Wednesday, February 15, 2012

బంగ్లాదేశ్ లో జర్నలిస్టు దంపతుల హత్య

ఒక రెండు రోజలు నెట్ లో ప్రపంచాన్ని జల్లెడ పట్టకపోతే చాలా ముఖ్యమైన వార్తలు మిస్ అవుతాం. బంగ్లాదేశ్ రాజధానిలో ఇద్దరు ప్రముఖ జర్నలిస్టు దంపతులు దారుణ హత్యకు గురవడం నాకు ఆలస్యంగా తెలిసింది.సాగొర్ సర్వార్ (న్యూస్ ఎడిటర్, మాస్ రంగా టీవీ), ఆయన భార్య మెహరున్ రునీ (సీనియర్ రిపోర్టర్, ఏటీఎన్ బంగ్లా) వారి నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. సర్వార్ ఒక జర్ననీ మీడియా సంస్థకు ఢాకా ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు. ఇద్దరి వయస్సూ నలభై ఏళ్ల లోపేననీ, ఉదయం వారి ఐదేళ్ల కుమారుడు మేష్ మృతదేహాలను చూసి పొరుగింటి వారిని అప్రమత్తం చేసే వరకూ ఈ ఘోర హత్యల గురించి ఎవ్వరికీ తెలియలేదని సమాచారం. 


ఈ హత్యల నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సాధారణ ప్రజలు కూడా జర్నలిస్టుల హత్యను ఖండిస్తూ, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్లకెక్కారు. దీన్ని ప్రతీకార హత్యగా లేదా దోపిడి దొంగల అఘాయిత్యంగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాగొర్ దేహం మీద మొత్తం 22 కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హంతకులు అతని కాళ్లు, చేతులు తాళ్లతో బంధించి పదునైన ఆయుధంతో పొడిచి చంపారట. వీరి అపార్ట్ మెంట్ లో ఆ రాత్రి వీరితో కలిసి భోజనం చేసిన కొందరు వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అంటున్నారు. http://www.nl-aid.org కథనం ప్రకారం....
Bangladesh is among the worst nations in the world in combating deadly anti-press violence. Bangladesh ranks 11th on New York based Committee to Protect Journalists (CPJ) Impunity Index, which calculates unsolved journalist murders as a percentage of each country’s population. Twelve journalists have been murdered in reprisal for their work in Bangladesh since 1992.

First Photo courtesy: BBC
Second Photo courtesy: http://www.nl-aid.org

పత్రికాధిపతులారా...అస్సాం ట్రిబ్యూన్ ను చూసైనా నేర్చుకుంటారా?

1967 నుంచి....జర్నలిస్టుల వేతనాలకు సంబంధించిన వేజ్ బోర్డుల సిఫార్సులను అమలుచేయడంలో ముందున్న అతికొద్ది పత్రికలలో ఈశాన్య భారతం నుంచి వస్తున్న "ద అస్సాం ట్రిబ్యూన్: ఒకటి. జస్టిస్ మజీతియా నేతృత్వంలోని వేజ్ బోర్డు ఇచ్చిన సిఫార్సులు అమలుచేయకుండా ఉండటానికి పత్రికల యాజమాన్యాలు నానా యాగీ చేస్తూ...ఎక్కడ లేని లా పాయింట్లు పీకుతుంటే అస్సాం ట్రిబ్యూన్ మాత్రం ఆ సిఫార్సులను అమలుచేయాలని నిర్ణయించింది. 
జనవరి నుంచి కొత్త వేతనాలను యాజమాన్యం అమలుచేసింది. దాంతో కనీసం పదిహేను వేల రూపాయల అదనపు జీతాన్ని జర్నలిస్టులు పొందారు. ఇది నిజంగా హ్యాపీ న్యూ ఇయరే మన మిత్రులకు. అస్సాం ట్రిబ్యూన్ ఎడిటర్ కం మేనేజింగ్ డైరెక్టర్ అయిన పి.సి.బారువా దీనిమీద అన్న మాట ఏమిటంటే..."We have done our duty and given the employees their due. We don't want to speak for ourselves. Let others talk about our gesture."

 1939 ఆగస్టు నాలుగో తేదీన ఏర్పడిన ఈ పత్రిక ఈశాన్య భారతంలో అత్యధిక సర్క్యులేషన్ తో వర్ధిల్లుతున్నది. ఇందులో దాదాపు నాలుగొందల మంది పనిచేస్తున్నారు. అందులో వంద మంది జర్నలిస్టులున్నారు. ఈ గ్రూప్ వారికే అస్సమీ లో దైనిక్ అసోమ్, అసోమ్ బని, గరియోషి అనే పత్రికలున్నాయని ది హూట్ వెబ్ సైట్ లో వచ్చిన ఒక ఆర్టికల్ పేర్కొంది.

జర్నలిస్టుల రక్తమాంసాలు పిండి మీడియా సామ్రాజ్యాలు నిర్మించుకుంటూ తరతరాలకు తరబడ సంపాదిస్తున్న తెలుగు పత్రికా యాజమాన్యాలు అస్సాం ట్రిబ్యూన్ నుంచి ప్రేరణ పొందాలి. ప్రతికలను అడ్డంపెట్టుకుని చేస్తున్న వ్యాపారాలలో భారీగా ఆర్జిస్తూ, పత్రికా నిర్వహణలో నష్టాలు చూపించి జర్నలిస్టుల, నాన్ జర్నలిస్టుల పొట్టకొట్టడాన్ని ఇప్పటికైనా ఆపాలి. చేవలేని జర్నలిస్టు సంఘాలు మొద్దు నిద్ర వదిలేలా జర్నలిస్టులు కూడా పూనుకోకపోతే మీకు చట్టబద్ధంగా పెరగాల్సిన జీతాలు పెరగవని గమనించాలి.

Tuesday, February 14, 2012

జిల్లాకో యూనివర్శిటీ...ఒక చెత్త ప్లాన్...

వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం...జిల్లాకో యూనివర్శిటీని ఏర్పాటుచేయాలనుకోవడం, అందులో భాగంగా పలు జిల్లాలలో యూనివర్శిటీలు ఏర్పాటు చేయడం. యూనివర్శిటీ విద్యను ప్రజల చెంతకు తేవాలన్న ఆలోచనలో భాగంగా ఆయనీ నిర్ణయం తీసుకుని ఉంటారు కానీ పలు లాజిస్టికల్ సమస్యలను ఆయన పట్టించుకోలేదు.

అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వాడుకుని...కనీస మొత్తంలో నిధులు కేటాయించి లోకల్ గా యూనివర్శిటీలను ఏర్పాటుచేశారు. వైస్ ఛాన్సలర్ లు చాలా వరకు రాజకీయ నియామకాలే. అధ్యాపకుల నియామకాల్లోనూ నాణ్యతకు పెద్దపీట వేయలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి.  తాజాగా మచిలీపట్నంలో ఉన్న యూనివర్శిటీలో పోస్టులు ఇప్పిస్తానని ఒకాయన పది లక్షల వరకూ నొక్కేసి పారిపోయాడట. ఇందులో బాధితులు పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో విషయం బైట పడింది.
రాష్ట్రంలో ఉన్న పెద్ద యూనివర్శిటీలలోనే నాణ్యతా ప్రమాణాలు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బాగా బోధించే ప్రొఫెసర్లు లేక మనం సతమతమవుతుంటే....జిల్లాకో యూనివర్శిటీ అన్నది ఎంత మూర్ఖపు ఆలోచనో చెప్పలేం. పైగా సిబ్బందిని నియమించుకోవడానికి ఈ స్థానిక యూనివర్శిటీలకు నిధులు లేవు. సదుపాయాలూ లేక పంతుళ్లూ లేక యూనివర్శిటీ వాళ్లు కోర్సులను ఎలా నడుపుతారు?

ఈ నిర్ణయం వల్ల పిల్లలకు దీర్ఘకాలంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. యూనివర్శిటీ సెటప్ ఏర్పడింది కాబట్టి స్థానికంగా ఉన్న టీచర్లతో బండి నడుపుతారు...పిల్లలకు డిగ్రీలు ఇస్తారు. ఆ పిల్లలు అధిక సంఖ్యలో పోటీ పరీక్షల్లో దెబ్బతింటారు. దీన్ని పట్టించుకునే నాథుడే లేడు.

Monday, February 13, 2012

HM TV= High Morals Television: మూడో వార్షికోత్సవం

కపిల్ చిట్స్ వారి ఆధ్వర్యంలో, సీనియర్ మోస్ట్ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి గారి నేతృత్వంలో నడుస్తున్న హెచ్ ఎం టీవీ ఫిబ్రవరి పన్నెండో తేదీన మూడో వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా కపిల్ అధినేత వామన రావుగారికి, మూర్తిగారికి, టీవీ సిబ్బందికి శుభాకాంక్షలు. ‌HM TV  అంటే High Morals Television అని ఛానల్ పేరు తెచ్చుకోవడానికి ఇందులో ప్రతి ఒక్కరూ ప్రయత్నించడాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను.

కపిల్ చిట్స్ వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం లో పనిచేస్తున్నా కాబట్టి...ఛానల్ గురించి రాయడం సొంత డబ్బా అవుతుందన్న అభిప్రాయంతో మనసును కట్టడి చేసుకుని ముగిస్తున్నాను. ఛానల్ లో డైనమిజమ్ పెరగాలనీ, మిగిలిన ఛానల్స్ కూడా విలువలకు ప్రాధాన్యమివ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ నిర్వహించిన దశ-దిశ అనే కార్యక్రమం సంచలనం సృష్టించింది. డిసెంబరు 21, 2009 నాడు (
నేను ఐ.ఎస్. జే.లో చేరకముందు) ఒక పక్కన దశ-దిశ కార్యక్రమం జరుగుతుండగానే నేను రాసిన పోస్టు "దశ-దిశ కోసం hm-tv యత్నం..భేష్!" మరోసారి చదవండి.

Saturday, February 11, 2012

టీచర్ల కోసం NCTE వారి "Code of Professional Ethics"

నా స్కూలు జీవితాన్ని ఛిద్రం చేశారని నేను భావిస్తున్న ఇద్దరు నీచ్ కమీనే బేవార్స్ టీచర్లను కేంద్రంగా చేసుకుని నిన్న నేను రాసిన టపాకు మిశ్రమ స్పందన లభించింది. ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్టులు ఫోన్ చేసి తామూ టీచర్ల బాధితులమేనని చెప్పారు. కొందరు మిత్రులు మాత్రం...విషయాన్ని గురించి కాకుండా....నాకు సంబంధించిన శారీరక, మానసిక, సైద్ధాంతిక విశ్లేషణలు చేసి, కొన్ని బ్లాంకెట్ స్టేట్ మెంట్లతో కామెంట్లు పంపారు. మర్యాదస్థులు అనుకున్నవారికి ఇక్కడే సమాధానమిచ్చాను. మరి కొందరికి జవాబివ్వడం కూడా వేస్టని ఆ కామెంట్లే పెట్టలేదు. ఇక్కడ మీకో మనవి.

అయ్యలారా...అమ్మలారా....గుండెలో గూడుకట్టుకున్న వేదనను వెళ్లగక్కే క్రమంలో పదాల, వాక్యాల రూపు సంతరించుకుంటున్న భావ పరంపరను మర్యాద అనే ఫిల్టర్లో వడపోసి సర్వ్ చేయడం.... ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ కు మంచి వేదికని నేను భావిస్తున్న నా ఈ బ్లాగ్ లో కుదరదని మీ అందరికీ మనవి.  అంత సాఫ్టుగా రాసుకోవాలనుకుంటే నిన్నటి పోస్టుకు నగిషీలు దిద్ది ఏ తెలుగు పత్రికైనా వేసుకునేలా రాసేవాడిని. రాచిరంపాన పెడుతున్న అత్తగారిని కోస్తా కోడలు తిట్టదలిచినా...."అత్తగారూ...మీరు దొంగ ముండ గారండీ..." అంటుందట. బ్లాగులో అది మన వల్ల కాదు. క్షమించాలి.

అంతగా బాధపడుతున్న మర్యాదస్థుల కోసం, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా పెట్టుకుని నా ఉద్వేగాల గురించి బాధ పడుతున్న వారి కోసం ఈ కింది సమాచారం. 
తల్లి, తండ్రి తర్వాత భారతీయ సమాజం గురువుకు అంత ప్రాధాన్యమిచ్చింది. గురువంటే దేవుడు. అందుకే గురు దేవో భవ అన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు ఒకటి రెండు మాటలన్నా, చేయి చేసుకున్నా, గోడకుర్చీ, కోదండం వేయించినా పెద్దగా స్పందించడం మంచిది కాదు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు స్కూల్ టీచర్ల కోసం "Code of Professional Ethics" ను అమలు చేయాలని భావిస్తున్నారు. వారి ముసాయిదా పత్రంలో టీచర్ల ప్రవర్తనకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
Preamble
--Recognizing that every child has a fundamental right to education of good quality

--Recognizing that every child has an inherent potential and talent
--Recognizing that education should be directed to the all-round development of the human personality
--Recognizing the need for developing faith in the guiding principles of purity, viz., democracy, social justice and secularism

--Recognizing the need to promote through education the concept of composite culture of India and a sense of national identity
--Recognizing that teachers, being an integral part of the social milieu, share the needs and aspirations of the people
--Recognizing the need to enhance self-esteem of teachers

Obligation towards student

--Treats all students with love and affection
--Respects the value of being just and impartial to all students irrespective of their caste, creed, religion, sex, economic status, disability, language and place of birth
--Facilitates students' physical, social, intellectual, emotional, and moral development
--Respects basic human dignity of the child in all aspects of school life

--Makes planned and systematic efforts to facilitate the child to actualize his/her potential and talent
--Transacts the curriculum in conformity with the values enshrined in the Constitution of India
--Adapts his/her teaching to the individual needs of the students

--Refrains from subjecting any child to fear, trauma, anxiety, physical punishment, sexual abuse, and mental and emotional harassment
--Keeps a dignified demeanour commensurate with the expectations from a teacher as a role model
---------------
Note: మిత్రులారా...నేను ఒక రెండు రోజులు తిరుపతి టూరుకు వెళుతున్నాను. మంగళవారం నాడు కలుద్దాం. అంతవరకూ సెలవ్. నమస్కారం.

Friday, February 10, 2012

కిరాతకపు టీచర్లారా...మా పూవులను చిదిమేస్తారా?

చిన్నప్పుడు స్కూల్లో ఇంగ్లిషు, లెక్కల టీచర్ల వల్ల నేను ఎంత నరకం అనుభవించానో, జీవితంలో ఎంత కోల్పోయానో....నిన్న చెన్నై లో స్కూలు క్లాసు గదిలో ఒక స్టూడెంట్ చేతిలో హత్యకు గురైన టీచర్ ఉదంతం గురించి పేపర్లో చదువుతుంటే గుర్తుకువచ్చాయి. పిల్లల జీవితంలో టీచర్లు, సార్ల కున్న ప్రాధాన్యాన్ని సమాజం, జనం సరిగా గుర్తించలేదని, ఇది మున్ముందు మరిన్ని ప్రమాదాలు తేబోతున్నదని నాకు గట్టిగా అనిపిస్తున్నది.

నేను ఖమ్మం జిల్లా రెబ్బవరం గ్రామంలో ఏడో తరగతి దాకా, తర్వాత వైరాలో పది దాకా చదివాను. మా ఇంగ్లిషు సారు పేరు పాండురంగారావు గారు. రెబ్బవరం పక్కనే ఉన్న మా అమ్మమ్మ గారి ఊరు గొల్లపూడి నుంచి వచ్చి ఆయన పాఠాలు చెప్పేవారు. తమ గ్రామంలో పోలీస్ పటేల్ గా పనిచేసి చనిపోయిన మా తాతయ్య గారంటే ఆయనకు ఎందుకో గౌరవం, కోపం ఉండేవి. నాకు తెలిసి మా తాతకు మంచి పేరుంది. జనాలు పోలీసుల జులుంకు గురికాకుండా, పేదల పట్ల సానుభూతితో ఉండేవారు. రజాకార్లు దాడికి వస్తున్నారని తెలిసి పొరుగున ఉన్న కృష్ణా జిల్లాకు వెళ్లి తలదాచుకున్నారు.


నాకు చిన్నప్పుడు రెబ్బవరంలో ట్యూషన్ చెప్పిన కుసుమ మేడమ్ వల్ల ఇంగ్లిషు పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఈ పాండురంగారావు చేతిలో పడిన తర్వాత నా బతుకు బస్టాండయింది. దరిద్రుడు రోజూ క్లాసులో తిట్టే వాడు. మా తాత ప్రస్తావన తెచ్చేవాడు. వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే చెయ్యిని దొప్ప లాగా ముడిచి ఒంగబెట్టి వీపు మీద  కొట్టేవాడు....చాలా కసిగా. అందుకే వాడికి "దొప్పడ రంగారావు" అని పిల్లలు ముద్దుపేరు పెట్టారు. శ్రద్ధగా పాఠం విననిచ్చేవాడు కాదు, మధ్యలో దేని గురించి అడిగి కొడతాడో అని వణికి చచ్చేవాడిని. పైగా ఒక క్రీడాకారుడిగా, మంచి స్పీకర్ గా, నటుడిగా ఒక గుర్తింపు ఉన్న నాకు దప్పడ రంగారావు ధోరణి అస్సలు మింగుడుపడేది కాదు. అందుకే సాధ్యమైనంత మేర వాడి క్లాసు ఎగ్గొట్టే వాడిని. దాంతో ఇంగ్లిషు చంకనాకి పోయింది, నేను బేవార్సుగా మిగిలాను కొత్తగూడెంలో ఒక మిత్రుడు దొరికేవరకూ.

చెన్నైలో పిల్లవాడు టీచర్ మీద చేసిన అఘాయిత్యం దప్పడ రంగారావు మీద చేయాలని నేను చాలా సార్లు అనుకున్నాను. వాడి వల్ల నా జీవితం దెబ్బతింటున్నదని నాకు అపుడే తెలుసు. చాలా సార్లు ఫిర్యాదు చేసినా ఇంట్లో వాళ్లు  పెద్దగా పట్టించుకోలేదు. అందుకే, వాడు స్కూటర్ మీద వైరా నుంచి గొల్లపూడి వెళుతున్నపుడు మధ్యలో రోడ్డుకు అటూ ఇటూ ఉన్న రెండు చెట్లకు కనిపించని ఒక వైరొకటి అడ్డంగా కట్టి దానికి తట్టుకుని వాడుపడిపోగానే తల మీద పెద్ద బండరాయి వేసి చంపి...మర్నాడు ఏమీ తెలియని వాడిలా స్కూలుకు వెళ్లాలని నాకు చాలా సార్లు అనిపించింది. అప్పట్లో వచ్చిన ఏదో సినిమాలో ఒక హత్య అలాగే జరిగింది మరి. అదీ మరీ బాగోలేదు కాబట్టి, వాడి బండి టైరుకు దబ్బనంతో పంక్చర్ చేసి వాడిని ఇబ్బంది పెట్టాలని అనిపించేది కానీ దొరికితే పరువుపోతుందని, శిక్ష పడుతుందని ఆగిపోయాను. ఒక టీచర్ నా జీవితాన్ని మార్చేశాడు. నేను ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది.

ఇంకొక నికృష్టపు సారు రెబ్బవరం ప్రభుత్వ పాఠశాలలో లెక్కల సారు సోమనర్సయ్య గారు. వాడికి కోపం వస్తే జస్టర్ ముండా కొడకా అని తిట్టే వాడు. నేను పశువుల డాక్టర్ గారి అబ్బాయిని కాబట్టి, క్లాసు ఫస్టు కాబట్టి నాకు పెద్దగా తిట్లు గట్రా ఉండేవి కావు. కానీ ఆ సారు దగ్గరు ఒక తుపాకీ ఉండేది. సాయంత్రం కాగానే ఒకరిద్దరు స్టూడెంట్స్ ను తీసుకుని బైటికి వెళ్లే వాడు. ఆయన పిట్టలను గురిచూసి కాల్చితే...చచ్చి కిందపడిన పిట్టలను ఏరుకు రావడం ఆ పిల్లల పని. నన్ను ఒక రోజు తీసుకువెళ్లిన గుర్తు. ఆ రోజంతా నేను నిద్రపోలేకపోయాను. సారు వారి ఈ మారణకాండను ఆపే వారెవరూ లేరా అని చాలా బాధపడేవాడిని. ఎందుకో మా నాన్నకు తెలిసినా దాన్ని పట్టించుకోలేదు. 


ఇదిలా ఉండగా, మా రెబ్బవరం గ్రామానికి రేషన్ షాపు మా అమ్మమ్మ గారి ఊరైన గొల్లపూడిలో ఉండేది. రేషన్ కార్డు మీద పంచదార తెచ్చేపని (ఆరో తరగతిలో అనుకుంటా) నాకు అప్పగించాడాయన. రేషన్ కార్డు, డబ్బు చెల్లింపు బాధ్యత నాది. మోసే బాధ్యత చాకలి వెంకటేశ్వర్లు ది (పాపం...వాళ్లు బట్టలు ఉతుకుతారు కాబట్టి ఆ పేరుతోనే వాడిని పిలిచేవారు).
కాల్వగట్టు మీద పొలాల మధ్య గుండా ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచివెళ్లి చక్కెర తెచ్చే బాధ్యత మా ఇద్దరిదీ. దరిద్రుడు...స్కూలు టైమ్ లోనే ఆ పనికి పంపాడు. అంతా బాగానే అయింది కానీ ఇంకాసేపటికి సార్ ఇంటికి వస్తామనగా మా వెంకటేశ్వర్లు నెత్తిమీద ఉన్న చక్కెర సంచీ జారి కిందపడింది. అపుడు వెంకటేశ్వర్లు పడిన కంగారు, వాడి మొహంలో వెర్రిభయం నాకు ఇప్పటికీ గుర్తు. "భయపడకు...ఇది నీ ఒక్కడి తప్పు కింద కాకుండా ఇద్దరం కలిసి చేసిన తప్పుగా చెబుదామ"ని ఒకసారి అసలు "ఇది కింద పడ్డట్టే చెప్పకుండా ఉంటే పోలా" అని మరొకసారి అనుకున్నాం. ప్లాన్ బీ అమలు చేయడంలో భాగంగా కింద పడిన చక్కెరను జాగ్రత్తగా సంచీలోకి ఎత్తాం. దాన్ని సార్ ఇంటికి చేర్చి స్కూలుకు పోయాం. 


అప్పుడు సారు మా క్లాసులో ఉన్నారు. చక్కెర తెచ్చామన్న విషయం చెప్పగానే..."వెరీ గుడ్...చూడండ్రా వీళ్లు చెప్పిన పని జాగ్రత్తగా చేసుకొచ్చారు...డాక్టర్ గారి అబ్బాయి చాకు..." అని సారు కితాబు ఇవ్వగా నేనూ వెంకటేశ్వర్లు ఒకరి మొహం ఒకరం బెరుకు బెరుగ్గా చూసుకున్నదీ నాకు ఇప్పటికీ గుర్తే.
సరే...క్లాసు అయింది. సార్ ఇంటికి వెళ్లాడు. చక్కెర రంగు తేడా ఉండటంతో విషయం కనిపెట్టాడు. మర్నాడు...క్లాసుకు రాగానే..."ఏర్రా...ఆ జెస్టర్ ముండాకొడుకుల"ని మా గురించి వాకబు చేశాడు. సార్ కనుక్కోలేదని గట్టిగా నమ్మి క్లాసుకు వచ్చిన మేము అణుబాంబు మీద పడినట్టు ఉలిక్కిపడి...లేచి తప్పు ఒప్పుకున్నాం. ఒప్పందం ప్రకారం...తప్పు ఇద్దరిదీ అని చెప్పాం. ఇక ఆ రోజు నుంచి క్లాసులో నరకం ప్రారంభమయింది. రోజూ...జెస్టర్ ముండాకొడుకులంటూ తిట్టి పాఠం మొదలు పెట్టేవాడు కఠినాత్ముడు. ఈ అవమానం భరించలేక నేనూ వెంకటేశ్వర్లు...లెక్కల క్లాసు ఎగ్గొట్టి ఊరికి దగ్గర్లో రోడ్డుపక్క చెట్ల మీద గిన్నెకాయలు రాళ్లతో కొట్టి తినేవాళ్లం. అలా లెక్కలూ మఠాష్. నేను పదో తరగతి లెక్కల సబ్జెక్టులో ఎలా పాసయ్యానో చెబితే మీరు ఆశ్యర్యపోతారు.
 డాక్టర్ కావాలని మా అమ్మ కన్న కలలు, అయితీరతానని చిన్నపుడు నేనిచ్చిన మాట...ఈ దరిద్రుల వల్ల సఫలం కాలేదని నా నమ్మకం. లెక్కల్లో వీక్ అయి పోవడంతో మిగిలిన సబ్జెక్టులూ గుండె ధైర్యంతో చేయలేక...ఎంసెట్ లో కొన్ని వేల ర్యాంకులు వచ్చి సీటు రాకుండా పోయింది.
ఈ విధంగా స్కూలు టీచర్ల ప్రభావంతో ఎంతో కోల్పోయిన నేను కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను.


1) నా కూతురు, కొడుకుతో టీచర్ల గురించి వాకబు చేస్తాను. ఎవరైనా హర్ట్ చేస్తుంటే వెంటనే స్పందిస్తాను. నల్గొండలో ఒక తెలుగు సారు మా అమ్మాయిని కొడితే చెయ్యి వాచింది. నేను స్కూలుకు వెళ్లి వాడికిచ్చిన డోసు వాడికి జీవితంలో గుర్తుంటుంది. వాడి చెంప పగలగొట్టబోయి తమాయించుకుని ఆగాను...మనసు గట్టిగా చెప్పడంతో. ఇంకెవర్నీ కొట్టవద్దని వాడిని ప్రాధేయపడుతూ...ఒక గంట పాటు నేను ఏడిస్తే ప్రిన్సిపాల్ కంగారుపడ్డాడు. అలాగే ఆటల కారణంగా ఫిదెల్ అప్పుడప్పుడూ మాత్రమే స్కూలుకు వెళ్లాడా మధ్యన. ఒక టీచర్ "నువ్వేమైనా వీ.ఐ.పీ.వా..." అని అడిగి కించపరచడం మొదలు పెట్టింది. ఆమెనూ జాగ్రత్తగా సెట్ చేశాను. మొన్నటికి మొన్న నా స్నేహితుడి కొడుకును లెక్కల టీచర్ కొడితే...గౌతమ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి..పేపర్ వాళ్లు మీ టీచర్ కిరాతకత్వం గురించి అడుగుతున్నారని అబద్ధంతో బెదిరించాను
2) దాదాపు ట్రబుల్ సమ్ టీచర్లందరినీ కలిసి...నాకు మార్కులు వద్దనీ, మా పిల్లలకు జీవితపు విలవలు నేర్పండనీ, సృజనాత్మకతను చంపవద్దని చాలా పకడ్బందీగా చెప్పివస్తాను. మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే...అటు టీచర్ హర్ట్ కాకుండా, ఇటు మన వార్డ్ బలికాకుండా ఉండాలి. చాలా కసరత్తు అవసరం.

3) గురుదేవో భవ..., దండం దశగుణం భవేత్..అనే సొల్లు సామెతలు నమ్మకండి. ఇవి కలికాలానికి అతకని మాటలు. ఎవరైనా సార్ లేదా టీచర్ పిల్లల మీద చేయి చేసుకుంటే వెంటనే స్పందించండి. కంప్లయింట్ చేయడం వల్ల మిగిలిన టీచర్లు గ్యాంగప్ అవుతారు కాబట్టి స్వయంగా వెళ్లి నేరుగా ఆ కిరాతకులతోనే మాట్టాడటం ఉత్తమం
4)  హత్యలు, ఆత్మ హత్యలు వాటిలో రకాల గురించి మన టీవీలూ ఛానళ్లు పదేళ్ల వయస్సు దాటిని ప్రతొక్కరికీ నేర్పాయి. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి...పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాలి. పిల్లలు బాగా డిస్ట్రబ్డ్ గా అనిపిస్తే...ఆ రోజు స్కూలు మాన్పించటం ఉత్తమం. పిల్లలు హాయిగా ఇంట్లో ఉండి నిద్రపోతే ఎంతో రిఫ్రష్ అవుతారు. మనతో మనసు విప్పి మాట్టాడతారు.


5) స్కూలుకు పోతేనే చదువు వస్తుందని అనుకోవడం మన మూర్ఖత్వం. తల్లో తండ్రో జాగ్రత్తగా పాఠాలు చెప్పినా చాలు. లేదా కథలు చెప్పినా పర్వాలేదు. 

6) బందులు జరగాలి మళ్లీ మళ్లీ...అని పిల్లలు అనుకుంటున్నారంటే వారి మీద ఏదో ఒత్తిడి పనిచేస్తున్నదనే అర్ధం. ఒక ఫ్రెండ్ లా వారితో మాట్టాడితే...వాళ్లు ఎన్నో చక్కని విషయాలు చెబుతారు. చదువు ప్రాధాన్యం చెబుతూనే వారు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం ఇవ్వాళ ప్రతి పేరెంట్ విధి.
 7) టీచర్లారా...మీ  వ్యక్తిగత జీవితంలో కంగాళీతనంతో వచ్చిన నిస్పృహను పిల్లల మీద తీర్చుకోవాలని అనుకోకండి. A tap on their back works wonders. 


ఇప్పటికే ఓవరయింది. ఉంటాను. చెన్నైలో టీచర్ ను కిరాతకంగా చంపిన పిల్లవాడిని కలిసి కాసేపు మాట్టాడాలని నా మనస్సు కోరుకుంటోంది. బిడ్డడు...ఎంత నిస్పృహతో ఆ పనిచేశాడో కదా! 

Tuesday, February 7, 2012

చార్లెస్ డికెన్స్ 200 వ జయంతి-ఒక రెండు పేరాలు

ఇవ్వాళ సమయం చిక్కక మిగిలిన పేపర్లు, ఛానళ్లు చూడలేదు కానీ అటు "ది హన్స్ ఇండియా" ఆంగ్ల పత్రికా, ఇటు "హెచ్ఎం టీవీ" రెండూ అద్భుత రచయిత చార్లెస్ డికెన్స్ రెండు వందలో జయంతి సందర్భంగా చక్కగా స్పందించాయి. హైదరాబాద్ హన్స్ లో Outliving the Information Age అనే శీర్షికతో ఒక మంచి వ్యాసాన్ని రాశారు. చానల్ లోనూ మంచి కాపీతో కూడిన ప్రోగ్రాం ను ప్రసారం చేశారు. ఇది నాకు బాగా నచ్చింది. వసివాడిన బాల్యం, మానవీయ విలువలు, దోపిడీ వ్యతరేక గళం డికెన్స్ సొంతం. 
 
ఫ్రెంచి విప్లవం నేపథ్యంలో...పారిస్, లండన్ ల మధ్య సాగిన "ద టేల్ ఆఫ్ టూ సిటీస్" అనే నవల ఇంట్రో నాకు చాలా చాలా ఇష్టం. మన మాటలతో, వాక్యాలతో పాఠకుల మనోఫలకాలపై దృశ్యకావ్యాలను ఎలా నిర్మించాలన్న దానికి నేను ఈ నవలలో మొదటి రెండు పేరాలను ఉదాహరణగా చెబుతుంటాను...నా జర్నలిజం విద్యార్థులకు. డికెన్స్ జయంతి సందర్భంగా ఆ రెండు పేరాలూ మీరూ చదివి ఆనందించండి. రెండు వైరుధ్యాలను ఎంత చక్కగా వర్ణించాడో...

It was the best of times, it was the worst of times, it was the age of wisdom, it was the age of foolishness, it was the epoch of belief, it was the epoch of incredulity, it was the season of Light, it was the season of Darkness, it was the spring of hope, it was the winter of despair, we had everything before us, we had nothing before us, we were all going direct to Heaven, we were all going direct the other way--in short, the period was so far like the present period, that some of its noisiest authorities insisted on its being received, for good or for evil, in the superlative degree of comparison only.

There were a king with a large jaw and a queen with a plain face, on the throne of England; there were a king with a large jaw and a queen with a fair face, on the throne of France. In both countries it was clearer than crystal to the lords of the State preserves of loaves and fishes, that things in general were settled for ever.

Courtesy: http://www.online-literature.com/
(Note: Please visit this wonderful site for English literature)