Sunday, July 3, 2016

పాతికేళ్ల తర్వాత కొత్తగూడెం డిగ్రీ మిత్రుల కలయిక

జీవితంలో పావు శతాబ్దం (పాతికేళ్ళు) చిన్న లెక్క కాదు; పెద్ద విషయం. కాలేజీలో ఉన్నప్పటి అప్పటి గుర్తులు ఎప్పటికీ చాలా వరకు తీపిగానే ఉంటాయి. ఒంటి నిండా శక్తి, ఎదగాలన్న తపన, కష్టపడాలన్న స్పృహ, బుర్ర నిండా ఏవేవో ఆలోచనలు... ఉన్న రోజులల్లో  మనం చూసిన వాళ్ళను పాతికేళ్ల తర్వాత ... జీవితంలో స్థిరపడి యమ వేగంతో సంసార సాగరాన్ని ఈదుతున్న సమయంలో చూడడం, విశేషాలు పంచుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి.



25 సంవత్సరాల కిందట (1989-92) ఖమ్మం జిల్లా కొత్తగూడెం లోని రామవరం లో ఉన్న శ్రీ రామచంద్రా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో బీ ఎస్సీ (బీ జడ్ సి) చదువుకున్న ఒక ఐదుగురం మిత్రులం ఈ రోజు హైదరాబాద్ లో కలిసాం. ఎన్నో రీ యూనియన్ల గురించి రాసిన నా మనసు... వారిని కలిసే కొన్ని నిమిషాల ముందు ఒక తీయని అనుభూతికి గురయ్యింది. కలయికకు ఒక అర్థ గంట ముందు నేను డిగ్రీ కాలేజ్ స్మృతులను అప్రయత్నంగా నెమరేసుకున్నాను. వారిని కలిసిన గంటా గంటన్నర పాటు ప్రపంచాన్ని అందరం దాదాపు మరిచి పోయాం. అప్పటి చదువులు, మిత్రులు, టీచర్ల విషయాలు గుర్తు తెచ్చుకుంటూ.. ప్రస్తుత వృత్తి, జీవిత విశేషాలు పంచుకుంటూ గడిపాము. 'ఒకరిది అతివృష్టి, మరొకరిది అనావృష్టి' అని గడ్డం బాగా పెంచిన రఫీ ని, తల మీద వెంట్రుకలు పోయిన నన్ను ఉద్దేశించి రాము అనే మిత్రుడు చేసిన వ్యాఖ్య కు మేమంతా నవ్వుకున్నాం. డిగ్రీ లో సమృద్ధిగా ఉన్న జుట్టు పోతే మరి అట్లా అనరా?

ఆ బ్యాచ్ లో ఉండగానే మనసులు కలిసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భూషణం, అమీనా లను కలవడం చాలా ఆనందం గా అనిపించింది. "మాకు మతం పట్టింపులు లేవు. మా ఇంట్లో అన్ని పండగలు చేసుకుంటాం," అని భూషణం ఏ మాత్రం గర్వం లేకుండా చెప్పారు. భూషణం బాగా కష్టపడి చదివే తత్వం ఉన్న వ్య్తకి. మతానికి అతీతంగా జీవితాలు పంచుకుంటూ ముగ్గురు బిడ్డలకు మంచి చదువులు అందిస్తున్న వారిద్దరూ  ఆదర్శప్రాయులు.

రసాయన శాస్త్రం లో పీ హెచ్ డీ చేయడమే కాకుండా, కెనడా లో పోస్ట్ డాక్టోరల్ డిగ్రీ చేసి ప్రస్తుతం ఒక ఇంజినీరింగ్ కాలేజీ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీధరాల రాము, జైళ్ల విభాగంలో ఉద్యోగం చేస్తున్న మహమ్మద్ రఫీ కూడా నా లాగానే  స్నేహామృతం లో తన్మయత్వం పొందారు. రఫీ ని నేను కలుస్తూనే ఉంటాను గానే అందరం కావడం ఇదే ప్రథమం.
ఈ రీ యూనియన్ ఆధారంగా మిగిలిన అందరు మిత్రుల సమాచారం సేకరించి.... త్వరలో అందరం తప్పక కలవాలని అనుకుంటున్నాం. మంచి స్నేహశీలురైన మిత్రులున్న మా బ్యాచ్ అది చేసి చూపిస్తారనడంలో నాకు సందేహం లేదు.
సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని వాట్సాప్ లో ఒక గ్రూపు ఏర్పాటు చేశారు మావాళ్లు. మా కలయికను వెంటనే మనోళ్లు పోస్ట్ చేశారు. మిగిలిన మిత్రులు అది చూసి ఆనందించారు. వాట్సాప్ లో, ఫోన్లలో అంతా చిన్న పిల్లల మాదిరిగా తమ పాతికేళ్ల ప్రయాణంలో అనుభవాలు, అనుభూతులు పంచుకోవడం గమ్మత్తు గా ఉంది.
ఏది ఏమైనా ... మిత్రత్వంలో ఉన్న ఆనందమే వేరప్పా!
అది తెలిసే కదప్పా..స్నేహితురాలిని పెళ్ళాడి అమ్మాయికి 'మైత్రేయి' అని అబ్బాయికి 'స్నేహిత్' అని పేరుపెట్టాం!!


Tuesday, June 28, 2016

'ది హిందూ' కార్టూనిస్టు సురేంద్ర గారి ఇంటర్వ్యూ

1996 నుంచి ఇప్పటి దాకా అంటే రెండు దశాబ్దాలుగా 'ది హిందూ' ఆంగ్ల దినపత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్న సురేంద్ర గారు చాలా మంచి మనిషి. స్వయం కృషి, పట్టుదలలతో ప్రతిభతో వృత్తిలో పైకి వచ్చారు.

ఒక వెబ్ సైట్ వారి కోసం నేను సురేంద్ర గారిని ఇంటర్వ్యూ చేశాను. దాన్ని వారు ప్రచురించారు.
ఆంగ్లంలో ఉన్న ఆ ఇంటర్వ్యూ ను మీరు కూడా చదవండి.
Interview with The Hindu’s Surendra : A self-made and gifted cartoonist

Monday, June 13, 2016

సాక్షి టీవీ చానెల్ లో కొమ్మినేని గారి లైవ్ షో

వృత్తి రీత్యా పని ఒత్తిళ్ళ వల్ల మీమీ మధ్యన తరచూ పోస్టులు పెట్టలేక పోతున్నాం. అదీ కాక-ఉన్నది ఉన్నట్టు రాస్తే ప్రతివాడికీ కోపం, కక్షా. అయితే, ఉదయం కాస్త కాఫీ తాగుతూ ఎన్ టీవీ లో మేము చూసి ఎంజాయ్ చేసే/ నవ్వుకునే 'కే ఎస్ ఆర్ లైవ్ షో'  రావడం లేదేమిటి? కొమ్మినేని శ్రీనివాస రావు గారికి ఏమయ్యింది? అని పలువురు మాకు రాసారు. ఆయనకు సంబంధించిన సమాచారం ఇవ్వడం కోసం ఈ పోస్టు. 

'ఈనాడు' లో 1978 లో జర్నలిజం ఓనమాలు నేర్చుకుని.... రామోజీ రావు గారి దీవెనలతో తెలుగు దేశం పార్టీ ఉన్నతి కోసం ఎన్నో వార్తలు రాసి,  తర్వాత 2006 లో టీవీ జర్నలిజం లోకి అడుగుపెట్టి ఆనతికాలం లోనే వినుతి కెక్కిన కొమ్మినేని గారు 2009 నుంచి నరేంద్రనాథ్ చౌదరి గారి ఎన్-టీవీ లో చేరారు-చీఫ్ ఎడిటర్ గా. అక్కడ పొద్దున్నే ఆయన చేసే లైవ్ షో  కు మంచి ప్రజాదరణ వచ్చింది. ఈ క్రమంలో ఎక్కడ బెడిసిందో కానీ తెలుగు దేశం వాళ్ళతో ఆయనకు పడలేదు. జగన్ కు అనుకూలంగా ఆయనవ్యవహరించారని ఒక ప్రచారం. అసలే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లోకేష్ బాబు లు  దీన్ని సహించలేక నరేంద్రనాథ్ తో చెప్పి చానల్ ప్రసారాలు బంద్ చేస్తామని బెదిరించి కొమ్మినేని గారి లైవ్ షో మూసేయించారు. పరిస్థితి సద్దుమణగక పోతుందా అని ఆయన కాలక్షేపానికి కెనడా కూడా వెళ్లివచ్చారు. అయినా బాబు గార్లు పట్టు వీడలేదు. 

ఇక లాభం లేదని కొమ్మినేని గారు సాక్షి ఛానెల్ లో చేరారు... తన వార్తల సైట్  మొట్ట మొదటి సారిగా ఆయన సాక్షి ఛానెల్ లో ఈ ఉదయం ఏడున్నర కు 'కె ఎస్ ఆర్ లైవ్ షో' లో పాల్గొన్నారు. ఆయన తనదైన తరహాలో చర్చను రక్తి కట్టించారు. మంచి జర్నలిస్టుగా పేరున్న ఆయన తనను ఏడిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ను, తనపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతిపక్ష నాయకుడు జగన్ ను ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి. 

కొమ్మినాని గారి లైవ్ షో ఫోటోలు (టీవీ నుంచి సెల్ ఫోన్ లో సంగ్రహించినవి) ఇక్కడ పోస్టు చేసాము.   

కొమ్మినేని గారి గురించి....
ఈనాడు 1978 - 2002
ఆంధ్రజ్యోతి 2002 -2006
ఎన్‌టివి..2007 -2007 సెప్టెంబరు
టివి 5..2007 సెప్టెంబరు - 2009ఆగస్టు
ఎన్‌టివి..2009 ఆగస్టు -2016 ఏప్రిల్

రాసిన గ్రంథాలు... 
రాష్ట్రంలో రాజకీయం ఆంధ్ర టు అమెరికా
తెలుగు తీర్పు.. 1999,తెలుగు తీర్పు..2004
తెలుగు ప్రజాతీర్పు 2009 (2010 ఉప ఎన్నికలతో సహా)
తాజాకలం (రాజకీయ వ్యాసాలసంపుటి)
శాసన సభ చర్చల సరళి..1956 - 1960.
శాసన సభ చర్చల సరళి..1960 - 1971.

Thursday, April 21, 2016

టీవీ-5 ఛానల్ ఎడిటర్ గా దినేష్ ఆకుల

సీనియర్ జర్నలిస్టు దినేష్ ఆకుల గారు.. ఇప్పుడు టీవీ-5 ఛానల్ ఎడిటర్ గా చేరారు. ఇప్పటి వరకూ ఎక్స్ ప్రెస్ టీవీ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కం ఛానెల్ హెడ్ గా ఆయన ఉన్నారు. 
ఈ మధ్యన మరణించిన అరుణ్ సాగర్ గారి స్థానాన్ని దినేష్ గారు భర్తీ చేసినట్లు చెబుతున్నారు.  ఎక్స్ ప్రెస్ టీవీ లో జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి దాపురించిన నేపథ్యంలో.. దినేష్ గారి కి వచ్చిన మంచి అవకాశం ఇదని అనుకోవచ్చు.  
దినేష్ గారు ఎక్స్ ప్రెస్ టీవీ లో చేరినప్పుడు మేము రాసిన పోస్టు కూడా మీరు ఇక్కడ చదవవచ్చు. 

ఇదిలా వుండగా ఎక్స్ ప్రెస్ టీవీ నుంచి ఒక పాతిక మంది జర్నలిస్టులతో కలిసి ఉన్నపళంగా వెళ్ళిపోయి మీడియా 24 అనే ఛానెల్ పెట్టడంలో కీలక పాత్ర వహించిన నేమాని భాస్కర్ గారు మళ్ళీ ఎన్-టీవీ లో చేరిపోయారు.  మీడియా 24 పరిస్థితి ఏమిటా? అని అనుకుంటున్న సమయంలోనే... తనను వీడి వెళ్ళిన వాళ్ళను మళ్ళీ తీసుకునే మంచి అలవాటు ఉన్న నరేంద్ర చౌదరి గారి తో మాట్లాడుకుని సొంత గూటికి చేరిపోయారు.. నేమాని. తనను నమ్ముకున్న జర్నలిస్టులు చాలా మందికి అందులో ఉద్యోగాలు వచ్చాయి.. ఒక మహిళా జర్నలిస్టు తప్ప. 
ఒకప్పుడు నరేంద్ర చౌదరి గారు అభిమానించిన ఆ జర్నలిస్టు విషయంలో ఎందుకు ఇప్పుడు ఇంత నికచ్చిగా ఉన్నారో అర్థం కావడం లేదు. 
నేమాని గారు ఎక్స్ ప్రెస్ ఛానెల్ వీడినపుడు మేము రాసిన పోస్టు ఇక్కడ చదవవచ్చు. 

Thursday, March 24, 2016

'ది హిందూ' ఎడిటర్ ముకుంద్; సాక్షికి ఎనిమిదేళ్ళు...

కుటుంబ కలహాలతో జనాలకు పిచ్చెక్కిస్తూ... జర్నలిజాన్ని పలచన చేస్తున్న 'ది హిందూ' లో మరొక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ 'బిజినెస్ లైన్' ఎడిటర్ గా ఉన్న ముకుంద్ పద్మనాభన్ ను 'ది హిందూ' ఎడిటర్ గా నియమిస్తూ కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ బోర్డు మార్చి 23 న నిర్ణయం తీసుకుంది.  అదే సమయంలో 'బిజినెస్ లైన్' బాధ్యతలు రాఘవన్ శ్రీనివాసన్ కు అప్పగించింది.  అదే పత్రికలో ఇప్పటివరకూ రాఘవన్ అసోసియేట్ ఎడిటర్ గా ఉన్నారు. 
గోల్ఫ్ ఆట పట్ల మక్కువ చూపే పద్మనాభన్ (పక్కన ఫోటో) 'ది హిందూ' లో 15 సంవత్సరాల కిందట చేరి పత్రికలో పలు మార్పులు చేర్పుల కారణంగా ఇప్పుడు ఈ ఉన్నత పదవికి ఎంపికయ్యారు.  ఫిలాసఫీ లో ఎం ఫిల్ చేసిన పద్మనాభన్ చెన్నై, డిల్లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లలో విద్యాభ్యాసం చేశారు. డిల్లీ యూనివెర్సిటీ లో లెక్చరర్ గా కొద్ది రోజులు పనిచేసి జర్నలిజంవైపు మళ్ళారు. అమృత్ బజార్ పత్రిక వారి 'సండే' లో, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో అంతకు ముందు ఆయన పనిచేసారు.  ఎన్ రామ్, మాలినీ పార్థసారథి, ఎన్ రవి లతో పాటు పదకొండు మంది ఆ కుటుంబ సభ్యులే కాక ముగ్గురు బైటి వాళ్ళతో (రాజీవ్ లోచన్, వినిత బాలి, మహాలింగం) కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ బోర్డు ఏర్పడింది. కుటుంబ కలహాల వల్ల కావచ్చు... జనవరి లో ఎడిటర్ పదవికి  మాలినీ పార్థసారథి రాజీనామా చేశాక.. నేషనల్ పేజీల ఎడిటర్ సురేశ్ నంబత్ పత్రిక ఎడిటోరియల్ వ్యవహారాలూ చూస్తూ వచ్చారు. 

ఇదిలా ఉండగా, ప్రముఖ తెలుగు దినపత్రిక  'సాక్షి' కి ఎనిమిదేళ్ళు నిండాయి. ఈ సందర్భంగా.. పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు 'మీ ఆదరణే ఊపిరిగా...' అంటూ మొదటి పేజీలో ఒక సంతకంతో కూడిన ఎడిటోరియల్ ప్రచురించారు. ఎందుకో గానీ... అది అంత రుచికరంగా లేదు. పొగరుబోతు ఆంబోతులా 'ఈనాడు' తెగ రెచ్చిపోతున్న సమయంలో పుట్టిన 'సాక్షి' జర్నలిజం లో నాణ్యతా ప్రమాణాలు పాటించిందా? లేదా? అన్న ప్రశ్నను పక్కన పెడితే... డబ్బులున్న ఈ పత్రిక మూలంగా జర్నలిస్టుల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా, అప్పటిదాకా... పెద్దగా ఆదరణకు నోచుకోని రెడ్డి జర్నలిస్టులు... పెద్ద పదవులు తద్వారా నాలుగు పైసలు సంపాదించడానికి ఇది ఎంతో దోహదపడింది. ఇది మామూలు విషయం కాదు. 'సాక్షి' మరిన్ని రోజులు... మరింత ఉత్తేజంతో ఉరకలు వేయాలని... 'ఈనాడు' దూకుడుకు కళ్ళెం వేస్తూనే జర్నలిస్టులకు మంచి మేళ్ళు చేయాలని కోరుకుందాం.  

Tuesday, February 23, 2016

మీడియా 24 ఛానల్ పరిస్థితి ఏమిటి?

గత ఏడాది జనవరి లో ఎక్స్ ప్రెస్ టీవీ కి రాజీనామా చేసిన సీనియర్ జర్నలిస్టు నేమాని భాస్కర్ గారి చొరవతో ప్రారంభమైన మీడియా 24 తెలుగు ఛానల్ పరిస్థితి అంత బాగున్నట్లు కనిపించడం లేదు. ఆయనకు మద్దతుగా... ఎక్స్ ప్రెస్ ఛానల్ కు రాజీనామా చేసిన మీడియా 24 లో చేరిన జర్నలిస్టుల పరిస్థితి దీంతో అగమ్యగోచరంగా తయారయ్యింది. 

ఇరవై ఒక్క మందితో జనవరిలో చిగురుపాటి వారి ఛానల్ ఎక్స్ ప్రెస్ ను వీడిన నేమాని కొంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకుని మార్చి కల్లా మార్కెట్ లో ప్రవేశించారు. డబ్బులు పెడుతున్నది ఎవరో తెలియకుండా...M.S.Mediahouse India Pvt Ltd  ఆధ్వర్యంలో మొదలయిన ఈ ఛానల్ కు షేక్ ఖాజా మొహియుద్దీన్ అనే సారు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు లో... కొత్త రాజధాని అమరావతి కేంద్రంగా వస్తున్నమంటూ లోగో కూడా ఆయన లాంచ్ చేసారు. నిత్యం ఆఫీసుకు వచ్చి మంచీ చెడ్డా చూసుకున్న ఈయన ఒకటి రెండు నెలల నుంచి రాకపోవడం... ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన రాలేకపోతున్నారన్న ప్రచారం జరగడం జర్నలిస్టులను బాధిస్తున్నాయి. 

ఒక నలభై మంది జర్నలిస్టులు, శిక్షణ కోసం తెసుకున్న మరొక 30 మంది ఈ పరిణామాలతో కంగు తిని కంగారు పడుతున్నారు. జీతాలు ఇస్తున్నారో ఇవ్వడంలేదో ఎవ్వరూ చెప్పలేదు. ఇవ్వకపోయినా తెలుగు నేల మీద వీళ్ళను అడిగే వాడు ఎవ్వడూ లేడు. 
ఈ లోపులో నేమాని గారు తానూ పనిచేసిన ఎన్ టీవీ కి వెళ్ళిపోయారన్న ప్రచారం కూడా జరిగింది కానీ ఆయన మీడియా 24 ఆఫీసుకు వస్తున్నారని ఆయన సహచరులు చెప్పారు. 

Friday, February 19, 2016

TV-5 యాజమాన్యానికి అభినందనలు

సరే, మనుషులమన్నాక... కింద పడి మీద పడి... చచ్చీ చెడీ బతుకు వెళ్ళబుచ్చి... చివరకు నిజంగానే చావక తప్పదు. ఇది నిత్యసత్యం. మరి... బతికినన్ని రోజులు మనం చేసేది ఏమిటండీ?

1) ఊహ వచ్చింది లగాయితూ మనుగడ కోసం పోరు
2) అజ్ఞానాన్ని జాగ్రత్తగా కప్పిపుచ్చుకుంటూ తెలివిగల వాడిలా పోజు కొడుతూ సొసైటీ లో స్టేటస్ కోసం, ఎంపిక చేసుకున్న వృత్తిలో నిలబడడం కోసం నానా డ్రామాలు
3) ఫాల్స్ ప్రిస్టేజ్ తో, అహంకారంతో తెలిసీ తెలియక వింత ప్రవర్తన-పర జన పీడన
4) ఎదుగుతున్న క్రమంలో మనకంటూ ఒక భజన బృందం ఏర్పాటు చేసుకోవడం
5) పనిలో పనిగా, మనం పోయాక... పెళ్ళాం బిడ్డల కోసమని కొంత కూడా బెట్టడం.

నోట్లో బంగారు చెంచాతో పుట్టిన ఏ కొందరో తప్ప మిగిలిన వాళ్ళంతా చేసేది ఇదే... అటూ ఇటుగా. రామోజీ అయినా సరే...రవి ప్రకాష్ అయినా సరే... చేసేది ఇదే. ఈ ఐదు అంచెల క్రమంలో... ఇతరుల గురించి పట్టించుకోకుండా...  చెలరేగిపోయి చిన్ని నా బొజ్జ... శ్రీరామ రక్ష అనుకుంటూ నానా గడ్డి కరిచి ఎడా పెడా నాలుగు రాళ్ళు వెనకేసి డాబూ దర్పంతో బతికేవాడిని  'సక్సెస్ ఫుల్' మనిషి అని, జీవిత పరమార్ధమెరిగి కేవలం విజ్ఞాన్ని సాధించడం నిజమైన ఆనందమని నమ్మి సర్వే జనా సుఖినే భవంతు... అనుకునే వాడిని 'ఒట్టి పిచ్చోడు/వెర్రి బాగులోడు' అని మనం అంటుంటాం. 

పాపం... చాలా మంది జర్నలిస్టులు ఈ లిస్టులో మొదటి మూడు, నాలుగు పనులు బాగానే చేస్తారు. ఐదో పని చేయలేరు. అది చాలా మంది వల్ల కాదు. వృత్తి విలువలు నమ్ముకునే సత్తెకాలపు మనుషులకు అది అందని ద్రాక్షే. ప్రభుత్వాలు దయ తలచి చీప్ రేట్ కు స్థలాలు ఇవ్వబట్టి సరిపోయింది గానీ లేకపోతే...అంగన్ వాడీ వర్కర్లకు, జర్నలిస్టులకు పెద్ద తేడా ఉండేది కాదు. నిజానికి చాలా తక్కువ మందికి స్థల సౌకర్యం తక్కిందనేది వేరే విషయం.

చాలా మంది జర్నలిస్టు మిత్రులు పోయాక... పట్టించుకునే నాథుడే ఉండడు. ఇప్పుడు సోషల్ మీడియా, వాట్స్ అప్ గ్రూపులు ఉండబట్టి...చావు కబురు చల్లగా అందరికీ తెలుస్తుంది... మహా వేగంగా.  'ఈనాడు' లో చేస్తూ పోయినోడి చావుకు వాడితో పనిచేస్తూ ఇప్పుడు ఇతర మీడియా హౌజ్ లలో ఉన్న ఒక పది పదిహేను మంది వస్తారు. కానీ వేరే సంస్థ... ముఖ్యంగా 'సాక్షి'లో చేస్తూ పోతే... ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా 'ఈనాడు'వాడు రాడు. అంటే.. వచ్చే అవకాశం తక్కువని! "పోతూ పోతూ (వేరే పత్రికలో చేరే ముందు) డీ ఎన్ లేదా ఎం ఎన్ ఆర్ లేదా రాహుల్  తో గొడవ పెట్టుకుని ఎండీ (కిరణ్) కు పెద్ద లెటర్ రాసి పోయాడు. అందుకే... నేను రాలేకపోయాను. అంత్యక్రియలు బాగా జరిగాయా?" అని ఈనాడు మిత్రుడు అడుగుతాడు.. ఎంతో ప్రేమతో.

మనోడు స్వర్గస్థుడు అయ్యాక...కాస్త హృదయం ఉన్న మిత్రుడు ఒకడు తెగించి చొరవ చూపి ఒక సంతాప సభ జరిపినా వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువే. ప్రాంత-కుల-గోత్ర సమీకరణాలు కలిసి, అన్ని ఇతర కాలిక్యులేషన్స్ సజావుగా ఉంటే పది ఇరవై మంది వస్తారు. అదే గొప్ప. తెలుగు జర్నలిజంలో ఆద్భుతమైన జర్నలిస్టులు ఇలా చివరకు ఘన నివాళులకు నోచుకోకుండానే పోతున్నారు. వారి అకాల మరణం తర్వాత వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నా... పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదొక విషాదం. 

సీనియర్ ఎడిటర్ కావడం వల్ల... అరుణ్ సాగర్ గారి కి ఇబ్బంది లేకుండానే జరిగిపోయింది. సన్నిహిత మిత్రుల అశ్రు నివాళితో  అంతిమ యాత్ర బాగా జరిగింది. 'మహాప్రస్థానం' దగ్గర ఆయన భౌతిక కాయం దిగగానే... "కామ్రేడ్ అరుణ్ సాగర్ అమర్ హై" తో పాటు "గోవిందా... గోవిందా..."అని కూడా ఒక సారి వినిపించిది. దీన్ని బట్టి ఆయనకు అన్ని రకాల మిత్రులు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చేమో!  తుది వీడ్కోలు దగ్గర ఈ పిచ్చి లెక్కలు చూసుకోకూడదు.

అరుణ్ సాగర్ గారి విషయంలో TV-5 యాజమాన్యం స్పందించిన తీరు ను ప్రశంసించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.  బహుశా... మొట్టమొదటి సారిగా ఒక మీడియా ఆఫీసు దగ్గ భౌతిక కాయం వుంచి అక్కడి నుంచి అంతిమ యాత్ర జరిపారు. అరుణ్ సాగర్ గారి భార్య కు నెలకు కొంత మొత్తం ఇవ్వడానికి నిర్ణయించడం, వాహన సౌకర్యం కొనసాగించడం, పాప చదువు ఖర్చులు భరించడం, టీవీ ఫైవ్ ఆఫీసులో సమావేశ మందిరానికి ఆయన పేరు పెట్టడం... అద్భుతమైన విషయాలు. ఇందుకు... ఆ సంస్థ యాజమాన్యానికి.. సీ ఆర్ నాయుడు గారికి... మా కృతజ్ఞతాపూర్వక ప్రశంసలు. ఇవన్నీ ఎంత గొప్ప పనులు!

మరి... సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేసే వీర కమ్యూనిస్టులు స్థాపించిన 10 టీవీ కోసం అహరహం కృషి చేసిన అరుణ్ సాగర్ గారికి ఆ సంస్థ ఏమి చేసింది? విలేకరులకు యాడ్స్ టార్గెట్ లు ఇస్తూ ఇతర సంస్థల కన్నా ఘోరంగా హీనంగా జర్నలిజం  మాన మర్యాదలు తీస్తున్న కామ్రేడ్స్ ను... అరుణ్ సాగర్ అంతరాత్మ అంగీకరించి ఉండదు, ఆత్మా క్షమించదు.

ఏతావాతా...టీవీ 5 నాయుడు గారి నుంచి ఇతర యాజమాన్యాలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది! అరుణ్ సాగర్ విషయంలో మాదిరిగా అందరు జర్నలిస్టుల విషయంలో వ్యవహరించడానికి కుదరదు. సాధారణ జర్నలిస్టుల అకాలమరణం సందర్భంగా అన్ని మీడియా యాజమాన్యాలు కాస్త ఉదారంగా స్పందించి మృతుల కుటుంబాలను ఆదుకుంటే బాగుండు.

Wednesday, February 17, 2016

వెంకట కృష్ణ స్థానే హెచ్.ఎమ్. టీవీ కి కొత్త ఎడిటర్ ఇన్ చీఫ్!!!

కపిల్ చిట్స్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మీడియా హౌజ్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఆ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ హోదాలో చక్రం తిప్పిన సీనియర్ జర్నలిస్టు, వాడి వేడి చర్చలతో తెలుగు అర్నబ్ గా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న వెంకట కృష్ణ అధికారాలపై కోత పడినట్లు ఆ సంస్థ వర్గాలు ధృవీకరించాయి. 

అనధికారంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీ ఈ ఓ) అన్నట్లు ఉన్న వీకే ఇప్పటి వరకూ ఎడిటోరియల్ బాధ్యతలు నిర్వహిస్తూ ... రామచంద్ర మూర్తి గారు, రాజశేఖర్ గారు వెళ్ళిపోయాక ఛానెల్ ను నిలబెట్టారు. ఈ రోజు నుంచి ఆ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి... ముందుగా ఏడాది కిందట నియమించుకున్నప్పుడు అపాయింట్మెంట్ లెటర్ లో పేర్కొన్నట్లు చర్చలకు పరిమితం కావాలని వీకే కు చెప్పినట్లు హెచ్ ఎమ్ టీవీ వర్గాలు వెల్లడించాయి. దీన్ని వీకే (ఆయన ట్విట్టర్ అకౌంట్ ఫోటో పక్కన ఉన్నది) ఎలా తీసుకుంటారో వేచి చూడాలి. 

వీకే బాధ్యతలు... జర్నలిజంలో స్ట్రాంగ్ మాన్ గా నిరూపించుకున్న ప్రొఫెసర్ కే నాగేశ్వర్ కు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. రామచంద్ర మూర్తి-విశ్వనాథన్ నాయర్ గార్ల కాంబినేషన్లో వచ్చి మార్కెట్ లో బాగా దెబ్బతిన్న 'ద హన్స్ ఇండియా' ను ఒక దారికి తేవడంలో ఎడిటర్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ సఫలీకృతులయ్యారు. ఆ భరోసా తోనే కపిల్ గ్రూప్ యాజమాన్యం ప్రొఫెసర్ నాగేశ్వర్ కు టెలివిజన్ పగ్గాలు కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

'ఈనాడు' కంట్రిబ్యూటర్ గా వరంగల్ లో జర్నలిజం ప్రయాణం ఆరంభించిన వీకే పరిశోధనాత్మక జర్నలిజం లో మంచి ప్రతిభావంతుడు. ఆయనలో స్పార్క్ గమనించిన రామోజీ రావు గారు ఈ- టీవీ లోకి తెచ్చి బాగా ప్రోత్సహించారు. కారణాంతరాల వల్ల టీవీ-5 లో చేరి దాని అభ్యున్నతిలో కీలక పాత్ర పోషించారు వీకే. ఆ ఛానెల్ లో వుండగా... ఒక రష్యన్ వెబ్ సైట్ కథనం ఆధారంగా అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో మరణించడం వెనుక రిలయెన్స్ హస్తం ఉన్నదన్న కలర్ తో లైవ్ చర్చ తో సంచలనం సృష్టించారాయన.  ఆ సందర్భంగా అరెస్టు కూడా అయ్యారు. ఆ అరెస్టుకు ఐదేళ్ళు అయిన సందర్భంగా ఈ జనవరి 8 న వీకే తన ట్విట్టర్ లో ఈ విధంగా 'గ్రేట్ అనుభవం'గా పెట్టుకున్నారు.

ఏది ఏమైనా... తెలుగు టెలివిజన్ జర్నలిజం లో తనదైన ముద్ర వేసుకుంటున్న వారిలో వీకే పేరు కచ్చితంగా ఉంటుంది. సూక్ష్మం లో మోక్షం కనిపెట్టే తెలివిడి, తెలివిగా మాట్లాడే నైపుణ్యం, ఎదుటి వాడిని ఏ ప్రశ్నైనా అడిగే ధైర్యం, విశ్లేషణ సామర్ధ్యం, అర్జెంటుగా ఎదిగిపోవాలన్న తాపనలతో పాటు నిండైన విగ్రహం వీకే ను నిలబెడుతూ వస్తున్నాయి. మిత్రుడు వీకే కు రాజశేఖర్ మాదిరిగానే మున్ముందు కూడా మంచి జరగాలని కోరుకుందాం.

Saturday, February 13, 2016

అరుణ్ సాగర్ గారికి రెండు అక్షర నివాళులు!!!

మిత్రులు అరుణ్ సాగర్ గారి మరణానంతరం ఆయన మీద వచ్చే నివాళులను ప్రచురించాలని అనుకున్నాం కానీ ఎవ్వరూ పంపలేదు. సాగర్ గారి సన్నిహిత మిత్రుడు కస్తూరి శ్రీనివాస్ గారు మా విన్నపాన్ని మన్నించి ఒకటి పంపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ రాలేదు. ఈ లోపు.. ఫేస్ బుక్ లో ఒక రెండు మంచి మాటలు కనిపించాయి. ఒకటి... సీనియర్ జర్నలిస్టు సాయ శేఖర్ గారు (శీర్షిక: వెనక్కి రా.. ఫినిక్స్) రాసారు. అదీ 'వాడి స్ఫూర్తి తో రాసిందే...'అని ఆయన చెప్పారు. రెండోది... తప్పు చేసారు బాస్... అంటూ విజయ్ సాధు గారి పేజ్ లో కనిపించింది. అవి ఇక్కడ మీ కోసం...


1) వెనక్కి రా ... ఫీనిక్స్
వింజామరలు వీయించుకుంటున్నావా
విచ్చు కత్తులూ, విస్ఫోటనాలూ, విస్ఫులింగాలూ విచలితుడవై వీక్షిస్తున్నావా
ఇక్కడ చేరలేని తీరాలు 
ఎక్కడున్నాయో వెతుక్కుంటున్నావా ???
పోలవరం నిర్వాసితుల ని-వేదనలు
కాలసర్పాల నిర్హేతుక
ని-వేదికలూ నిర్వాకాలు
నీ నిర్భీతి వ్యాఖ్యానాల
నీ నిబద్ధ నీతి వాక్యాల
నిగళాలలో ఘల్లుమంటునే ఉన్నాయ్...
అబ్భ ... ఏముంది బాస్ ... అని
నువ్వు అన్ని ఫీలింగ్స్ నీ మేళవించి
అబ్బురపడే అవ్యయాలు
నా అంతరంగంలో ఆడుతునే ఉన్నాయ్
...
ఆ బక్కోడి లవ్ స్టోరీ
వాడి గవర్మెంటాఫీసర్ మామ పిటాంబర్
డాంబికం
ఫ్యాన్ ఒంటి మీద పడి నడుం విరిగిన ఇంటిఓనర్
ఆ పీల కాయుడి మీద కక్ష కట్టిన తీరు ...
నువ్వు ఆ కథ పంపినప్పుడు
తెరలు తెరలు గా వచ్చిన నవ్వుతోనూ ...
నువ్వు లేవనే చేదునిజం తెలిసినప్పుడు
అంతులేని వేదనతో
పొరలు పొరలుగా కట్టిన కన్నీటి
చారికలతోనూ...
నీ కలం లో కదలాడిన
కవితా పరిచారికలతోనూ
నీ మనో బలం లో మెదలాడిన
యారొగెంట్ అభిసారికలతోనూ
నీ పెక్కడిల్లోస్
ఇంకా మెమరీస్ లో ఫ్రెష్ గానే ఉన్నాయ్ ...
మియర్ మేల్, మేల్ కొలుపు
మ్యూజిక్ నెవర్ డైస్ ... ఇవన్నీ ...
నేనూ నీ అంతటి కవినయ్యుంటే
ఒక యాభయ్యేళ్ళకో, డెబ్భయ్యేళ్ళకో
తెలుగు వాచకం ఉంటే ...
అందులో నా కవిత్వం అచ్చైతే...
కవి కాలాదుల్లో నన్నూ
నీ సమకాలికుడిగా రాసి
నీ వైభవాన్ని ... ఆ పక్కనే
నా ప్రాభవాన్నీ ... పిల్లలు కీర్తించే వారేమో
తెలుగు మేష్టర్లు ఆనందపడేవారేమో ...
కానీ ...
మై డియరెస్ట్ ఫ్రెండ్ !!!
నాకు నీ స్థాయి లేదు
ఏడు దశాబ్దాల తర్వాత తెలుగు కూడా
సంస్కృతమైపోతుందేమో తెలీదు
లేక... మరు జన్మ ఉంటే ...
నువ్వే ఆ తెలుగు మేస్టరవుతావేమో
ఊహించలేను...
గుండెలనిండా ప్రేమ నింపుకున్న
అనురాగ మూర్తివి ...
ఆవిరవుతున్న ఆశలకి కొత్త
ఊపిరులూదే అభిమాన స్ఫూర్తివి...
తలపై కూస్తున్న తీతువుని
ఇలలో భయపిస్తున్న హేతువుని
కలలో జడిపిస్తున్న మృత్యువుని
ప్రెస్ క్లబ్ లో తలపై ముసిరే దోమల్ని
తోలినట్టూ ... హుష్ అంటే పోతాయనుకున్నావా?
కొత్తేడాది రెండో రోజే
నువ్విచ్చిన బర్త్ డే పార్టీ లో
మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే
అని నీకు చెప్పిన గ్రీటింగ్స్
నిరర్ధకం.. అసంబద్ధం ...
అండ్ అబద్ధం
అని నాడు తెలీదు
నేడు తెలిసినా చెయ్యగలిగిందేమీ లేదు ...
అరుణ సాగర మధనం చేస్తే
ఉత్సాహం ఉరకలెత్తే కవితా
ఉచ్చైశ్రవం ...
నికృష్టుల వికృత చేష్టలు
నిర్జించే హాలాహలం...
నీ మందస్మిత వదనం లాంటి
చంద్రుడూ ... నువ్వెక్కిరించే
వైట్ ఎలిఫెంట్...
ఇలా అన్నీ పుడతాయ్ ...
నీ రాతల మధనం చేస్తే
బూడిదలోంచి పైకి లేచే ఫీనిక్స్...
గుర్రం ఎగరావచ్చని నిరూపించే
పెగాసస్
ఇంకా ... గ్రిఫిన్, యూని కార్న్ లాంటి ఇతర మిథికల్ మిరకిల్స్ అన్నీ
పుట్టుకొస్తాయ్ ...
అదేదో ఒక జీనస్ ... ఒక స్పీషీస్ నించీ
నేను లిబరేటెడ్ అని చెప్పుకున్నావ్
ఈ స్థాయికి ఎదగక పోతే
ఆస్ట్రసైజ్డ్ అనాల్సొచ్చేది అని కూడా
అన్నావ్ ...
నువ్వు జ్జానదర్శివి
అన్నా... మనస్తే ...
అని మనసుతో నమస్తే చెప్పి న
సోమవారం నాటి నీ వాట్స్ ఆప్
మన ఐహిక స్నేహానికి ఫుల్ స్టాప్
అయ్యింది ...
నా కవితలకి తొలి పాఠకుడివి
నా ఆవేశానికి ఆపోశన వి
నా ఆలోచనలకి ఆది గురువు వి
నా ఆలాపనకి ఆలంబనవి
నువ్వు వెళ్ళిపోయిన ఆ తెలియని
చోటిక్కూడా మెసేజ్ పంపే
యాప్ ఒకటి వస్తుందేమో లే ఫ్రెండ్
అప్పటి వరకూ ...
అల్విదా ...
2) తప్పు చేసారు బాస్... 
తప్పు చేసారు బాస్...సరిదిద్దుకోలేని తప్పు చేశారు
కోపంగా ఉంది బాస్... మిమ్మల్ని ఎన్నటికి క్షమించలేని కోపం ఉంది
ఎలా వెళ్లిపోతారు బాస్... అలా ఎలా వెళ్లిపోతారు..?
మిమ్మల్నే నమ్ముకున్నోళ్లందర్నీ అనాధలను చేసి...
మీరున్నారనే ధైర్యంతో కాలరేగరేసిన నన్ను నడిరోడ్డులో వదిలేసి ...
మీరొక్కరే... ఇక సెలవంటూ అలా ఎలా వెళ్లిపోతారు..???
టన్నుల కొద్ది మంచితనం ఉంటే సరిపోదు..!!
కాసింత జాలి,దయ కూడా ఉండాలి...!!!
మరణాన్ని వెంటేసుకు తిరిగే గట్స్ మీకు ఉండొచ్చు బాస్...!!!
కానీ మృత్యువు ముందు ఓడిపోయిన మిమ్మల్ని చూసే గుండెధైర్యం ఉండాలిగా..?
ఏం నడుస్తుంది బాస్....?
ప్రపంచం ఎటు పోతోంది గురు..?
అని నవ్వుతూ అడిగే వారు కదా.....!!!!
మీ చివరి చూపుకోసం ఎంతదాకా నడిచానో..
మీ కోసం ప్రపంచాన్ని ఎలా పక్కకు నెట్టేసి వచ్చానో...
ప్రశ్నించేందుకైనా... కనీసం తెలుసుకునేందుకైనా ఓసారి రావొచ్చుగా...!!!
"అరుణ్ సాగర్" అనే పేరుకు న్యాయం చేసేందుకైనా..??
చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా ఉదయించొచ్చుగా..!!
ఇది టూమచ్ గురు...!!
మరీ అత్యాశ బాస్ అంటారా....!!!
సరే సార్.... సరే నా కన్నీళ్లకు ఏమని బదులిస్తారు...??
మీరు చదివిన "మహాప్రస్ధానమే"....
మీ ప్రస్ధానానికి ముగింపుగా నిలిచినప్పుడు..
మీకోసం తపించిన నా హృదయానికి ఏమని సమాధానం చెప్తారు..??
Come on BOSS...Come on
Dont b Quiet...BREAK this SILENCE
Please say Something...!!

అరుణ్ సాగర్ గారికి ఘన వీడ్కోలు

అరుణ్ సాగర్ గారి అంత్యక్రియలు మిత్రులు, బంధువుల అశృ నియనాల మధ్య నిన్న (ఫిబ్రవరి 12, 2016) సాయంత్రం నార్నే రోడ్ లో ఉన్న 'మహా ప్రస్థానం'లో జరిగాయి. ముందుగా... ఎర్రగడ్డ లో అని, తర్వాత పంజాగుట్ట (ఒక ఛానెల్ లో వచ్చింది) అనుకుని తర్వాత ఫిల్మ్ నగర్ లోని ఈ అధునాతన శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.

ఈ తుది వీడ్కోలు లో టీవీ -5 ఛైర్మన్ బీ ఆర్ నాయుడు, టీవీ-9 సీ ఈ ఓ రవి ప్రకాష్, మహా న్యూస్ ఎడిటర్ వెంకట్రావు, 10 టీవీ ఎం డీ వేణుగోపాల్, ఎక్స్ ప్రెస్ టీవీ హెడ్ దినేష్ ఆకుల, సీనియర్ రచయిత-నటుడు తనికెళ్ళ భరణి,  ఎడిటర్లు శ్రీనివాస్ (ఆంధ్ర జ్యోతి), కట్టా శేఖర్ రెడ్డి (నమస్తే తెలంగాణా), ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులుపాల్గొన్నారు. పలువురు ఎడిటర్లు, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అరుణ్ సాగర్ గారి నివాసానికి వచ్చి అంతిమ నివాళి అర్పించారు. సాగర్ గారి మిత్రులు సీతారాం గారి లాంటి వాళ్ళు ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇది సాగర్ గారు చివరిగా అప్ డేట్ చేసిన వారి ఫేస్ బుక్ పేజీ.



ఉన్నా పోయినా పట్టించుకోని అమానుష యాజమాన్యాలు ఛానల్స్ నడుపుతున్న ఈ రోజుల్లో అరుణ్ సాగర్ గారి పట్ల టీవీ -5 యాజమాన్యం చూపిన సంస్కారం అభినందనీయం. శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ నాయుడు గారి చొరవ వల్ల భౌతికకాయాన్ని టీవీ-5 ఆఫీసు దగ్గరకు తీసుకువచ్చి అక్కడి నుంచి 'మహా ప్రస్థానం'దగ్గరకు ఊరేగింపు గా  తెచ్చారు. ఈ మధ్య కాలంలో ఏ సీనియర్ ఎడిటర్ కు దక్కని విధంగా అరుణ్ సాగర్ గారికి  అంతిమ వీడ్కోలు లభించింది. అందుకు ఆయన అర్హుడు.

అయితే...అనుకోకూడదు కానీ... మనోళ్ళ క్రమశిక్షణ లేమి అంతిమ సంస్కారం దగ్గర బాగా కనిపించింది. ఒక ముగ్గురు నలుగురు వీడియో గ్రాఫర్లు భౌతిక కాయం చుట్టూ చేరారు. ప్రశాంతంగా నివాళి అర్పించకుండా...హడావుడి చేసారు. వాటర్ బాటిల్స్ రాగానే కొంపలారిపోస్తున్నట్లు ప్రముఖ యాంకర్లు ఎగబడడం బాగోలేదు. నిజంగా వారు దాహార్తి తో ఉండి వుంటారు..

మనల్ను వీడి వెళ్ళిన మనిషి మనకు మిగిల్చిన జ్ఞాపకాలను, అనుభూతులను, విలువలను గుర్తు చేసుకుంటూ వీడ్కోలు పలకాల్సిన సమయంలో కాస్త ప్రశాంత పాటిస్తే బాగుండేది బ్రదర్స్!

Friday, February 12, 2016

మంచి మనిషి అరుణ్ సాగర్...మీకిదే జోహార్!!!

ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ ఎడిటర్, సామాజిక స్పృహ బాగా ఉన్న కవి... అన్నింటికీ మించి... మంచి మనిషి అరుణ్ సాగర్ గారు ఈ తెల్లవారుఝామున కన్నుమూశారని తెలియజేయడానికి విచారిస్తున్నాం. ప్రస్తుతం TV-5 ఎడిటర్ గా ఉన్న ఆయన కొన్నేళ్లుగా శ్వాశకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 

ఖమ్మం జిల్లాలో 1967 జనవరి 2 న జన్మించిన సాగర్ గారు దళిత, గిరిజన, అణగారిన వర్గాల పట్ల పక్షపాతంలో "మగ్జిమం రిస్క్", "మేల్ కొలుపు", "మ్యూజిక్ డైస్"వంటి కవితా సంకలనాలతో సంచలనం సృష్టించారు. టీవీ-9 ఎదుగుదలలో రవి ప్రకాష్ బృందంలో కీలక భూమిక పోషించారు.  

టీవీ 9 లో పరిణామాలతో బాధపడిన సాగర్ గారు.. ప్రజల డబ్బుతో వచ్చిన 10 టీవీ ఛానెల్ ప్రారంభం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఖమ్మం కమ్యూనిస్టు నాయకుడు తమ్మినేని వీరభద్రం గారికి దగ్గర అయినప్పటికీ సాగర్ గారు ఆ ఛానెల్ లో ఇమడలేక పోయారు. 2014 ఆగస్టు లో టీవీ 5 లో ఎడిటర్ గా చేరారు. 
 "సాగర్ గారు మంచి మనిషి. తన మానస పుత్రిక అయిన 10 టీవీ నుంచి వెళుతున్నప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. మన అంతరాత్మ సాక్షిగా పనిచేయాలని ఎప్పుడూ అనే వారు," అని 10 టీవీ లో ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన బృందంలో ఉన్న... ఈ బ్లాగు వ్యవస్థాపకుల్లో ఒకరైన హేమ చెప్పారు. 

అంత్య క్రియలు ఈ రోజు (ఫిబ్రవరి 12, 2016) సాయంత్రం నాలుగు గంటలకు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని టీవీ-5 యాజమాన్యం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రకటించినట్లు ఆ ఛానెల్ చెప్పింది. 

సాగర్ జీ! మీకు మా హృదయపూర్వక నివాళి.  
IMP Note: If you are a close friend/ follower of Mr.Arun Sagar, please send his obituary (a few lines, preferably in Telugu) to srsethicalmedia@gmail.com
We appreciate if you can write your name and the organisation you are working with. We also consider anonymous contributions. 

Friday, February 5, 2016

ఏ.ఎస్. రావు గారి స్థానంలో దివాకర్ గారికి 'మెట్రో ఇండియా' బాధ్యతలు

సుఖంగా 'మెయిల్ టుడే' విలేకరిగా ఉండే ఏ. శ్రీనివాస రావు గారు సీ లక్ష్మీ రాజం గారి పెట్టుబడితో వచ్చిన 'మెట్రో ఇండియా'  అనే పత్రికకు ప్రాణం పోసి పెంచి ఒక స్థాయికి తెచ్చారు.. ఎగ్జి క్యూటివ్ ఎడిటర్ హోదాలో. చివరకు నిన్న (ఫిబ్రవరి 4, 2016) రావు గారికి ఆ పత్రికతో తెగతెంపులు అయ్యాయి. ఆయన స్థానంలో.. సీనియర్ జర్నలిస్టు దివాకర్ గారిని రాజం గారు నియమించారు. ఈ వీడియో గ్రాబ్ లో ఉన్న దివాకర్ గారు  ప్రెస్ క్లబ్ లో అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఆలింగనం చేసుకుంటూ ఉండే పెదన్న గా చాలా మందికి సుపరిచితులు. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసిన దివాకర్ గారు  ఇప్పటి దాకా మెట్రో ఇంటర్నెట్ వ్యవహారాలు చూస్తున్నారు. ఒక పత్రిక ఆరంభించిన తృప్తి రావు గారికి మిగిలింది. ఆయన ఒక అద్భుతమైన రిపోర్టర్ గా బాగా రాణించారు.  

Monday, January 25, 2016

'ఈనాడు' రామోజీ గారికి పద్మ విభూషణ్; కంగ్రాట్స్!!!

తెలుగు జర్నలిజాన్ని, రాజకీయాలను విడివిడిగా కలివిడిగా కొత్త పుంతలు తొక్కించిన వ్యాపారవేత్త 'ఈనాడు' గ్రూపు చైర్మన్ శ్రీ చెరుకూరి రామోజీ రావు గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. సెప్టెంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరును ఈ అవార్డుకు సిఫార్సు చేయగా ఈ రోజు కేంద్రం ఈ ప్రకటన చేసింది. 


రామోజీ గారితో పాటు, సినీ స్టార్ రజనీకాంత్, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, ఆథ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవి శంకర్ లను పద్మ విభూషణ్ వరించింది. 
అవార్డు గ్రహీతలతో పాటు రామోజీ రావు గారికి ప్రత్యేక అభినందనలు. ఈ అవార్డుకు ఆయన అర్హుడు కాడని అనే వారితో ఈ బ్లాగు బృందం ఏకీభవించడం లేదు. తెలుగు జర్నలిజం ప్రమాణాలు ఈ రోజు ఈ స్థాయిలో-మంచో చెడో- ఉండడానికి కారణం... రామోజీ గారి తెగింపు.. దాంతో పాటు ఆయన ముందు చూపుతో ఏర్పాటు చేసిన 'ఈనాడు జర్నలిజం స్కూల్' అనే జర్నలిస్టుల కర్మాగారమ్. 
కంగ్రాట్స్... రామోజీ జీ. 
రామోజీ గురించి కారవాన్ పత్రిక ప్రచురించిన సుదీర్ఘ వ్యాసం ఇక్కడ చదవండి: Chairman Rao  
Photo courtesy: my firstshow.com

Sunday, January 24, 2016

ఈ పీ డబ్ల్యు ఎడిటర్ గా పరంజోయ్ గుహ ఠాకూర్త

నాణ్యమైన విశ్లేషణలకు, పరిశోధన పత్రాల ప్రచురుణకు వేదికైన ఈ పీ డబ్ల్యు (ఎకానమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ) నూతన ఎడిటర్ గా జర్నలిజం లో సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు, రచయిత, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, జర్నలిజం బోధకుడు పరంజోయ్ గుహ ఠాకూర్త ఎంపికయ్యారు. 

పదకొండు సంవత్సరాల పాటు ఆ పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించి నాణ్యతను మరింత పెంచిన తెలుగు బిడ్డ సీ రామ్మనోహర్ రెడ్డి గారి స్థానంలో ఠాకూర్త ను పత్రిక యాజమాన్యం (సమీక్ష ట్రస్టు) నియమించింది. ఏప్రిల్ ఫస్టు నుంచి కొత్త ఎడిటర్ బాధ్యతలు స్వీకరిస్తారు .

పత్రిక యాభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తీసుకురాదలచిన ప్రత్యేక సంచిక విషయంలో  రామ్మనోహర్ రెడ్డి గారికి, ట్రస్టు అధిపతులకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.  రామ్మనోహర్ రెడ్డి గారి ని వదులుకోవద్దని సూచిస్తూ దేశ విదేశాల నుంచి 101 మంది మేథావులు, ప్రొఫెసర్లు, సామాజిక కార్యకర్తులు ట్రస్టు కు ఒక లేఖ కూడా రాసారు. ఈ లేఖను ది వైర్ ప్రచురించిన లింక్ ను ఇక్కడ చూడండి,
http://thewire.in/2016/01/15/a-letter-to-the-sameeksha-trust-from-the-epw-community-19389/

వివిధ పత్రికలలో వ్యాసాలు ప్రచురించే పరంజోయ్ గారు తెలుగు నేల మీద వెల్లివిరిసిన పెయిడ్ న్యూస్ జాడ్యం పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన సబ్ కమిటీ లో సభ్యుడు. ఆయనతో పాటు అప్పట్లో విశాలాంధ్ర లో సీనియర్ పొజిషన్లో ఉన్న జర్నలిస్టు యూనియన్ లీడర్ శ్రీనివాస రెడ్డి కూడా అందులోని రెండో సభ్యుడు. 'మీడియా ఎథిక్స్' మీద పరంజోయ్ గారు రాసిన పుస్తకం విశేష ఆదరణ పొందింది. http://www.paranjoy.in/ లో ఆయన వ్యాసాలు ప్రచురిస్తారు.

ఆయన నియామకంపై 'ది హిందూ'ఈ రోజు ప్రచురించిన వార్త ఇది:

Tuesday, January 19, 2016

'ది హిందూ' లో అసలేమి జరుగుతోంది?

1889 నుంచి దినపత్రికగా వస్తూ... నైతిక జర్నలిజానికి ప్రతినిధిగా జనం నమ్మే స్థాయికి ఎదిగిన 'ది హిందూ' పత్రికలో పరిణామాలు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. కుటుంబ కలహాలు, అహం పోరాటాల మధ్యన పత్రిక, అందులో పనిచేసే జర్నలిస్టులు నలిగిపోతున్నారు. 

'ది హిందూ' మొదటి మహిళా సంపాదకురాలిగా.. ఫిబ్రవరి 1, 2015 న బాధ్యతలు స్వీకరించిన మాలినీ పార్థసారధి  ఏడాది తిరగకుండానే...కొత్త సంవత్సరం జనవరి మొదటి వారంలో రాజీనామా చేసారు. తన పదవీ కాలంలో.. సీనియర్ఎడిటర్లు, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేకుండా దడదడలాడించిన మాలిని గారి రాజీనామా కు కారణం కుటుంబ సభ్యుల మధ్య మనఃస్పర్ధలని చెబుతున్నారు. ఆమె రాజీనామా గురించి జనవరి  5 వ కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ బోర్డు చైర్మన్ ఎన్. రామ్ చేసిన ప్రకటన ఇది:

Malini Parthasarathy has resigned as Editor of The Hindu with immediate effect.
Suresh Nambath, National Editor, The Hindu, has been entrusted with the responsibility of managing the news and editorial operations of The Hindu until a new Editor is appointed.
The KSL Board has placed on record its appreciation of the contribution of Malini Parthasarathy as Editor of The Hindu. She will continue as a Wholetime Director of Kasturi & Sons Ltd.
N. Ram
Chairman of Kasturi & Sons Limited & Publisher of The Hindu


ముకుంద్ పద్మనాభన్ లేదా వేణు లేదా నిర్మలా లక్ష్మణ్ తదుపరి ఎడిటర్ కావచ్చని అంటున్నారు. అయితే, కారణాలు ఏవైనా... మాలిని ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆ పత్రిక ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమె హయాం లో ముంబాయి ఎడిషన్ ఆరంభం కావడం ఒక్కటి మినహా మిగిలినవన్నీ బాధాకరమైన నిర్ణయాలే అని చెన్నై ఆఫీసు లో అనుకుంటున్నారు. ఎడాపెడా బదిలీలు చేసి ఉద్యోగ అభద్రత సృష్టించడాన్ని జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. 
సీనియర్ ఎడిటర్లు సైతం మేడం ఎప్పడు సైతాను నిర్ణయం తీసుకుని ఇంటికి వెళ్ళిపొమ్మని అంటారేమో అని భయపడిన వారు ఇప్పుడు కొద్దిగైనా మార్పు వస్తుందని భావిస్తున్నారు. 
ముంబాయి ఎడిషన్ తేవడంలో ఎంతో కృషి చేసిన తెలుగు బిడ్డ శ్రీనివాస రెడ్డి గారిని వదులుకోవడం ఆమె చేసిన పెద్ద తప్పిదాల్లో ఒకటి. ఆమె బాదితుడైన మరొక సీనియర్ జర్నలిస్టు మురళీధర్ రెడ్డి గారు మాత్రం ఇంకా హైదరాబాద్ ఆఫీసులో రిపోర్ట్ చేస్తున్నారని భోగట్టా.  సాధారణ ప్రజానీకం గురించి ఇప్పటికీ పట్టించుకుంటూ... రూరల్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్న 'ది హిందూ' కు మంచి రోజులు రావాలని ఆశిద్దాం. 

Sunday, January 17, 2016

శ్యాం రావ్ హర్నూర్ గారికి ఘన నివాళి

జర్నలిజం ఒక గమ్మత్తైన వృత్తి. బుర్రలో గుజ్జు లేకపోయినా... దీన్ని అడ్డం పెట్టుకుని తెగ సంపాయించి మేథావులుగా పోజు కొడుతూ బతికేస్తున్న అధికసంఖ్యాక మహానుభావులు ఒక రకం. నిజంగానే ఈ వృత్తిని పవిత్రంగా భావించి జీవితాంతం నికార్సైన జర్నలిస్టులుగా బతికిన వారు కొందరే అయినా ఇతరుల మది పొరల్లో కలకాలం నిలిచి పోతారు.

ఈ రెండో రకానికి చెందిన వారిలో ఒకరు శ్యాం రావ్ హర్నూర్ గారు అని సీనియర్ జర్నలిస్టుల వల్ల తెలుస్తున్నది. ప్రసిద్ధి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీ టీ ఐ) లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన జనవరి 12 న 87 ఏళ్ళ వయసులో మరణించారు. వారి గొప్పతనాన్ని స్ఫురించుకుంటూ... సీనియర్ జర్నలిస్టు ములుగు సోమశేఖర్ గారు తన ఫేస్ బుక్ పేజీ లో ఘన నివాళి అర్పించారు. 1952 లో పీ టీ ఐ లో చేరడానికి ముందు... హర్నూర్ గారు రయ్యత్, ఇమ్రోజ్, సెంటినల్ అనే పత్రికలలో పనిచేసారు. ఇందులో మొదటి రెండు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించిన షోయబుల్లా ఖాన్ రాజాకార్ల చేతిలో హత్యకు గురైన సంగతి జర్నలిస్టులకు తెలుసు.
సీనియర్ డిప్యూటీ ఎడిటర్ హోదాలో బిజినెస్ లైన్ పత్రిక బ్యూరో చీఫ్ గా పనిచేసున్న సోమశేఖర్  గారికి పీ టీ ఐ లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆ నివాళిని యథాతథంగా మీ కోసం అందిస్తున్నాం. వారికి థాంక్స్.
A Tribute
Sham Rao Harnur, the former Manager of the PTI, who passed away on Tuesday morning was one of the last of the complete wire service Journalists from Hyderabad. He was a gentleman, soft spoken and thorough professional. He was among my first bosses in Journalism. In good measure, he was instrumental in encouraging me with reporting on virtually all subjects as a rookie reporter at PTI in the mid-1980s. 
The 87 year old Sham Rao was a linguist, who could read Urdu, Telugu, Kannada, Hindi which helped him and also the agency in exhaustive coverage of events from the city. He was an efficient man-manager and loved to wear his coats and formals to events and assignments. He commanded respect in the political circles with CMs like Marri Chenna Reddy, Kasu Brahmananda Reddy, Vengala Rao etc on first name basis. Leaders like Rosaiah (governor of TN now), V Hanumantha Rao, Quereshi etc would often come to the office. 

For four decades, starting from the formation of the combined AP, he served the agency with commitment and guided its growth. With PTI being an office with home attached, he was always at hand when any development took place. For most Cong(I) leaders and State Governors, a report from PTI was a must to reach Delhi and high command, and hence the agency was the focal point of lot of action during those times. Sham Rao was seldom swayed by political leanings as he stuck to factual, thoroughly sourced reportage. 

This highly non-controversial Journalist, however, had his share of controversy, when he put out a `scoop', that nearly a dozen MLAs with NTR were shifting to Nadendla Bhaskara Rao, during the 1984 political drama that saw NTR being dethroned for nearly 30 days and dramatically returning to power. The story raised national attention and was debated for sometime. Sham Rao was quick in reporting, fast in typing and could get his team to cover events extensively. It was under his stewardship that me, Dinesh Sharma and G Rajaraman, all classmates in Journalism from Osmania University had the unique opportunity to work and learn the finer aspects of agency Journalism. Proud that Dinesh is an accomplished Science Journalist and Rajaraman an acclaimed Sports Scribe in the country now.

 PTI provided the opportunities and to good measure, I shall be indebted to Sham Rao Harnur for a good part of all the initial learning, assignments and political contacts to whatever progress I have made in the profession. He retired in 1990 in the true sense. Leading a peaceful life away from the media. His son, Sridhar a fellow Nizamian became a crime reporter before moving on to the US. His brother, RV Harnur is a well known News Editor and a close relative P Vaman Rao, a noted Journalist. 

Tuesday, January 12, 2016

మీడియా మహారాజుకు నాలుగో పెళ్లి


వార్తా ప్రపంచం రూపురేఖా విలాసాలు పూర్తిగా మార్చేసి, జర్నలిజాన్ని మంచి వ్యాపారంగా మార్చి కోట్లు గడించిన మీడియా మహారాజు రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) నాలుగో పెళ్లి చేసుకోబుతున్నారు. ఒకప్పటి నటి-మోడల్ జెర్రీ హాల్ (59 ఏళ్ళు) ను ఈ న్యూస్ కార్పోరేషన్ కంపనీ అధిపతి (84 ఏళ్ళు) మనువాడబోతున్నారు.  
తన అధ్వర్యంలో నడుస్తున్న 'ది టైమ్స్' లో జననాలు, వివాహాలు, మరణాల సెక్షన్ లో ఈ జంట ఈ విషయాన్ని ఈ విధంగా (పక్కన చూడండి) ప్రపంచానికి చాటింది. గత అక్టోబర్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య లండన్ లో జరిగిన రగ్బీ ప్రపంచ కప్ ఫైనల్స్ లో వీరిద్దరూ జనాలకు కలిసి కనిపించారు. ఆస్ట్రేలియా లో పుట్టి అమెరికా జాతీయత స్వీకరించిన మర్దోక్ తన మూడో భార్య వెండీ డెంగ్ నుంచి 2013 లో విడాకులు తీసుకోగా, అమెరికాకు చెందిన హాల్ సర్ మిక్ తో 23 ఏళ్ళ బంధానికి 1999 లో తెరదించింది. 

BBC వారి కథనం ప్రకారం రూ. మ. గారి పూర్వాపరాలు, ఘనతలు ఇలా వున్నాయి. 
  • Wealth: According to Forbes in 2015, Rupert Murdoch and his family have a net worth of $11.2 billion (£7.7bn), making him the 77th richest person on the planet.
  • Newspapers: Born in 1931, he inherited two Adelaide newspapers from his father at the age of 22 and built his media empire from there. Now executive chairman of News Corporation, Rupert and his family control 120 newspapers in five countries, including the Sun and the Times in the UK, and also own book publisher HarperCollins.
  • Television: The Murdoch family own a large cable TV network, including the Fox channels in the US. Rupert is also co-executive chairman, with his son Lachlan, of 21st Century Fox, and owns a large stake in broadcaster Sky.
  • Personal life: He married Patricia Booker, a flight attendant from Melbourne, in 1956. They had one child, Prudence, and divorced in 1967. His second marriage to Glasgow-born journalist Anna Torv lasted 32 years, ending in 1999. They have three children, Elisabeth, Lachlan and James. His third marriage to Chinese-born businesswoman Wendy Deng ended in 2013 after 14 years and two children, Grace and Chloe.
  • Controversy: His battles with striking journalists in 1986 outside his newspapers' Wapping headquarters heralded a revolution in Fleet Street. Some 5,000 staff lost their jobs, but the move also spelled an end to over-manning and restrictive practices. More than 20 years later, he was in the spotlight over the phone hacking scandal, infamously being attacked with a foam pie during a meeting with MPs.

Thursday, January 7, 2016

1991 'ఈ జే ఎస్' బ్యాచ్ సిల్వర్ జూబ్లీ మీట్

తెలుగు జర్నలిజానికి ఎందరో మంచి జర్నలిస్టులను అందించిన 'ఈనాడు జర్నలిజం స్కూల్' మొట్టమొదటి బ్యాచ్ (1991) బృందం జనవరి 3, 2016 (ఆదివారం) నాడు కలుసుకుని ఎంతో ఉత్సాహంగా 'సిల్వర్ జూబ్లీ మీట్' జరుపుకున్నారు. 

ఈ బ్యాచ్ నుంచి కాల్వ శ్రీనివాస్ లాంటి రాజకీయ నాయకులు, పొలిటికల్ వార్తలు అద్భుతంగా రాసే నేలకొండపల్లి భార్గవ లాంటి వారు, జర్నలిజాన్ని నమ్ముకునిఅంచెలంచెలు గా ఎదుగుతున్న ఎం.ఎల్. నరసింహా రెడ్డి, డబ్బీరు రాజేంద్ర ప్రసాద్, జీ వెంకటేశ్వర్లు లాంటి వారు, సినిమాల్లో అదృష్టాన్నిపరీక్షించుకుంటున్న శ్రీనివాస్, సతీష్ తదితరులు ఉన్నారు. ప్రతి బ్యాచ్ లో మాదిరిగానే కొందరు టీచర్లు కూడా ఉండి ఉంటారు. 

ఈ పూర్వ మిత్రుల సమ్మేళనం మీద త్వరలో మరొక పెద్ద పోస్టు ఉంటుంది.
మీట్ కు సంబంధించిన ఫోటో ఇది:

Monday, January 4, 2016

అది 'తెలంగాణా టుడే' నే.... వచ్చేది ఉగాదికి!

'నమస్తే తెలంగాణా' తెలుగు పత్రిక వారి ఇంగ్లిష్ పత్రిక పేరు 'తెలంగాణా టుడే' అనీ, సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్ రెడ్డి గారు దానికి ఎడిటర్ అని దృవపడింది. కిందటేడాది (2015) చివరి రోజు (డిసెంబర్ 31) సాయంత్రం 4.59 గంటలకు శ్రీనివాస్ రెడ్డి గారు తన ఫేస్ బుక్ పేజీ లో ఈ కింది నోట్ ద్వారా వారి కొత్త పాత్రను ప్రకటించారు.

Friends. I have joined as Editor of 'Telangana Today', an English daily to be launched shortly from Hyderabad. Wishing you a Happy New Year!

ఇప్పుడు 'నమస్తే తెలంగాణా' ప్రాంగణంలో... శ్రీ సీ లక్ష్మీ రాజ్యం గారి యాజమాన్యంలో వస్తున్న 'మెట్రో ఇండియా' అనే ఆంగ్ల పత్రికనే రూపు రేఖా విలాసాలు మార్చి 'నమస్తే తెలంగాణా' అధ్వర్యంలో తెస్తారన్న ఒక ప్రచారం/ భ్రమకు రెడ్డి గారు ఈ నోట్ ద్వారా తెరదించారు. రెడ్డి గారు షార్ట్లీ అన్నారు కానీ... తెలంగాణా టుడే ఒక నాలుగు నెలల్లో... బహుశా ఉగాది నాటికి వస్తుందని భావిస్తున్నారు.


ఇందుకోసం జర్నలిస్టుల నియామకాల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి పత్రిక లో చేరే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. చివరకు 'ది హిందూ'నుంచి కూడా ఒక బృందం అక్కడ చేరబోతున్నట్లు ప్రచారం భారీగా జరుగుతోంది. 'కనీసం ఎనిమిది మంది వెళ్తారట. నిజంగానే అది జరిగితే.. ది హిందూ లో అదే పెద్ద భారీ వలస అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో... కొందరు ది హిందూ నుంచి వెళ్ళే అవకాశం బాగానే ఉంది,"అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పిన మాట నమ్మదగినదిగానే ఉంది.

ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి ముందు ఉన్న ఒక కఠినాతికఠినమైన సవాలు: నాణ్యమైన జర్నలిస్టులను సత్తా ప్రాతిపదికన ఎంచుకోవడం. మీడియా అనగానే... తప్పులు లేకుండా తన పేరు రాయగలవాడు, నాలుగు మాటలు చెప్పి బతకగలిగిన ఎవడైనా చేయదగ్గ ఉద్యోగం అన్న అభిప్రాయం  పెరిగిన నేపథ్యంలో... మన కులపోళ్ళు, వేలువిడిచిన మేనమామ మనమళ్ళు, భజనపరులు పోలో మంటూ వస్తారు.  ఈ కులాభిమానానికి, మనో వికారాలకు లొంగితే ఇంతే సంగతులు... చిత్తగించవలెను. ఇప్పుడు మన తెలుగు టీవీ ఛానెల్స్ నాశనం కావడానికి ఇలాంటి చెత్త నియామకాలే పెద్ద కారణం.  

నిజానికి పక్కా రీజనల్ ఇంగ్లిష్ పత్రిక ఇంతవరకూ ఒక్కటీ లేదు మనదగ్గర. ఆ లోటును పూడ్చే ప్రయత్నాన్ని 'మెట్రో ఇండియా', 'హన్స్ ఇండియా'లు చేస్తున్నాయి కానీ... అంత్యంత ప్రతిభావంతులైన జర్నలిస్టుల కొరత వాటిని పీడిస్తున్న అంశాల్లో ఒకటి. జీతాలు తక్కువగా ఇస్తూ... ఉద్యోగ అభద్రతను సృష్టిస్తే మంచి జర్నలిస్టులు దొరకరు. శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో 'తెలంగాణా టైమ్స్' ఈ సమస్యలు అధిగమించి చరిత్ర సృష్టించాలని కోరుకుందాం.

కొత్త సంవత్సరం సందర్భంగా... శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కే సీ అర్ గారిని కలిసిన దృశ్యం ఇది. ఇది రెడ్డి గారి ఫేస్ బుక్ నుంచి సంగ్రహించబడింది.  

Friday, January 1, 2016

నూతన సంవత్సర శుభాకాంక్షలతో... హీరోలు, నీరోలు, జీరోలు

ప్రియమైన మిత్రులారా... మా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 
బ్లాగులో రెగ్యులర్ అప్ డేట్స్ గురించి మిత్రులు మెయిల్స్ రాస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. అయినా... మీడియా లో పరిణామాలను తాజాగా అందించడంలో మేము ముందే ఉన్నామండీ. 
కొత్త సంవత్సరం సందర్భంగా వారంలో కనీసం నాలుగైదు పోస్టులు పెట్టాలని మా బృందం కృతనిశ్చయంతో ఉందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. థాంక్స్. 
-----------------------------------------------------
 ప్రతి ఏడాది మాదిరిగానే 2015 కూడా గిర్రున తిరిగి ముగిసి పోయింది. ఈ రోజు పేపర్లో 'ఈనాడు'దీని మీద ఒక భయంకరమైన కవిత రాసింది. అది ఇదీ...

కాలచక్ర భ్రమణంలో.. కరిగింది మరో వసంతం 
కుడ్యంపై చేరాతల డైరీ.. నేడు జ్ఞాపకాల శిలాక్షరం 
కేర్ మన్న సవ్వడి.. వసంతోత్సవ అలికిడి
నడిరాత్రి కేరింత.. కొంగొత్త ఆకాంక్షల గీతిక 
ఆ స్వర గీతికను ఆస్వాదిద్దాం 
నవ ఉషస్సును స్వాగతిద్దాం

కొత్త సంవత్సరం మొదటి రోజు... కుడ్యం ఏమిటో... శిలాక్షరం ఏమిటో... సవ్వడి కేర్ మనడం ఏమిటో.. వసంతోత్సవం అలికిడి ఏమిటో!!! ఈ నవ కవికి... నవ కవనానికి.. థాంక్స్, ఆల్ ది బెస్ట్ లు చెబుతూ... 2015 లో మీడియా లో మెరపులు, మరకల సమాహారమైన వ్యక్తుల కు మేము సరదాగా ఇస్తున్న అవార్డులివీ.

'బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్' విన్నర్:  ప్రొఫెసర్ కే నాగేశ్వర్. జర్నలిజం బోధకుడి స్థానం నుంచి టీవీల్లో వీర విశ్లేషకుడిగా పేరు తెచ్చుకుని జనాభిమానంతో ఎం ఎల్ సీ అయి... 10 టీవీ చైర్మన్ గా చేరి ఇటీవలనే 'ది హన్స్ ఇండియా' ఎడిటర్ గా పగ్గాలు స్వీకరించి.. పలు పరిమితులతో అయినా వినూత్న ఆలోచనలతో పత్రికను త్వరిగతిన గాడిలో పెట్టి బహుముఖ ప్రజ్ఞతో మల్టీ టాస్కింగ్ తో స్ఫూర్తి ని పంచుతున్నందుకు. 

'ఓపెన్-షట్-ఓపెన్ అవార్డ్' విన్నర్:  మెట్రో ఇండియా ఓనర్ సీ. లక్ష్మీ రాజం.
'మెట్రో ఇండియా' అనే ఇంగ్లిష్ పేపర్ పెట్టి... మూడ్రోజులు మూసేసి... మళ్ళీ తెరిచి...మళ్ళీ మూస్తారేమో అనిపిస్తున్నందుకు. ఈ ఏడాది మూతపడిన 'ఇండియా టుడే' తెలుగు పత్రిక ఈ అవార్డు కోసం పోటీ పడినా... రాజం గారి సూపర్ ప్లానింగ్ ముందు ఓడిపోయింది.
నోట్:  గతంలో 'బెస్ట్ కమెడియన్' అని ఉన్న ఈ అవార్డు పేరు మార్చామని గమనించగలరు.

'పాపం...పూర్ రిచ్ ఫెలో అవార్డ్ ' విన్నర్: హెచ్ ఎం టీవీ-హన్స్ ఇండియా ఓనర్ వామన రావు. పొందిగ్గా చిట్స్ వ్యాపారం చేసుకోకుండా... మీడియా లో వేలు పెట్టి...కోట్లువెచ్చించి ఛానెల్ పెట్టి, హంసలు ఏవో కాకులు ఏవో తెలియకపోయినా ఆనక ఒక ఇంగ్లిష్ పత్రికఆరంభించి... ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియక ఏమిచేయాలో ఎరగక అలాగే డబ్బు వెదజల్లుతూ ముందుకు పోతున్నందుకు.
నోట్:  గతంలో 'బెస్ట్ బకరా' అని ఉన్న ఈ అవార్డు ను 'పాపం... పూర్ రిచ్ ఫెలో' గా మార్చామని గమనించగలరు.

'పుణ్యం.. పురుషార్ధం అవార్డ్ ' విన్నర్: ఎన్ టీవీ అధినేత నరేంద్ర చౌదరి. జూబ్లీ కొండల సాక్షిగా ఆరుగాలం శ్రమ పడి... కొంగొత్త ఆలోచనలతో.. ఒక మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించి... భక్తి శ్రద్ధలతో రెండోయేడాది కూడా 'కోటి దీపోత్సవం' చేసి ముక్కోటి దేవుళ్ళను, వారి నిత్య ఆరాధకులైన స్వామీజీలను, పీఠాధిపతులను అందులో భాగస్వాములను చేసి, సామాన్య జనాలకే కాకుండా...కావలసిన రాజకీయ నాయకులకు సైతం ఇతోధికంగా ముక్తి ప్రసాదిస్తున్నందుకు. 

'యుధ్ వీర్ అవార్డ్ ' విన్నర్:  ఆంధ్రజ్యోతి గ్రూపు యజమాని వేమూరి రాధాకృష్ణ.  పోట్ల గిత్త లాగా మంచి ఊపు మీద ఉన్న టీ ఆర్ ఎస్ ప్రభుత్వం తో, రాజకీయ ఉద్దండుడు కే సీ ఆర్ తో డైరెక్ట్ గా తలపడి... ఒక్క జర్నలిస్టు సంఘం సహాయం లేకపోయినా కిందపడుతున్నా తలవంచకుండా పోరాడి ఛానెల్ ప్రసారాలు మళ్ళీ ఆరంభించినందుకు... దమ్మున్న మనిషని నిరూపించుకున్నందుకు.

'దొరిపోరా బై దూరిపో... అవార్డ్ ' విన్నర్:  సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్. నెట్ జర్నలిజం గురించి ఎవ్వరికీ తెలియకముందే... వెబ్ సైట్ లో పనిచేసి... ఆ తర్వాత పలు ఛానల్స్ అవలీలగా ఆలవోకగా మారి...తెలుగు దేశం ప్రభుత్వం వచ్చాక... ఎంచక్కా... 'ఆంధ్రప్రదేశ్' ఎడిటర్ గా కుదురుకున్నందుకు.

'కేరాఫ్ ఎర్రగడ్డ... అవార్డ్ ' విన్నర్:  భారత దేశం లో రెండు అత్యంత ప్రముఖమైన పత్రికలు-- ఈనాడు, ది హిందూ-- ఈ అవార్డ్ కోసం గట్టిగా పోటీ పడినా... ఈ ఏడాది ది హిందూ పత్రికనే అది వరించింది. మార్కెట్ ఫిగర్స్ ఇచ్చిన ఉన్మాదంతో పిచ్చిపట్టినట్లు... జర్నలిస్టుల ఉద్యోగాలు పీకుతూ..థూ.. జర్నలిజం... అనిపిస్తున్నందుకు.

'సూపర్ టైం పాస్ అవార్డ్ ' విన్నర్:  సీనియర్ జర్నలిస్టు సుసర్ల నగేష్ కుమార్. అనుకోని పరిస్థితుల్లో 'ది హిందూ' వదిలిన తర్వాత.. తన సేవలు జర్నలిజానికి అవసరమని మనసా వాచా కర్మణా భావిస్తూ... పిలిచిన పలు తెలుగు ఛానల్స్ లో తన అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చుతూ... విశ్లేషణలు చేయడమే కాకుండా... తనకంటూ ఒక బ్లాగ్ ఏర్పరుచుకుని అడపా దడపా అద్భుతంగా రాస్తూ కాలక్షేపం చేస్తున్నందుకు.    

'కామన్ మాన్ అవార్డ్ ' విన్నర్:  రాసిపురం కృష్ణస్వామి (ఆర్కే) లక్ష్మణ్. సగటు జీవి కేంద్రంగా దాదాపు ఐదు దశాబ్దాల పాటు చురుకైన కార్టూన్లు వేసి 94 ఏళ్ళ వయసు లో గత జనవరి లో కన్ను మూసారాయన.

ఉద్యోగాలు పీకే స్థాయిలోఉన్న దశలో... ఒక్కసారిగా ఉద్యోగం ఊడగొట్టుకున్నఒకసెల్ఫ్ మేడ్ సీనియర్, నమ్మిన వామనుడి తల మీద కాలేసి తొక్కేసి తాపీగా వేర్వేరు చానెల్స్ లో చేరిన పెద్దమనుషులు, యాడ్ ఏజంట్లుగా మారిన ముదురు ఎడిటర్లు, వాక్యం సరిగా రాయరాక పోయినా బకరా గాళ్ళతో ఒక పత్రిక పెట్టించి.. ఎడిటర్ కావాలని కలలు కన్న ఒక మహానుభావుడు, అంతే వాసులు పలు అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడినా...వారి ఎంట్రీలను వచ్చే ఏడాదికి పరిశీలిస్తామని మనవి చేస్తూ ముగిస్తున్నాం.
Happy New Year-2016