పొరుగునున్న పాకిస్థాన్ లోని పెషావర్ లో మిలిటరీ స్కూల్ లో చొరబడిన తాలిబాన్ తీవ్రవాదులు సృష్టించిన నరమేధంలో దాదాపు వంద మంది విద్యార్థులు మరణించడం, పెద్ద సంఖ్యలో పిల్లలు గాయపడడం తీవ్రంగా కలచివేస్తోంది. ఇంతకన్నా పైశాచిక చర్య మరొకటి ఉండదు.
మత పిచ్చి, రాజకీయ వెర్ర్రి ఉంటే ఉండవచ్చు గాక! దీన్నంతా చిన్నారి భావి పౌరుల మీద చూపించడం దుర్మార్గం, హేయం. వీళ్ళకు ఇదేమి పోయే కాలం?
"మేము అప్పుడు పరీక్ష గదిలో ఉన్నాం. అప్పుడే ఉన్నట్టుండి ఫైరింగ్ మొదలయ్యింది. నిశ్శబ్దంగా నేల మీద పడుకోండని టీచర్లు చెప్పారు. ఒక గంట పాటు బిక్కుబిక్కున అలాగే ఉన్నాం. సైన్యం వచ్చి మమ్మల్ని రక్షించింది," అని ఒక విద్యార్థి చెప్పారు. ముందుగా గాల్లోకి కాల్పులు జరిపి.... తర్వాత ఏరికోరి ఎంపిక చేసిన చిన్నారులను ఈ నికృస్టులు కాల్చి చంపారట. చాలా మంది పిల్లలను బందీలుగా చేసుకున్నారట.
"మా ఆత్మాహుతి దళం స్కూల్లోకి వెళ్ళింది. పిల్లలకు హాని చేయవద్దని, సైనికులను లక్ష్యంగా చేసుకోండని ఆదేశాలు ఇచ్చాం. ఉత్తర వజీరిస్థాన్ లో సైనిక చర్యకు ప్రతీకారంగా ఈ దాడి చేశాం," అని తాలిబాన్ ప్రతినిధి ఒకడు ప్రకటించాడు.
దేశాల మధ్య విద్వేషాలను వదిలి, ఓటు బ్యాంకు రాజకీయాలు మాని అన్ని దేశాల అధినేతలు ఈ మతిలేని తీవ్రవాదాన్ని ఖండించి పాకిస్తాన్ కు అండగా ఉండాల్సిన తరుణమిది.
మత పిచ్చి, రాజకీయ వెర్ర్రి ఉంటే ఉండవచ్చు గాక! దీన్నంతా చిన్నారి భావి పౌరుల మీద చూపించడం దుర్మార్గం, హేయం. వీళ్ళకు ఇదేమి పోయే కాలం?
"మేము అప్పుడు పరీక్ష గదిలో ఉన్నాం. అప్పుడే ఉన్నట్టుండి ఫైరింగ్ మొదలయ్యింది. నిశ్శబ్దంగా నేల మీద పడుకోండని టీచర్లు చెప్పారు. ఒక గంట పాటు బిక్కుబిక్కున అలాగే ఉన్నాం. సైన్యం వచ్చి మమ్మల్ని రక్షించింది," అని ఒక విద్యార్థి చెప్పారు. ముందుగా గాల్లోకి కాల్పులు జరిపి.... తర్వాత ఏరికోరి ఎంపిక చేసిన చిన్నారులను ఈ నికృస్టులు కాల్చి చంపారట. చాలా మంది పిల్లలను బందీలుగా చేసుకున్నారట.
"మా ఆత్మాహుతి దళం స్కూల్లోకి వెళ్ళింది. పిల్లలకు హాని చేయవద్దని, సైనికులను లక్ష్యంగా చేసుకోండని ఆదేశాలు ఇచ్చాం. ఉత్తర వజీరిస్థాన్ లో సైనిక చర్యకు ప్రతీకారంగా ఈ దాడి చేశాం," అని తాలిబాన్ ప్రతినిధి ఒకడు ప్రకటించాడు.
దేశాల మధ్య విద్వేషాలను వదిలి, ఓటు బ్యాంకు రాజకీయాలు మాని అన్ని దేశాల అధినేతలు ఈ మతిలేని తీవ్రవాదాన్ని ఖండించి పాకిస్తాన్ కు అండగా ఉండాల్సిన తరుణమిది.
The worst tragedy in the history of terrorism as innocent kidswere massacred by Taliban mad dogs.They deserve to be shot whenever they are sighted anywhere in the globe.Let Pakisthan begin the act followed by other countries till last Taliban is eliminated otherwise the bloodshed of innocents will continue.It is a great lesson for Pakisthan which has been soft towards terrorists acting against India but now it is the victim of it's own soft corner towards terrorists.
ReplyDeleteJP Reddy
చదువుకున్నవాళ్ళు వాళ్ళు చెప్పిన మాట చచ్చినా వినరు గదా!
ReplyDeleteవాళ్ళు చెప్పింది చచ్చినట్టు వినే బానిసమూక కావాలి వాళ్ళకి?