న నాకు మరో బాలస్వామి సార్ దొరకడం కష్టమని స్పష్టంగా అర్థమయ్యింది.
ఆ మధ్యన ఒక అకడమిక్ పనిమీద ఓపెన్ యూనివర్సిటీలో ఘంటా చక్రపాణి గారిని కలిస్తే ఆయన ఒక మాట అన్నారు. గత 30 సంవత్సరాల అకడమిక్ ప్రస్థానంలో ఏ ప్రొఫెసర్ భౌతికంగా వెళ్ళిపోయినా వెల్లువెత్తని ఘన నివాళులు, అశ్రు తర్పణాలు ప్రొఫెసర్ బాలస్వామి విషయంలో చూసినట్లు చెప్పారు. ఇదొక్కటి చాలు, బాలస్వామి సార్ అంటే అయన తెలిసిన ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రేమ, ఆరాధన భావాలను తెలియజేయడానికి. </b></div><div><b><br /></b></div><div><b>సార్ లేని లోటు ను నిత్యం మూగ బాధతో అనుభవించే వాళ్ళం చేయాల్సింది-ఆయన వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకుని అణుకువతో మెలుగుతూ అందరికీ ప్రేమ, ఆనందం, విజ్ఞానం, వినోదం పంచుకోవడమే.
బాలస్వామి సార్.... అమర్ హై! </b></div><div><b><br /></b></div><div>నోట్: బాలస్వామి సార్ కు నివాళిగా 'నమస్తే తెలంగాణా,' "ది హన్స్ ఇండియా' లో రాసిన వ్యాసాలు మీకు సమయముంటే చదవండి.<div><b><br /></b><div><b><span style="color: #ffa400;">మానవతా వాది, ప్రేమ మూర్తి </span><br /></b><div><div><b><a href="https://www.ntnews.com/telangana/professor-bandi-balaswamy-pass-away-due-to-covid-19-92103" target="_blank">https://www.ntnews.com/telangana/professor-bandi-balaswamy-pass-away-due-to-covid-19-92103</a><br /></b></div><div><b><span style="color: #ffa400;">An ocean of humanity and humility</span></b> </div><div><a href="https://www.thehansindia.com/hans/opinion/news-analysis/an-ocean-of-humanity-and-humility-685881" target="_blank">https://www.thehansindia.com/hans/opinion/news-analysis/an-ocean-of-humanity-and-humility-685881</a><br /></div><div><br /></div><div><br /></div></div></div></div></div>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-9195484225996733612022-01-17T20:35:00.008+05:302022-01-17T20:35:40.013+05:30 'మా' తో TUOWJ చర్చలు: చెత్త థంబ్ నెయిల్స్ పై ఉమ్మడి కార్యాచరణ<p><span style="font-size: medium;">కొందరు వెర్రిమొర్రి, బాధ్యతారహిత నెటిజెన్ల శునకానందానికి సెలిబ్రెటీస్-ముఖ్యంగా సినిమా యాక్టర్లు-బలవుతుంటారు. మంచీచెడూ లేకుండా కేవలం క్లిక్స్ పెంచుకునేందుకు ఘోరంగా తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్ పెట్టి వినోదం ముసుగులో చాలా మంది చెలరేగిపోతున్నారు. ఈ పెడధోరణి సీరియస్ రీడర్స్, వ్యూయర్స్ కు చాలా ఇబ్బంది కలిగిస్తుండగా, బాధితులకు చెప్పలేని మనోవేదన కలిగిస్తున్నది. సోషల్ మీడియా వేదికగా సీరియస్ జర్నలిజం చేసేవారికి ఇలాంటి అన్ ప్రొఫెషనల్ ఎలిమెంట్స్ తో చాలా ఇబ్బంది కలుగుతున్నది. </span></p><p><span style="font-size: medium;">సముద్రం లాంటి సోషల్ మీడియాలో ఎవడి చావు వాడు చస్తాడని అనుకోకుండా, మంచి ప్రాక్టీస్ ను పోషించేలా, వృత్తికి తలవంపులు తెచ్చేవారిని దారిలోకి తెచ్చేలా చొరవచూపుతున్నది సీనియర్ జర్నలిస్టు బీ ఎస్ నేతృత్వంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUOWJ). డిజిటల్ జర్నలిస్టులకు గుర్తింపు.. సోషల్ మీడియా ఛానెళ్లకు సాధికారత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్న TUOWJ మరొక చొరవ చూపింది. సినీ ఆర్టిస్టుల ప్రధాన వేదిక అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)తో ఈ రోజు (జనవరి 17, 2022) భేటీ అయ్యింది. 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు, కోశాధికారి శివ బాలాజీ తో డిజిటల్ మీడియా విస్తృతి, YouTube ఛానెళ్లకు గుర్తింపు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించింది.</span></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEjO6KVxqBEPTCPzNnq6ywGzSQxyc2OTuJ9cJCXZU_v-RtiQOWIv5p928BaGFGCD9L2bZd9i0IwqDy4Je2MSZlgq2SBwwgqoy8daIihLc8xfy7T6v4slm-6PXmwgx0ZImSbkxB0YWp4TT9NWphucJHatfqaVHixfpaM79t3A1jAC9uIOLfqEt080Ktbc=s1162" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><span style="font-size: medium;"><img border="0" data-original-height="821" data-original-width="1162" height="283" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEjO6KVxqBEPTCPzNnq6ywGzSQxyc2OTuJ9cJCXZU_v-RtiQOWIv5p928BaGFGCD9L2bZd9i0IwqDy4Je2MSZlgq2SBwwgqoy8daIihLc8xfy7T6v4slm-6PXmwgx0ZImSbkxB0YWp4TT9NWphucJHatfqaVHixfpaM79t3A1jAC9uIOLfqEt080Ktbc=w400-h283" width="400" /></span></a></div><p><table cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="float: left;"><tbody><tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEigOtd2xekpcRgU0vKRLJrBalWJKje1Wrlf2AEQCzH2YVtTuYzZvg1RxB8wG_XHXTkmvtlDsCJKSaHgHuw6Qhyox4Sn2I8uyDv_PrIyua8ogSwlva0QhDPV8mqbi4AGKZrqwViQKdSu-G48iVEsZzUy4B0TCmalwujgOY_1CK3Uc257y5EORLHvT62K=s809" imageanchor="1" style="clear: left; margin-bottom: 1em; margin-left: auto; margin-right: auto;"><span style="font-size: medium;"><img border="0" data-original-height="786" data-original-width="809" height="389" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEigOtd2xekpcRgU0vKRLJrBalWJKje1Wrlf2AEQCzH2YVtTuYzZvg1RxB8wG_XHXTkmvtlDsCJKSaHgHuw6Qhyox4Sn2I8uyDv_PrIyua8ogSwlva0QhDPV8mqbi4AGKZrqwViQKdSu-G48iVEsZzUy4B0TCmalwujgOY_1CK3Uc257y5EORLHvT62K=w400-h389" width="400" /></span></a></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;"><span style="font-size: medium;">మంచు విష్ణు తో బీ ఎస్ </span></td></tr></tbody></table><span style="font-size: medium;">తప్పుడు Thumbnails పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండాలన్న తన విధానాన్ని మంచు విష్ణు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అయితే, యూనియన్ తో చర్చించాకే చర్యలుంటాయని కూడా హామీ ఇచ్చారు. "మా సమావేశం సుహృద్భావ వాతావరణంలో బాగా జరిగింది. వివిధ అంశాలను కూలంకషంగా చర్చించాం. గాసిప్స్ రాస్తే తప్పు లేదు కానీ తప్పుడు భాషలో కుటుంబాల్ని రోడ్డుకీడ్చేవిధంగా ఉండే ఛానెళ్లను ఉపేక్షించేది లేదని విష్ణు స్పష్టం చేశారు. ఇది అర్థం చేసుకోతగినదే. మా వైపు నుంచి 'మా' కు సంపూర్ణ సహకారాలు ఉంటాయి," అని బీ ఎస్ 'తెలుగు మీడియా కబుర్లు' తో చెప్పారు. </span></p><p><span style="font-size: medium;">డిజిటల్ మీడియా యూనియన్ గా తాము కూడా స్పష్టమైన విధివిధానాల్ని రూపొందించుకుని స్వయం నియంత్రణ పాటించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, కలిసి పని చేయాలనుకుంటున్నామని చెప్పినట్లు బీ ఎస్ తెలిపారు. మరో సారి పూర్తి స్థాయిలో సమావేశమై విషయాలు చర్చించుకోవాలని ఉభయపక్షాలు నిర్ణయించాయి. ఇలాంటి సకారాత్మక చర్యలు సఫలం కావడానికి యూ ట్యూబర్స్, ఆన్ లైన్ జర్నలిస్టులు సహకరిస్తే బాగుంటుంది. ఈ విషయంలో పిచ్చి రాజకీయాలకు, కుళ్ళుబోతు వ్యవహారాలకు తావ్వివకుండా అంతా కలిసిపనిచేయాలని ఆశిద్దాం. </span></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-79561803442857984212022-01-03T20:05:00.003+05:302022-06-02T12:27:14.780+05:30'పరిశోధన' శూన్యం...'ఆత్మ' మిథ్య... 'జర్నలిజం' మాయం...<p>'పరిశోధనాత్మక జర్నలిజం' అంటే ఎవరో స్వప్రయోజనం కోసం దాచిపెట్టాలని లేదా సమాధిచేయాలని ప్రయత్నించే విలువైన సమాచారాన్ని తెలివిగా బట్టబయలు చేసి నిజాన్ని జనాల ముందుకు తెచ్చి బతికించే పని. ఇది సాహసోపేతమైన పనే కాక, సామాజిక విహిత కర్తవ్య నిర్వహణ కూడా. ఇన్వెస్టిగేషన్ కన్నా అద్భుతమైన పనేమీ ఉండదనీ, జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరిస్తే ఇలాంటి మంచి పనులు బోలెడు చేసి ప్రజాసేవ నిర్వర్తించవచ్చునని నమ్మి జర్నలిజం లోకి వచ్చేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కాలానుగుణంగా మీడియా స్వరూప స్వభావాల్లో వచ్చిన మార్పుల వల్ల, ఇతరేతర వివిధ కారణాల వల్ల ఇప్పుడు పరిశోధనాత్మక జర్నలిజం దాదాపుగా కనుమరుగు అయిపోయింది. అందుకే, గతంలో లాగా మీడియా ఇప్పుడు పరిశోధనాత్మక జర్నలిజం చేయడంలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు గత నెలలో హైదరాబాద్ లో మా మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద శ్రమించి, పరిశోధించి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. మీడియా ముఖచిత్రం నుంచి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కనుమరుగుకావడం దురదృష్టకరమని అయన చెప్పారు.</p><p><br />'ఈనాడు' లో గతంలో కొద్దికాలం పనిచేసి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి అలంకరిస్తున్న జస్టిస్ రమణ గారు మినహా పరిశోధనాత్మక జర్నలిజం మీద ఈ మధ్య కాలంలో మాట్లాడినవారే లేకపోయారు. వారిలా మీడియాను దగ్గరి నుంచి చూసిన వారితో గానీ, ఇప్పుడు పనిచేస్తూ ఈ పవిత్ర వృత్తిలో తలపండిన జర్నలిస్టులతో గానీ మాట్లాడితే మీడియా పరిస్థితిలో వచ్చిన మార్పునకు కారణాలు తెలుస్తాయి. నేను 'ఈనాడు' లో పార్ట్ టైం విలేకరిగా చేరిన 1989-90 లో నాకు తారసపడిన సీనియర్లకు, 2002-2009 ప్రాంతంలో 'ది హిందూ' లో పనిచేసినప్పటి సీనియర్లకు మధ్య పోలికే లేదు. చిత్రా సుబ్రహ్మణ్యం, ఎన్ రామ్ బట్టబయలు చేసిన బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం రేపిన దుమారాన్ని చూసి పెన్ను పడితే అక్రమార్కులను వణికించవచ్చని గట్టి నమ్మకంతో పనిచేశాం అప్పట్లో. 1992 లో బయటపడిన హర్షద్ మెహతా గారి సెక్యూరిటీస్ స్కాం వల్ల సిరా చుక్క భూకంపాలు తెప్పిస్తుందని నమ్మి పనిచేశాం.<br /><br />అప్పట్లో అయితే 'ఆధారాలు' గట్టిగా ఉన్నాయా? కథనంలో అందరి వెర్షన్స్ ఉన్నాయా? అని చూసుకుని పరిశోధనాత్మక కథనాలు ఎంతో ఉత్సాహంతో ప్రచురించేవారు. మొత్తం కెరీర్ లో పరిశోధించి ప్రచురించే వార్తలు ఒక ఐదారు ఉంటే గొప్పే. శోధించి వార్తలు రాసే జర్నలిస్టుకు మంచి క్రేజ్ ఉండేది. వ్యవస్థలో మార్పు కోసం తపించే వారు (విజిల్ బ్లోయర్స్) వచ్చి సమాచారం ఇచ్చేవారు. ఒక్కోసారి సిరీస్ (వరస కథనాలు) ప్రచురించి పత్రికలూ అవినీతిపరుల అంతు తేల్చేవి. వాటికి ప్రభుత్వం స్పందించేది. అప్పుడు మా ఘనకార్యం ప్రభావం ఇదని కాలర్ ఎగరేసి ఇంకో వార్త ప్రచురించేవారు. పథకాల్లో అవకతవకల మీద, అధికారుల డబ్బు కక్కుర్తి మీద, నాయకుల అన్యాయాల మీద, కలప స్మగ్లింగ్ మీద, బ్లాక్ మార్కెటింగ్ వంటి ప్రజోపయోగమైన అంశాల మీద పసందైన కథనాలు వచ్చేవి. సాధారణ ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్ల, స్పీచ్ ల వార్తలకు భిన్నంగా ఈ కథనాల్లో సమాచారం అబ్బురపరిచేది.<br /><br />క్రమంగా పరిస్థితి మారింది. మన విలేకరి ఎవరికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించాడో వాడు తమ వాడేనా (కులం, ప్రాంతం వగైరా) ? అని చూడ్డం, వారి మనిషి అయితే చూసీ చూడనట్టు పోవడం మొదలయ్యింది. కొన్ని పత్రికలు సదరు అవినీతి పరుడి నిజస్వరూపాన్ని బైటపెట్టేలా విలేకరి తెచ్చిన సాక్ష్యాలు, సేకరించిన ఆధారాలు (డాక్యుమెంట్లు) చూపించి అందినకాడికి దండుకోవడం కూడా బాగానే సాగింది. పత్రికలు రాజకీయ పార్టీల కొమ్ముకాయడం మితిమీరి పెరిగాక ఇన్వెస్టిగేషన్ అస్త్రాన్ని తమ కులస్థుల వ్యతిరేక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీయడం మాత్రమే మొదలయ్యింది. కాంగ్రెస్ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల మీద, టెండర్లలో గోల్ మాల్ మీద తెలుగుదేశం అనుకూల పత్రికల్లో మొదటి పేజీల్లో పెద్ద పెద్ద వార్తలు వచ్చేవి. పొలిటికల్ బాసు, పత్రిక అధిపతి ముందుగా ప్లాన్ చేసేవారు కాబట్టి అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలకు ముందురోజో, అవి కొనసాగుతున్నప్పుడో ఇన్వెస్టిగేటివ్ కథనాలు బాంబుల్లా పేలేవి. ఆ కథనాల మీద చర్చ జరగాలని విపక్షం పట్టుపట్టి విచారణకు ఆదేశించేలా చేయడమో, ఇంకేదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి ఒత్తిడి చేయడమో జరిగేది. పరిశోధన ను పూర్తిగా వదలకుండా... కొన్ని పత్రికలు ప్రభుత్వం నొచ్చుకోని విధంగా సుతిమెత్తని పరిశోధనాత్మక కథనాలు ప్రచురిస్తున్నాయి.... అప్పుడప్పుడూ.<br /><br />ప్రభుత్వాధినేతలు సొంత మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ మీడియా యజమానుల మెడలు వంచే పద్ధతులు పాటిస్తుండడంలో మీడియా సంస్థలు జీ హుజూర్ జర్నలిజం చేస్తున్నాయి. దీంతో, ఇప్పుడు పరిశోధన శూన్యం, ఆత్మ సున్నా, జర్నలిజం జీరో అయిపోయిన దుస్థితి. అప్పట్లో డెక్కన్ క్రానికల్ పత్రిక ఇన్వెస్టిగేటివ్ వార్తలకు ప్రాధ్యాన్యం ఇచ్చేది. నాయర్ గారు ఎడిటర్ గా ఉన్నప్పుడు వెలువడిన కొన్ని కథనాలు జర్నలిస్టులకు మధుర స్మృతులుగా మిగిలిపోతాయి. పుట్టపర్తి లో సత్యసాయి ప్రాంగణంలో జరిగిన హత్యల మీద వచ్చిన కథనాలు కంపనాలు సృష్టించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు ఆంధ్ర జ్యోతి పత్రిక, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఎడిటర్ (ఇన్వెస్టిగేషన్స్) గా ఉన్న సుధాకర్ రెడ్డి లాంటి ఒకరిద్దరు దమ్మున్న ఇంగ్లిష్ జర్నలిస్టులు అప్పుడప్పుడు కథనాలు రాస్తున్నారు. పరిశోధనల కోసం ప్రత్యేకించి దమ్ము, ధైర్యం, బుర్ర, రచనా సామర్ధ్యం ఉన్న సీనియర్ జర్నలిస్టులను నియమించనైనా నియమించడంలేదాయె. ఇలా పలు కారణాల రీత్యా క్రిటికల్ వార్తలు రాసి ప్రభుత్వం స్పందించేలా చేసే జర్నలిస్టులు కనుమరుగయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారే కాకుండా సదాలోచన పరులు, ప్రజాస్వామ్య హితైషులు పరిశోధనాత్మక జర్నలిజం లేకుండా పోయిందే... అని ఆవేదన చెందడానికి కారణమైన ఐదు అంశాలు ఏమిటంటే...<br />1) <span style="color: red;">యాజమాన్య ధోరణులు</span> 2) <span style="color: #ffa400;">దమ్మున్న ఎడిటర్లు/ సీఓబీ లు లేకపోవడం</span> 3) <span style="color: #2b00fe;">పరిశోధనాత్మక జర్నలిస్టులకు సముచిత గౌరవం, ప్రోత్సాహకాలు లేకపోవడం</span> 4) <span style="color: #2b00fe;">ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు దన్నుగా నిలబడే వారు కరువవడం </span>5) <span style="color: #800180;">పరిశోధనాత్మక జర్నలిజం లో శిక్షణ లేకపోవడం.</span><br /><br /><span style="color: red;">ఒక పత్రిక సత్య ప్రమాణకంగా పరిశోధించి వ్యాసం రాసినా దాన్ని తిప్పికొడుతూ వైరి పత్రిక వ్యాసం (రిజాయిండర్) రాసే పరిస్థితి ఇప్పుడు దాపురించింది. కారణం, పైన మనం అనుకున్న యాజమాన్య ధోరణులు. మీడియా ఓనర్లకు పలు వ్యాపారాలు ఉండడం తో వాళ్ళ పిలక ప్రభుత్వం చేతిలో ఉంటున్నది. మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు వ్యాసాలు ప్రచురించే పత్రికల ఆర్ధిక మూలాలపై కోలుకోలేని దెబ్బకొట్టే విద్వేషపూరిత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి. ఇండిపెండెంట్ మీడియా అనేది లేకపోతే పరిశోధనకు అవకాశమే లేదు.</span><br /><br /><span style="color: #ffa400;">పగ్గాలు విడిస్తే పరిశోధించి అక్రమార్కుల భరతం పట్టే జర్నలిస్టులకు కొదవులేదు. కానీ అందుకు ఎడిటర్ల, చీఫ్ ఆఫ్ బ్యూరోల సంపూర్ణ మద్దతు అవసరం. నేను నా కెరీర్ లో ఒక వింత పరిస్థితి ఎదుర్కొన్నా ఒక చవట చీఫ్ ఆఫ్ బ్యూరో మూలంగా. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఒక అధికారి బినామీ పేర్లతో చీప్ రేటుకు వందల ఎకరాలు ఎలా కొన్నదీ నిరూపిస్తూ నేను డాక్యుమెంట్లు తెస్తే... అభినందించాల్సింది పోయి నా బాస్ అయిన ఈ సీనియర్ ఒక సిల్లీ ప్రశ్న వేశాడు- "ఇది మనం ప్రచురిస్తే కోర్టు కేసు అవుతుందా?' అని. కేసు కావచ్చు, కాకపోవచ్చు అనగానే... 'వద్దులే' అని కొట్టిపారేశాడు... ఆ డాక్యుమెంట్లను చూడకుండానే, నా శ్రమను అభినందించకుండానే. తాను ప్రపంచంలోనే గొప్ప జర్నలిస్టునని, చక్కని రాత గాడినని అందరితో మిడిసిపాటుతో వ్యవహరించి చివర్లో దారుణంగా భంగపడిన ఈ సీనియర్ లాంటి వాళ్ళ వల్ల కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడున్న తెలుగు పత్రికల ఎడిటర్లలో దూకుడు స్వభావం లేకుండా మన్నుతిన్న పాముల్లాంటి వాళ్ళే ఎక్కువ. ఇప్పటి ఎడిటర్లలో తమ జీవితంలో ఎవరు ఎన్ని పరిశోధనాత్మక కథనాలు రాసారో, ఎవరు ఎన్ని ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాసి సంచలనం సృష్టించారో లెక్కతీస్తే ఉస్సూరుమంటాం. యాజమాన్యాలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన వారికి కాకుండా వేరే కొలబద్దలను బట్టి తమ మనుషులకు ఎడిటర్లుగా పట్టంకట్టినంత కాలం పరిస్థితి మారదు. పరిశోధన చేసి ఏదైనా కథనం రాయాలంటే వృత్తిపట్ల కట్టుబాటు ఉండాలి, గుండె నిండా సాహసం ఉండాలి, నీతి విషయంలో నిబద్ధత ఉండాలి కదా!</span><br /><br /><span style="color: #2b00fe;">ప్రాణాలకు తెగించి, ఎన్నో అవరోధాలను అధిగమించి పరిశోధనాత్మక కథనాలు రాసే జర్నలిస్టులకు వెన్నుదన్నుగా ఉండే వ్యవస్థ ఎక్కడుంది చెప్పండి. . ఇలాంటి సిన్సియర్ జర్నలిస్టులు ఇబ్బందుల్లో పడితే మీడియా మానేజ్మెంట్స్ పక్కకు తప్పుకుంటాయి. ఎడిటర్లు బండలు వేస్తారు. శ్రమించి సాధించిన జర్నలిస్టులను వారి మానాన వారిని వదిలేసి, మీ కేసు మీరే చూసుకోండని అంటే కష్టమై పోతుంది. పరిశోధనాత్మక జర్నలిజం బతకాలంటే ప్రోత్సాహకాలు భారీగా ఉండాలి. ప్రతి ఏడాదీ ఒక అత్యుత్తమమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పనితనాన్ని గుర్తించి మెచ్చుకుని ఒక బహుమానం ఇస్తే ఎంత బాగుంటుంది! ఒకటి రెండు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లాంటి జాతీయ పత్రికలు ఇలాంటి నికార్సైన జర్నలిస్టుల కోసం ఒక బహుమతి ఇచ్చి గౌరవిస్తున్నాయి. ప్రతి ఏడాదీ ప్రభుత్వమే చిత్తశుద్ధితో మంచి జర్నలిస్టులకు ప్రోత్సాహకాలు ఇచ్చే సత్సంప్రదాయాన్ని చిత్తశుద్ధితో కొనసాగించాలి. అయినా, మీడియా బిజినెస్ మీద బాగా సంపాదించిన 'ఈనాడు' లాంటి పత్రికలు ఒక పదో, పాతికో లక్షలు ఏడాదికి ఒకరిద్దరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు ప్రోత్సాహకంగా ఇవ్వవచ్చు కదా! జర్నలిజంలో అద్భుతమైన శిక్షణ పొంది, రచనలే శ్వాసగా చేసుకుని అర్ధంతరంగా చనువుచాలించిన సుమన్ పేరిట ఒక వార్షిక అవార్డు నెలకొల్పి ఉంటే ఒక సత్సంప్రదాయానికి తెర ఎత్తినట్లు అయ్యేది. <br />అమెరికాలో ఉన్నట్లు పులిజర్ అవార్డుల్లాంటివి మన దగ్గర లేవన్న స్పృహ మనోళ్లకు లేకపోవడం బాధాకరం. ఈ అంశాన్ని అటు వ్యవస్థ గానీ, సంస్థలు గానీ, విశ్వవిద్యాలయాలు గానీ పట్టించుకోవడం లేదు. నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లో ఉన్నప్పుడు అక్కడి యాజమాన్యానికి ఇందుకు సంబంధించిన ఒక ప్రతిపాదన చేశాను గానీ అది వారికి వంటపట్టలేదు. ఇది ప్రచురించే సమయానికి సుప్రసిద్ధ జర్నలిస్టు అరుణ్ సాగర్ గారి స్మృత్యర్థం నెలకొల్పిన అవార్డుల ప్రధానం ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నది. ఇలాంటి అవార్డులు మరెన్నో నెలకొల్పి అర్హులైన జర్నలిస్టులకు ప్రదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.</span><br /><br /><span style="color: #800180;">ఇక విశ్వవిద్యాలయాల్లో 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం' ఒక సీరియస్ అంశంగా చెబుతున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం నడుపుతున్న విశ్వవిద్యాలయాల్లో ఇది నిల్లు. జర్నలిస్టులు నడుపుతున్న ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో మాకు ఇన్వెస్టిగేషన్ మీద సీరియస్ శిక్షణ ఇచ్చి ఒక ప్రాజెక్టు చేసేలా ప్రోత్సహించేవారు. నేను ప్రింట్ జర్నలిజం ఆరంభించడానికి సహకరించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఈ తరహా జర్నలిజం మీద క్లాసులు తీసుకుని, ఒక అసైన్మెంట్ ఇచ్చేవాడిని. ఈ పనిచేయాలంటే బోధకులకు ఫీల్డ్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి. దాన్ని పట్టించుకునే వారు ఇప్పుడు లేరు.</span><br /><br />ఈ ఐదు అంశాల సంగతి అలా ఉంచితే, సోషల్ మీడియా వచ్చాక ఇన్వెస్టిగేషన్ మీద కొద్దిగా ఫోకస్ ఉన్నట్లు కనిపించింది. రెండు మూడు యూ ట్యూబ్ ఛానెల్స్ ఇలా ఆశలు రేకెత్తించాయి. అందులో ఒకటైన క్యూ న్యూస్ నాకు నచ్చేది. దాని ఆరంభకుడు తీన్మార్ మల్లన్న అనే చింతపండు నవీన్ కు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆ కారణంగానే 30కి పైగా కేసులు పడ్డాయి అతని మీద. ఇంతలో కారణాంతరాల వల్ల బీజేపీ తీర్థం స్వీకరించి మల్లన్న ఇండిపెండెంట్ జర్నలిజం అన్న మాటకు అనర్హుడయ్యాడు. తొలి వెలుగు లో రఘు అనే అబ్బాయి బాగానే చేస్తున్నాడు కానీ... ఇది శృతి మించిన కారణంగా క్రమంగా సీరియస్ నెస్ కోల్పోతున్నట్లున్నది.<br /><br />ప్రజాస్వామ్యం మనగలగాలంటే జర్నలిజం, ముఖ్యంగా పరిశోధనాత్మక జర్నలిజం, బతికి బట్టకట్టే పరిస్థితులు సమాజం, వ్యవస్థలు సృష్టించాలి. సిన్సియర్ జర్నలిస్టులు ఇండిపెండెంట్ గా నైనా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని స్వీకరించి సోషల్ మీడియా వేదికగా ప్రోత్సహిస్తే మంచిది. చీఫ్ జస్టిస్ గారు అభిలషిస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ (ప్రధాన మీడియాలో) లో రాణించి ప్రజాస్వామ్యానికి జవజీవాలు ఇస్తుందని ఆశిద్దాం. జస్టిస్ రమణ గారి ఆవేదనకు స్పందిస్తూ సుప్రసిద్ధ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ గారు ఒక వ్యాసంలో పేర్కొన్నట్లు సీరియస్ జర్నలిజం చేసే జర్నలిస్టులకు న్యాయ స్థానాలు వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుందాం. </p><p>I published the same in Adarshini, edited by senior journalist Mr Mini Suresh Pillai.</p><p>Here is the link</p><p><a href="https://adarsini.com/dr-s-ramu-feature-article-on-investigative-journalism/">https://adarsini.com/dr-s-ramu-feature-article-on-investigative-journalism/</a></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-66642306541324091322021-12-25T12:31:00.000+05:302021-12-25T12:31:07.488+05:30బన్నీ యాచ్చన్ తప్ప 'పుష్ప'విలాపమే గదా సామీ!<p> కుటుంబ సమేతంగా చూడాలని ఇన్ని రోజులు ఆగి నలుగురం కలిసి నిన్న రాత్రి ఏడు గంటల షో కు కూకట్ పల్లి లోని సుజనా మాల్ లో 'పుష్ప' కు వెళ్లాం. హౌస్ ఫుల్లయ్యింది. 'వూ అంటావా, వుఊ అంటావా.. ' అని పక్క సీట్లో యువకుడు హమ్ చేస్తూ కూర్చున్నాడు. సినిమా విడుదలకు ముందే మొత్తం పాట జనాల నోటికి వచ్చేట్టు మార్కెట్టింగ్ బాగా చేస్తున్నారీ మధ్య కాలంలో. </p><p>సూపర్ గా ఉన్న అల్లు అర్జున్ (పుష్పరాజ్) యాక్షన్ కు ఫుల్లు మార్క్స్ ఇచ్చి తీరాల్సిందే. కొత్త గెటప్ లో చూట్టానికి బాగున్న బన్నీ చాలా బాగా నటించాడు. ప్రతి ఫ్రేమ్ లో అబ్బాయి కళ్ళు భలే షార్ప్ గా చూపించారు. మహేష్ బాబుకు ఇచ్చినా ఇంత పవర్ఫుల్ గా చేయగలిగే వారు కాదేమో! మాజీ లెక్కల సార్ సుకుమార్ మంచి దర్శకత్వం, కెమెరా వర్క్, కమెడియన్-కం-హీరో సునీల్ (మంగళం శీను) కొత్త గెటప్ మినహా మిగిలినదంతా పుష్పలో ఉత్తతీతే. సాగపీకాలన్న ఆలోచన ఆలస్యంగా వచ్చి ఆ గుండు ఐ పీ ఎస్ ఫహాద్ ఫాజిల్ (భన్వర్సింగ్ షెకావత్) తో రంగప్రవేశం చేయించి కామిడీ పండించాలని విఫల ప్రయత్నం చేసిన పార్ట్ -1 ను గబ్బుపట్టించారు. </p><p>పుష్ప కు భీకరమైన హైప్ ఇచ్చింది.. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ తోపాటు నిస్సందేహంగా అక్కినేని ఇంటివారి మాజీ కోడలు, తెలుగువారి 'నెక్స్ట్ డోర్ గాళ్' సమంత చేసిన ఐటం సాంగ్. తనను తొక్కిపెట్టిన వారి మీద కసితో ఆమె మగబుద్ధిని ఎత్తిపొడిచే ఈ సాంగ్ చేశారని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా, ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో వస్తున్న బూతుతో పోల్చుకుంటే ఇందులో బూతు తక్కువన్నట్టే. పాటలో పదాలు పవర్ఫుల్ గా ఉన్నాయ్. మంగ్లీ చెల్లి కి బ్రేక్ వచ్చింది. రష్మిక ఒంపు సొంపులను మాటిమాటికీ చూపించి విసిగించారు. మేక-పీక పాట తో పాటు ఇతర పాటలు ఓకే ఓకే. కథ కోసం <a href="కథ కోసం 'పుష్ప- ది రైజ్' మీద వచ్చిన సమీక్ష దీన్ని చదవండి. " target="_blank">'పుష్ప- ది రైజ్' మీద వచ్చిన సమీక్ష</a> చదవండి. </p><p>నాకు ఈ సినిమాతో రెండు సమస్యలున్నాయి. </p><p>ఒకటి, నేరమైన ఎర్ర చందనం స్మగ్లింగ్ ను బాగా గ్లామరైజ్ చేయడం. ముంబాయ్ డాన్ భాయ్ ల మీద కూడా సినిమాలు వచ్చాయి కానీ ఆ నేరాలను ఇంతగా గ్లామరైజ్ చేసి చూపలేదు. సమస్య కోణాలను చూపడం వేరు, సమస్య కారకులను ఘనంగా చూపడం వేరు. కేవలం స్మగ్లింగ్ గ్యాంగ్ లను, సిండికేట్ లను, అందులో ముదిరిపోయిన ఒకడ్ని కేంద్రంగా చేసుకుని పుష్ప ను మండించారు. ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు ఎర్ర చందనం నేర సామ్రాజ్యం మీద పరిశోధనాత్మక జర్నలిస్టు <a href="https://sudhakarudumula.com/" target="_blank">ఉడుముల సుధాకర్ రెడ్డి</a> (ఈనాడు, డెక్కన్ క్రానికల్ పత్రికల్లో మంచి పేరు సాధించిన అయన ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఎడిటర్- ఇన్వెస్టిగేషన్స్ గా ఉన్నారు) రాసిన పుస్తకాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్ వీ రమణ విడుదల చేశారు. ఎన్డీ టీవీ సీనియర్ మోస్ట్ రిపోర్టర్ ఉమా సుధీర్ ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. ఎంతో అమూల్యమైన ఈ వృక్ష సంపదను కొల్ల గొడుతూ కోట్లు గడిస్తున్న జాతీయ, అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ ల గురించి ఉడుముల వివరిస్తే అవాక్కయ్యాను. శేషాచలం అడవుల నుంచి వేల కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం ఎందరో చేతులు తడుపుతూ విదేశాలకు తరలిపోతున్నదని సాక్ష్యాలతో సహా ఈ పుస్తకంలో విశదీకరించారు. ఈ ఘోరమైన నేరం పట్ల చీఫ్ జస్టిస్ కూడా ఆందోళన వ్యక్తంచేస్తూ స్థానికుల భాగస్వామ్యంతో దీన్ని నివారించాలని కూడా సూచించారు. ఇలాంటి నేరానికి పాల్పడుతున్న పుష్ప లాంటి వాళ్ళ ఘోర కృత్యాలను అద్భుతమైన ఘన కార్యక్రమంగా చూపడం బాధ్యతాయుతమైన పనిగా అనిపించుకోదని నా అభిప్రాయం. పార్ట్-2 లో పుష్ప ను మారిన జనం నేతగానో గానో, ఎర్రచందనం చెట్లను కాపాడే వాడిగానో చూపవచ్చు గానీ ప్రస్తుతానికి మాత్రం క్రిమినల్ గ్లామరైజేషన్ అస్సలు బాగోలేదు. </p><p>రెండు, పోలీసులను మరీ లంచగొండ్లుగా చిత్రీకరించడం. సినిమా స్టార్టింగ్ లోనే పుష్ప తనను పట్టుకున్న పోలీసులకు బేరం పెడుతూనే చావచితక కొడతాడు. మనిషికో లక్ష ఇచ్చేసరికి ఖాకీలు ఖుషీ అయి వదిలేస్తారు. డీఎస్పీ గోవిందప్ప (హరీష్ ఉత్తమన్) బృందాన్ని ఎర్రిపప్పలుగా చూపించారు. చివర్లో వచ్చిన ఐ పీ ఎస్ షేఖావట్ ను పచ్చి లంచగొండిగా చూపించారు. పుష్ప లాంటి కరుడుకట్టిన క్రిమినల్ తో మిలాఖత్ కావడం, తనతో ఒంటరిగా కూర్చుని అయన మందుకొట్టడం, వాడు ఇప్పమంటే చొక్కా-ప్యాంట్ ఇప్పి వెళ్లిపోవడం చాలా కృతకంగా బోరింగ్ గా అనిపించాయి. పాఠాలు చెప్పే టీచర్లను, శాంతి భద్రతలను కాపాడే పోలీసులను మరీ చులకన చేయడం అత్యంత ప్రభావశీలమైన సినిమా మాధ్యమాన్ని డీల్ చేస్తున్నవారికి తగని పని. </p><p>చివరగా, రెండు చిన్న పరిశీలనలు. సుక్కు గారూ... అప్పుడే నీళ్ల నుంచి బైటికి తీసిన డబ్బు బ్యాగ్ నుంచి కొన్నైనా నీటి బొట్లు రాలతాయి గదా సార్! అట్లానే, బుల్లెట్ దిగిన అరచేయి నుంచి రక్తం ఒక్క క్షణం మాత్రమే కారి ఆరిపోతుందా? </p><p>ఎందుకు సామీ... జనాల చెవిలో ఇట్లా పుస్పాలు పెట్టేసినారు? </p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-5265632519716536202021-12-21T18:04:00.004+05:302021-12-21T18:14:18.846+05:3036 ఏళ్ళ తర్వాత ఒక సుమధుర ఆత్మీయ సమ్మేళనం! <p><span style="color: #ffa400; font-size: medium;"><b> కనుచూపుమేర విస్తరించి కనువిందు కలిగించే పెద్ద చెరువు. </b></span></p><p><span style="color: #ffa400; font-size: medium;"><b>దాన్ని ఆనుకుని విశాలమైన క్రీడా మైదానం. </b></span></p><p><span style="color: #ffa400; font-size: medium;"><b>ఆ మైదానానికి ఇటువైపు పచ్చని చెట్ల మధ్యన తాటాకు పాకలతో పాఠశాల. </b></span></p><p><span style="color: #ffa400; font-size: medium;"><b>ప్రజ్ఞావంతులైన టీచర్లు.. హుషారైన మిత్రులు.</b></span></p><p><span style="color: #ffa400; font-size: medium;"><b>ఆటలు...పాటలు... ఎస్ ఎఫ్ ఐ - పీ డీ ఎస్ యు రాజకీయాలు.</b></span></p><p><span style="color: #ffa400; font-size: medium;"><b>ఏడాదిలో రెండు సార్లు కాలేజ్ ఫంక్షన్లు, అందుకోసం పోటీలు, బహుమతులు, నాటికలు. </b></span></p><p><span style="color: #ffa400; font-size: medium;"><b> 'జీజేసీ వైరా' అనగానే మది పొరల్లో పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తూ చిన్ననాటి మధురానుభూతులకు తెరతీసే తీపి జ్ఞాపకాలివీ.</b></span></p><p>1984-85 విద్యా సంవత్సరంలో ఈ స్కూల్ పదో తరగతి చదివిన విద్యార్థులం డిసెంబర్ 19, 2021 నాడు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కలుసుకున్నాం. 36 ఏళ్ల తర్వాత నిక్కర్ బ్యాచ్ బాల్యమిత్రులను చూడడం, మాట్లాడడం, చిన్నప్పటి విషయాలు గుర్తుకుతెచ్చుకోవడం, ఇక కాంటాక్ట్ లో ఉండి తీరాలని అనుకోవడం, కలిసి అక్కడే తిని వచ్చేయడం మంచి అనుభూతి మిగిల్చాయి. </p><table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto;"><tbody><tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEiKk8dCwF3AvQpoO7IkuyjIroHcMTTHkthET9YF6qK845rObuPqln8g6asw6ovKdnDKpa-joqKpPlrlQwZ3MgLx4kX0k35otYS1LUKYV-_ubiFCtvbvrbXAItJJl9ttabT1mnvsqA_NQlQE45aZo-FwPgauv8kC2Ye5cmHUu4Cv9zGPV8Fa1QRgu6Su=s886" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" data-original-height="297" data-original-width="886" height="215" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEiKk8dCwF3AvQpoO7IkuyjIroHcMTTHkthET9YF6qK845rObuPqln8g6asw6ovKdnDKpa-joqKpPlrlQwZ3MgLx4kX0k35otYS1LUKYV-_ubiFCtvbvrbXAItJJl9ttabT1mnvsqA_NQlQE45aZo-FwPgauv8kC2Ye5cmHUu4Cv9zGPV8Fa1QRgu6Su=w640-h215" width="640" /></a></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;">Group photo of 1984-85 tenth class students of GJC Wyra</td></tr></tbody></table><p>నాకు చిన్నప్పుడు ఈ విశాలమైన క్రీడా మైదానమే ఒక సువిశాల విశ్వం. అక్కడ చదివిన నాలుగేళ్లు అదే నా వేదిక. అక్కడి బాడ్మింటన్ కోర్టు, నాటికలు వేయడానికి ఉన్న వేదిక నా ప్రపంచం. ప్రతి సంవత్సరం జరిగే బాడ్మింటన్, వ్యాస రచన, వక్తృత్వం, నాటికల పోటీల్లో కచ్చితంగా ఏదో ఒక బహుమతి వచ్చేది. వైరాలో స్కూల్ లో బాల్ బాడ్మింటన్ తో పాటు ఇంటి దగ్గర ఒక బాల్ బాడ్మింటన్, ఇంకో షటిల్ బాడ్మింటన్ కోర్టు వేసి ఆడేవాళ్ళం. మా నాన్నగారు, అన్నయ్య, తమ్ముడు కూడా ఆడేవారు. అదొక అద్భుతమైన మజా. కొత్తగూడెం రామచంద్ర కాలేజీలో చదివేటప్పుడు ఇండోర్ షటిల్ బాడ్మింటన్ ఆడి ఇంటర్ కాలేజియేట్ ఛాంపియన్స్ అయ్యామంటే, యూనివర్సిటీ జట్టుకు ఎంపిక అయ్యామంటే దానికి పునాది పడింది వైరా మైదానంలో. అందుకే వైరా గ్రౌండ్ కు గుండె లోతుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం. 'ఆటలను నమ్ముకుంటే జీవితం కష్టం. మంచి ఉద్యోగం రావాలంటే చదవాలి....' అని వైరా పీ ఈ టీ మల్లయ్య గారు దివ్యోపదేశం చేయడం బాగానే ఉపకరించింది. జీవితంలో జర్నలిస్టుగా ఈనాడు, ది హిందూ పత్రికల్లో రాటుదేలి, జర్నలిజంలో డాక్టోరల్ డిగ్రీ తో టీచింగ్ లో ఉన్న నాకు అయన మాటలు ఎప్పుడూ గుర్తు ఉంటాయి. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ లో అంతర్జాతీయ స్థాయికి చేరుకొని ఒలింపిక్స్ ధ్యేయంగా కృషి చేస్తున్న నా పుత్రరత్నం స్నేహిత్ తో చేస్తున్న ప్రయోగం మల్లయ్య సార్ కు చెప్పాలని ఉండేది. వారి గురించి తెలియదు. స్కూల్ లో రామస్వామి గారనే ఫిజికల్ డైరెక్టర్ బాల్ బాడ్మింటన్ లో స్పిన్ షాట్ కొడితే బంతి కోర్టు బైటి నుంచి కోర్టులోకి షేన్ వార్న్ స్పిన్ మాయాజాలాన్ని తలపించేలా సుడులు తిరుగుతూ వెళ్ళేది. </p><p>తెలుగు సార్ కొంపెల్ల కృష్ణమూర్తి గారు, ఇంగ్లిష్ సార్ డీ పీ రంగారావు గారు, సోషల్ స్టడీస్ సార్ హరినాథ్ గారు నాకు గుర్తు. బాగా సనాతన సంప్రదాయవాది అయిన కృష్ణమూర్తి గారు తనను తాకనిచ్చేవారు కాదు. పొరపాటున ఆయన్ను ఎవరైనా తగిలితే బాగా కోప్పడేవారు. అయితే అయన బోధనా సామర్ధ్యం అద్భుతమైనది. ఇక డీపీ రంగారావు గారు మా సొంత ఊరు గొల్లపూడి వాస్తవ్యులు. అయన ఎందుకో క్లాసులో మా తాత ప్రస్తావన తెచ్చి ఈపును గుభికీ గుభికీ మనిపించేవారు. ఈయన పీడ విరగడ కావాలని నేను బాగా కోరుకునేవాడిని. నేను నయం, అయన ఆగ్రహానికి, పిడిగుద్దులకు బలైనప్పటికీ అనేక మంది ఆయన్ను ప్రేమగానే గుర్తుకుతెచ్చుకున్నారు మొన్న కలిసినప్పుడు. హరినాథ్ గారు నన్ను 'చదువరి' అని పిలిచే వారు. సెక్షన్-ఏ లో చెప్పిన సోషల్ నోట్స్ ను సెక్షన్-బీ లో నాచేత చదివించేవారు. కానీ ముగ్గురూ కాలం చేసారు. మా ఇంట్లో ఉండి నాతో పాటు వైరాలో టెన్త్ చదివిన ఇంగువ మురళి ఒక పదేళ్ల కిందట కన్నుమూశాడు. మా బ్యాచ్ మిత్రుడు ఎస్ శ్రీను కూడా చనిపోయాడని తెలిసి బాధేసింది. వారి ఆత్మకు శాంతి కలుగుగాక! రాధాకృష్ణ మూర్తిగారు అనే సార్ కూడా ఉండేవారు. </p><table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto;"><tbody><tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEhf9F0f1eAlf4dy91wIQ9HpPpo-OWTD5987AlAXppoTCmzNFCFFE_Ph1TwHmJNtdjpy28xn9CctpdaV5ux1auoJ1DDBJsiAIOZW_u29roWaxV7bDFYjone2cREWWf6QwYev3JSKj5PWoCjQkYeOF7M1KFQ2szSZhSaHHJJlBMl653hGgF-n91IN8DXR=s1024" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" data-original-height="768" data-original-width="1024" height="480" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEhf9F0f1eAlf4dy91wIQ9HpPpo-OWTD5987AlAXppoTCmzNFCFFE_Ph1TwHmJNtdjpy28xn9CctpdaV5ux1auoJ1DDBJsiAIOZW_u29roWaxV7bDFYjone2cREWWf6QwYev3JSKj5PWoCjQkYeOF7M1KFQ2szSZhSaHHJJlBMl653hGgF-n91IN8DXR=w640-h480" width="640" /></a></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;">I have taken a selfie with Ramesh, Govardhan and Jani Basha in front of the then school</td></tr></tbody></table><p>ముగ్గురు సార్లకు (Suri garu, Pulla Rao garu, Satyanarayana garu)ఈ సందర్భంగా సన్మానం చేశారు. నేను పేర్కొన్న ముగ్గురు తప్ప మిగిలిన టీచర్స్ నాకు పెద్దగా గుర్తులేరు. కానీ అప్పటి మిత్రులు మాత్రం బాగా గుర్తు. బాగా సౌమ్యుడైన జానీ బాషా, ఆల్ రౌండర్ అయిన డీ రమేష్, మంచి మిత్రుడు రాజశేఖర్, సమాజం పట్ల అవగాహన-బాధ్యతతో ఉన్న సంగమేశ్వర్ రావు, నా బాడ్మింటన్ దోస్తు గోవర్ధన్, నాతో నాటికలు వేసిన ఎస్ శ్రీను, ప్రత్యేకించి తీసుకున్న రూమ్ లో వయసుకు మించిన విషయాలు బోధించిన బాలస్వామి, చలాకీగా ఉండిన రాం మోహన్, నర్సింహారావు, బీ వీ నాకు గుర్తు. మేము కొందరం పీ డీ ఎస్ యూ లో పనిచేసేవారం. మా నాయకుడు ఆనందరావు అనే మంచి యువకుడు. మాకు సమ సమాజ స్థాపన కోసం ఎన్నో మాటలు చెప్పిన ఆయన పిరికివాడిలాగా తాను ఆత్మహత్య చేసుకోవడంతో నాకు ఈ ఉద్యమం మీదనే విరక్తి వచ్చి వదిలేశాను. </p><table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="float: right; margin-left: 1em; text-align: right;"><tbody><tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEic2Gx8J71Z3uglnPF7q3pKN_Q4uSEwTYh6D2wleTETloSO2_tMMss32mCGtlMRLdv2rO3NBor0IPLGSXQgYkBC1xxpA5Kinaq4Bs0J-N2Hqv8Wo4rhA1p9tqSgUKVSdgxvi2JXI7nqB63hbCgOpYG-EtgjoSFMQSxUek2SGbEURPqphGZ0Otv2fdIu=s1599" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" data-original-height="777" data-original-width="1599" height="155" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEic2Gx8J71Z3uglnPF7q3pKN_Q4uSEwTYh6D2wleTETloSO2_tMMss32mCGtlMRLdv2rO3NBor0IPLGSXQgYkBC1xxpA5Kinaq4Bs0J-N2Hqv8Wo4rhA1p9tqSgUKVSdgxvi2JXI7nqB63hbCgOpYG-EtgjoSFMQSxUek2SGbEURPqphGZ0Otv2fdIu=w320-h155" width="320" /></a></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;">Rajasekhar with Sangameswar and Malla Reddy</td></tr></tbody></table><p>మా ఊరు అబ్బాయి, మొదటినుంచీ కష్ట జీవి అయిన నూకల వాసు నాకు రెబ్బవరం స్కూల్ లోనే తెలుసు. మొన్నటి రీ యూనియన్ సందర్భంగా తన ఇంటికి ఆహ్వానించి పెసరట్టు, ఉప్మా పెట్టాడు. ఇప్పుడు టీచింగ్ వృత్తిలో ఉన్న రాం మోహన్, శ్రీధర్ సూర్యదేవర తదితర మిత్రుల మూలంగా ఈ పూర్వ విద్యార్థుల కలయిక సాధ్యమయ్యింది. స్థానికంగా ఉన్న వారంతా చాలా కష్టపడ్డారు. మాతో కలిసి చదివిన స్థానికుల్లో ఒకరైన బొర్రా రాజశేఖర్ రాజకీయాల్లో ఉండడం విశేషం. అయన ఇప్పుడు మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రాజాకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అనిపించింది. </p><table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="float: left; margin-right: 1em; text-align: left;"><tbody><tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEiwYVnSEfAg_nnWS4qUF2Q4RoAo3m8UFH2GrMiWZXS-4LEduR0W4L-PwDPujIv3FN-4syeLqRsvhNnGMam_eZqa3J_R6iVeumlpWvSno4z7D-MWmPH9IBzkbJEUle9LfzVmFUwPKI8E6K9QLBMDnNnIqNVr_oNGm1_1lQxsdmw7pHg1yAZJcahwvlz-=s1156" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" data-original-height="868" data-original-width="1156" height="240" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEiwYVnSEfAg_nnWS4qUF2Q4RoAo3m8UFH2GrMiWZXS-4LEduR0W4L-PwDPujIv3FN-4syeLqRsvhNnGMam_eZqa3J_R6iVeumlpWvSno4z7D-MWmPH9IBzkbJEUle9LfzVmFUwPKI8E6K9QLBMDnNnIqNVr_oNGm1_1lQxsdmw7pHg1yAZJcahwvlz-=s320" width="320" /></a></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;">Rammohan with our batchmates</td></tr></tbody></table><p>నేను ఎలాగైనా కలవాలని కష్టపడి కాంటాక్ట్ చేసిన వారిలో ముఖ్యులు జానీబాషా, రాజశేఖర్, సంగమేశ్వర్, రమేష్. దాదాపు 13 ఏళ్లపాటు ప్రజల చైతన్యం కోసం పూర్తి స్థాయిలో పనిచేసి, ప్రస్తుతం గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్న జానీబాషాను నేను ఒక నాలుగేళ్ల కిందటనే కలిసాను హైదరాబాద్ లో. జీవితాతం కలిసి నడవాల్సిన మంచి సన్మిత్రుడు జానీ. మేకప్ పాండు గారి కుమారుడు రాజశేఖర్, నేను కలిసి స్కూల్ కు వెళ్లే వాళ్ళం. సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న ఆయన రోజుకొక మొక్క నాటుతూ 'ప్రకృతి ప్రేమికుడు' అన్న మాటను నిజం చేసుకుంటున్నాడు. రెండేళ్ల కిందట టచ్ లోకి వచ్చాం. స్థానికంగా జర్నలిజంలో చేరిన సంగమేశ్వర్ ను కూడా మూడేళ్ళ కిందట కలిసాను మధిరలో. అద్భుతమైన ప్రతిభాపాటవాలు ఉన్న తను కొన్ని కారణాల రీత్యా అక్కడే ఉండిపోవడ, నాకు బాధ కలిగించింది. క్రమశిక్షణ కు మారు పేరైన రమేష్ ఇప్పుడు కాప్ జెమిని లో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఈ రీ యూనియన్ సందర్భంగా రాజశేఖర్ తన నంబర్ ఇస్తే... నేను చాలా సేపు మాట్లాడాను. రమేష్, జానీ, నేను హైదరాబాద్ నుంచి వైరా పోతూ, మళ్ళీ వస్తూ కారులో చేసిన ప్రయాణం, మాట్లాడుకున్న మాటలు మమ్మల్ను టెన్త్ రోజులకు తీసుకుపోయాయి. </p><p>కరోనా వల్ల ఎందరో మంచి మిత్రులను, సన్నిహితులను కోల్పోయిన మాకు ఏడాది చివరిలో జరిగిన ఈ 'ఆత్మీయ సమ్మేళనం' నూతనోత్తేజాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు. అప్పట్లో కలిసి ఉన్న కాలేజ్, స్కూల్ ఇప్పుడు అదే కాంపస్ లో రెండుగా అయ్యాయి. దాంతో, విశాల ప్రాంగణం అనిపించకుండా పోయింది. దీన్ని సుందరీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెలలో ఒకసారైనా అక్కడకు వెళ్లి పిల్లలకు ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంశాల్లో పాఠాలు చెప్పాలని ఉంది. </p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-62044562466110263352021-10-25T14:41:00.006+05:302021-10-25T14:41:48.900+05:30 మావోయిస్టు ఆర్కే హీరోనా? విలనా?<p>తమ్ముడు ముని సురేష్ పిళ్లే సంపాదకత్వంలో చక్కగా రూపుదిద్దుకుంటున్న 'ఆదర్శిని' వెబ్సైట్ కోసం నేను రాసిన వ్యాసమిది. </p><div>(<a href="https://adarsini.com/ram-banam-maoist-rk-is-he-a-hero-or-villian/">https://adarsini.com/ram-banam-maoist-rk-is-he-a-hero-or-villian/</a>)</div><p>'విప్లవం' స్వరూపస్వభావాలు, సాధకబాధకాలు, అర్థపరమార్థాలు అవగాహన చేసుకోవాలంటే 'క్యూబన్ విప్లవం' సరిగ్గా సరిపోతుంది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాకనే, 1953-59 మధ్య కాలంలో యువ న్యాయవాది ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో రెండు విడతలుగా జరిగిన సాయుధ గెరిల్లా పోరాటం సామ్రాజ్యవాదుల తొత్తు, సైనిక నియంత బటిస్టాను గద్దె దింపింది. కమ్యూనిస్టులు అధికారం చేజిక్కించుకున్నారు. అమెరికా దాష్టీకాలను, ఆర్ధిక ఆంక్షలను, హత్యా ప్రయత్నాలను, కుట్రలను తట్టుకుని చాలా దేశాల కన్నా మెరుగైన పాలనను కాస్ట్రో అందించారు. అదొక ఉక్కుపాదపు ప్రభుత్వమన్న విమర్శలు, కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వంటి ప్రతికూలాంశాలు కూడా ఈ క్రమంలో కనిపిస్తాయి. కాస్ట్రో సోదరుల శకం ఈ మధ్యనే ముగిసినా ఈ విప్లవం ఆరంభం నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు ఆసక్తి కలిగిస్తూ అబ్బురపరుస్తాయి.</p><p>రక్తపాతం నడుమ మొదటి సారి సాయుధ పోరాటం విఫలమైనప్పుడు కాస్ట్రో బందీ అయ్యాడు. దేశం కోసం, ప్రజల కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం న్యాయస్థానంలో కాస్ట్రో చేసిన నాలుగు గంటల వాదన ('హిస్టరీ విల్ అబ్సాల్వ్ మీ') చరిత్రలో నిలిచిపోతుంది. 'మీరు నా గొంతు నొక్కలేరు. క్యూబన్ గా బతకడం అంటే అది ఒక విద్యుక్త ధర్మం. ఆ ధర్మాన్ని నెరవేర్చకపోవడం ఒక నేరం, దేశ ద్రోహం... పాలకుడు ఒక నేరగాడో, ఒక దొంగో అయిన దేశంలో నిజాయితీపరులు చావనైనా చావాలి లేదా జైళ్లలో నైనా మగ్గాలి. అది అర్థంచేసుకోదగ్గదే... నన్ను శిక్షించండి, పర్వాలేదు. చరిత్ర మాత్రం నన్ను దోష విముక్తుడినని నిరూపిస్తుంది," అని అయన చేసిన ప్రసంగం ఉత్తేజపూరితంగా సాగి పౌరులలో కదనోత్సాహాన్ని నింపుతుంది. విప్లవ మహా యోధుడు కాస్ట్రో ఆ ప్రసంగం చేసింది అక్టోబర్ 16, 1953న. ఒకటి రెండు రోజుల తేడాతో సరిగ్గా 68 సంవత్సరాల తర్వాత మనందరం దసరా సంబరాల్లో ఉండగా, భారత దేశంలో సాయుధ పోరాటానికి పెద్ద సంఖ్యలో యువతను సన్నద్ధం చేసేలా కదనోత్సాహం నింపిన మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) అడవితల్లి ఒడిలో 63 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి- హోం మంత్రి జానారెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వచ్చి మొదటిసారి బహిరంగంగా ప్రజలకు కనిపించిన సరిగ్గా 17 ఏళ్లకు ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కన్నుమూశారు. ఇంతకూ ఆర్కే హీరోనా? విలనా?</p><p>పీడిత తాడితుల పక్షాన తాను ప్రగాఢంగా నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి, నాలుగు దశాబ్దాల పాటు భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిర్బంధాల నడుమ నానా కష్టనష్టాలు చవిచూసి, తన దారినే ఎంచుకున్న కొడుకు కళ్ల ముందు బుల్లెట్టు దెబ్బకు నేలకొరిగినా చలించకుండా, నిత్యం నిఘా నేత్రాల మధ్యన దినమొక గండంగా అలుపెరగని పోరాటం చేసి, వైద్యం అందక అనారోగ్యంతో కన్నుమూసిన ఆయన్ను హీరో అందామా?</p><p>అగమ్యగోచరమైన విప్లవ పంథాను ఎంచుకుని, సమాంతర సాయుధ వ్యవస్థతో, హింస-రక్తపాతంతో బీభత్సం సృష్టించి... రాజ్య ప్రతినిధుల పేరిట, ఇన్ఫార్మర్ల నెపంతో ప్రాణాలు హరించి... ఆదివాసులను, గిరిజనులను, అణగారిన వర్గాల పిల్లలను ఆకర్షించి సాయుధ ఉద్యమంలో సమిధలను చేసినందుకు విలన్ అందమా?</p><p><br /></p><p>ఈ సంగతి ఇలా ఉంచితే.... ఇంతకూ-</p><p>జనాల్లో వస్తు వినియోగ సంస్కృతి విచ్చలవిడిగా పెచ్చరిల్లిన ఈ కాలంలో...</p><p>స్వలాభం, స్వకుటుంబ సంక్షేమం, స్వార్థం జడలు విప్పిన ఈ రోజుల్లో...</p><p>సాంకేతిక పరిజ్ఞాన ప్రేరక సమాచార సాధనాలు పంచుతున్న పిచ్చి వినోదానికి జనాలు బానిసలుగా మారిన ఈ పరిస్థితుల్లో...</p><p>ప్రలోభాల ప్రభావంతో అధికారంలోకి వచ్చి ఆనక పదింతలు దండుకోవచ్చన్న నవీన ప్రజాస్వామిక సూత్రానికి ఓటర్లు ఆమోదముద్ర వేస్తున్న ఈ తరుణంలో...</p><p>నిలకడైన అభివృద్ధికి ఉపకరించని జోకొట్టే పథకాల వలలో, తాయిలాల లంపటంలో కుడుమిస్తే పండగనుకునే జనాలు సుఖప్రస్థానం చేస్తున్న ఈ వాతావరణంలో...</p><p>నిర్బంధకాండతో నోళ్లు మూయించవచ్చని పాలకులు దిగ్విజయంగా నిరూపిస్తున్న సమయంలో...</p><p>మనకెందుకొచ్చిన గొడవని టీచర్లు, మేధావులు, బుద్ధి జీవులు; రాజీపడితే పోలా! అని విద్యార్థులు స్థిరపడిన ఈ ఘడియల్లో...</p><p>'విప్లవం' అన్నది ఒక కాలం చెల్లిన సిద్ధాంతం కాదా?</p><p>ఆర్కే మరణం నేపథ్యంలో చర్చకు వచ్చిన అంశాలివి.</p><p>సిద్ధాంత రాద్ధాంతాలను పక్కనపెట్టి చూస్తే- 'శాంతి'లో ఒక ప్రశాంతత, నిదానం, గంభీరత ఉన్నట్లే... 'విప్లవం' లో ఒక పోరాటం, ఆరాటం, త్యాగ నిరతి ఇమిడి ఉంటాయి. ప్రతి మనిషి లో ఒక శాంతి కాముకుడు, ఒక విప్లవ యోధుడు ఉంటాడు.</p><p>అన్నీ అమరుతూ కడుపులో చల్ల కదలకుండా సాగిపోతున్నపుడు ఎవడెటుపోయినా మనసు 'శాంతి' వైపే నిలకడగా ఉంటుంది. కడుపుకాలే వాడు, పీడనకు-దోపిడీకి నిరంతరం గురయ్యేవాడు రెండో వైపు చూస్తాడు. భారత స్వాతంత్య్ర పోరాటం గానీ, క్యూబన్ విప్లవం కానీ, ఆ మాటకొస్తే చరిత్రలో అన్ని ప్రజా ఉద్యమాలు సూచించేది- శాంతి కావాలంటే విప్లవం (లేదా, దాని లైటర్ వెర్షన్ 'పోరాటం') ఉండాల్సిందేనని. ఇది చారిత్రక సత్యం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది అట్లనే కదా! అత్యద్భుతమని మనం గట్టిగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపెడితే రాలేదు. ప్రజాకంటకుల చెంపలు పగలగొడితే గానీ అవి ఏర్పడలేదు. అందరి కోసం ఏ కొందరో రక్తతర్పణం చేస్తేగానీ మనం ఈ స్థితికి చేరుకోలేదు.</p><p>అట్లాగని హింసే పరమ ఔషధం అని కూడా వాదించలేం.</p><p> 'ది హిందూ' ఆంగ్ల పత్రిక నల్గొండ ప్రతినిధిగా నేను ఎదుర్కున్న ఒక సంఘటన ఇది. అప్పట్లో ఒక అధికార పార్టీ ప్రతినిధి (తెలుగు దేశం మనిషి)ని- పది మంది సాయుధ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా- కృష్ణపట్టి దళం దారుణంగా కాల్చిచంపింది. ఆ ప్రతినిధి ఒక పలుకుబడిగల మనిషని తెలుసు గానీ, ఈ హత్యకు అసలు కారణాలు ఎవ్వరూ చెప్పలేదు. లొంగిపోయిన తర్వాత మాజీ నక్సలైట్ కోనపురి రాములును నేను ఈ హత్య గురించి లోతుగా కొన్ని ప్రశ్నలు అడిగాను. తమపై ఆ ప్రజా ప్రతినిధి చేస్తున్న అఘాయిత్యాలపై, లైంగిక అకృత్యాలపై ఆ ఊరి మహిళలు చేసిన ఫిర్యాదు మేరకు, ఒకటి రెండు సార్లు హెచ్చరిక జారీ చేశాకనే తానే ఈ మర్డర్ చేశానని చెప్పాడు. 'పోలీసులతో కుమ్మక్కై ఆ నాయకుడు చేసిన ఘోరాలు అన్నీ అన్నీ కావు. అందుకే పై స్థాయిలో చర్చించే ఆ చర్య తీసుకున్నాం. ఆ ప్రజాకంటకుణ్ణి హత్య చేసిన తర్వాత మహిళలు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. వారి జీవన్మరణ సమస్యను తీర్చినందుకు అంత కూంబింగ్ మధ్యన ఆ ఊర్లోనే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు,' అని రాములు చెప్పాడు. అధికారం చేతిలో ఉన్నవారి అడుగులకు ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ మడుగులొత్తుతుంటే నిస్సహాయులైన అదే ప్రజలు సాయం కోసం మీ దగ్గరకు వస్తే ఏమి చేస్తారన్నా? అని రాములు అడిగితే నా దగ్గర ఠక్కున చెప్పే సమాధానం లేదు. మనింటి మహిళను అదే ప్రజాప్రతినిధి చెరిస్తే కర్మ ప్రారబ్దమని వదిలేస్తామా?</p><p>అట్లాగని మావోయిస్టులు చేసిన హత్యలన్నీ ఇంతలా సమర్ధనీయం కాదు. అందులో కొన్ని మతిమాలినవి కూడా లేకపోలేదు. కాకతీయ ఫాస్ట్ పాసింజర్ కు మంటలు పెట్టినట్లు వచ్చిన ఆరోపణ చిన్నదేమీ కాదు. ఎదుగుతున్న గిరిజన నాయకుడు రాగ్యానాయక్ ను చంపి సారీ చెప్పారు. ఖాకీ డ్రస్సులో ఉన్న పాపానికి పోలీసులను కేవలం భయోత్పాతం సృష్టించడానికో, ఉనికి చాటుకోవడానికో కాల్చిపారేయడం ఏమి న్యాయం? ఇట్లాటివన్నీ పోలీసులు జరిపే బూటకపు ఎన్ కౌంటర్ల అంతటి తప్పుడు పనులే. ఆ తరవాతి కాలంలో నయీమ్ అనే భూ భోక్త, హంతకుడిని పోలీసు వ్యవస్థ ఎలా వాడుకున్నదీ, మేధావులైన పౌర హక్కుల నేతలను ఎంత దారుణంగా హత్య చేసిందీ చూస్తే గుండె తరుక్కుపోయేది. వ్యూహ ప్రతివ్యూహాల్లో చట్టం, న్యాయం నవ్వుల పాలయ్యాయి. మానవత్వం మంట కలిసింది. అదే సమయంలో, కొందరు పోలీసు బాసులు లొంగుబాట్లకు, లొంగిన వారి ప్రశాంత జీవనానికి సహకరించిన తీరు కూడా ప్రశంసనీయం. అందుకే- నక్సల్స్, సర్కార్ లలో ఎవరు రైట్, ఎవరు రాంగ్ ? అనే దానికి సమాధానం దొరకడం అంత తేలిక కాదు.</p><p> ఒకరి దృష్టిలో 'టెర్రరిస్టు' మరొక దృష్టిలో 'స్వాతంత్య్ర పోరాట యోధుడు' అన్నది ఎంత నిజం! నక్సల్స్ ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు గ్రామాల్లో విచ్చలవిడితనం, అఘాయిత్యాలు, అక్రమాలు, అవినీతి, మతోన్మాదం అంతగా ఉండేవి కావు. ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండను చూస్తే... నక్సలైట్లు ఉంటే ఎంతబాగుందని అనిపిస్తున్నది ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. మావోయిజాన్ని భూతంగా, రాక్షస కృత్యంగా చూడనక్కరలేదని 2004 లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చర్చలకు పిలిచి నిరూపించింది. చర్చలు విఫలమైనా... పీడితులు బాధితులు బారులుతీరి మరీ నక్సల్ నాయకులకు వినతి పత్రాలు సమర్పించిన తీరు చూస్తే ఆ వ్యవస్థ పట్ల వారికున్న నమ్మకం, భరోసా కనిపించాయి. నిజానికి, విప్లవ పార్టీల ప్రధాన డిమాండ్... భూ సంస్కరణలు. 1967 లో బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం పుట్టుకొచ్చింది కూడా భూమి గురించే. చారు మజుందార్ లిఖిత 'చారిత్రక ఎనిమిది ప్రతుల్లో' దిశానిర్దేశం ఉన్నప్పటికీ వాటికి ప్రాతిపదిక భూమి, రైతాంగం. </p><p>దున్నేవాడికి భూమి, పేదలకు భూమి నినాదాలతోనే అనేకమంది అడవిబాట పట్టారు. 2004 శాంతి చర్చల సమయంలో ఆర్కే బృందం ఈ సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తే సరైన రికార్డులు లేవంటూ మళ్ళీ మాట్లాడుకుందామని ప్రభుత్వం చెప్పి పంపింది. దళితులకు మూడేసి ఎకరాలు అన్న మాట (అది మాటగా ఇచ్చినా, ఇచ్చి తప్పుకున్నా) కచ్చితంగా మావోయిస్టుల డిమాండ్ నుంచి పుట్టుకొచ్చిందే. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు దాటుతున్నా దారిద్య్రంతో కునారిల్లుతున్న వారు అట్టడుగున అట్లనే పడి కొట్టుకుంటున్నారు. పేదలు దరిద్రులుగా, ధనికులు కుబేరులుగా తయారయ్యే అసమతుల్య వ్యవస్థ వేళ్లూనుకుంది. భూమితో పాటు, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌలిక సమస్యలు ఇంకా అపరిష్కృతం గానే ఉన్నాయి. </p><p>ప్రజల్లో నిస్సహాయత పెచ్చరిల్లితేనే సమస్య. మహమ్మారి కరోనా సృష్టించిన బీభత్సం ఇప్పట్లో మరవగలమా? కొత్త వైరస్ విజృభించిన క్లిష్ట సమయంలో వ్యవస్థపై పట్టులేక ప్రభుత్వాలు ప్రజలను గాలికి వదిలేశాయి. మందులేని రోగానికి కార్పొరేట్ వైద్యరంగం లక్షలకు లక్షల బిల్లులు వేస్తే జనాలు దాచుకున్న సొమ్ము ఏ మాత్రం సరిపోకపోగా అసహాయంగా ఆస్తులు అమ్ముకున్నారు. ఇలాంటి దయనీయ స్థితులే జనాలను గళమెత్తేలా, వేరే దారిపట్టేలా చేస్తాయి.</p><p>ఆర్కే మరణంతో రాజ్యంపై సాయుధ పోరాటం లేదా ప్రజా యుద్ధం అనే పద్ధతి అంతం అయినట్లేనా? ఇక ఈ మావోయిస్టుల పంచాయితీ, రక్తపాతం ఉండవా? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. అసలెలాంటి హింసకు తావులేని సుఖప్రదమైన జీవితాలు ఉండాలని సమాజ హితైషులమైన మనం కోరుకుంటాం. అట్లాగని రాజ్య హింస లేకుండా పోవాల్సిందిపోయి.... అది మన నాగరికతలో పాటు వివిధ రూపాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నదే! చట్టాలు కలవారి చుట్టాలై పోయాయి. కర్ర ఉన్నవాడిదే బర్రె అయ్యింది. అందరి మేలు కోసం మనం రాసుకున్న మాటలు, చేసుకున్న బాసలు ధనికులకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయం చేస్తున్నాయి. ఆధునికతతో పాటు దోపిడీ పెరుగుతున్నది. వర్గ దోపిడీకి తోడు పాలి-కార్పొ జమిలి దోపిడీ (పాలిటిక్స్-కార్పొరేట్స్) శృతిమించుతున్నది.</p><p>దోపిడీ ఉన్న చోట తిరుగుబాటు తప్పకుండా ఉంటుందని చెప్పడానికి పెద్ద సిద్ధాంతాలు అక్కర్లేదు. అదొక సహజ సూత్రం. పీడితులను చైతన్య పరిచి, సమీకరించి, సంఘటితం చేసి తిరుగుబాట పట్టించే బలీయమైన శక్తులు ప్రతి తరంలో ఉంటాయి. అది కూడా సహజ సూత్రమే. విప్లవాలు అట్లానే పుట్టుకొస్తాయి. తుఫాను సృష్టిస్తాయి.</p><p>ఈ పరిస్థితిని నిలువరించే, నివారించే శక్తి నిజానికి ప్రభుత్వాల్లో ఉంది. నక్సల్స్, మావోయిస్టులు వంటి వామపక్ష సాయుధులు లేకుండా, పుట్టకుండా చేయాలంటే చేయాల్సిన పనులు స్పష్టం. పేదలకు భూమి పంపిణీ, రైతు సమస్యల పరిష్కారం, కార్మికులకు న్యాయమైన జీతాలు, యువతకు ఉద్యోగాలు, ప్రజలకు నాణ్యమైన-మెరుగైన-ఉచితమైన విద్య, వైద్య సౌకర్యాలు, సహజ సంపదల దోపిడీ నివారణ, అణగారిన వర్గాలకు గౌరవం వంటి పనులు చేస్తే చాలు. నక్సలైట్లే నిజమైన దేశభక్తులని అన్న ఆయన గానీ, నక్సల్స్ అజెండానే మా అజెండా అని అన్న పెద్ద మనిషి గానీ అధికారం చేతిలో ఉండగా చిత్తశుద్ధితో పనిచేయకుండా ఇతరేతర అజెండాలను భుజాలకు ఎత్తుకోవడం వల్ల ఈ దీర్ఘ కాల సమస్యలు ఎక్కడివక్కడే ఉండి పోయాయి. అధికారంలో కొనసాగడం ఎలా? అన్నది మాత్రమే ఏకైక అజెండాగా పాలకులు నానా గడ్డికరుస్తుంటే ఈ సమస్యలు ఇట్లానే ఉంటాయి.</p><p>తప్పో, ఒప్పో... ఒక మహోన్నతమైన ఆశయ సాధన కోసం అహరహం కృషిచేసి కన్నుమూసిన కమిటెడ్ విప్లవకారుడి కోసం సమాజం రెండు కన్నీటి బొట్లు విడవడంలో తప్పులేదు. ప్రజల పక్షపాతులు, విప్లవ భావావేశపరులు, ప్రజాస్వామ్య హితైషులు, కమ్యూనిస్టులు అనేక మంది ప్రయివేటు సంభాషణల్లో ఆర్కే సేవలను కొనియాడారు. ఆయుధం చేబూనడం, ఎన్నికలకు దూరంగా ఉండడం తప్ప మిగిలినవన్నీ ఆయనదీ అన్ని రాజకీయ పార్టీల అజెండానే అయినప్పటికీ పొలిటీషియన్స్ బైటకు పెద్దగా ప్రకటనలు చేసినట్లు కనిపించలేదు. 'కామ్రేడ్ ఆర్కే జోహార్... లాల్ సలామ్'... అని బహిరంగంగా అన్న పొలిటికల్ గొంతు సీపీఐ నారాయణ గారిదొక్కటే ప్రముఖంగా వినిపించింది. దక్షిణ అమెరికా ఖండపు విప్లవ వీరుడు చే గువేరా బొమ్మ తో రాజకీయం చేసుకోవాలనుకునే భావోద్వేగపు బాపతు నయా నాయకులూ మిన్నకున్నారు. కాకి అరిచినా ట్వీట్ చేసే వాళ్లు ఆర్కే మరణాన్ని ప్రస్తావించి ఆ సిద్ధాంతంలో తప్పొప్పులను మాట్లాడవచ్చు. గణనీయంగా మారిన సామాజిక, ఆర్థిక, సాంకేతిక పరిస్థితుల్లో మావోయిజం రిలవెన్సు గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు గదా! వైరుధ్యాల ప్రపంచంలో అన్నీ బ్లాక్ అండ్ వైట్ గా ఉంటాయనుకోవడం తప్పే కదా.</p><p>ఆర్కేని ఆదర్శంగా తీసుకుని ఆయుధాలు చేబట్టి ఉన్నపళంగా బస్తర్ అడవుల వైపు వెర్రిగా పరిగెడుతూ పోవాల్సిన పనిలేదు. రాజ్య ప్రతినిధులను శత్రువులుగా చూడాల్సిన, కాల్చాల్సిన, వర్గ శత్రు నిర్మూలన చేయాల్సిన పనిలేదు. ఎవరి వృత్తుల్లో వారు ఉంటూనే, ఎవరి స్థాయిలో వారు దోపిడీని నిలువరించాలి. ప్రతి మనిషికి, ప్రతి శ్రమకు గౌరవం దక్కేందుకు కృషిచేయాలి. గళమెత్తే కలాలకు దన్నుగా ఉండాలి. ప్రశ్నించే గొంతులను బలోపేతం చేయాలి. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలి. బాధ్యతతో ప్రజాచైతన్యం కల్గించడం ప్రతి ఇండియన్ విద్యుక్తధర్మమని వ్యవస్థలో అందరూ అహరహం భావించాలి. మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది చాలా కీలకం. </p><p>ఇంతకూ ఆర్కే హీరోనా? విలనా? అన్న దానికి 'ఎస్' లేదా 'నో' అన్న సమాధానం ఇవ్వడం ఏ మాత్రం కుదరదు. ఇది ఎవరికి వారు పరిస్థితులను అధ్యయనం చేసిన, వాస్తవాలు క్రోడీకరించి, విషయాలు అవగాహన చేసుకుని ఒక నిర్ణయానికి రావలసిన అంశం. </p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-49581619587626860712021-08-30T20:56:00.001+05:302021-08-30T20:56:15.030+05:30'ఈనాడు' కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా-ఆమోదం <div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiEJQksm6C-8Ivz9f2mjtMuM1-ZfyKjet0cs8J7PaMqd8GCcPXIXYWBd61rlp9W_rKLzKhc7O1e5Q0q0h3g8HiZ6IUfgHYPpyfyT5dxWyfZkYsqXPLKq3och6uKGhK1Juv4-KOdq_dV6EA/s1200/sirdhar.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="900" data-original-width="1200" height="300" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiEJQksm6C-8Ivz9f2mjtMuM1-ZfyKjet0cs8J7PaMqd8GCcPXIXYWBd61rlp9W_rKLzKhc7O1e5Q0q0h3g8HiZ6IUfgHYPpyfyT5dxWyfZkYsqXPLKq3och6uKGhK1Juv4-KOdq_dV6EA/w400-h300/sirdhar.jpg" width="400" /></a></div><br /><p>'ఈనాడు' కార్టూనిస్టుగా సుదీర్ఘంగా 43 సంవత్సరాలు పనిచేసిన శ్రీధర్ గారికి ఆ పత్రికతో బంధం తెగిపోయింది. తాను రాజీనామా చేసినట్లు ఆయన ఫేసు బుక్ లో చేసిన ప్రకటన తెలుగు పాఠకులను కుదిపివేసి పెద్ద సంచలనం సృష్టించింది. ఈ ప్రస్థానంలో అయన దాదాపు లక్ష కార్టూన్లు వేసినట్లు ఒక అంచనా. </p><p>స్పార్క్ ను గుర్తించి రామోజీ రావు గారు ప్రోత్సహించిన శ్రీధర్ గారు ఒక సంచలనం. మృదుస్వభావి, పక్కా ప్రొఫెషనల్ అయిన ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. </p><p>శ్రీధర్ గారికి మేలు జరగాలని కోరుకుంటున్నాం. </p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com6tag:blogger.com,1999:blog-6892103454419978380.post-58622618309420389502021-08-04T21:43:00.007+05:302021-08-04T21:43:57.267+05:30తీన్మార్ మల్లన్నపై కక్షపూరిత వైఖరి తగదు!<p>ప్రశ్నించే గొంతులను నొక్కేయడం అప్రజాస్వామిక పాలకుల ప్రథమ కర్తవ్యం. ప్రశ్నించే తత్త్వం నుంచి, ఒక మహోన్నత ఉద్యమం ద్వారా పాలనాధికారం పొందిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రజాదరణ కలిగిన ' క్యూ న్యూస్' యూ ట్యూబ్ ఛానెల్ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు అయిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పట్ల ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడంలేదు. ఇది దారుణం, అన్యాయం. </p><p>ప్రభుత్వ విధానాలకు, అవినీతికి పాల్పడిన మంత్రులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, పత్రికలు, టెలివిజన్ చానళ్ల కన్నా ఘాటుగా స్పందిస్తూ ప్రజాదరణ పొందిన మల్లన్న ఆఫీసులో నిన్న (ఆగస్టు 3, 2021) రాత్రి మూడు గంటలకు పైగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ పనిచేసినట్లు పోలీసులు తెలిపినా, ఇది ఒక పద్ధతి ప్రకారం కక్ష సాధింపుతో చేసినట్లు కనిపించింది. ఆఫీసు బైట మల్లన్న అభిమానులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. పలు రాజకీయ పార్టీలు కూడా మల్లన్నకు బాసటగా నిలిచాయి. పోలీసుల సోదాలను మల్లన్న టీమ్, అయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో లైవ్ చేసారు. మొత్తం మీద పోలీసులు తనను అక్రమంగా కదలకుండా చేశారని, కొన్ని కంప్యూటర్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు మల్లన్న చెప్పారు. </p><p>ఇటీవల ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధికి ముచ్చెమటలు పట్టించి మల్లన్న రెండో స్థానం పొందారు. ఆ తర్వాత ప్రభుత్వంపై దాడిని మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా టీమ్ లను ఏర్పాటు చేసి అక్రమార్కులపై కథనాలు పెంచి, తనను కలిసిన బాధితులకు బాసటగా ఉంటున్నారు. సాధారణ జర్నలిజానికి భిన్నంగా పరుష పదాలతో.... ముఖ్యమంత్రిని, ఆయన పరివారాన్ని నేరుగా దూషిస్తూ, పలు ఆరోపణలు చేస్తూ మల్లన్న రోజూ చేసే చర్చలకు ప్రజాదరణ ఉంది. ఈ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో అవినీతి పెరిగిందిగానీ, అభివృద్ధి జరగడం లేదన్న అక్కసు, ఆవేదన మల్లన్న మాటల్లో కనిపిస్తుంది. </p><p>తనను అరెస్టు చేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని మల్లన్న చెబుతూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా మల్లన్న కు వ్యతిరేకంగా కొన్ని పరిణామాలు జరిగాయి. వాటికి, పోలీసుల చర్యకు ఎంత సంబంధం ఉన్నదీ తెలియదు గానీ, ప్రభుత్వం పరిధికి మించి ఒక జర్నలిస్టును వేధించడం మంచిది కాదు. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించిన యువ జర్నలిస్టు రఘు ను పోలీసులు గూండాల్లా అరెస్టు చేసి అభాసు పాలైన కొన్ని రోజులకే మరో జర్నలిస్టు ఆఫీసులో పోలీసు సోదాలు జరగడం గమనార్హం. </p><p>మల్లన్న పై ప్రభుత్వ పత్రికగా ముద్ర ఉన్న 'నమస్తే తెలంగాణ' ప్రచురించిన వార్త ఈ కింది విధంగా ఉంది. ముఖ్యమంత్రిని మాటిమాటికీ అనుచితంగా మల్లన్న తిట్టడం ఎంత తప్పో, ఈ కింది కార్టూన్ లో 420 గా తనను పేర్కొనడం అంతే తప్పు. జర్నలిజం ముసుగులో దొంగదెబ్బలు తీయడం వృత్తికి ప్రమాదం. </p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhVISoPj4Cv3YyTfUAZwV32Cpl_rhJXs7sckxTGFn34dcRtWA7ruGcrQ4XCwGPtczOdSNKLd9e6-aj94FD5328gLktKilLAQHZg-iMqbWB5vQ1dnzXlw4-JUwPIJ8ZdQ5WrqAAAW8xz3Ps/s1458/mallanna+.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="761" data-original-width="1458" height="334" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhVISoPj4Cv3YyTfUAZwV32Cpl_rhJXs7sckxTGFn34dcRtWA7ruGcrQ4XCwGPtczOdSNKLd9e6-aj94FD5328gLktKilLAQHZg-iMqbWB5vQ1dnzXlw4-JUwPIJ8ZdQ5WrqAAAW8xz3Ps/w640-h334/mallanna+.jpg" width="640" /></a></div><br /> <p></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-35617214507108543052021-07-17T15:56:00.002+05:302022-06-02T12:29:28.225+05:30'ది హన్స్ ఇండియా' పదేళ్ల పండగ!<div>హైదరాబాద్ కేంద్రంగా వెలువడుతున్న 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల దినపత్రిక జులై 16, 2021 నాడు పదేళ్ల జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకం. రోజురోజుకూ నాణ్యత పరంగా వృద్ధిచెందుతున్న ఈ పత్రికకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం. సీఎల్ రాజాం గారి నేతృత్వంలో, అప్పరసు శ్రీనివాస రావుగారి సంపాదకత్వంలో హైదరాబాద్ కేంద్రంగా 'మెట్రో ఇండియా' అనే పత్రిక వచ్చింది కానీ మూడు ఏళ్లకే మూతపడింది. ఎదుకంటే... దినపత్రిక నిర్వహణ అంత తేలికైన వ్యవహారం కాదు. అయినా.... మొక్కవోని దీక్షతో నాణ్యతకు పెద్దపీట వేస్తూ, ఆర్ధిక సమస్యలను అధిగమిస్తూ పదేళ్లు పూర్తిచేసుకోవడం మామూలు విషయం కాదు. </div><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhde1V5l5GYJlhLQcLXFsnhYYIQ2bhlVVH2LAXqFBAN5zoADFP3HQO5v1rIKYaeSixUriBhr40yOFmle8TobNQwRzeLc-SGAXycAO0ECzdtoTxsBaWKn1VqkzXNi_Gk6eBJwLi_oWiHuY8/s840/hans+india+10.jpg" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="554" data-original-width="840" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhde1V5l5GYJlhLQcLXFsnhYYIQ2bhlVVH2LAXqFBAN5zoADFP3HQO5v1rIKYaeSixUriBhr40yOFmle8TobNQwRzeLc-SGAXycAO0ECzdtoTxsBaWKn1VqkzXNi_Gk6eBJwLi_oWiHuY8/s320/hans+india+10.jpg" width="320" /></a></div><div><br /><div>కపిల్ చిట్స్ అధిపతి వామనరావు గారి పెట్టుబడిలో సీనియర్ జర్నలిస్టు కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి మానస పుత్రికగా "ది హన్స్ ఇండియా' పత్రిక పురుడుపోసుకున్నప్పుడు నేను ఆ సంస్థ వారి 'ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం' వ్యవహారాలు చూసేవాడిని. దీన్ని మంచి టాబ్లాయిడ్ గా తేవాలని భావించినా ప్రింటింగ్ కు సంబంధించి వచ్చిన సాంకేతిక సమస్య వల్ల బ్రాడ్ షీట్ గా తెచ్చారు. ఎడిటర్ గా, డెక్కన్ క్రానికల్ మాజీ ఎడిటర్ నాయర్ ఉండేవారు. సీనియర్ జర్నలిస్టు, ది హిందూ లో ఒక వెలుగు వెలిగిన సాయశేఖర్ రిపోర్టింగ్ కు నేతృత్వం వహించారు. భాస్కర్, పెన్నా శ్రీధర్, మంజులతా కళానిధి తదితర మంచి జర్నలిస్టులు ఉన్న ఈ బృందం చాలా కష్టపడి దీన్ని ఆరంభించింది. వృత్తి విలువలు, నైతిక నిబద్ధత వంటి అంశాలలో 'ది హిందూ' కు దీటుగా ఉండాలని సంకల్పం చెప్పుకున్నారు. లోకల్ వార్తలకు పెద్దపీట వేయడం ఇందులో కనిపిస్తుంది. అలాగే ప్రత్యేకించి బిజినెస్ ఎడిషన్ ఉండడం ఒక ప్రత్యేకత. </div><div>అప్పటికే జర్నలిజం పటుత్వం తగ్గిపోయిన నాయర్ గారికి పూర్ణకుంభ స్వాగతం పలికి బాధ్యతలు మొదట్లో ఎడిటర్ బాధ్యతలు అప్పగించారు గానీ, అది వర్కవుట్ అయినట్లు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి హయాంలో పత్రిక ఒక ఊపు అందుకుంది. వారు వెళ్ళిపోయాక సీనియర్ జర్నలిస్టు రామూ శర్మ గారి నేతృత్వంలో కొత్తపుంతలు తొక్కుతున్నది. పత్రిక రెండో రోజు బ్యానర్ స్టోరీగా నేను నల్గొండ లో ఫ్లోరైడ్ సమస్య మీద రాస్తే వేశారు. మే 2021 నుంచి ప్రతి బుధవారం 'Moot Point' అనే కాలమ్ రాసే అవకాశం ఇచ్చిన ప్రస్తుత ఎడిటర్ రామూ శర్మగారికి ధన్యవాదాలు. </div><div><br /></div><div>పది వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రామూ శర్మ గారి సైన్డ్ ఎడిట్ ఇదీ: </div><div><div><br /></div><div><span face=""Open Sans", sans-serif" style="background-color: white; color: #303030; font-size: 18px;">Crossing the decade milestone is a moment of pride for The Hans India. The 10-year-old journey began with an intention to serve the Telugus with wholesome, pure and unbiased news. This made the Hyderabad Media House Limited launch The Hans India simultaneously from Hyderabad, Visakhapatnam, Vijayawada, Warangal and Tirupati on July 16, 2011. The launch took off under the leadership of veteran journalist K Ramachandra Murthy, who took the newspaper from the pre-Telangana movement to separate Statehood. Since then The Hans India was driven by the credible Editors PNV Nair and Prof K Nageshwar bringing the unbiased reportage to the readers.</span></div><div><span face=""Open Sans", sans-serif" style="background-color: white; color: #303030; font-size: 18px;">The Team Hans promises to continue its journey in the new decade upholding the core values and remain connected with the readers by taking up issues that matter to them the most. The Hans India has seven editions in the two Telugu States and one edition in the National Capital to reach Telugus, policymakers and opinion leaders. With Hyderabad, Warangal and Khammam editions in Telangana and Amaravati, Visakhapatnam, Tirupati and Kurnool edtions in Andhra Pradesh, The Hans India has a unique distinction of having readers in the age group of 18 to 45 years. It has started attracting readers from Mumbai, Delhi, Bengaluru and Chennai.</span></div><div><br /></div><div><p style="background-color: white; box-sizing: border-box; color: #303030; font-family: "Open Sans", sans-serif; font-size: 18px; margin: 0px 0px 10px;">With growing readership over a broad spectrum, The Hans India has launched two e-Papers riding the digital trends. A full-fledged edition has a special focus on Bengaluru. The second one on the young entrepreneurs with Bizz Buzz and the business sections explore all aspects from start-ups, macroeconomy to information for small investors. The core of the newspaper is its unbiased content serving various sections of society, especially the marginalised society and rural regions, not ignoring the urban happenings. The urban content is amply covered in City Hans pages, which is the source of strength in reaching the readers. Besides national news with a special focus on diaspora from abroad, in-depth articles from experienced experts in the field is the hallmark of The Hans India. An exclusive section Womenia covers various aspects of women. Young Hans provides the space for GenNext to give utility news from education to opportunities. Illustrated Sports pages give priority to the local news as important as popular games in the arena of sports.</p></div><div><p style="background-color: white; box-sizing: border-box; color: #303030; font-family: "Open Sans", sans-serif; font-size: 18px; margin: 0px 0px 10px;">As part of social responsibility, The Hans India has initiated awareness programmes among citizens like Jagore, Freedom from Plastic, Half Marathon and Retail Ratna Awards etc. With the focused coverage, The Hans India has created an impact on the administration by taking up action on civic issues. These responsive actions from the administration are covered under the brand: The Hans Impact.</p><p style="background-color: white; box-sizing: border-box; color: #303030; font-family: "Open Sans", sans-serif; font-size: 18px; margin: 0px 0px 10px;">Giving platforms to women and young aspirants to showcase their talents by organising contests like Ghar Ki Biryani, focus on the gourmets of Deccani cuisine with the Hans Haleem, where visitors to the Haleem centres gave ratings to the ever-popular dish and Draw A Dream – “Swecha Bharath.” Hans India will always be your best News Partner.</p></div><div><br /></div></div></div>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-1341729962816443882021-06-30T16:58:00.001+05:302021-06-30T16:58:07.628+05:30దళితుల అంశాల కవరేజ్ కోసం డీసీలో ప్రత్యేక రిపోర్టర్ <p>దళితులకు సంబంధించిన అంశాలను, పరిణామాలను నిశితంగా పరిశీలించి వార్తలు రాసేందుకు డెక్కన్ క్రానికల్ (డీసీ) ఆంగ్ల పత్రిక ప్రత్యేకంగా ఒక రిపోర్టర్ ను నియమించబోతున్నది. </p><p>డీసీ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ కర్రి బుధవారం మొట్టమొదటి 'ప్రొఫెసర్ బి. బాలస్వామి స్మారకోపాన్యాసం' చేస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా మహమ్మారికి మే నెల ఏడున బలైన మానవతావాది, ప్రేమమూర్తి, విద్యార్థుల ఆత్మీయ ప్రొఫెసర్ బండి బాలస్వామి జయంతి సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం డిపార్టుమెంటు ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ జూమ్ లో ఈ స్మారకోపన్యాసం నిర్వహించింది. <table cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="float: left;"><tbody><tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhYrIDbi3zpe2_rfYsSWQMv2W2AR-9XzOeG7Dj84bH_Foc1ZWVmgrJOLJeviuZ1EYqXcdJhySByNkz6dLe9LX66jM38ya2vNg0_DstzeMeEF2Qe9a57L7V3kO1pEVYYpxHRx9z6-kLrdaw/s1128/karri+sriram.jpg" imageanchor="1" style="clear: left; margin-bottom: 1em; margin-left: auto; margin-right: auto;"><img border="0" data-original-height="810" data-original-width="1128" height="461" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhYrIDbi3zpe2_rfYsSWQMv2W2AR-9XzOeG7Dj84bH_Foc1ZWVmgrJOLJeviuZ1EYqXcdJhySByNkz6dLe9LX66jM38ya2vNg0_DstzeMeEF2Qe9a57L7V3kO1pEVYYpxHRx9z6-kLrdaw/w676-h461/karri+sriram.jpg" width="676" /></a></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;"><span style="color: #2b00fe;">Mr.Sriram Karri delivering "Prof B.Balaswamy Memorial Lecture" on June 30, 2021<br /><br /></span></td></tr></tbody></table><br /></p><p>"Virus in the Newsroom: Which Mask to Wear?' అనే అంశంపై డీసీ రెసిడెంట్ ఎడిటర్ మాట్లాడారు. కఠిన సామాజిక పరిస్థితులకు వెరవకుండా ప్రొఫెసర్ బాలస్వామి ఉన్నత ఎత్తుకు ఎదిగారని, అయన మరణానంతరం సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన నివాళులు దివంగత ప్రేమమూర్తి ఔన్నత్యానికి అద్దం పడతాయని అయన అన్నారు. ఈ సందర్భంగా, మాజీ ఎం ఎల్ సీ, ప్రొఫెసర్ బాలస్వామి సహోద్యోగి అయిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ న్యూస్ రూమ్ లలో దళితులకు దక్కని ప్రాతినిధ్యం గురించి ప్రస్తావించినపుడు శ్రీరామ్ కర్రి స్పందిస్తూ... దళితుల సమస్యల నివేదన కోసం ఒక జర్నలిస్టును నియమిస్తామని అక్కడికక్కడ ప్రకటించారు.</p><p>దళిత జర్నలిస్టులను యాజమాన్యాలు నియమించకపోవడం ఒక లోపమేనని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. అలాగే, పత్రికల విశ్వసనీయత బాగా దిగజారిందని స్పష్టంచేశారు. భిన్న అభిప్రాయాలకు ఆలవాలమైన సోషల్ మీడియా విస్తరణ ఆహ్వానించదగిన పరిణామమే అయినా తప్పుడు సమాచారం 'ఫేక్ న్యూస్' రూపంలో చేస్తున్న నష్టం అపారమైనది చెప్పారు. </p><p>కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పనిచేసినట్టే, తప్పుడు సమాచారాన్ని నిలువరించేందుకు మూకుమ్మడిగా ప్రయత్నాలు చేయాలని రెసిడెంట్ ఎడిటర్ చెప్పారు. జర్నలిజంలో నాణ్యత ప్రమాణాలు దిగజారాయని చెబుతూ శ్రీరామ్ ఒక గమ్మత్తైన వ్యాఖ్య చేశారు. తన సుదీర్ఘ జర్నలిజం జీవితంలో తిరుగులేని అద్భుతమైన లీడ్ (వార్తలో మొదటి పేరా) రాసే వారిని ఇంతవరకూ చూడలేదని చెప్పారు. </p><p>ఓయూ జర్నలిజం శాఖ అధిపతి ప్రొఫెసర్ స్టీవెన్ సన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ బాలస్వామి గారిని ఆసుపత్రిలో చేర్పించి దగ్గరుండి చూసుకున్న డిపార్ట్మెంట్ పూర్వ విద్యార్థి రమేష్ మాట్లాడుతూ వారి మృతి తీరనిలోటని చెప్పారు. </p><p>నిజంగానే డీసీ పత్రిక దళిత్ బీట్ ఏర్పాటు చేసి, కేవలం దానికోసమే ప్రత్యేకించి ఒక రిపోర్టర్ ను నియమిస్తే అది భారతదేశ జర్నలిజం చరిత్రలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికినట్లు అవుతుంది. కరోనా కారణంగా జర్నలిస్టుల ఉద్యోగాలు పీకేస్తున్న సమయంలో ఈ చర్య ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. ఈ పని సత్వరమే జరగాలని ఈ బ్లాగు కోరుకుంటోంది. </p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6892103454419978380.post-56590554025892724352021-06-30T10:00:00.006+05:302021-06-30T21:37:23.346+05:30ఎడిటోరియల్ మూర్తి గారికి 'ఈనాడు' లో చివరి రోజు!<p>సంపాదకీయాలు రాయడం (ఎడిటోరియల్ రైటింగ్) అనేది ఒక కళ. విశ్లేషణ, వ్యాఖ్య, విమర్శ, మార్గనిర్దేశం అన్నీ పాఠకుల మనసును ఆకట్టుకునేలా, ప్రభావశీలంగా కొన్ని పదాల్లోనే చేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలకమైన...వాక్యాలను చిత్రికపట్టే కార్యక్రమం కాబట్టే.. కొందరు కొమ్ములుతిరిగిన పూర్వ ఎడిటర్లు తాము ఎడిట్ రాస్తున్నప్పుడు గది బైట ఎర్ర బల్బు వెలిగే ఏర్పాటు చేసుకునేవారు. ఎడిట్స్ రాసేవారిని 'లీడర్ రైటర్స్' అంటారు. పత్రిక లీడర్ తరఫున రాసేది కాబట్టి అది రాసేవారిలో 'డర్' సహజంగానే ఉంటుంది. లీడర్ రైటర్స్ అన్నా పత్రికలో మిగిలిన ఉద్యోగులకు డర్ ఉంటుంది... వారి మేధోశక్తి, భాషా పటిమ, ముఖ్యంగా లీడర్ (అధిపతి)తో నిత్యం టచ్ లో ఉంటారనే సత్యం కారణంగా. </p><p>'ఈనాడు' దినపత్రిక మొత్తం గుండుగుత్తగా తనదే అయినా... సంపాదకీయపు పేజీ (ఎడిట్ పేజ్) అనేది ఆ పత్రిక అధిపతి రామోజీరావు గారి గుండెకు దగ్గరగా ఉంటుంది. పత్రిక దృష్టికోణాన్ని, అభిప్రాయాన్ని చెప్పే సంపాదకీయం ఆ రోజున దీనిమీద రాయాలి? ఆయా పరిణామాలపై పత్రిక యాంగిల్ ఏమిటి? వంటివి అంత వయసు మీదపడినా ఇప్పటికీ రోజూ రామోజీరావు గారు ప్రత్యేక శ్రద్ధపెట్టి నిర్ణయిస్తారు.ఈ కసరత్తులో ఆయనకు తృప్తి అమితంగా ఉన్నట్లు చెబుతారు. </p><p></p><table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto;"><tbody><tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgcZCDl9Swvs8FdbIHh3XEsbXBUsTYXGWsl0RkkWDErnELx1PVu3REi4R2nR7TkhlQxBm2EAr_DrPT8pVYlRHbhd9TPnSkZRj3yy5RCKXbtRWKu9B-ij6A-uXq0eTXeB7OKNMrxJhKdnXQ/s1243/murthy+balu.jpg" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" data-original-height="497" data-original-width="1243" height="256" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgcZCDl9Swvs8FdbIHh3XEsbXBUsTYXGWsl0RkkWDErnELx1PVu3REi4R2nR7TkhlQxBm2EAr_DrPT8pVYlRHbhd9TPnSkZRj3yy5RCKXbtRWKu9B-ij6A-uXq0eTXeB7OKNMrxJhKdnXQ/w640-h256/murthy+balu.jpg" width="640" /></a></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;">ఫొటోలో కుడివైపున మూర్తి గారు, ఎడమవైపున బాలు గారు... రామోజీ రావు గారితో.... <br />(Photo courtesy: Mr.Balu's FaceBook wall)<br /><br /></td></tr></tbody></table> 'ఈనాడు' ఎడిట్ పేజీ (సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు- సీఈబీ) లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న ఇద్దరు- మూర్తి, బాలు గార్లు- నిత్యం రామోజీ గారితో అనుసంధానమై ఉంటారు... ఈ పేజీ పని నిమిత్తం.పెద్దాయన మనసెరిగి, అంటే రాయాల్సిన అంశం ఎంపిక జరిగాక, ఈ ఇద్దరిలో ఒకరు ఆ రోజు సంపాదకీయాన్ని రాస్తారు. ఆ రాయడానికి, అద్భుతంగా ఏర్పాటుచేసుకున్న సంస్థాగత గ్రంథాలయం నుంచి వచ్చే ఫైల్స్ ఎంతగానో ఉపకరిస్తాయి. అందులో పాత క్లిప్పింగ్స్ ఉంటాయి. కొత్త పరిణామాలకు అనుగుణంగా, అదనంగా... పదేళ్ల కిందటి ఎడిటోరియల్ లో నుంచి ఒక పేరా, అదే టాపిక్ పై ఐదేళ్ల కిందట ప్రచురించిన దాన్నుంచి ఒక పేరా, అలా తెలివిగా అమర్చుకుంటూ పోతే చాలు.... గంటలో ఎడిట్ సిద్ధమవుతుందని అనుకునే చుప్పనాతులు కూడా ఉంటారు. అది నిజమే అనిచెప్పడం మరీ అన్యాయం. <p></p><p>సరే, ఏదో ఒకలా తయారయిన సంపాదకీయాన్ని... పరస్పరం చదువుకుని పెద్దాయనకు ఆమోదముద్ర కోసం పంపేవారు... వీరిద్దరూ, అప్పట్లోనైతే. రామోజీ గారు దాన్ని ఒకసారి చూసి, సరే కానివ్వండి...అన్నాక అది సంపాదకీయ స్థలం (ఎడమవైపు బారుగా ఉంటుంది) లోకి పోయి కూచుంటుంది. ఈ ఎడిట్ పేజీలో పెద్దా, చిన్నా కొన్ని వ్యాసాలు తెప్పించుకుని, అవసరమైతే అనువాదం చేయించుకుని, తప్పులురాకుండా చూసుకుని ప్రచురించే ప్లానింగ్ బాధ్యత మూర్తి, బాలు గార్లు సమష్టిగా చూస్తారు. తెర ముందు మూర్తి గారు, తెర వెనుక బాలు గారు కథ నడుపుతుండగా, వారికి సహకరించే సబ్ ఎడిటర్లు ఒక ముగ్గురు నలుగురు ఎడిట్ పేజ్ డెస్క్ లో ఉంటారు. </p><p>రామోజీ గారి కనుసన్నల్లో ఉన్న సీఈబీ లో దాదాపు రెండేళ్లు పనిచేసే మంచి అవకాశం కలిగినపుడు నా బాసుగా మూర్తి గారు ఉండేవారు. అయన ఇంటిపేరు పర్వతం అనుకుంటా, మరిచిపోయాను. అయన మాత్రం బక్క పలచగా, బారుగా, నగుమోముతో ఉంటారు. పరమ సాత్వికుడు, మృదుభాషి, హాస్య ప్రియుడు. అందరితో చాలా ప్రేమగా ఉండేవారు. మేము ఆ వారం ప్రచురించాల్సిన వ్యాసాల పై మేధోమదనం చేసేటప్పుడు అయన ఆధ్వర్యంలో చర్చలు చాలా బాగుండేవి. "అది కాదు రా... నాన్నా...." అంటూ తన వాదన చెప్పేవారు. ఆ డెస్కులోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ గారు, సమాజం గురించి విధిగా బాధపడే మా జీవీ అన్న (ఇప్పుడు నమస్తే తెలంగాణా ఎడిట్ పేజీ), మంచి సైన్స్ వ్యాసాలు రాసే ఉడుముల సుధాకర్ రెడ్డి గారు (ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పరిశోధనల ఎడిటర్) కూడా పనిచేసేవారు. ఈ ముగ్గురూ మంచి మిత్రులుగా మిగిలిపోయారు. </p><p>బాలు గారి గుండ్రటి అక్షరాలు మాత్రమే ఆయనకు సంబంధించి నాకు బాగా గుర్తున్నది. కళ్ళతోనే ఎక్కువగా మాట్లాడే ఆయనకు నేను దూరంగా మెలిగేవాడిని. అలాగని అమర్యాదకరమైన మనిషి కారాయన. ఆయన తీరు అదీ. మెంటారింగ్ అనే కళ మూర్తి గారికి తెలిసినట్లు బాలు గారికి తెలియదు. తన పనేదో తాను చేసుకుపోయేవారు... ఆర్ ఆర్ జీ ఫైల్స్ లో మునిగితేలుతూ. పని విభజనలో భాగంగా కావచ్చు మూర్తి గారే మాతో డీల్ చేసేవారు. వారిద్దరి మధ్యన సమన్వయం నిజంగా అద్భుతం. (నేను 'ఈనాడు' ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న జనరల్ డెస్క్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్న సీఈబీ లో పడిన విధం గురించి చివర్లో విడిగా రాశాను, వీలుంటే చదవండి). </p><p>దాదాపు 30 సంవత్సరాల పాటు 'ఈనాడు' లో పనిచేసిన మూర్తి గారికి అక్కడ ఈ రోజు ఆఖరి రోజు అని తెలిసి ఇవన్నీ రాస్తున్నాను. మూర్తి గారు ఇచ్చిన స్ఫూర్తి తో, చేసిన దిశానిర్దేశంతో...అనేక వ్యాసాలు నేను రాశాను. అందులో, సర్వమత సమ్మేళనం సందర్భంగా, 2000 ఒలింపిక్స్ అప్ప్పుడూ రాసిన వ్యాసాలు నాకు చాలా తృప్తినిచ్చాయి. నిత్యం ఎడిట్ పేజ్ పనిలో మాత్రమే ఉంచకుండా, కొంత ప్రపంచం చూసే, మంచి సెమినార్లలో పాల్గొనే, అధ్యయనం చేసే అవకాశం ఉంటే మూర్తి గారు ఇంకా బాగా ఎడిట్స్ రాయగలిగేవారని నాకుఅనిపించేది. మేధో వికాసానికి ప్రయత్నాలు చేయకుండా ఎడిట్స్ రాయకూడదు, రాసినా పండవు. ఎవరు ఎడిట్స్ రాసినా రోజూ అద్భుతంగా ఎలా ఉంటాయి? మూర్తి గారు తనదైన శైలి, పదజాలంతో వేలాది సంపాదకీయాలు రాసి మన్ననలు పొందారు. </p><p>సహచరులను, కింది ఉద్యోగులను ఉన్మాదంతో పీక్కుతిని, రాచిరంపానపెట్టి, రాక్షసానందం పొందే వారికి భిన్నంగా, తనకున్న శక్తిమేరకు సలహాలు ఇస్తూ, నవ్వుతూ పనిచేస్తూ, సాధ్యమైన మేర నిష్పాక్షికంగా వ్యవహరించే మూర్తి గారిలాంటి ప్రొఫెషనల్స్ సంఖ్య మరీ తగ్గిపోతున్నది. ఇది బాధాకరం. అన్నేళ్ల పాటు ఎడిట్ పేజీకి అకింతమై సేవలు అందించి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా మూర్తి గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అవిరళ సేవతో అలిసిపోయిన ఆయనకు కాస్త విశ్రాంతి అవసరం. <br /><span style="color: #ffa400; font-size: medium;">All the best...Murthy jee.</span> </p><p>(POST SCRIPT: మూర్తి గారి పూర్తిపేరు 'పర్వతం శ్రీరామచంద్ర మూర్తి (పీ ఎస్ ఆర్ సీ మూర్తి)'. పదవీవిరమణ అయ్యాక కూడా కొనసాగాలని రామోజీ కోరినా... అయన వద్దనుకున్నారట. ఇద్దరు పిల్లలు సెటిల్ అయ్యారు. బాదరబందీలు లేనపుడు 1986 నుంచీ చేస్తున్న అదే పని చేయడం కన్నా కాస్త సేద తీరదామని మూర్తి గారు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారట). </p><p><b><span style="color: #2b00fe;">ఇంక మన సొంత సొద...నేను ఎడిట్ పేజీలో చేరిన వైనం... </span></b></p><p>చెప్పానుకదా, ఇరవై ఏళ్లకు పూర్వం నేను 'ఈనాడు'లో దాదాపు పదేళ్లు పనిచేశాను. అంతకుముందు డిగ్రీ చదువుతూ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కంట్రి బ్యూటర్ గా మూడేళ్లు కలుపుకుంటే ఒక పుష్కర కాలం పాటు అక్కడఉన్నట్టు లెక్క. ఒక ఎనిమిదిన్నరేళ్ళు నేను పనిచేసిన జనరల్ డెస్క్ లో నేర్చుకోవడానికి చాలా అవకాశం ఏర్పడింది. ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అది మంచి వేదిక. ఎందుకోగానీ, 'ఈనాడు' లో మంచి మంచి సంపాదకీయాలు, సరళభాషలో రాయాలన్న కుతూహలం నాకు అప్పుడు జాస్తిగా ఉండేది. డ్యూటీ సాయంత్రం అయితే ఉదయాన్నే వచ్చి లైబ్రరీలో కూర్చొని శాంపిల్ ఎడిట్స్ రాసి గప్ చిప్ గా రామోజీ గారికి కవర్లో పంపాను రెండు మూడు సార్లు. ఎవరైనా ఆయనకు లేఖలు పంపే వెసులుబాటు ఉండేది. మన ఉత్సాహం గమనించి ఒకసారి పిలిచి... "ఇంకా కృషిచేయి... నీకు అవకాశం ఇస్తా"నని అయన అన్న రోజు, ఆ తర్వాత రెండు రోజులు నేను నిద్రపోలేదు. నేనేదో ఒక వార్త రాస్తే 'తెలుగంటే ఇలా ఉండాలి' అని అయన అంతకు ముందు ఎర్ర స్కెచ్ తో చేసిన వ్యాఖ్యతో ఉత్తేజం పొంది నేను ఎడిట్స్ సాహసం చేసాను. </p><p>ఈ లోపు నేను రామకృష్ణా మఠ్ కు ఇంగ్లిష్ నేర్చుకోవడానికి, ఉస్మానియాలో జర్నలిజం చేయడానికి నాదైన సమయంలో పోతుంటే 'న్యూస్ టుడే ' ఎండీ గా పనిచేసి ఒక ఏడెనిమిదేళ్ళ కిందట కాలం చేసిన రమేష్ బాబు కుమ్మేయడం ఆరంభించాడు. ఆయన చల్లనిచూపుల్లో ఎందుకోగానీ నేను పడలేక ఇమడలేక ఇబ్బందిపడ్డాను. కుంగతీసేలా మాటలు అనేవాడు. మనిషిలో ఉన్న మానసిక స్థైర్యాన్ని కరకు మాటలతో, అబద్ధాలతో చివరిచుక్కతో సహా ఎలా తొలగించాలో తెలిసిన ఒకరిద్దరు మానసిక వికలాంగులు అక్కడ ఇన్ ఛార్జ్ లుగా ఉండేవారు... ఆ మహానుభావుడికి తానతందానగా. ఒక సారి జ్వరం వచ్చి సెలవు పెడితే... నన్ను ఇబ్బంది పెట్టారు. సెలవునుంచి వచ్చాక రమేష్ బాబు నన్ను నేను ఉద్యోగం చేసే స్థలంలో కాకుండా... సెక్యూరిటీలో కూర్చోపెట్టాడు. ఈ విషయాన్ని ఒక లేఖ రూపంలో తెలియజేయగానే రామోజీ గారు, అపుడపుడే బాధ్యతలు చేపట్టిన కిరణ్ గారు నాతో చాలా ఉదారంగా వ్యవహరించి ఈ ఎడిట్ పేజీలో వేశారు. అద్గదీ.... అలా నేను మూర్తి గారి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. ఐక్యరాజ్యసమితి మీద నేనుప్రచురించిన రెండో వ్యాసం నచ్చి, పిలిపించి... 'నువ్వు నా మూడో కొడుకువీ రోజు నుంచి..' అని రామోజీగారు అన్న రోజు కూడా నిద్రపట్టి చావలేదు. అయన అలా ప్రేమగా పలువురిని కొడుకుల్ని చేసుకున్నట్లు ఈ మధ్యన తెలిసింది. అయినా.... అది గొప్పే కదా! అయన అంటే నాకు గౌరవభావం ఇప్పటికీ ఉండడానికి పలు స్వీయ అనుభవాలు కారణం. </p><p>అప్పటికే ఉస్మానియా జర్నలిజంలో రెండు గోల్డ్ మెడల్స్ వచ్చిన ఊపుతో ఇంగ్లిష్ జర్నలిజంలోకి పోవాలని అనుకోవడం మూలంగా 2000 లో ఈనాడు వదిలి బైటికొచ్చి ఏషియన్ స్కూల్ అఫ్ జర్నలిజం లో చేరి తర్వాత 'ది హిందూ' లో చేరడం జరిగింది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న రామోజీ గారికి నేను ఏసీజే నుంచి రాగానే ఒక లేఖ రాశాను... 'అయ్యా, ఇప్పుడు నేను మరింత బాగా ఉపయోగపడగలను. మీరు పనిస్తే చేస్తా,' అని. రమేష్ బాబు తదితరుల పుణ్యాన అనుకుంటా నాకు తిరుగు టపా రాలేదు. ఎదురుచూసి నేను 'ది హిందూ' లో చేరాను. అక్కడ పన్నెండేళ్ళు పనిచేసినా ఒక్క ప్రమోషనైనా రాకుండా, చివరకు గ్రాట్యుటీ కూడా రాకుండా చేశారే అనే బాధ ఉన్నా.... 'ఈనాడు' చదవకపోతే రోజు గడవని వారిలో నేనూ ఒకడ్ని. జర్నలిస్టుగా నిలదొక్కుకునేలా పునాది వేసిన 'ఈనాడు' ఒక తీపి గుర్తే. </p><p>విచిత్రమేమిటంటే, నన్ను, నాలాంటి ప్రొఫెషనల్ జర్నలిస్టులను ఇబ్బంది పెట్టి అబద్ధాలతో కెరీర్ లు ఖూనీ చేసిన రమేష్ బాబు నిజ స్వరూపం తెలిసి యాజమాన్యం వదిలించుకుంది. అయన తరువాత తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేరి, పాపం అకాల మరణం పొందారు. వాడో నరరూప రాక్షసుడని జర్నలిస్టులు ముక్తకంఠతో చెప్పే ఆ ఇన్ ఛార్జ్ కూడా పంపబడ్డాడు. </p><p>మొత్తంమీద ఇప్పటికీ 'ఈనాడు' ఎడిట్స్ చూసినా.. అయ్యో అనిపిస్తుంది. సరళంగా చెప్పేదాన్ని పలుగురాళ్లతో నలుగుపెట్టి తమదైన శైలిలో చెబుతారు. ఎంత కీలకమైన స్పేస్ అది! ఒక స్టయిల్ ఏర్పడిన తర్వాత మార్చడం కష్టమే కదా!</p><p>--ది ఎండ్--</p><p></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com4tag:blogger.com,1999:blog-6892103454419978380.post-17296505008449359082021-06-25T15:06:00.002+05:302021-06-25T15:06:27.160+05:30 సమీక్ష-దిద్దుబాటు కేసీఆర్ కు శ్రీరామరక్ష!<p><span style="background-color: white;"><span style="color: #222222; font-family: Arial, Helvetica, sans-serif; font-size: large;">(An edited version of this political analysis was published in Andhra Jyothi newspaper on June 23, 2021. </span><br /><span style="color: #222222; font-family: Arial, Helvetica, sans-serif; font-size: large;"><a href="paste" target="_blank">https://epaper.andhrajyothy.com/c/F1058F142811AF62454FA5476C87A005) </a></span></span></p><p><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif; font-size: x-large;"><b>(డాక్టర్ ఎస్. రాము)</b></span></p><span style="font-size: large;"><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">పోరాట కాలం, పదవీ కాలం, పోకదల కాలం--అనే మూడు ముఖ్య మజిలీలు నాయకుల జీవితాల్లో ఉంటాయి. పదవీభాగ్యం దక్కే స్థాయికి చేరాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. కష్టనష్టాలకోర్చినా ఆశించిన ఫలితం రాక కనుమరుగయ్యేవారే తొంభై ఐదు శాతం మంది ఉంటారీ రాజకీయ వైకుంఠపాళిలో. మిగిలిన ఐదు శాతంలో నాలుగున్నర శాతం మంది పదవిపొందాక... కళ్ళు నెత్తికెక్కి పవర్ కిక్కులో తిక్కతిక్క నిర్ణయాలు తీసుకుంటూ, కూడబెడుతూ అధికారాన్ని అజరామరం చేసుకోవడమే పాలనకన్నా ముఖ్యమైన పనని నమ్మి కాలగర్భంలో కలిసిపోతారు. ఆ చివరి అర శాతం మంది, విశేష ప్రజాభిమానంతో పదవి పొందాక కూడా... సింహాసనం అశాశ్వతమైనదని అనుక్షణం గుర్తెరిగి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రజారంజకంగా పాలించి చరిత్రలో నిలిచిపోతారు.</span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;"> </span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">పోకదల కాలాన్నే పిదపకాలం అని నాజూగ్గా, పోయేకాలం అని మొరటుగా అంటారు. నేతల జీవితాల్లో చివరిదైన ఈ ఘట్టంలో మరో ఐదు దశలు ఉంటాయి. పోకదల కాలం దాపురిస్తున్న మొదటి దశలో- అందలం ఎక్కించిన ప్రజాబలాన్ని నాయకుడు తప్పుగా అవగాహన చేసుకుంటాడు. రెండో దశలో- అంతవరకూ చోదక శక్తిగా నడిపిన సిద్ధాంతాన్ని త్యజిస్తాడు. మూడో దశలో- కొత్త భజనపరులు చుట్టూ చేరి రంజింపజేస్తుండగా అనుయాయులపై అపనమ్మకం పెరిగి శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా అనిపిస్తారు. నాలుగో దశలో-సంస్ధాగతమైన వ్యవస్థలు పనికిమాలినవిగా తోచి, తన మాటే శాసనమన్న విశ్వాసం దృఢపడుతుంది. శాశ్వతంగా అధికారంలో ఉండడానికి అడ్డు అనుకున్నవారిని వ్యవస్థను వాడుకుని తొక్కిపారేసే ఉన్మాదం ఆవరిస్తుంది. ఇక, ఐదో దశలో- ఒకవైపు అంతఃశక్తి తాను మామూలు మనిషినికాననీ, ఒక అద్భుత అతీంద్రియ శక్తినని క్షణక్షణం బోధిస్తుండగా, మరోపక్క చుట్టూ అప్పటికే బలపడిన కోటరీ వలయం వినిపించే బాజాభజంత్రీల ఆస్వాదనలో మునిగితేలుతూ నాయకుడు తప్పుల మీద తప్పులు చేస్తూ పతనమై పోతాడు.</span></span><div><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh07Ho2JPWlyN4FZRdueW1DKqGI00AK4oWTcaN_Zk1km9mAQpOwYQu5EVhTFSi-5FxyXpWLRT6S1M5gx9J-Sr8Rpbu0YL-pxrs-cnGWr-2s9b5a95TzLpNRuuKpboz-xzdaAon8OLwUfc4/s1300/andhra+jyothi.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="731" data-original-width="1300" height="360" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh07Ho2JPWlyN4FZRdueW1DKqGI00AK4oWTcaN_Zk1km9mAQpOwYQu5EVhTFSi-5FxyXpWLRT6S1M5gx9J-Sr8Rpbu0YL-pxrs-cnGWr-2s9b5a95TzLpNRuuKpboz-xzdaAon8OLwUfc4/w640-h360/andhra+jyothi.jpg" width="640" /></a></div><br /><span style="font-size: large;"><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">ఈ పోకదల కాలం ప్రజాభిమానిని ప్రజాకంటకుడిగా మార్చి, హీరోను జీరో చేసి చరిత్ర హీనుడిగా నిలబెట్టిపోతుందని ప్రపంచ చరిత్రలో ఏ మహానేత ప్రస్థానాన్ని సునిశితంగా అధ్యయనం చేసినా తెలుస్తుంది. రాజకీయాల్లో ఉండేది కేవలం ఆత్మహత్యలు మాత్రమే అన్న మాట అందుకే వచ్చింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన ముచ్చటుంది. అధికారమదంతో సిద్ధాంతానికి తిలోదకాలిచ్చి, స్వపక్ష-విపక్షాలను కుమ్మేసి, వ్యవస్థలను నాశనం చేస్తూ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలతో సొంత సామ్రాజ్యం నిర్మించుకుంటూ అత్యాశకు పోయే నేతలను పైన చెప్పుకున్న నాలుగో దశలోకి ప్రవేశించీ ప్రవేశించగానే ప్రకృతి ఒక కుట్రచేసి కథ సమాప్తం చేస్తుంది. ఒక వెలుగు వెలిగిన అలెగ్జాండర్ (అనారోగ్యం), హిట్లర్ (ఆత్మహత్య), ఇందిర (హత్య)లు కొన్ని ఉదాహరణలు. ప్రత్యర్థులను వణికించి, ప్రత్యేక రాష్ట్ర వాదులను ఇళ్లకు పరిమితం చేసిన రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయినప్పుడు కుట్ర, ప్రకృతి కుట్ర గురించి ఎందరు మాట్లాడలేదు! </span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">అద్భుతమైన నాయకత్వం, వాక్ చాతుర్యం, రాజకీయ వ్యూహాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా రెండోసారి పాలిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి వ్యవహార శైలి, పాలనా ధోరణి , నిర్ణయాలు చూస్తుంటే పైన పేర్కొన్న నాలుగో దశలోకి వాయువేగంతో ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తున్నది. ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడంలో అయన చేసిన జాప్యం మొదటి దశకు పెద్ద సూచిక. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనుమరుగుకావడం రెండో దశలో కనిపిస్తే, తనకన్నా ఒకింత ఎక్కువగానే తెలంగాణ వాదాన్ని వినిపించి, జనసమీకరణలో కీలక భూమిక పోషించిన వారిని పక్కనపెట్టి, ఉద్యమ వ్యతిరేకులను ఆదరించి అందలాలు ఎక్కించడం, స్వేచ్ఛగా ఉండాల్సిన మీడియాపై పకడ్బందీగా పట్టుబిగించడం వంటి పనులు మూడో దశలో భాగంగా కనిపిస్తాయి. </span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">రాజకీయ దురంధరుడైన కేసీఆర్ ప్రజా సంక్షేమాన్నేమీ మరువలేదు. రైతుల ఖాతాల్లో ఎప్పుడూ లేనివిధంగా డబ్బులు జమవుతున్నాయి. అన్ని వర్గాల వారికీ జీవాలు, చేప పిల్లలు, ఇతరత్రా సాయాలు అందే ఏర్పాటు జరిగింది. జనాలను చేపలిచ్చి ఖుషీగా ఉంచాలా? చేపలు పట్టే శక్తి, పరిస్థితులు కల్పించాలా? అన్న 'అభివృద్ధి చర్చ' మొదలయ్యేలోపే భారీగా సాగునీరు అందించే బృహత్ ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఉద్యోగాలూ బాగానే ఇచ్చామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది. కొవిడ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినా ఉద్యోగులకు జీతాలూ పెంచారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణావసర మందుల కోసం జనాలు హాహాకారాలు చేయాల్సిరాగా, ఇదే అదనుగా కొన్ని ప్రయివేటు-కార్పొరేటు ఆసుపత్రుల వైద్యం లక్షల కుటుంబాలను పేదరికంలోకి నెట్టింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం అప్పుల్జేసి ఆస్తులు అమ్ముకుని బికార్లవుతుంటే, ఖజానా ఖాళీ అయి రుణభారంతో ప్రభుత్వం భూములను అమ్మకానికి పెట్టాల్సిన దుస్థితి దాపురించింది.</span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">కొవిడ్ రెండో తరంగం సమాంతరంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే- కేసీఆర్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అర్థమవుతుంది. తన దీర్ఘకాల సహచరుడు ఈటల రాజేందర్ ను సమయం సందర్భం చూసుకోకుండా ఆరోగ్య మంత్రి పదవి నుంచి తీసిపారెయ్యడం ఆ తప్పుడు నిర్ణయాల్లో చిన్నది మాత్రమే. సీనియర్ మంత్రివర్గ సహచరుడిపై భూ కుంభకోణాన్ని తెరమీదకు తెచ్చి, ముందుగా సొంత మీడియాలో రచ్చరచ్చ చేయించి గెంటేయడం బాగోలేదు. భారీ అవినీతి, భూ ఆక్రమణల ఆరోపణలు దాదాపుగా అందరిమీదా ఉన్నా ఒక్కడ్ని టార్గెట్ చేయడమే అభ్యంతరకరమే. మంత్రి మండలిలో ఒక సభ్యుడిని వద్దనుకునో అధికారం పూర్తిగా ముఖ్యమంత్రిది కాబట్టి దానిమీద రాద్ధాంతం అవసరం. నమ్మినోళ్ళను నట్టేట్లో నిండా ముంచడం ఆయన అలవాటని, రాత్రి పొద్దుపోయేదాకా మస్తు ఖుషీగా కలిసుండేవాళ్ళం...చివర్లో కనీసం అపాయింట్మెంటైనా ఇవ్వలేదని యూ-ట్యూబ్ ఛానెల్స్ లో గుండెలు బాదుకుంటూ చెబుతున్నవారి సంఖ్య పెద్దదే. ఇది కూడా కాల మహిమనే. </span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">నిజానికి, ఈటల ఉదంతంకన్నా ప్రభుత్వానికి పెద్ద నష్టం కలిగించిన పరిణామాలు రెండున్నాయి. దుబ్బాకలో దెబ్బ, గ్రేటర్ హైదరాబాద్ లో కమల వికాసం కన్నా కూడా ఈ రెండు పరిణామాలు ముంచుకొస్తున్న ఆ నాలుగో దశను బలంగా సూచిస్తున్నాయి. ఈ పరిణామాల్లో ఇద్దరు సాహసవంతులైన నవతరం జర్నలిస్టులు ఉండడం విశేషం. వారిద్దరూ ప్రభుత్వ ఇనుప పిడికిలికి దూరంగా సోషల్ మీడియాను ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ఇందుకు ఆద్యుడు- తీన్మార్ మల్లన్న అనే నవీన్. పోలీసు కేసులకు జంకకుండా, ధైర్యంతో అవినీతి బాగోతాలను మల్లన్న రోజువారీ ప్రజల ముందుంచే పనిలో ఉన్నాడు. దూషణ మోతాదు ఎక్కువని అనిపించినా మల్లన్న తీన్మార్ పల్లెపల్లెకూ చేరి విశేష ప్రభావం చూపింది. ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధికి ముచ్చెమటలు పట్టించి మల్లన్న నైతిక విజయం సాధించాడు.</span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">సర్కార్ చేసుకున్న 'సెల్ఫ్ గోల్'...యువ జర్నలిస్టు గంజి రఘు అరెస్టు. కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాలను వెలికితీస్తున్న రఘును పట్టపగలు రాష్ట్ర రాజధానిలో మఫ్టీ పోలీసులు చేసిన దౌర్జన్యపూరిత అరెస్టు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. జైలు నుంచి వీరుడిగా తిరిగి వచ్చిన రఘుకు లభిస్తున్న విశేష స్పందన ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. పోలీసు జులుం ఢిల్లీ స్థాయిలోనే కాదు, విశ్వవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పరువు తీసింది-సోషల్ మీడియా సాక్షిగా.</span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">మీడియా సంస్థలను నియంత్రించి.. సొంత పత్రిక, టీవీ ఛానెళ్లలో స్వర్గం సృష్టించి.. వాస్తవాలకు మసిపూసి ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకుందామంటే కుదిరే కాలం కాదిది. కారణం, అత్యంత ప్రభావశీలమైన సోషల్ మీడియా అనూహ్య విస్తరణ. దేన్నైనా క్షణాల్లో వైరల్ చేసే సామాజిక మాధ్యమాలు ఒకపక్క, కొత్త ప్రజాస్వామ్య గళాలు-క్రియాశీలంగా ఉన్న న్యాయవ్యవస్థ మరొక పక్క 'అణచివేతతో ఏదైనా సాధ్యం' అన్న నిరంకుశ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ప్రభుత్వాల తిక్క కుదురుస్తున్నాయిప్పుడు. చేతిలో ఉన్న మొబైల్ ను బ్రహ్మాస్త్రంగా ఎలా వాడుకోవచ్చో, దురహంకార ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జన శ్రేణులను సమీకరించి ఎలా బుద్ధిచెప్పవచ్చో 'అరబ్ స్ప్రింగ్' పదేళ్ల కిందటే నేర్పింది. ఈ విద్య మన బిడ్డలకూ బాగా అబ్బింది. దొంగ కేసులు-దౌర్జన్యపూరిత అరెస్టులతో ప్రపంచవ్యాప్తంగా బద్నామ్ అవుతామని పైవారికి నచ్చజెప్పి, నెటిజన్స్ ను సాకుగా చూపి తప్పించుకోవడం పోలీస్ అధికారులకు ఇపుడు శ్రేయస్కరం.</span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;"> </span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">రాష్ట్రం విషయంలో అకున్నదొక్కటి... అయ్యిందొక్కటని ప్రొఫెసర్లు, టీచర్లు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఇతర బుద్ధిజీవులు ఆవేదన చెందుతున్నారు. ఇంతటి అణచివేత, క్రూరత్వం లేని ఆ కలిసున్న రోజులే బాగుండెననిపిస్తున్నదని చెప్పుకోవడం ఈ మధ్యన ఎక్కువయ్యింది. ప్రభుత్వ సేవలో ఉన్న తెలంగాణ ప్రముఖులు కలివిడిగానో, విడివిడిగానో, కలిసో, లేఖల ద్వారానో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని పెద్దాయనకు తెలియజేయడం తక్షణావసరం. ఈ ప్రముఖుల మౌనం (కాన్సిపిరేసీ ఆఫ్ సైలెన్స్) రాష్ట్రానికే కాదు, ఆయనకూ ప్రమాదకరం. </span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">బలిదానాల వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత కేసీఆర్ ఒక్కరిదే అనుకోరాదు. కనీసం వచ్చే రెండేళ్లు రాజకీయాలకు అతీతంగా, తెలంగాణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయడం ఒక్కటే అమరవీరులకు నిజమైన నివాళి. నిరంకుశత్వంతో ప్రభుత్వం, అధికారకాంక్షతో బీజేపీ, పట్టుకోసం కాంగ్రెస్ పరిస్థితులను దారుణంగా దిగజారుస్తున్నాయి. కమలం కన్నా గులాబీనే మిన్న అని భావించే బుద్ధిజీవుల్లో నిరాశ, నిస్పృహ, ఆగ్రహం పెరగక ముందే మేల్కొంటే సర్కార్ కు మంచిది. </span><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">ప్రొఫెసర్ జయశంకర్ సార్ 'వొడువని ముచ్చట'లో ఒకచోట అన్నట్టు- 'తప్పులు రిపీట్జేస్తూ పోతావా? సవరించుకుంట పోతావా? సవరించుకోవడానికి మ్యూచువల్ కాన్ఫిడెన్స్ గావాలె." </span><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">పాలనలో సర్వం తానై వ్యవహరిస్తున్న కేసీఆర్ కుటుంబ బాంధవ్యాలను పక్కనపెట్టి పెద్దరికంతో తప్పొప్పుల మీద చిత్తశుద్ధితో మధ్యంతర సమీక్ష జరిపి సవరణలు చేసుకోవాలి. ఈ కసరత్తును ఎవరూ నామోషీగా భావించాల్సిన అవసరం లేదు. సకాలంలో దిద్దుబాటుకు ఉపక్రమిస్తే నిజంగానే పీకేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, పీకే (ప్రశాంత్ కిషోర్) అవసరమూ ఉండదు. ఆరంభంలో పేర్కొన్న అర శాతం మహానేతల జాబితాలో చేరే సువర్ణావకాశాన్ని కేసీఆర్ వదులుకోకూడదు.</span><br style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;" /><span style="background-color: white; color: #222222; font-family: Arial, Helvetica, sans-serif;">పిదపకాలంలో వచ్చే పిదపబుద్ధులకు విరుగుడు మందు ఒక్కటే: ప్రజాస్వామ్యాన్ని మనసావాచాకర్మణః నమ్మడం, ప్రజాస్వామ్య స్పూర్తితో మెలగడం.</span></span></div><div><span style="font-size: large;">(The End) <br /></span></div>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com7tag:blogger.com,1999:blog-6892103454419978380.post-38680629540419730442021-06-15T22:11:00.002+05:302021-06-15T22:11:44.462+05:30 జైలు నుంచి జర్నలిస్టు రఘు విడుదల: పోరాటం సాగుతుందని ఉద్ఘాటన <p><span style="font-size: medium;">సినిమాల్లో విలన్ల మాదిరిగా మఫ్టీ పోలీసులు కారులోకి బలవంతంగా ఎక్కించి బంధించి తీసుకుపోయి తరువాట్స్ అరెస్టుగా చూపిన సాహసోపేత 'తొలి వెలుగు' యూ ట్యూబ్ ఛానల్ జర్నలిస్టు గంజి రఘు 13 రోజుల జైలు నిర్బంధం నుంచి బెయిలుపై ఈ రోజు (జూన్ 15, 2021) విడుదలయ్యారు. అక్రమ అరెస్టు ద్వారా తనకు ప్రజలపై బాధ్యతను మరింత పెంచిన "కుటుంబ సపరివారానికి" కృతజ్ఞలు చెబుతూ.... గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ జర్నలిస్టుగా తనపై ఉన్న బాధ్యతను నిర్వర్తిస్తానని అయన ప్రకటించారు. నిర్బంధించిన కారులో వెళుతుండగా తన భార్య ఫోన్ కాల్ ను పోలీసులు తీసుకోనివ్వలేదని, తన గురించి ఒక మెసేజ్ పెట్టాలని కోరినా అవహేళనగా నవ్వారని రఘు చెప్పారు. </span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh6MIqk1FW0uqT4WDfM0t9Ldou-TIzjDIxf3mEU0lKMK36CGxIXIHlti3onNm5OKbqPuyOl3XAViiJ1EDIpJCOsUwE49H_Esq9h7lXSDMUBWlEpvqGMZPPo1P9CvRzMyRrEkTGJY9xrWBc/s383/raghu.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="242" data-original-width="383" height="404" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh6MIqk1FW0uqT4WDfM0t9Ldou-TIzjDIxf3mEU0lKMK36CGxIXIHlti3onNm5OKbqPuyOl3XAViiJ1EDIpJCOsUwE49H_Esq9h7lXSDMUBWlEpvqGMZPPo1P9CvRzMyRrEkTGJY9xrWBc/w640-h404/raghu.jpg" width="640" /></a></div><span style="font-size: medium;">హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో ఈ నెల మూడో తేదీ ఉదయం 9.46 నిమిషాలకు రోడ్డు పక్కన మామిడిపళ్ళు కొనుక్కుంటున్న రఘును ఇద్దరు దృఢకాయులు కారు దాకా రెక్కలు పట్టుకుని తోసుకుపోగా మరొక ఇద్దరు కలిసి ఆయన్ను తెల్ల కారులోకి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. <span style="background-color: white; color: #222222; font-family: Mallanna, sans-serif; text-align: justify;">గుర్రంపోడు తండా భూముల కేసులో రఘును 12.45నిమిషాలకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు రఘు కుటుంబ సభ్యులకు మధ్యాహ్నం 1.30గంటలకు సమాచారం ఇచ్చారు. </span></span><p></p><p><span style="background-color: white; color: #222222; font-family: Mallanna, sans-serif; font-size: large; text-align: justify;">ఈ లోగా రఘును బలవంతంగా మఫ్టీ పోలీసులు కారులో తీసుకుపోయిన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. </span><span style="font-size: large;">అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలను వెలుగులోకి తెస్తున్నందుకే, జర్నలిస్టుకు ఒక హెచ్చరికలా ఉండేందుకు పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జర్నలిస్టులు ఆరోపించారు. రఘు అరెస్టు కు వ్యతిరేకంగా జర్నలిస్టులు, మేధావులు నిరసన కూడా చేపట్టారు. రఘు శ్రీమతి ప్రధాన మంత్రికి లేఖ కూడా రాశారు. </span></p><p><span style="font-size: large;">రఘు అరెస్టు చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. </span></p><p></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6892103454419978380.post-65792067162431445782021-06-06T22:08:00.003+05:302021-06-06T22:11:28.402+05:30'నమస్తే తెలంగాణ'కు పదేళ్ళు- మన సురేంద్ర కు 'ది హిందూ' లో పాతికేళ్ళు <p>(డాక్టర్ ఎస్. రాము)</p><p>'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' పత్రికలకు దీటుగా 'సాక్షి' పుట్టుకొస్తే...ప్రత్యేక తెలంగాణకు గొంతుకగా నిలవాలని 'నమస్తే తెలంగాణా' ఆవిర్భవించింది. ఈ రోజు పదేళ్ల పుట్టినరోజు జరుపుకుంటున్న 'నమస్తే తెలంగాణా' యాజమాన్యానికి, అన్ని విభాగాల సిబ్బందికి శుభాకాంక్షలు. ఈ పత్రిక తెలంగాణా హృదయ స్పందనై వందేళ్లు పయనించాలని, ప్రజలకు మెరుగైన జీవనం ఇవ్వడంలో తోడ్పడాలని కోరుకుందాం. </p><p>రాజకీయ రాగద్వేషాలు అనేవి మీడియా యాజమాన్యాల విధానంలో భాగమైనందున, ఈ పత్రిక అధికార పార్టీ మౌత్ పీస్ అని మొత్తుకోవడం కన్నా పత్రికకు అభినందనలు చెప్పడం ఉత్తమం. అన్ని పత్రికలకు ఉన్నట్లే ఈ పత్రిక యానంలోనూ మెరుపులు, మరకలు ఉన్నాయి. అల్లం నారాయణ గారు, కట్టా శేఖర్ రెడ్డి గార్ల తర్వాత యువకుడైన తిగుళ్ల కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఎడిటర్ గా ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బాగా నలిగిన కృ.తి. సంపాదకత్వంలో మరింత పురోభివృద్ధి సాధిస్తుందని ఆశిద్దాం. </p><p>పదేళ్ల సందర్భంగా ఈ రోజు నమస్తే తెలంగాణా మొదటి పేజీలో వచ్చిన ఈ కింది శ్లోకం బాగుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని సంకల్పంగా చెప్పుకోవడం మంచి విషయం. దీన్ని తు.చ. తప్పకుండా జర్నలిజంలో చేయకూడని పనులు చేయకుండా ఉండడం అందరు జర్నలిస్టుల పరమావధి కావాలని ఆశించడంలో మంచిది. </p><div class="separator" style="clear: both; text-align: center;"><br /></div><br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi75nii_FjI6xveRvgiWWyha3oFh-PelEThCKbwMf5Q8ct6woOd8JI3xXwo1Qp35YOgLylpBsdtU8hb572NXOCC6Gg6tyDrbk6ET06Llv7aNR7KeNj2Q_RaRjlCuWr3GRuZnVCD7tHuRUQ/s823/nt.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="799" data-original-width="823" height="388" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi75nii_FjI6xveRvgiWWyha3oFh-PelEThCKbwMf5Q8ct6woOd8JI3xXwo1Qp35YOgLylpBsdtU8hb572NXOCC6Gg6tyDrbk6ET06Llv7aNR7KeNj2Q_RaRjlCuWr3GRuZnVCD7tHuRUQ/w400-h388/nt.png" width="400" /></a></div><p><span style="color: #2b00fe; font-size: large;">గర్వించదగిన కార్టూనిస్టు సురేంద్ర గారు </span></p><p>తెలుగు జాతి గర్వించదగిన కార్టూనిస్టు సురేంద్ర గారు ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' కు సేవలందించడం ఈ రోజుతో పాతికేళ్ళు అయ్యింది. వారికి శుభాకాంక్షలు. ఒక తెలుగు కార్టూనిస్టును కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి మెరుగైన కార్టూనిస్టుగా తీర్చిదిద్దిన యాజమాన్యానికి అభినందనలు. ఒక వెబ్ సైట్ కోసం నేను 2016లో సురేంద్ర గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఆ వివారాలు ఇక్కడ చూడవచ్చు. </p><p><a href="https://www.telugu360.com/interview-hindus-surendra-self-made-gifted-cartoonist/">https://www.telugu360.com/interview-hindus-surendra-self-made-gifted-cartoonist/</a></p><p>ఈ రోజే సురేంద్ర గారి జన్మదినోత్సవమని తెలిసింది. వారికి బర్త్ డే గ్రీటింగ్స్. </p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-62553133632342189362021-06-03T21:55:00.004+05:302021-06-03T21:55:43.695+05:30 విధ్వంసం రేకెత్తించకుండా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజలకుంది: జర్నలిస్టు వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు <p>ప్రభుత్వం, దాని విభాగాలు తీసుకున్న చర్యలపై వ్యాఖ్య చేసే లేదా వాటిని విమర్శించే హక్కు ప్రజలకు ఉందని భారత దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అయితే ఆ వాఖ్యలు లేదా విమర్శలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధ్వంసం రేకెత్తేలా రెచ్చకొట్టకుండా, సమాజంలో అస్తవ్యస్థ పరిస్థితి సృష్టించకుండా ఉండాలని చెప్పింది. </p><p>సీనియర్ జర్నలిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వినోద్ దువా పై ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ లో మే, 2020 లో పెట్టిన దేశద్రోహం (సెక్షన్ 124 ఏ)తదితర అభియోగాలు చెల్లవని చెబుతూ గురువారం (జూన్ 3, 2021) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ వినీత్ శరణ్ లతో కూడిన బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. </p><p>ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వినోద్ దువా యూ ట్యూబ్ ఛానెల్ లో చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, ఆయన్ను అరెస్టు చేయాలని ఒక బీజేపీ నాయకుడు పెట్టిన కేసుపై సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది. 1962 లో కేదార్నాథ్ సింగ్ కేసులో పేర్కొన్నట్లు ప్రతి జర్నలిస్టు రక్షణ పొందడానికి అర్హుడని కూడా స్పష్టంచేసింది. అయితే, మీడియాలో పదేళ్ల అనుభవం ఉన్నవారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకుండా చూడాలన్న విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. </p><p>కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, తీర్పు కాపీ LiveLaw.in లో ఇక్కడ చూడవచ్చు. </p><p><a href="https://www.facebook.com/421878521234688/posts/4131063860316117/?sfnsn=wiwspwa">https://www.facebook.com/421878521234688/posts/4131063860316117/?sfnsn=wiwspwa</a></p><p><br /></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-52336379422843933612021-05-21T22:19:00.002+05:302021-05-21T22:19:07.369+05:30 ఆనందయ్య గారి వైద్యం ఆపడం ఎందుకయ్యా!<p>(పర్వతాల శరభయ్య) </p><p>ప్రత్యామ్నాయ వైద్య విధానాలు భారత దేశ ప్రత్యేకతల్లో ఒకటి. దేవుడి మహిమలు ఆయన్ను నమ్మేవారికి మాత్రమే తెలిసినట్లు, ఈ వైద్యం ప్రభావం దాన్ని అనుసరించి అనుభవించే వారికే తెలుస్తుంది... శాస్త్రీయతా, హేతుబద్ధతా.. భంగు...భోషాణం అనే వారి ఏడుపులు ఎట్లావున్నా. శాస్త్రీయ దృక్పథం పెంచాలని రాజ్యాంగంలో రాసుకున్నా... మానవ జీవితంలో చాలా విషయాలు సైన్స్ కు అందకుండానే ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్నిటికి లాజిక్ ఉండదని చాలా మందికి అనుభవాలు నేర్పిన పాఠం. దీని మీద సిద్ధాంత రాద్ధాంతాలు నిష్ఫలం. </p><p>మారణహోమం సృష్టిస్తున్న కొవిడ్ కట్టడికి మందు కనిపెట్టే బృహత్ పనిలో ఆధునిక వైద్యం, అవకాశాన్ని అందిపుచ్చుకుని చచ్చేలా లాభాలు ఆర్జిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు, వైద్య సౌకర్యాలు లేక ప్రభుత్వాలు, ఏ మందు సరిగా పనిచేస్తుందో తెలిచ్చావక కొందరు డాక్టర్లు, మిడిమిడి జ్ఞానంతో మరికొందరు వైద్యులు జనాలను చంపేస్తుంటే....చావుకబుర్లను ఆపేలా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి ఒక శుభవార్త వచ్చింది. బొనిగే ఆనందయ్య గారు వివిధ దినుసులతో ఉడికించి తయారుచేసిన మూడు రకాల మందులు పనిచేస్తున్నట్లు వచ్చిన వార్తలు హనుమాన్ వెళ్లి లక్ష్మణుడికోసం సంజీవినిని తెచ్చినట్లయ్యింది. </p><p>సాదాసీదాగా ఉన్న ఆ పెద్దాయన పెద్దమనసుతో సొంత డబ్బులు పెట్టి అయన పనేదో ఆయన చేసుకున్నాడు... నిన్నటిదాకా. ఊళ్ళో వాళ్లకు గురి కుదిరింది. అక్కడ కేసులు లేవట. చావులు కూడా నిల్లని అంటున్నారు. కొవిడ్ తగ్గిన వాళ్ళు సోషల్ మీడియాలో ఆనందం, ఆశ్చర్యం వ్యక్తంచేయడంతో పాటు స్థానిక రాజకీయులు రంగప్రవేశం చేయడంలో మొత్తం వ్యవహారం కంపై కూర్చుంది. స్థానిక అధికారపార్టీ ఎం ఎల్ ఏ గారు అనవసరంగా... ఈ రోజు (శుక్రవారం) నుంచి పంపిణీ చేసేస్తామని గొప్పగా ప్రకటించడంతో రద్దీ పెరిగింది. ఒక ప్రభుత్వ కమిటీ దాని మీద ఒక నివేదిక కూడా మందుకు చాలావరకు అనుకూలంగా ఇవ్వడంతో ఇక కొవిడ్, కార్పొరేట్ బాధితుల్లో ప్రాణం లేచివచ్చింది. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో నరకయాతన పడుతున్న వాళ్ళు అంబులెన్స్ లలో కృష్ణపట్నం దారిపట్టారు. నెల్లూరు జిల్లాలో కిక్కిరిసిన ఆసుపత్రులలో రద్దీ తగ్గడం, నిన్నటిదాకా దొరకని బెడ్లు క్రమంగా ఖాళీ కావడం మొదలయ్యిందట. </p><p>పాపం... ఆనందయ్య గారు ఏదీ దాచుకోకుండా... ఏ ఏ దినుసులతో మందు తయారుచేస్తున్నదీ చెప్పారు. ప్రభుత్వానికి చేరిన నివేదికలో ఇది స్పష్టంగా ఉంది. అయినా.... ఈ రోజు ఒక మూడు నాలుగు వేల మందికి మందిచ్చే అవకాశం ఉన్నా ఆపడం, ఆయన్ను పోలీస్టేషన్ కు తీసుకుపోవడం అస్సలు బాగోలేదు. చాలా మంది చావుబతుకుల మధ్య అక్కడ చిక్కుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అక్కడికి చేరిన వారికైనా మందు ఇవ్వనివ్వాలి. ప్రతిదాన్నీ సైన్స్ కు ముడిపెట్టి చూసే సైన్టిఫిక్ మూర్ఖుల అభ్యంతరాలు చూసి, ఎవరో వచ్చి ఏదో చేసి సర్టిఫికెట్ ఇచ్చేదాకా ఆగుదామంటే కుదరదు. ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలి. </p><p>అయ్యా...ఆనందయ్య గారు జనాలను మంటల్లో వేస్తున్నాడో, చెంపలు వాయిస్తున్నాడో, అశుద్ధం తినమంటున్నాడో అంటే మనకు అర్జంటుగా అభ్యంతరం ఉండాలి. దినుసులేంటో చెప్పినాక కూడా వైద్యం ఆపడం ఎందుకు? సైన్స్ బాబాలు చెబుతున్న మందులు, స్టెరాయిడ్లు వంద శాతం పనిచేస్తున్నాయని మీ దగ్గర ఒక సాక్ష్యం ఉంటే అది వేరే సంగతి. అపుడు కృష్ణపట్నం పోనివ్వద్దు. ఇక్కడ సరైన వైద్యం తెలియక పిట్టల్లా జనాలు రాలుతున్నారు. భయంతో జనం గుండెలు మిగులుతున్నాయి. ఆధునిక వైద్యుల చేతిలో రోగులు గినియా పిగ్స్ అయి...నరాల్లో స్టెరాయిడ్స్ ఏరులై...చివరకు రోగులు ఒక్క పూటలోనే శవాలై... అనాధల్లా దహనమై పోతున్నారు. డబ్బుకు డబ్బు వదులుతున్నది. ప్రాణాలకు ప్రాణాలు పోతున్నాయి. ఏంట్రా బాబూ ఇదని అడిగితే... మ్యూటేషన్, గిటేషన్ అని సొల్లు చెబుతున్నారు. ఒక్కళ్ళ దగ్గరా ఒక్క చావు గురించీ సైన్టిఫిక్ వెర్షన్ లేదు. హార్ట్ ఫెయిల్ అన్నది కామన్ సానుగుడయ్యింది. అడిగేవాడే లేని హత్యాకాండ అయ్యింది. </p><p>టీకాలు వేసుకున్నాక కూడా కొవిడ్ సోకుతుంది. పోయేవాళ్లు పోతున్నారు. టీకాలు వేయకముందు బాగుండి ... వేశాక గుటుక్కుమన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది టీకాను తప్పుబట్టడం కాదు. భయంకరమైన అనిశ్చితి గురించి చెప్పడం మాత్రమే. తీవ్రమైన అనిశ్చితి సృష్టిస్తున్న వైరస్ మూలంగా మనం తీవ్రాతితీవ్రమైన గందరగోళంలో ఉన్నాం. తరచిచూస్తే ఇప్పుడు ట్రయిల్ అండ్ ఎర్రర్ యవ్వారం నడుస్తోంది. ఇవ్వాళ్ళ ప్రాణ ప్రదాత అనే ఇంజెక్షన్ రేపు 'నో నో' అయిపోతున్నది. క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరైడ్, రెండిసీవిర్... అన్నింటి గురించి రోజుకో మాట చెప్పారే. ఖండితంగా వర్కవుట్ అయిన ఒక్క ప్రోటోకాల్ అయినా తయారు కాలేదే! మందు లేని జబ్బుకు... లక్షలు గుంజుతున్నారే! ఈ స్థితిలో కృష్ణపట్నం స్వామిని కట్టేయడం ఏమి భావ్యం? </p><p>ఇంకో మాట... ఆనందయ్య గారి వైద్యం పనికిరాని చెత్తే అనుకుందాం. అది తేలనివ్వండి. అప్పుడు చూద్దాం. అయినా సరే నమ్మకంతో జనం ఉన్నారు కాబట్టి... చాలా మందికి తగ్గిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి.... ప్రస్తుతానికి కానివ్వండి. శాస్త్రీయులు నమ్మే ప్లాసిబో ప్రభావం అనే పరమ శాస్త్రీయ సిద్ధాంతానికి కట్టుబడైనా సరే అయన పని ఆయన్ను చేయనివ్వండి. తర్వాత సంగతి తర్వాత!</p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com3tag:blogger.com,1999:blog-6892103454419978380.post-79624725650286598582021-05-11T20:04:00.004+05:302022-06-02T12:31:51.712+05:30అమ్మలారా...అయ్యలారా.... పది రోజులు పదిలంగా ఉండరా... <p><span style="font-size: large;">కొవిడ్-1 అపుడు ఉన్న ఊపు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో కనిపించడంలేదు... వైరస్ సృష్టించిన పెను ఉత్పాతం కారణంగా. రెండో తరంగం ప్రతి ఇంటినీ పట్టికుదుపుతూ మరణ మృదంగం వినిపిస్తుంటే ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సిలిండర్లు లభించక, మందులు సకాలంలో దొరక్క, మన దగ్గర తయారైన టీకాలు మనకే అందుబాటులో లేక అగమ్యగోచరమై... యావత్ భారతం వణికిపోతుంటే....పాలకులు పాలిటిక్స్ మీద దృష్టిపెట్టి పరిస్థితిని భ్రష్టుపట్టించారు. బతికుంటే చాల్రా నాయనా... అని సామాన్యులు బిక్కుబిక్కున బతుకుతున్నారు. </span></p><p><span style="font-size: medium;">భారత్ లో బాధితుల ఆక్రందనలు విని చలించి... 'లాక్ డౌన్ విధించండి... తాత్కాలిక ప్రాతిపదికన ఆసుపత్రులు తెరవండి... సైన్యం సాయం తీసుకోండ'ని విదేశీ నిపుణులు సైతం మొత్తుకుంటున్నా కేంద్రప్రభుత్వం స్పందించకుండా రాష్ట్రాలకే నిర్ణయం అప్పగించింది. పరిస్థితి విషమించడంతో కోర్టులు సైతం బెత్తం పట్టుకోవాల్సివచ్చింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు ముందే స్పందించగా.. మొత్తమ్మీద తెలంగాణా ప్రభుత్వం ఈ రోజు భోజనాలయ్యాక లాక్ డౌన్ పై నిర్ణయం ప్రకటించింది. </span></p><p><span style="background-color: white; color: #222222; font-family: mallanna;"><span style="font-size: medium;">తెలంగాణ వ్యాప్తంగా బుధవారం (మే 12, 2021) ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. లాక్డౌన్ కొనసాగింపుపైమళ్ళీ 20న కేబినెట్ సమావేశమై పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో నడవనున్నాయి. లాక్డౌన్ నుంచి వ్యవసాయరంగానికి మినహాయింపునిచ్చారు. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పనులు కొనసాగనున్నాయి. లాక్డౌన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.</span></span></p><p><span style="background-color: white; color: #222222; font-family: mallanna;"><span style="font-size: medium;">లాక్ డౌన్ ప్రకటన వచ్చిందో లేదో జనం రోడ్ల మీద పడ్డారు. పెట్రోల్ బంకులు సర్లే గానీ... మందుషాపుల ముందు బారులు తీరి ఉన్నారు. అక్కడ భౌతిక దూరం గట్రా ఏమీ లేకుండా... స్కైలాబ్ పడుతుందన్నట్లు... ఈ మందు లేకపోతె చస్తామన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇది దారుణం. ఒరేయ్ నాయనా....చస్తార్రా బాబూ... కొద్దిగా సోయిలోకి రండి. </span></span></p><p><span style="background-color: white; color: #222222; font-family: mallanna;"><span style="font-size: medium;">ఇది ప్రజలు బాధ్యతతో మెలగాల్సిన సమయం. వచ్చే పది రోజులు కాస్త కఠినంగా క్రమశిక్షణతో ఉంటే పరిస్థితులు చక్కబడేలా ఉన్నాయి. ఈ లోపు ఏ పొడులో, మాత్రలో వస్తాయి మనల్ను ఆదుకోవడానికి. ప్రతి ఒక్కరూ పెద్ద యుద్ధం చేస్తున్న సైనికుల్లా వ్యవహరించకపోతే మరిన్ని మరణాలు చూడాల్సివస్తుంది. బీ కేర్ఫుల్. </span></span></p>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-72591235532011508272021-05-10T22:14:00.004+05:302021-05-10T22:28:44.456+05:30ఇదేమి ఖర్మరా నాయనా.... ఇవేమి రోజులురా దేవుడా.... పొద్దున్నేఆరు గంటల లోపు ఫ్రెష్ గా లేవడం...<div>ఊళ్ళో ఉన్న అమ్మతో ఫోన్ లో మాట్లాడడం.... <br /><div>గోడ ఆసరా గట్రా లేకుండా శీర్షాసనం వేయడం.... </div><div>ఆయనెవరో కరోనా-1 టైం లో చెప్పిన చప్పట్ల కసరత్తు చేయడం... </div><div>టీనో, తేనే నిమ్మరసమో తాగడం... </div><div>భార్యతో కలిసి కబుర్లాడుతూ పార్కులో ఒక ఐదు రౌండ్లు నడవడం... </div><div>మరో ఐదు రౌండ్లు స్లో రన్నింగ్, తర్వాత శ్వాస సంబంధ ఎక్సర్సైజ్లు చేయడం...</div><div>వచ్చాక పేపర్ చూస్తూ ఒక కప్పు కాఫీనో, టీనో తాగి కూరలు లేదా సరుకులు తేవడం... </div><div>స్నానానంతరం టిఫిన్ బిగించి జర్నలిజం పిల్లలకు ఆన్లైన్ క్లాసు ఆనందంగా చెప్పడం... </div><div>భార్యతో కలిసి కూర్చుని మాట్లాడుతూ మంచి భోజనం చేయడం.... </div><div>ఫోనులో వీడియోలు చూస్తూ నిద్రలోకి జారి ఒక గంటకు పైగా కునుకు తీయడం...<br />సాయంత్రం ఒక టీ తాగి రేపటి క్లాసుకో, రాయాల్సిన వ్యాసం కోసమో చదవడం... </div><div>మధ్యలో ఆర్కే కు ఫోన్ చేసి ఒక అర్థగంటకు పైగా కబుర్లాడడం... </div><div>ఎనిమిది గంటలకల్లా డిన్నర్ తినడం....</div><div>నాన్నతో ఫోన్ లో మాట్టాడడం... </div><div>భార్యా పిల్లలతో కలిసి కాసేపు సినిమా చూడడం....</div></div><div>తొమ్మిది, పది గంటలకల్లా నిద్రలోకి వెళ్లిపోవడం...</div><div>గుర్రుకొట్టి నిద్రపోవడం.... </div><div><br /></div><div>-కరోనా కుమ్మేయకముందు రోజులు అటూ ఇటుగా ఇట్లానే గడిచాయి. ఇప్పుడు కథ మారింది, వ్యధ మిగిలింది. </div><div><br /></div><div>ఏడు గంటలకు బద్ధకంగా లేవడం... అమ్మ ఫోన్ తో... </div><div>బైటికి పోతే గాల్లో తేలే కరోనా కళ్ళగుండా వస్తుందని గుర్తుచేసుకోవడం...</div><div>కళ్ళు మండుతుండగా... బ్రష్ చేసి... </div><div>మూడుంటే శీర్షాసనం వేసి... ఎక్సర్ సైజ్ మ్యాట్ మీద కాళ్ళూ చేతులూ కదల్చడం.... </div><div>బైట పడి ఉన్న పేపర్ల కట్ట మీద కరోనా ఉందన్న భయంతో చూస్తూ టీ తాగడం .... </div><div>టిఫినీ తినడం.... తెల్లారగట్టా పీడకల వచ్చినందువల్ల మరో కునుకు తీయడం.... </div><div>జర్నలిజం క్లాసు చెప్పడం... </div><div>ఏ దుర్వార్తా లేకపోతే పొట్టనిండా లంచ్ చేయడం.... (మే 5 నుంచి రోజూ ఒక మిత్రుడు పోయారు). </div><div>పేస్ బుక్కు లో వార్తలు లేదా నివాళులు చూస్తూ నిద్రపోవడం... </div><div>లేచి ఎవరితో మాట్లాడాలా (ఆర్కే ని కబళించింది) అని చూసి ఎవ్వరితో మాట్లాడకపోవడం... </div><div>లెస్సన్ ప్రిపేర్ కావడం, లేదా వ్యాసం రాయడం... </div><div>ఈ రోజు పోయిన మిత్రుడి గురించి మనసు స్పందిస్తే బ్లాగడం.... </div><div>ఈ లోపు ఇంట్లో ఎవరికీ తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా... ఉలిక్కిపడడం.... </div><div>తొమ్మిది గంటలకు రెండు మెతుకులు తినడం.... </div><div>కాసేపు టీవీ (వార్తలు కాదు) చూడడం... </div><div>మళ్ళీ ఫోన్ చూస్తూ కూర్చోవడం....</div><div>ఆ రోజు పోయిన మనిషి గురించి మాట్లాడుకోవడం....</div><div>మారిన కరోనా ఉత్పరివర్తనంపై కథనాలు చూడడం.... </div><div>స్పెయిన్ లో ఉన్న కుమారుడితో మాట్లాడడం... </div><div>భారంగా 12 గంటల ప్రాంతంలో నిద్రపోవడం... </div><div><br /></div><div>ఇట్లానే ఒకటి రెండు నెలలు అయితే... లంగ్స్ లోకి దూరి కరోనానే చెప్పక్కర్లేదు రాజా.... </div><div>బైటికి కదలకుండా, స్వేచ్ఛగా గాలిపీల్చకుండా కొంపలోనే మగ్గుతూ ఛస్తే...చచ్చి ఊరుకుంటాం. </div><div>మొదటి ఫేసు లో ఇంతలా చావులు లేవుకాబట్టి... ఇంటికి పరిమితం కావడం కొత్తకాబట్టి బాగానే గడిచింది. ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. మన అనుకున్న ఎందరినో పట్టుకుని పీడించింది... పీడిస్తోంది. </div><div><br /></div><div>ఇదేమి ఖర్మరా నాయనా.... ఇవేమి రోజులురా దేవుడా.... </div><div>చాలు స్వామీ... ఇక ఆపేయ్! </div><div><br /></div>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6892103454419978380.post-81699626927670621662021-05-05T22:17:00.007+05:302021-05-06T09:25:31.169+05:30 సూపర్ జర్నలిస్టు భళ్ళమూడి రామకృష్ణ (ఆర్కే)కు అశ్రు నివాళి!<div>తెలుగు జర్నలిజంలో బాగా రాసేవారు (only writing-committed to the profession)... బాగా మేసేవారు (only corruption-as much as possible), బాగా కూసేవారు (Only talking-in studios)...బాగా చేసేవారు (Only recommendations-for everything)... బాగా నాకే వారు (Only praising-the government) ఉన్నారు. ఇందులో మొదటి రకం పక్కా ప్రొఫెషనల్స్ కొరత ఎంతో ఉంది. ఇది కాక... నాణ్యత పెంచడానికి వృత్తినిబద్ధతతో ప్రయత్నంచేసే వారు బహు అరుదు. </div><div><br /></div><div>వృత్తి సంబంధ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే... తాను నేర్చిన విద్యను నలుగురికి పంచడం బాధ్యతగా భావిస్తూ... అందులో తృప్తిని వెతుక్కున్న జర్నలిస్టు భళ్ళమూడి రామకృష్ణ (ఆర్కే). కరోనా పై పోరాడుతూ అయన ఈ ఉదయం గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. అయన వయస్సు 54 సంవత్సరాలు. భార్య వందన, కూతురు శ్రీలాస్య ఉన్నారు. </div><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQdJmd2p5nAd-SX4Cr-WxhT8CtCtCR_6BreyVtLaZOewqaPvup237kQRd7qgXEMZVKY4sGwtDorJj3fJ-nkPruDkXOOBgKVPRhArFUIeZ6FMLrve0YoiU5UfWFG-jaIXMnFhkLeJeoeQI/s266/RK.jpeg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="266" data-original-width="264" height="200" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQdJmd2p5nAd-SX4Cr-WxhT8CtCtCR_6BreyVtLaZOewqaPvup237kQRd7qgXEMZVKY4sGwtDorJj3fJ-nkPruDkXOOBgKVPRhArFUIeZ6FMLrve0YoiU5UfWFG-jaIXMnFhkLeJeoeQI/w198-h200/RK.jpeg" width="198" /></a></div><br /><div>విజయనగరం జిల్లా బొబ్బిలిలో 29-08-1967న విద్యాధికుల కుటుంబంలో జన్మించిన ఆర్కే (పాలొలికే బుగ్గలతో ఉంటాడు కాబట్టి 'పాలబాబు' అని ఇంట్లో ముద్దుగా పిలుస్తారు) ఎం ఎస్సీ-ఫిజిక్స్ చదివాడు. ఆంగ్ల బోధకుడైన తండ్రి నుంచి వారసత్వంగా సాహిత్యాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన జర్నలిజంపై మక్కువతో 1991-92 లో "ఈనాడు" కంట్రిబ్యూటర్ గా చేరాడు. "ఈనాడు జర్నలిజం స్కూల్" లో 1993లో చేరి బ్యాచ్ ఫస్టు వచ్చారు. సంస్థ గుండెకాయగా భావించే జనరల్ డెస్క్ లో చేరి తెలుగు, ఇంగ్లిష్ భాషా సామర్ధ్యం మెండుగా ఉండడం వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడే జర్నలిజం స్కూల్ పిల్లలకు క్లాసులు తీసుకునేవాడు. డెస్కులో చేరిన కొత్త వారికి నిలదొక్కుకోవడానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. </div><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgFCa-8j69S8NXADVNUhWys2yPY47Ang0Hxl61OquPit9KULjGvluMVHdJM1McDHXw2IIL8m5eVwmGltKSJ5HGxW6DDm7ES4zD1NRtxIXZEdBHFNIlZh4Pv6aLrmZOpPtrvwb5zwzCkxWU/s836/rk+ram+.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="620" data-original-width="836" height="475" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgFCa-8j69S8NXADVNUhWys2yPY47Ang0Hxl61OquPit9KULjGvluMVHdJM1McDHXw2IIL8m5eVwmGltKSJ5HGxW6DDm7ES4zD1NRtxIXZEdBHFNIlZh4Pv6aLrmZOpPtrvwb5zwzCkxWU/w640-h475/rk+ram+.jpeg" width="640" /></a></div><br /><div><br /></div><div><br /></div><div>'సార్... ఎన్టీఆర్ ను కాదని మనం చంద్రబాబును ఎందుకు సమర్ధించాలి?' అని ఒక సంస్థాగత మీటింగులో ఈనాడు ఛైర్మన్ రామోజీ రావు గారిని ఆనాడు అమాయకంగానైనా సూటిగా అడిగి ఒక 30 నిమిషాల పాటు పెద్దాయన వివరణ ఇచ్చేలా చేసిన మొనగాడు... ఆర్కే. పదవులు రావనో... తొక్కేస్తారనో తను ఎన్నడూ భయపడలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో, రాయడంలో భయమెందుకు? అన్నదే ఏకైన సూత్రం. ఇది చేసిన నష్టం భారీగానే ఉన్నా... రాజీ పడకుండా ఇబ్బందిపడుతూనైనా బండి నడిపాడు. </div><div><br /></div><div>ఆర్కే ప్రతిభను గమనించి ఈనాడు యాజమాన్యం... అప్పుడే కొత్తగా వస్తున్న మాధ్యమం ఈ-టీవీ కి పంపింది. అక్కడా తనదైన ముద్రవేశాడు. ఎందరో మెరికలను తయారుచేశాడు. తర్వాత ఎన్-టీవీ, ఐ-న్యూస్ ఛానల్స్ లో పనిచేసి ప్రింట్ జర్నలిజం వైపు మారాడు. డెక్కన్ క్రానికల్, హన్స్ ఇండియా లలో పనిచేసిన ఆర్కే చివరకు ఆంధ్రజ్యోతిలో చేరాడు. "నాణ్యత కోసం నేను పడిన తాపత్రయాన్ని పొగరుగానో మారేదనో అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు ఛానెల్స్ లో నాకు మంచి అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు," అని ఆర్కే అన్నాడు. వ్యాస రచయిత రాము, రామకృష్ణ ఈనాడు రోజుల్లో దిగిన ఫోటో ఈ పైన ఉంది. </div><div> </div><div>ఆర్కే శివైక్యం చెందిన సందర్భంగా ఈ రోజు రాసిన లేఖ ఇదీ:::::</div><div><br /></div><div><div><br /></div><div><span style="color: #741b47; font-size: medium;">పాలబాబూ.... </span></div><div><span style="color: #741b47; font-size: medium;">రెండు రోజుల్లో కోలుకుంటావని అందరం అనుకుంటే... ఏంటి బ్రదర్ 54 ఏళ్లకే ఇలా వెళ్లిపోయావ్? </span></div><div><span style="color: #741b47; font-size: medium;">మూడు నాలుగు నెల్లుగా దాదాపు రోజూ గంట చొప్పున మాట్లాడుకున్నాం. ఎన్నోటి విషయాలు చర్చించుకున్నాం! జర్నలిజం, ప్రపంచ విశేషాలు, లోకల్ రాజకీయాలు, భోజనాలు, జనాలు...ఎన్నని విశ్లేషించాం! అవే నాకు మధురానుభూతిగా మిగిల్చి పోయావ్. నిజానికి, నీతో ఈనాడు లో జనరల్ డెస్క్ లో పోటీపడి రాసిన బ్యానర్లు, నువ్వు పడిపడినవ్విన బోలెడన్ని హెడ్డింగులు ఎప్పటికీ గుర్తుంటాయి. వీటితో పాటు, చింతల్ బస్తీ మెస్ లో మనం తిన్న ములంగ కాడలు, వస్తూ వస్తూ వేసుకున్న స్వీట్ పాన్లు, పండిన నోటితో చిద్విలాసంగా నువ్వు నడిచి వస్తుంటే... 'అయ్యా.... ఆర్కే..' అని ఒక డెస్క్ ఇంచార్జ్ చేసిన వ్యాఖ్యలు.... ఎప్పుడూ మరచిపోను. డ్యూటీ అయ్యాక నిమ్స్ ప్రాంగణంలో తాగిన టీలు, తిన్న మిర్చి బజ్జీలు.... </span></div><div><span style="color: #741b47; font-size: medium;">దీంతో పాటు నా 'సావిర్జినిటి', నీ ' వర్జీనియా వూల్ఫ్' నా మదిలో ఆనందంగా నిలిచిపోతాయి. ఎంత బనాయించావురా... 'రాజకీయ ఆర్తి-భంగపడ్డ మూర్తి' శీర్షికను! నీ హాస్య ప్రియత్వం, సంభాషణా చతురత, సునిశిత విశ్లేషణా సామర్థ్యం ఎల్లకాలం గుర్తుండి పోతాయి. </span></div><div><span style="color: #741b47; font-size: medium;"><br /></span></div><div><span style="color: #741b47; font-size: medium;">నేను ఏప్రిల్ లో రెండు రోజులు వరసగా థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసి వస్తే... కొవిడ్ ను పట్టించుకోకుండా ఏంటిదని మందలించావే! ఎన్ని జాగ్రత్తలు చెప్పావ్! చూడరా అన్నా... ఈ పాడు కోవిడ్ కనీసం నిన్ను కలవకుండా...చేసింది. నీకో దండ వేసి దండం పెడదామని నేను, హేమ సిద్ధమవుతుంటే...ఆ జీ హెచ్ ఎం సీ వాళ్ళు అంబర్ పేట కు ఆల్రెడీ తీసుకుపోతున్నారని చెప్పారు. పంచభూతాల్లో నీవు లీనమయ్యే లోపే ఇది రాయాలనుకున్నా. దుఃఖం ఆగడం లేదురా అన్నా. నువ్వు ఆసుపత్రిలో చేరాక... మాట్లాడాల్సింది. నీకు అది డిస్ట్రబెన్స్ అవుతుందనుకున్నారా అన్నా. ఘోరమైన తప్పు జరిగిపోయిందే!</span></div><div><span style="color: #741b47; font-size: medium;"> </span></div><div><span style="color: #741b47; font-size: medium;">ఎందుకురా.... నువ్వు నీ మరణం గురించి నాతో అంత లోతుగా చర్చించావ్? ఈ మధ్యనే రెండు మూడు సార్లు ఇదే ప్రస్తావించావ్. ఇప్పుడు అర్థమయ్యింది ఆర్కే. 'నాకు ఏదైనా అయితే వీళ్లకు (వందన గారికి, లాస్యకు) అండగా ఉండాలి," అని నువ్వు మాటిమాటికీ చెబితే నేను నిన్ను తిట్టా... పిచ్చివాగుడు ఆపాలని. నువ్వు మాట ఇవ్వాలని పట్టుపట్టినప్పుడు నాకు అర్థంకాలేదు అన్నా. బహుశా నువ్వు ఊహించినట్లే దాటిపోయావ్ మా అందరినీ వదిలేసి. నేను మాటకు కట్టుబడి ఉంటారా... అన్నా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ వాళ్ళిద్దరికీ నేను, నా కుటుంబం బాసటగా ఉంటాం. ఈ రోజు నేను చేస్తున్న పునరుద్ఘాటనరా ఇది. </span></div><div><span style="color: #741b47; font-size: medium;"> </span></div><div><span style="color: #741b47; font-size: medium;">అన్నా... నువ్వు.. అద్భుతమైన ప్రతిభావంతుడివి. నిన్ను నిన్నుగా నేచురల్గా ఎదగనివ్వని, అవకాశాలకు అడ్డంపడిన వెధవ ఎవ్వడూ నీలా ఒక్క పేరా అయినా రాయలేడు. కొన్ని లెక్కలు కలిసొచ్చాయి వారికంతే. నిన్ను ఇంగ్లిష్ జర్నలిజంలో చేర్చాలని... మనం ఈనాడు లో ఉండగానే నిన్ను ఒక ది హిందూ జర్నలిస్టు దగ్గరికి తీసుకుపోయాం. కానీ ఈ లోపు ఈ-టీవీ లో వచ్చి దేశ రాజధానికి వెళ్లిపోయావ్. తర్వాత మనం దూరమైనా... హేమ ఎన్-టీవీ లో చేరాక వారానికి ఒక సారి మాట్లాడుకున్నాం. అవన్నీ మధుర అనుభూతులే. మధ్యలో చాలా అంతరం వచ్చినా.... గత ఏప్రిల్ ఇబ్బంది నుంచి నువ్వు బైటపడ్డాక... నేను రోజూ మాట్లాడాలని పెట్టుకుని మాట్లాడాను... నువ్వు వేగంగా కోలుకుని హాయిగా ఉండాలని. ఈ నెల్లో అహోబిలం సహా కొన్ని ప్రాంతాలకు, మా ఊరికి వెళ్లాలని అనుకుంటే... అకస్మాత్తుగా వెళ్లిపోయావ్ మిత్రమా. </span></div><div><span style="color: #741b47; font-size: medium;">నీ జీవితంలో, మరణంలో రెంటిలోనూ వ్యవస్థ వైఫల్యం, యాజమాన్యాల కర్కశత్వం, అపోహలతో కక్షగా మెలిగిన కొందరి రాక్షసత్వం ఉన్నాయి. మనం వాటిని కూలంకషంగా మాట్లాడుకున్నాం... నాకు అవన్నీ గుర్తు ఉంటాయి. వదిలేద్దాం. </span></div><div><span style="color: #741b47; font-size: medium;">ఏడాదికి పైగా నువ్వు ఇంటి నుంచే పనిచేయడానికి సహకరించిన ఆంధ్ర జ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ గారికి, ఎడిటర్ శ్రీనివాస్ గారికి, సీనియర్ మిత్రుడు వక్కలంక రమణకు నీ తరఫున ఈ రోజున ధన్యవాదాలు. నిన్ను మామూలు మనిషిగా చూడాలని గట్టిగా అనుకున్న ఈనాడు ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వర రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా గత వారం అయన మీ ఇంటికి వచ్చి మందులిచ్చి, అర్థగంట ఉండడమే కాదు... నీ ప్రాణాలు కాపాడేందుకు కొన్ని గంటల పాటు ఫోన్లో ఆయన అందుబాటులో ఉన్నారు. రేగళ్ల సంతోష్ నీ గురించి ఎంతో తపన పడ్డాడు. పాపం ఎన్ని ఫోన్ కాల్స్ టంచనుగా తీసుకుని తనకు చేతనైన సాయం చేశాడో! ఇతర మిత్రుల ప్రయత్నాలు, ప్రేయర్స్ వర్కవుట్ కాలేదు. మేము దురదృష్టవంతులం...అన్నా. </span></div><div><span style="color: #741b47; font-size: medium;"><br /></span></div><div><span style="color: #741b47; font-size: medium;">నీతో పనిచేసిన, నీ నుంచి వృత్తిపరమైన నైపుణ్యాన్ని పొందిన అనేక మంది నాతో మాట్లాడారు. ఏమ్వోయ్, బ్రదర్, సోదరా... అని నువ్వు పిలిచిన వారూ కుమిలిపోతున్నారు. </span></div><div><span style="color: #741b47; font-size: medium;">ఆర్కే... మేమంతా నీ ఆత్మకు శాంతి, స్వర్గలోక ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తాం. అంతకు మించి మేమేమి చేయగలం. </span></div><div><span style="color: #741b47; font-size: medium;"><br /></span></div><div><span style="color: #741b47; font-size: medium;">పాలబాబూ.... ఇక సెలవ్... </span></div><div><span style="color: #741b47; font-size: medium;">నీ 'బోసమ్' ఫ్రెండ్'</span></div><div><span style="color: #741b47; font-size: medium;">రాము</span></div></div>Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.com10