Monday, January 26, 2015

'కామన్ మ్యాన్' కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మనకిక లేరు

కార్టూనిస్ట్ గా అత్యున్నత ప్రమాణాలు సృష్టించిన ప్రముఖ కార్టూనిస్టు, సగటు బడుగు జీవిని (కామన్ మ్యాన్) ను తన కార్టూన్లలో నిత్య అంతర్భాగం చేసిన 94 సంవత్సరాల రాసిపురం కృష్ణస్వామి (ఆర్ కే) లక్ష్మణ్ భారత గణతంత్ర దినోత్సవం రోజు  పూణే లో దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో కన్నుమూసారు. ఆయనకు "తెలుగు మీడియా కబుర్లు" బృందం భక్తి శ్రద్ధలతో నివాళులు అర్పిస్తోంది.

యూరినరీ ఇన్ఫెక్షన్ తో నెల రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించి వివిధ కీలక శరీర అంగాలు పనిచేయని పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులకు సునిశితంగా చురకలు అంటించడం లో దిట్ట అయిన లక్ష్మణ్ 'యూ సెడ్ ఇట్' అనే శీర్షికతో ద టైమ్స్ ఆఫ్ ఇండియా లో యాభై ఏళ్ళపాటు పాకెట్ కార్టూన్లు వేసారు. ఎమర్జెన్సీ రోజుల్లో సైతం ఇందిరా గాంధీ మీద కూడా కార్టూన్లు వేసిన ఘనత ఆయనదని చెబుతారు. 
మైసూర్ లో తమిళ కుటుంబం లో 1924 లో పుట్టిన లక్ష్మణ్ ముందుగా 'బ్లిట్జ్' లో తరవాత 'ఫ్రీ ప్రెస్ జర్నల్' లో పనిచేసారు. ఆ తర్వాత ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా లో చేరారు. లక్ష్మణ్ కు దక్కని ఆవార్డులు లేవు.
ప్రముఖ నవలా రచయిత ఆర్కే నారాయణ్ తమ్ముడు లక్ష్మణ్.  

Tuesday, January 13, 2015

బోనస్ రాకపాయె... ధోతులూ ఆగిపోయే...

మీడియా ప్రపంచంలో కాస్ట్ కటింగ్ తార స్థాయికి చేరుకుంది. ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లాగా మర్యాదగా చూసుకునే 'ది హిందూ' పత్రిక కూడా ఖర్చుల కోత పేరుతో సంస్థలో పద్ధతులకు తిలోదకాలు ఇస్తున్నది. గత సంవత్సరం బోనస్ ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరిచిన యాజమాన్యం....ప్రతి ఏడాది సంక్రాంతి పండగకు పంపే దుస్తుల (ఆడ వారికి చీరెలు, మగ వారికి పంచెలు) విషయంలో కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నై లో పేరెన్నికగన్న నాణ్యమైన బట్టలు కొని పండక్కు అల్లుడికి, ఆడబిడ్డకు పంపినట్లు కొరియర్ లో పంపే యాజమాన్యం...  ఈ సారి మీరే కొనుక్కొని బిల్లు పెట్టుకోవాలని ఆదేశించింది.... క్లిష్ట ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.  ఇక్కడ రేటు విషయంలో మానేజ్ మెంట్ ఒక పరిమితి విధించింది. 'ఈ సంప్రదాయం కొనసాగించాలని  సెంటిమెంట్ గా ఫీలయ్యే ఉద్యోగులు' పండక్కు బట్టలు కొనుక్కోవచ్చని, పంచెకు 250, చీరెకు 500 ఇస్తామని స్పష్టంచేసింది. పత్రికలో గతంలో మాదిరిగా నోరు మెదిపే పరిస్థితి లేదు కాబట్టి... ఈ సర్క్యులర్ చూసిన ఉద్యోగులు యాజమాన్య ధోరణి పై గొణుక్కుంటున్నారు. ఈ సందర్భంగా 'ది హిందూ' యాజమాన్యం  ఉద్యోగులకు రాసిన లేఖ ఇలా ఉంది:
KASTURI & SONS LTD.
Kasturi Buildings, 859 860, Anna Salai, Chennai - 600002,
January 12, 2015.
NOTICE
We wish all employees a happy and prosperous new year! As you well know, the company is going through a challenging financial position and austerity is the call of the day. However, KSL also has a reputation for benevolence and employee-centricity. From a financial standpoint, we need to take a hard look at our long tradition of issuing pongal dhothies/saree to employees. Equally, we need to keep in mind the sentiments of our employees. In view of both these viewpoints, we would like employees who sentimentally would like to continue the tradition to purchase the Pongal Dholhies/ saree on their own and et it reimbursed, subject to a maximum as per the details below:
Rs.250/- for Male Employees for purchasing dhothies and Rs.500/- for Female Employees for purchasing saree.
The claims need to be submitted to HR department, along with bill on or before 20th January 2015.
We request employees to balance sentiments with KSL's financial position In deciding your actions. We are thankful for your understanding and cooperation.
Vice President —
Human Resources
"'ది హిందూ' లో పరిస్థితులు దారుణంగా మారాయి. జీవితం రెసిడెంట్ ఎడిటర్ల చేతిలో బందీగా మారింది. గతంలో మాదిరిగా ఫ్రీ హాండ్ ఇవ్వకుండా... మాటి మాటికీ ఫోన్ చేసి చంపుతున్నారు. బోనస్, బట్టలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ వేధించకుండా ఉంటే అంతే చాలు..." అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు.  పర్మినెంట్ ఉద్యోగులను త్వరలో కాంట్రాక్ట్ సిస్టం లోకి తెచ్చేందుకు 'ది హిందూ' ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది.  
పెద్ద పదవిలోకి.... చెన్నై కి... శ్రీనివాస  రెడ్డి గారు
ఇప్పటి వరకు హైదరాబాద్ లో 'ది హిందూ' కు రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్న కె. శ్రీనివాస రెడ్డి గారిని పదోన్నతి మీద (కో-ఆర్డినేటింగ్ ఎడిటర్) చెన్నై పంపారు. దక్షిణ భారత రాష్ట్రాలలో పత్రిక నియామకాలు, ఇతర వ్యవహారాలను ఆయన చూస్తారట. సుసర్ల నగేష్ కుమార్ అర్థంతరంగా వెళ్ళిపోయాక... బెంగుళూరు నుంచి రెడ్డి గారిని హైదరాబాద్ తెచ్చి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు ఎడిటర్ మాలినీ పార్థసారథి కున్న అతి తక్కువ మంది నమ్మకస్థుల్లో ఒకరని చెన్నై వర్గాలు తెలిపాయి. కోరుకున్న కొత్త రెసిడెంట్ ఎడిటర్ దొరికే వరకూ రెడ్డి గారే చెన్నై నుంచి తెలంగాణ  వ్యవహారాలు పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.

Tuesday, January 6, 2015

చిగురుపాటి ఛానెల్ కు నేమాని బృందం టాటా


డాక్టర్ చిగురుపాటి జయరామ్ స్థాపించిన ఎక్స్ ప్రెస్ టీవీ కి సీనియర్ ఎడిటర్ నేమాని భాస్కర్ రాజీనామా చేయడం, ఆయనకు మద్దతుగా ఒక 21  మంది జర్నలిస్టులు వైదొలగడం గత 48 గంటల్లో జరిగాయి. ఒక ఎడిటర్ కోసం ఇంతమంది వైదొలగడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం.
టీవీ-9 నుంచి దినేష్ ఆకుల ను సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (ఎడిటోరియల్ అండ్ ఆపరేషన్స్)  గా నియమించినప్పటి నుంచి అసంతృప్తి తో ఉన్న భాస్కర్... వై. రాజశేఖర్ లాగా నరేంద్ర చౌదరి గారి ఎన్-టీవీ కి వెళ్లిపోతారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది ఉంది. అయితే ఇంతమంది తో కూడిన నేమాని భాస్కర్ బృందాన్ని  తీసుకునే పరిస్థితి చౌదరి గారి చానెల్ లో లేదు. కాబట్టి భాస్కర్... త్వరలో రానున్న ఒక ఛానెల్ లోకి వెళతారని భావిస్తున్నారు. 

పోతూపోతూ నేమాని భాస్కర్... చిగురుపాటికి ఒక ఆరు పేజీల మెయిల్ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాటలకు, చేతలకు  పొంతన లేకపోవడం, దినేష్ ను తెచ్చే తప్పుడు తనను సంప్రదించకపోవడం.... వంటి అంశాలు అందులో పేర్కొన్నారు. ఆ లేఖ యథాతథంగా ప్రచురించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. ఇకపోతే... హెచ్-ఎం టీవీ లో అనేక మంది ఉద్యోగాలు పీకేసిన అపవాదు మూటగట్టుకుని... చివరకు మళ్ళీ ఎన్-టీవీ కి వచ్చిన వై.రాజశేఖర్ తన పని తాను చేసుకుపోతున్నారు. "వచ్చాడు... ఉద్యోగాలు పీకాడు... ఉడాయించాడు. దీనివల్ల ఏమి సాధించాడు? మా కుటుంబాల ఉసురు తగలకపోదు," అని ఒక బాధిత జర్నలిస్టు ఆవేదనతో అన్నారు  

నోట్: ఈ ఫోటో నేమాని భాస్కర్ గారి ఫేస్ బుక్ పేజీ నుంచి దిగుమతి చేసుకున్నాం.

Saturday, January 3, 2015

"ది హిందూ" ఓప్- ఎడ్ పేజ్ ఎడిటర్ రాజీనామా

చెన్నై కేంద్రంగా నిడిచే "ది హిందూ" పత్రికలో సీనియర్ ఎడిటర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతోంది. రూరల్ అఫైర్స్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాథ్,స్ట్రాటజిక్ అఫైర్స్ ఎడిటర్ ప్రవీణ్ స్వామి వెళ్ళిపోవడం సృష్టించిన కలకలం సద్దుమణగక ముందే ఓప్- ఎడ్ పేజ్ ఎడిటర్ రాహుల్ పండిత రాజీనామా చేసారు. ప్రస్తుత ఎడిటర్ మాలినీ పార్థసారధి వ్యవహార శైలి నచ్చకపోవడం, ఎడిటర్ కు ఉండాల్సిన స్వేచ్ఛను ఆమె హరించడం కారణమని రాహుల్ తన రాజీనామా పత్రంలో పేర్కొన్నాడు. "స్వేఛ్చ లేదు... మీ మూడ్ ను బట్టి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం తప్ప. రచయితలు కవరింగ్ లెటర్ మీద మిమ్మల్ని 'మాలినీ'... అని సంబోధించారా... లేక 'మేడం' అని సంబోధించారా? అన్న దాన్ని బట్టి మీ నిర్ణయాలు ఉంటాయి..." అని ఆయన అందులో స్పష్టం చేసాడు. 
రాజీనామా చేశాక మాలినీ పార్థసారథి కి డిసెంబర్ 18 న రాహుల్ పంపిన లేఖ పూర్తి పాఠం. 

I think I made my point quite clear in my email to the editor-in-chief. In the current situation what the Op-ed page really needs is a bunch of interns who can seek instructions from you on an hourly basis and then get in touch with the authors on your behalf.
An Op-ed editor, the way I see it, has to be given some broad guidelines in the beginning and then left free to run the page.
But there is absolutely no freedom for the current editors to do so. Every article that comes to us or has to be commissioned has to go through your approval. And it really depends on what you think at that point.To tell you the truth, it is just a waste of talent, as far as I am concerned.I came to The Hindu to steer some top-notch reportage and to strengthen the edit pages - by making it more accessible and more nuanced. But I am bogged down with this hourly need to consult you, and with the practice of selecting articles on the basis of whether you've been addressed as "Malini" or "Ma'am" in the covering letters.I am also sick of this constant play of yours: to pitch one person against another for one week, and then reverse it in the next. One is also tired of your changing goalposts.
The Sunday Anchor has to be reportage-driven, and then suddenly it becomes policy-driven, and then suddenly, depending on what you hear or get impressed with, it has to be made reportage-driven again.I am a hardcore journalist and I came to journalism with a certain anger, with a certain cockiness. I have seen people dying in front of my eyes, their entrails in their hands. I have had guns pointed to my temple. Getting my blood pressure high in a conflict zone is a part of my life. But I do not like to get my blood pressure high while sitting in a cabin, waiting for a phone call from yours, of which I'll not understand a word.I have resigned with immediate effect. And that is what I have conveyed to the editor-in-chief.
Warmly,
r
'ది హిందూ' ఎడిటర్ గా సమూల మార్పులు తెచ్చిన సిద్దార్థ్ వరద రాజన్, అరుణ్ అనంత్ వెళ్ళిపోయాక..... విభిన్న పరిణామాల నేపథ్యంలో సాయినాథ్, ప్రవీణ్ నిష్క్రమించారు. ఆ తర్వాత సీనియర్ డిప్యూటి ఎడిటర్ డాక్టర్ శ్రీవత్సన్ ఇటీవలనే 'ది హిందూ' వీడారు.