Thursday, April 23, 2015

ఉత్తమ ప్రజా సంబంధాల మ్యానేజర్-2015 అవార్డు

దాదాపుగా 20 ఏళ్ళు జర్నలిస్టుగా, ఐదేళ్ళు యూనివెర్సిటీ లో జర్నలిజం బోధకుడిగా పనిచేసి ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) లో ఎడిటర్ అండ్ పీ ఆర్ ఓ గా పనిచేస్తున్న ఈ బ్లాగు వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ ఎస్. రాము కు 'ఉత్తమ ప్రజా సంబంధాల మ్యానేజర్-2015' అవార్డు లభించింది. 

జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21 సాయంత్రం తెలుగు యూనివెర్సిటీ లో పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీ ఆర్ ఎస్ ఐ)  నిర్వహించిన  ఒక కార్యక్రమం లో తెలంగాణా శాసన మండలి చైర్మన్ కె. స్వామి గౌడ్ ఈ అవార్డు ప్రదానం చేసారు. 
"This Award is presented to Dr Ramu in recognition of his outstanding performance in the practice of public relations and for having exhibited professional qualities that served in promoting the vision, mission, goals and services of ASCI," అని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమం లో తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్, అమర్ రాజా గ్రూపు సీ ఈ ఓ సముద్రాల విజయానంద్, పీ ఆర్ గురు డాక్టర్ సీ వీ నరసింహారెడ్డి, పీ ఆర్ ఎస్ ఐ ప్రధాన సలహాదారు ఎం ఎల్ నరసింహా రావు, ఛైర్మన్ డాక్టర్ జుర్రు చెన్నయ్య, కార్యదర్శి మోహన్ రావు 
పలు జర్నలిజం పుస్తకాలను తెలుగు లోకి అనువదించి, ప్రచురించిన గోవిందరాజు చక్రధర్ గారిని కూడా ఘనంగా సన్మానించారు. 

4 comments:

  1. అన్న హృదయపూర్వక అబినందనలు మరిన్ని పురస్కారాలు అందుకోవాలకి మనస్పూర్తిగా కోరుతూ

    ReplyDelete
  2. రాము గారూ మీకు, మా గురువు గారు చక్రధర్ గారికీ అభినందనలు

    ReplyDelete

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి