ఒక పార్టీ హయాంలో పదవి అనుభవించిన వారిని వైరి పార్టీ పవర్ లోకి రాగానే ఇంటికి సాగనంపడం మనం తరచూ చూస్తాం. ప్రతిభ, అర్హతలతో సంబంధం లేకుండా కేవలం పొలిటికల్ ఈక్వేషన్ కారణంగా ఇట్లా పాత వారికి పాతరేసి కొత్తవారి జాతర మొదలు పెడతారు. ఇదో దిక్కుమాలిన పద్ధతి. దానికి పూర్తి భిన్నంగా...కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన విద్యావేత్త, మేధావి, రాజకీయ - సామాజిక - సాంస్కృతిక విశ్లేషకుడు Chakrapani Ghanta గారిని కాంగ్రెస్ ప్రభుత్వ సారథి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించడం నాకు మంచిగా అనిపించింది. ఇలాంటి అసాధారణ చర్యలే తెలంగాణ పునర్నిర్మాణానికి కావలసింది. ప్రతిభను కాకుండా భజనను ప్రాతిపదికగా చేసుకునే పాత సీఎం ఇలాంటి పని కలలో అయినా చేయరు. మేధావులను వాడుకోవడం చేతగాక ఎన్నో బ్రిలియంట్ బ్రెయిన్స్ ను దూరం చేసుకుని అవమానించి చెడ్డపేరు తెచ్చుకుని ఫలితం అనుభవించిన కేసీఆర్ గారు రేవంత్ గారి నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప అంశం ఇదని నాకు అనిపిస్తున్నది.
మూడు దశాబ్దాలకు పైగా అదే యూనివర్శిటీ కి సేవలు అందించిన చక్రపాణి గారు వీసీ కావడం మంచి పరిణామం. లక్షల మంది ఇంటి గడపల చెంతకు చదువును చేర్చిన ఒక గొప్ప విద్యా సంస్థ అంబేద్కర్ విశ్వవిద్యాలయం. చక్రపాణి గారి సమర్ధ నాయకత్వంలో అది కాలానికి అనుగుణంగా ఉపాధి కల్పన పెంచే కోర్సులు ప్రవేశపెట్టి మేలు చేస్తుందని, ప్రతిభకు పెద్దపీట వేస్తుందని భావించవచ్చు. బీ.ఆర్ ఎస్ హయాంలో...పదవి ఉంది కదా...అని నోటికి వచ్చింది మాట్లాడకుండా తనకు అప్పగించిన పని మీదనే ఆయన దృష్టి పెట్టబట్టి మర్యాద నిలిచి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ మంచి పోస్టు వరించింది.
చక్రపాణి గారికి శుభకామనలు.
తేడా వస్తే తోలు తీసే Murali Akunuri లాంటి వారికి విద్యా కమిషన్ పగ్గాలు అప్పజెప్పడం కూడా బాగుంది. అందులో మా గురువు గారు PL Vishweshwer Rao లాంటి వారికి స్థానం కల్పించారు. నిజానికి PLV సార్ 15 ఏళ్ల కిందటనే వీసీ కావలసిన విద్యావేత్త, మేధావి.
ఈ సంస్కృతి ఆంధ్రా లో కూడా రావాలి
ReplyDelete