కంచు కంఠం తో, నిత్య ఉత్తేజంతో డ్రమాటిక్ మాటలతో సంభాషణలను రక్తి కట్టించే ప్రియదర్శిని రామ్ (రెడ్డి) గారు మళ్ళీ సాక్షి టీవీ ఛానెల్ పగ్గాలు స్వీకరించారు. జగన్ బాబు జైలు నుంచి బైటికి రావడానికి రెండు రోజుల ముందే ఆయన ఛానెల్ సీ ఈ ఓ అయినట్లు సమాచారమ్. "ఎన్నికల సీజన్ లో రామ్ రెడ్డి లాంటి డైనమిక్ వ్యక్తి ఛానెల్ హెడ్ గాఉంటే బాగని యాజమాన్యం భావించినట్లు ఉంది," అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు.
దాంతో, ఇప్పటి దాకా దాదాపు ఛానెల్ హెడ్ గా ఉన్న సీనియర్ జర్నలిస్టు, మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దిలీప్ రెడ్డి కి పదవీ గండం కలిగినట్లు తెలిసింది. అయితే, దిలీప్ సేవలను ఇతరత్రా వాడుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.
సీనియర్ యాంకర్ స్వప్న కు రామ్ రెడ్డి కి పడలేదని, ఒక విషయంలో వచ్చిన పంచాయితీ లో జోక్యం చేసుకుని జగన్ భార్య భారతి రామ్ రెడ్డి కి ఉద్వాసన పలికారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సాక్షి కుటుంబానికి దూరమైన రామ్ రెడ్డి మళ్ళీ క్రమంగా దగ్గరై.. విశ్వాసం చూరగొన్నారని చెబుతున్నారు. మరి ఇప్పుడు స్వప్న గారు అక్కడే రాజీపడి ఉంటారా? లేక తన దారి తానూ చూసుకుంటారా? అన్నవి మీడియాలో జరుగుతున్న చర్చల్లో ప్రముఖ ప్రశ్నలు.
రామ్ అన్నయ్యా... దున్నుకోవయ్యా. మళ్ళీ 'సాక్షి సలాం' తో అలా ముందుకు సాగిపో. సమకాలీన జర్నలిజాన్ని ఏలుకో. ఆల్ ద బెస్ట్.
meesaala ram reddy ani sambodinchina batta burra ramu gaaru. endukandi meekantha gula vere vaallani helana cheyyatam. aayanemanna mee bandhuva?
ReplyDeletemundu mee batta burra sarigga chusukondi addam lo paikosthaaru.
మాయదారి మాయావీ...
ReplyDeleteనా బుర్ర గురించి ఆలోచించిన నువ్వే నా బంధువ్వు. కలుద్దాం.
రాము
His writing style is upto the mark.Me thinks so.It will revamp Sakshi losr glory.
ReplyDeleteEenadu has gone from bad to worse.Hope they recover.Else,all they can boast of will be history.In this world of competition,only best survive.
congrats to Ram... Thanks to sakshi
ReplyDelete