Wednesday, March 31, 2010

మతకలహాలు రెచ్చగొట్టే ఛానెల్స్ పై ఉద్యమించండి: అబ్రకదబ్ర

                                                                                హైదరాబాద్
                                                                              మార్చ్ 31, 2010
ప్రియమైన...విజిటర్స్ కు.... బ్లాగర్ల్ కు...

నమస్తే...
నేను గతంలో పంపిన రెండు లేఖలకు మీ నుంచి వచ్చిన స్పందనకు ఆనందంగా ఉంది. వాటి మీద మంచి చర్చ జరిగింది. ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకు వచ్చేందుకు మీకు ఈ లేఖ అర్జెంటుగా రాస్తున్నాను. మీరు వెంటనే స్పందించకపోతే....ఈ లౌకిక సమాజానికి ఎంతో నష్టం. ఇప్పుడు మీరు రియాక్ట్ కాకపోతే...మత కలహాలు మీ ఇంటి దగ్గరకు వస్తాయి, మీ కుటుంబీకులనో, స్నేహితులనో హరిస్తాయి.


మీకు తెలుసు....మూడు రోజులుగా హైదరాబాద్ పాతబస్తీ...రగిలిపోతున్నది. మత కలహాలు ఇంకా చల్లారలేదు. రెండు మతాల వారు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇందులో ఎవరిది తప్పు?...అని దోష నిర్ధారణ చేసే సమయం కాదు ఇది.  ఎందుకంటే...తప్పు చేసిన వాడు, తప్పు చెయ్యని వాడు ఈ విషయానికి మతం రంగు పులిమి...పాత గాయాలను రేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనకు మంచిది కాదు. పట్టపగలు కత్తిపోట్లు, బీభత్సంగా రాళ్ళు రువ్వుకోవడం దుష్పరిణామానికి సంకేతాలు.

ఈ పరిస్థితులలో....సంయమనం పాటించాల్సిన కొన్ని తెలుగు ఛానళ్ళు ఈ దారుణాన్ని ప్రసారం చేస్తున్నాయి. పరిస్థితిని మరింతగా రెచ్చగొడుతున్నాయి. TV-9, N-TV, Saakshi, ABN-AndhraJyothi చానళ్ళు నిన్న మత కలహాల దృశ్యాలను ప్రసారం చేసాయి. ఇది అనైతికమని...గతంలో గుజరాత్ అల్లర్ల సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసినా...ఈ ఛానెల్స్ కు పట్టడంలేదు. ఇలాంటి గైడ్ లైన్స్ ఉన్నట్లు...ఈ ఛానెల్స్ లో పని చేసే బాసులకు తెలియదని అనిపిస్తున్నది. 

ఇప్పుడు నాకొక అనుమానం వచ్చింది. రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చేందుకు...ఎవరైనా...ఈ కల్లోలాన్ని ఛానెల్స్ ద్వారా ప్రసారం చేయించి ఆ మంటల్లో రాజకీయ చలి కాచుకోవాలని చూస్తున్నారా?...అని. ఆ గొడవ మనకు ఎందుకు? డబ్బు కోసం గడ్డి కరిచే కుసంస్కారపు ఛానల్ యాజమాన్యాలు, హెడ్లు ఉన్నంత కాలం ఏదైనా సాధ్యమే. కాబట్టి...ఈ మీడియా వల్ల... మత కలహాలు పెచ్చరిల్లకుండా, చివరకు ఈ అల్లర్లు మన ఇంటి దరిచేరకుండా ఉండేందుకు మనమే ప్రయత్నించాలి. పౌరులే స్పందించాలి. 
ఎక్కడో అల్లర్లు జరిగితే మనకేమిటి?....అనుకోకండి. ఇవి మీ ఊరి దాకా పాకి రెండు మతాల వారి మధ్య చిచ్చు పెడతాయి. ఆకతాయిలు దీన్ని అనుకూలంగా చేసుకుని చెలరేగుతారు. మీ ఊళ్ళో శాంతి నాశనం అవుతుంది. మీడియా మహిమ వల్ల ఈ అల్లర్లు వికృత రూపం దాల్చే అవకాశం ఉందని మీరు గ్రహించండి. 

మత కలహాలకు ఆజ్యం పోసే ఛానెల్స్ ను మీరు నిలువరించవచ్చు. వాటికి మీ నిరసన తెలియజేయవచ్చు. అది ఎలాగంటే.....

1) ఛానెల్స్ ప్రధాన కార్యాలయాలకు ఫోన్ చెయ్యండి. ఇలాంటి పిచ్చి ప్రోగ్రామ్స్ ప్రసారం చేయవద్దని గట్టిగా బుద్ధి చెప్పండి 

2) అలాంటి ఛానెల్స్ చూడకండి. మీ వీధిలో ఒక సమావేశం పెట్టి....ఆ ఛానెల్స్ చూడబోమని ప్రతిజ్ఞ చేయించండి. తీర్మానాలు చేయండి

3) ఈ ఛానెల్స్ రోజూ లైవ్ ఫోన్ ఇన్ లు నిర్వహిస్తాయి. దేశభక్తులైన మీరు...దీన్ని అవకాశంగా తీసుకోండి. లైవ్ లో రెండు మాటలు...ఆ కార్యక్రమానికి సంబంధించినవి మాట్లాడి...ఆ తర్వాత...మత కలహాలు ప్రోత్సహిస్తున్నందుకు....ఆ ఛానల్ హెడ్ ను ఆగకుండా బండ బూతులు తిట్టండి. బుద్దిలేదా? అని అడగండి. మన లైన్ కట్ చేసే వరకూ....తిట్ల దండకం ఆపకండి

4) పదవీ విరమణ చేసినవారు, ధైర్యం ఉన్న వారు....కోర్టులలో పిటిషన్లు  వెయ్యండి. ప్రెస్ కౌన్సిల్, సుప్రీంకోర్ట్, యూ.ఎన్. వంటి సంస్థలకు లేఖలు రాయండి. వాటికి ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ లో ఫిర్యాదులు పంపవచ్చు. 

5) ఈ ఛానెల్స్ హెడ్లకు, బడ్లకు బుద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు జరపండి. 

పౌరులారా....దీన్ని తేలికగా తీసుకోకండి. ఈ బాధ్యతారహిత ఛానెల్స్ వల్ల చాలా ప్రమాదం ఉంది. ఈ మీడియాను ప్రభుత్వం నియంత్రించలేదు. రాజకీయ లబ్ధి కోసమో, టీ.ఆర్.పీ. పిచ్చితోనో ఇవి మన జీవితాలు ఛిద్రం చేస్తాయి. ప్రమాదం ముంచుకు వచ్చింది. 
ఇప్పుడు కావలసింది...పౌర స్పందన. ఇది మీ ఇంటి నుంచి, మీ నుంచి ప్రారంభం కావాలి. నేనేదో ఆవేశంతో రాస్తున్నా అని అనుకోకండి...సమస్య సున్నితత్వాన్ని గ్రహించండి. ఆలస్యం చేయకుండా...ఉపక్రమించండి.
జై హింద్ 
ఆవేదనతో...మీ 
అబ్రకదబ్ర
ఫిలింనగర్ 
హైదరాబాద్   

తెలుగునాట సహకార రంగంలో న్యూస్ పేపర్ ఆవశ్యకత....?

ఆంధ్రప్రదేశ్ లో మీడియా మరీ గబ్బుపట్టిపోయిందని చాలా మంది అభిప్రాయం. ఇది నూటికి తొంభై పాళ్ళు నిజమే అని నాకు అనిపిస్తున్నది. ఈ తెలుగు చానళ్ళ సంఖ్య పెరిగాక...పరిస్థితి  మరీ దారుణంగా తయారయ్యింది. ప్రతి ఒక్కడూ..జర్నలిస్టు అయిపొయ్యాడు...ఛానెల్స్ లో అభిప్రాయాలు ఇస్తూ హార్డ్ కోర్ చర్చలు ఆలవోకగా జరిపేస్తున్నారు. జర్నలిజం విలువ, ప్రభావం, ఉపయోగం తెలియని వాళ్ళు,  యాజమాన్యం అడుగులకు మడుగులొత్తే వాళ్ళు, మాటల గారడీ చేసే వాళ్ళు, బూతును మార్కెట్ చేయడంలో తలపండిన అల్పబుద్ధులు...మీడియాను దున్నేస్తున్నారు. 

ఈ క్రమంలో ఫ్రాన్స్ దినపత్రిక   Le Monde తరహాలో...సహకార రంగంలో ఒక తెలుగు దినపత్రిక పెడితే ఎలా ఉంటుందని...ఒక సన్నిహిత మిత్రుడు ప్రతిపాదన చేశాడు. వేలాది మంది నామమాత్రపు డబ్బు వేసుకుని....నిష్పాక్షికంగా పత్రిక నడపవచ్చని ఆ సీనియర్ జర్నలిస్టు మిత్రుడు  చెప్పాడు. ఆ పత్రిక గురించి వికిపెడియాలో ఈ కింది సమాచారం ఉంది.
  The paper's journalistic side has a collegial form of organization, in which most journalists are not only tenured, but financial stakeholders in the enterprise as well, and participate in the elections of upper management and senior executives. In contrast to other world newspapers such as The New York Times, Le Monde was traditionally focused on offering analysis and opinion, as opposed to being a newspaper of record. Hence, it was considered less important for the paper to cover "all the news that's fit to print" (the motto of The New York Times) than to offer thoughtful interpretation of current events. Writers of lead reporting articles did not hesitate to provide commentary or venture predictions. In recent years, however, the paper has established a greater distinction between fact and opinion.

నిజమే, పత్రికలలో-ఛానెల్స్ లో నిజాన్ని నిజంగా చూపాలి, అభిప్రాయాన్ని అభిప్రాయంగా చూపాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న రేఖ చెరిపేసి...మన మీడియా యజమానులు జర్నలిజాన్ని ఆగమాగంచేస్తున్నారు. జనాలను గొర్రెలుగా భావించి అజెండాలు సెట్ చేస్తున్నారు. చాలా తక్కువ విలువలు, బాగా ఎక్కువ డబ్బున్న యజమానులు, డబ్బు కోసం ఏపనైనా చేసే జర్నలిస్టుల వల్ల సమస్య వచ్చిపడింది. వృత్తి పట్ల నిబద్ధత లేకుండా..."అంతా చూపుతున్నారు..మనమూ చూపుదామ"ని అనుకునే బాపతు గాళ్ళు పెరిగి పొయ్యారు. ఇదేంటి సార్ అంటే...కోపానికి వస్తున్నారు. రాళ్ళు రువ్వుతున్నారు.


మీడియా హౌజులు, రాజకీయ పార్టీ కార్యాలయాల మధ్య హాట్ లైన్ ఏర్పడడంతో...మూడు నాలుగు రూపాయలు పెట్టి పేపర్ కొనుకునే రీడర్, నెలకు మూడు నాలుగొందలు పెట్టి కేబుల్ కనెక్షన్ పొందిన వీక్షకుడు ఏది నిజమో తెలియక సతమతమవుతున్నాడు. అన్ని ప్రధాన పత్రికలు ప్రధాన పార్టీల బాకాలు గానో, ఏజెంట్లుగానో మారాయి. ఎడిటర్లు పార్టీలకు సలహాదార్లు అయ్యారు. ఈ పరిస్థితిలో జనం గందరగోళపడుతున్నారు. ఈ పరిస్థితిలో  సహకార రంగంలో ఒక పత్రిక ఆలోచన ఎలావుందంటారు?

సైన్స్ రిపోర్టింగ్ కు ప్రాధాన్యమివ్వని తెలుగు పేపర్లు

ఎప్పుడూ...రాజకీయం, సినిమా, క్రైం వార్తలకు బాగా అలవాటు పడిన తెలుగు పేపర్లు సైన్స్ రిపోర్టింగ్ ను పెద్దగా పట్టించుకోవు. ఇది మరొకసారి ఈ రోజు  నిరూపితమయ్యింది. అంత్యంత కీలకమైన 'బిగ్ బ్యాంగ్' ప్రయోగం విజయవంతమైన వార్తకు అటు 'ఈనాడు' గానీ..ఇటు 'ఆంధ్రజ్యోతి', 'సాక్షి'గానీ ప్రాముఖ్యమిచ్చి మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించలేదు. మొదటి పేజీలో 'హై లైట్' బాక్స్ ఇచ్చి...వార్తను మాత్రం లోపల ప్రచురించారు. ఆ తెలుగూ సరళంగా ఉన్నట్లు అనిపించలేదు. వీళ్ళందరికీ...సానియా పెళ్లి వ్యవహారం ముఖ్యమయ్యింది.


"విశ్వ" ప్రయత్నం...శీర్షికన..'ఈనాడు' 13 వ పేజీలో అట్టడుగున ఈ వార్త వేసింది. ఇది దారుణం. "విశ్వసాగర మథనానికి సంబంధించి భారీ ప్రయోగం దిగ్విజయంగా సాగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగం. భౌతిక శాస్త్ర చరిత్రలోనే ఇది మేలి మలుపు కానుంది," అన్న ఇంట్రో తో ఇచ్చిన వార్తకు ఇంత తక్కువ ప్రాధాన్యతా? మొదటి పేజీలో సగం పేజీ vivel వారి యాడ్ ఉంది...పోనీలే..అనుకుందాం. మరి...ఎంతో నష్టపోతూ..జనం కోసమే జర్నలిజం చేస్తున్న...మన వేమూరి రాధాకృష్ణ సారు ఈ వార్తను ఐదో పేజీకి పంపారు. "బిగ్ బ్యాంగ్ సక్సెస్" అని శీర్షిక ఇచ్చారు. ఫుల్ ఇంగ్లిష్.

జనం ఎజెండా నా ఎజెండా అని ఒక 'ప్రత్యేక వ్యాసం' రాసిన వే.రా. "ప్రకటనల 'సాక్షి'గా వివక్ష" అన్న వార్తను మొదటి పేజీలో ప్రముఖంగా అచ్చొత్తారు. కాగ్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పై దాడి చేస్తూ...రాసిన ఆ వ్యాసరాజం స్థానంలో ఈ సైన్స్ వార్త వేయొచ్చు కదా! 'సాక్షి' ఏమైనా భిన్నంగా చేస్తుందని అనుకుంటే...అదీ నిరాశ పరిచింది. మూడో పేజీలో వార్త టాప్ లో ప్రముఖంగా ప్రచురించడం...ఈ కీలక ప్రయోగంలో పాల్గొన్న ఏలూరుకు చెందిన శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్ ఫోటో వేయడం...గుడ్డిలో మెల్ల.


The Hindu ఈ వార్తకు సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. 'Big Bang machine' creates record collisions' అనే శీర్షికతో..."Could be seen as a giant leap for mankind, CERN chief" డెక్ తో వార్త ఇచ్చింది. 
"Scientists smashed sub-atomic particles into each other with record energy on Tuesday, aiming to recreate conditions just after the Big Bang that gave rise to the universe 13.7 billion years ago," అన్న లీడ్ వాక్యంతో ప్రారంభించింది. 


ఇలాంటి సైన్స్ వార్తలు సాధారణ జనాలకు ఏమి అర్ధం అవుతాయి?...అర్ధమయ్యే వార్తలే మొదటి పేజీలో వేస్తాం....అన్న పిచ్చి వాదన మన తెలుగు సంపాదకులు చేస్తారు. ఈ మహానుభావులకు అర్ధం అయ్యిందే వార్త. విజ్జ్ఞాన మైలురాళ్ళ గురించి అవగాహన లేక, వాటి ప్రాముఖ్యత గుర్తించలేక, ఆంగ్లంలో వచ్చే ఆ కాపీ లను సరళమైన తెలుగులో రాసే జనం లేక అన్ని పత్రికలూ సతమతమవుతున్నాయి. మిగిలిన పేపర్లు, ఛానెల్స్ ఈ అంశానికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాయో చూడాలి.  

Tuesday, March 30, 2010

అయేషా కేసులో 'ఐ-న్యూస్' అంకం రవి సమాంతర విచారణ

కోర్టు విచారణలో ఉన్న కేసుపై మీడియా విచారణ బహిరంగ జరపకూడదన్నది జర్నలిజంలో మౌలిక సూత్రం. దీన్ని పూర్తిగా అతిక్రమించి ఐ-న్యూస్ ఛానల్ లో అంకం రవి గారు 'హార్డ్ కోర్' చర్చ జరిపారు నిన్న రాత్రి. ఆయేషా హత్య కేసులో...పోలీసులు అరెస్టు చేసిన సత్యం బాబు ఆరోగ్యం దెబ్బతిన్నదని, పోలీసులు అతని గురించి పట్టించుకోవడంలేదని...చర్చ జరిపారు.


ఈ కార్యక్రమంలో భాగంగా...స్టూడియోలో ఒక పాత్రికేయుడు సహా ముగ్గురిని...విజయవాడ నుంచి ఆయేషా తల్లి సహా మరో ముగ్గురిని లైన్ లో తీసుకుని ఈ చర్చ జరిపారు. మధ్యలో...ఇటీవల మరణించిన మాజీ మంత్రి కోనేరు రంగా రావు గారి మనవడిని రవి గారు కాసేపు గ్రిల్ చేశారు. ఈ గోలలో ఒకరి మాట ఒకరికి వినిపించలేదు.

దాదాపు మూడేళ్ళ కిందట జరిగిన ఈ హత్య చాలా సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసులో పిల్లిమొగ్గలు వేసి నవ్వులపాలయ్యారు. ఈ కిరాతక హత్య చేసిన దుర్మార్గులు ఎవరో తెలుసుకోవాలని తెలుగు ప్రజలు కోరుకుంటారు. ఇదంతా ఓకే. అయితే...ఈ కేసులో...చిల్లర దొంగ సత్యం బాబును ఇరికించారని, అతని ఆరోగ్యం దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదని  అర్ధం వచ్చేలా రవి విచారణ సాగింది. నిజంగా...పోలీసులు అతన్ని ఇరికించి వుంటే..దాన్ని నిరూపించే సాక్ష్యాలు రవి చూపాల్సి వుంది. 'ఇప్పుడు సత్యం బాబు చనిపోతే...ఎలా..." అన్న అంశంపై చర్చ సుదీర్ఘంగా జరిపారు. 


ఈ కేసును దగ్గరి నుంచి చూసినట్లు చెప్పుకుంటున్న ఐ-న్యూస్ గుంటూరు విలేకరి ఫోన్ ఇన్ ఇస్తూ...పోలీసుల మీద చాలా వ్యాఖ్యలు చేశారు. సహజంగానే బాధలో ఉన్న అయేషా తల్లి గారు లైవ్ లో చాలా కటువైన వ్యాఖ్యలు చేశారు.

ఈ చర్చ అంతా చూశాక అర్థం అయ్యింది ఏమిటంటే....అయేషా కేసులో  పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు...అయినా....న్యాయ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. నిజంగా కేసులో లొసుగులు ఉంటే....సత్యంబాబు లాయర్ సాయం తీసుకుని ఉంటే బాగుండేది. అలా కాకుండా...బహిరంగ  విచారణ జరిపితే...జనాలకు వ్యవస్థల మీద నమ్మకం సడలే అవకాశం ఉంది. కోర్టు ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తే అంకం రవిని, కందుల రమేష్ ను, వాసు రాజును బుక్ చేయవచ్చు. 

Monday, March 29, 2010

తెలుగు ఛానెల్స్ కు దొరికిందిరా... తాజా బకరా.....శ్యామల

ఒక మూడు రోజుల నుంచి తెలుగు ఛానెల్స్...తాను జోగినిగా చెప్పుకుంటున్న శ్యామల చుట్టూ తిరుగుతున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే...ఆమె మీద సానుభూతి కన్నా...చాలా చలాకీగా ఉన్న ఆమెను సుందరంగా/రమ్యంగా/ సెక్సీ గా చూపడంపై ఈ ఛానెల్స్ దృష్టి పెట్టడం. 

శ్యామలను ఇంతగా హైలైట్ చేయడం ఆరంభించింది...zee-24 gantalu ఛానల్ వారు. శుక్రవారం రాత్రి రెండు గంటలకు పైగా...'శ్యామల ఆంటీ' పేరుతో ఒక సెమీ బూతు మాటల కార్యక్రమం నడిపారు. ఆమె కారు దిగిన దగ్గరి నుంచి....స్టూడియో లోకి వచ్చే దాకా...తీసిన వీడియో ఫూటేజ్ ను చాలా అందంగా చూపి గ్లామరైస్ చేశారు. ఇక యాంకర్ ఈశ్వర్ గారు...ఆమెతో చాలా తమకంగా మాట్లాడుతూ...నానా చెత్త ప్రశ్నలు వేసారు. 'హా..మీరు అలా చేతులు తిప్పుతుంటూ మాట్లాడుతుంటే..." నుంచి..."శ్యామల ఆంటీ అందం చూసి అంతా ఫ్లాట్ అయిపోతున్నారు...." వంటి చాలా చిలిపి స్థాయి మించిన స్టేట్మెంట్లు పదేపదే ఇచ్చారాయన. ఆమెకు 'ఆంటీ' అని తగిలించింది ఈశ్వర్ గారే నట. నిజానికి...గంభీరమైన గళంతో సంసారపక్షంగా యాంకరింగ్ చేసే...ఈశ్వర్ గారు శ్యామల విషయంలో ఎందుకు అలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు.

జనరల్ గా శైలేష్ గారి బృందం...ఇలాంటి స్టోరీల నుంచి మాగ్జిమం పిండుతుంది. అందుకు అది అనుసరించే మార్గం....ఫోన్ కాల్స్. 'చెప్పండి...శ్యామల ఆంటీ లో మీకు నచ్చింది ఏమిటి?'  అని ఆ యాంకర్ అడగడం..ఒకడు ''ఓహ్...ఆంటీ..మీరు చాలా సెక్సీగా ఉన్నారు..." అనడం..."అయితే..నాలో మీకు బాగా నచ్చింది ఏమిటి?" అని ఆ అక్కయ్య హావభావాలు, చిలిపి చేష్టలతో తెలుసుకోగోరడం...జరిగాయి. ఆమె మనసు ఎవరు దోచుకున్నదీ తెలుసుకునే ప్రయత్నం చేసారు ఈశ్వర్. ఆ కామెంట్స్, ఫోన్ కాల్స్ నాకు పరమ చికాకుగా అనిపించాయి. అయితే....ఆ సమయంలో చాలా మంది ఫోన్లో ఆమెతో మాట్లాడాలని ఉబలాట పడ్డారట. అంతే....కార్యక్రమం విజయవంతం అయినట్లే కదా! 

మర్నాడు...నేను ఊళ్ళో లేను. 'సాక్షి' వాళ్ళు శ్యామలను, మరొక జోగినిని లైన్ లోకి తెచ్చి ఘోరంగా కార్యక్రమం నడిపారని, అది చూసి రోత పుట్టి టీ.వీ.చూడడం ఆపానని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు. వాళ్ళిద్దరూ...ఒకర్ని ఒకరు పొడుచుకోవడం...శ్యామల అంతకు ముందు జీ..లో చేసిన వ్యాఖ్యలపై మరొక సీనియర్ జోగిని గారు విమర్శలు గుప్పించడం జరిగిందట. N-TV కూడా కచ్చితంగా ఈ కార్యక్రమం ప్రసారం చేసే ఉంటుంది. ఇలాంటి స్టోరీ లకు మసాలా దట్టించడంలో దిట్టలు కొలువై ఉన్నారు....చౌదరి గారి దర్బారులో.

ఇక ఈ రోజు...మన TV-9 రంగ ప్రవేశం చేసింది. నిజానికి...బ్రహ్మాండం బద్దలయ్యే స్టోరీలు సైతం...ఇతర ఛానెల్స్ చేసాక రవిప్రకాష్ చానెల్ ముట్టుకునేది కాదు. కాస్త సేలబుల్ ఎలిమెంట్ ఉంటే...అందునా ఆడోళ్ళ యవ్వారం అయితే...ఈ చానెల్ కొన్నాళ్ళుగా నిర్మొహమాటంగా అలాంటి స్టోరీ లను ఫాలో అప్ చేస్తున్నది. అందులో భాగంగా....శ్యామల అక్క TV-9 స్టూడియో లో ప్రత్యక్షం అయ్యారు...సోమవారం సాయంత్రం. యాంకర్ భద్రి గారు కూడా...ఫోన్ కాల్స్ తీసుకుని...ఆమె పర్సనల్ వివరాలు అందించి వీక్షకులను రంజింపచేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక సినిమా మసాలా ఉంది. దర్శకుడు శంకర్ ఫోన్ లైన్లోకి వచ్చి...శ్యామలకు సినిమా చాన్స్ ఇస్తానన్నాడు. ఆ ఊపులోనే...తాను జోగినిలకోసం ఒక ట్రస్టు పెడతానని శ్యామల ప్రకటించారు.

ఆ తర్వాత కొద్ది సేపటికి HM-TV వాళ్ళు 'పిన్ని వర్సెస్ ఆంటీ' అని ఒక కార్యక్రమం నడిపారు. వాళ్ళు...శ్యామల కు ఆ సీనియర్ జోగిని గారికి మధ్య మాటల యుద్ధాన్ని రెండు విడివిడి బాక్స్ లలో చూపారు. అది లైవ్ కాదనుకుంటా. మొత్తం మీద...ఛానల్స్ ఇలా ఒక విధివంచిత జోగినిని తెరకు ఎక్కించి....కార్యక్రమాలు నడిపాయి. 

నిజానికి...జోగినిలు, మాతంగులు వంటి వ్యవస్థలపై ఒక స్టోరీ చేసి...శ్యామల ధైర్యం, చదువు, చొరవలను ఒక కేస్ స్టడీ గా ఒక అర్ధగంట కార్యక్రమం చేస్తే...అది బాధ్యతాయుతంగా ఉండేదనిపించింది.  అలాకాకపోయినా...శ్యామల జీవితంపై ఒక స్ఫూర్తిదాయక స్టోరీ చేస్తే బాగుండేది. ఇలాంటి వాళ్ళను సెక్సీ గా చూపుతూ...స్టూడియో లైట్స్ తిమ్మిరిలో ఉన్న వాళ్ళను పోరంబోకు ప్రశ్నలు అడుగుతూ....పనీ పాటా లేని కాలర్స్ తో వాళ్ళను ఇష్టమొచ్చిన ప్రశ్నలు వేయిస్తూ... కాలక్షేపం  చేయడం టీ.ఆర్.పీ. రేసులో సాగించే...ఒక పిచ్చి పరుగు. ఒక ఘోరం, ఒక పాపం.
-------------------------------------------------------------

నోట్: ఈ పోస్టు శీర్షికలో 'బకరా' అన్న పదం వాడడం శ్యామల గారిని కించపరచడానికి కాదు. ఛానెల్స్ వెకిలిని ప్రస్తావించడానికే. ఆ పదం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని...శ్యామల గారికి సవినయ విన్నపం. ఇతర జోగినులకు సాయం చేయాలన్న ఆమె తలంపునకు వందనం.

విలేకరి-నేత-పోలీసు-అధికారి: ఇదీ నయా మాఫియా

రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు విలేకరులు ఒక టూరిస్టును వేధించి...ఆమెను దోచుకున్నట్లు వచ్చిన వార్త కలవరపెట్టింది. ఈ బాపతు దొంగనాయాళ్ళు ఈ వృత్తిలో ఉన్నారని తెలుసుగానీ...మరీ ఇలా బరితెగించి దోచుకుంటారని అనుకోలేదు. ఈ వార్త పెద్దగా బైటికి రాకుండా ఛానెల్స్, పేపర్స్ జాగ్రత్తలు తీసుకున్నాయి. 

ఒక డజను ఛానెల్స్, ఒక అర డజను పెద్ద పేపర్లు, వందలాది చిన్న పేపర్లకు కలిపి...రాష్ట్రంలో వేల సంఖ్యలో విలేకరులు ఉన్నారు. 1989 ప్రాంతంలో 'ఈనాడు' రామోజీ గారు మినీలు అన్న పిల్లపేపర్లను సృష్టించి...వాటికి విలేకరులను పెట్టారు. నెట్ వర్క్ ఉండాలని మండలానికి ఒక విలేకరిని నియమించారు. మొదట్లో ఈ విలేకరుల (stringers/ contributors) నియామకంలో కొంత నాణ్యత పాటించేవారు కానీ...కాలక్రమేణా...అన్ని పేపర్లు/ఛానెల్స్ ఆ నమూనాను కాపీ చేసి నాలుగు అక్షరం ముక్కలు రాయడం వచ్చిన వాడినల్లా విలేకరిగా తీసుకున్నాయి. రియల్టర్లు, చిట్ ఫండ్స్ వాళ్ళు, రాజకీయ కండూతి ఉన్న కోటీశ్వరులు... పెట్టిన ఛానెల్స్ గత రెండేళ్లుగా ప్రతి మండలంలో ఒక కేమేరామ్యాన్ ను పెట్టాయి. ఇది నిజానికి శ్రమ దోపిడీ అయినా...ఈ ఉజ్జోగాలకు బాగానే పోటీ ఉంటుంది. 

ఇవ్వాళ ప్రతి మండల కేంద్రంలో విలేకరి అన్న ముద్ర ఉన్న వాళ్ళు కనీసం 40 మంది తయారయ్యారు. వీళ్ళలో సగం మంది మంచోళ్ళు ఉన్నారనుకున్నా...ఒక 20 మంది ఏక్ దం అవినీతిపరులు, బేవార్స్ గాళ్ళు విలేకరులుగా అవతారం ఎత్తారనేది నిష్టురసత్యం. వీళ్ళు ప్రభుత్వం నుంచి బస్సు, రైల్ పాసులు పొందుతారు. వీళ్ళకు వాళ్ళ సంస్థలు సామాజిక హోదా ఇచ్చాయి, కానీ...ఆర్ధిక హోదా ఇవ్వలేదు. దాంతో...సోషల్ స్టేటస్ కోసం....వీళ్ళలో అత్యధికులు అవినీతికి పాల్పడుతున్నారు. 

కొందరు...విలేకర్లు...తమ ప్రాంతంలో రాజులుగా వెలుగొందుతున్నారు. వాళ్ళు ఏ పాపానికైనా ఒడిగట్టడానికైనా వెనుకాడరు. వీరి దగ్గర కలం బలం ఉంది కాబట్టి...ఆ ప్రాంతంలో రాజకీయ నేతలు, పోలీసులు, అధికారులు, కాంట్రాక్టర్లు వీరి అడుగులకు మడుగులొత్తడం ఆరంభించారు. ప్రచారం కోసం వీళ్ళ మీద ఆధారపడుతున్నారు. వీరంతా 'కలిసిమెలిసి' జీవిస్తున్నారు. ఇలా...రాష్ట్ర వ్యాప్తంగా విలేకరి-నేత-పోలీసు-అధికారితో కూడిన నయా మాఫియా ఏర్పడింది. ఇది ప్రమాద స్థాయిని ఎప్పుడో దాటింది. కానీ...ఎవ్వరూ దీనిపై బహిరంగ చర్చకు దిగడంలేదు. ఎవడి భయం వాడిది.

విలేకరుల దర్జా వ్యవహారం చూసిన...జేబు దొంగలు, దారి దోపిడీ గాళ్ళు కూడా...'అబ్బ విలేకరి ఉజ్జోగం ఉంటే చాలు..... పబ్లిగ్గా...గౌరవంగా...దంచుకోవచ్చు.." అని గుర్తించి....డబ్బు పెట్టో, కులాన్ని వాడుకునో విలేకరులు అయిపోయ్యారు. ఇప్పుడు రోజూ పేపర్లలో సుద్దులు చెప్పే యాజమాన్యాలు....ఈ విలేకరులను అడ్డంపెట్టుకుని....ప్రైం ప్రాంతాలలో స్థలాలు ఛీప్ గా కొనుకుని స్థిరాస్తులు సమకూర్చుకున్నాయి. ఫుల్ టైం ఉద్యోగులు అంతా పత్తిత్తులు అని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. ఈ పార్ట్ టైం వాళ్ళ వార్తలు ఎక్కువగా ప్రచురిస్తూ/ప్రసారం చేస్తూ....వారి నుంచి...సొరకాయలు, చేపలు, బీరుకాయలు కాజేసే వాళ్ళు చాలా మంది మాకు తెలుసు. ఇక్కడ క్వాలిఫికేషన్స్ తో పని లేదు...కాబట్టి...అమాం బాపతు గాళ్ళు విలేకరులయ్యారు. అందరూ...ఇలా ఉంటారని చెప్పడం తప్పు కానీ...చాలా మంది ఇలా ఉంటారని మా పరిశీలనలో తేలింది. 
మొత్తం మీద....రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ఈ మాఫియా విస్తరిస్తున్నది. ఇది అవినీతిని పెంచి పోషించే వ్యవస్థ. చాప కింద నీరులా విస్తరించింది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక...స్థానిక ప్రజలు చస్తున్నారు. ఈ విలేకరులు...చాలా చోట్ల భూ పంచాయితీలు చేస్తున్నారు. వీళ్ళకు ఇసుక వ్యాపారాలున్నాయి. కొందరు వివిధ కేసులలో మధ్యవర్తులుగా మారి తీర్పులు చెప్పి దండుకుంటున్నారు. ఇదేమిటని ఈ విలేకరులను మందలించామా....రేపు వీళ్ళు అంతా జమై ఏదో ఒక మిషతో వాళ్ళను పేపర్లోకి ఎక్కిస్తారు, అభూతకల్పనలు సృష్టించి....పరువు పంచనామా చేస్తారు. వీళ్ళ జోలికి పోతే...'పత్రికా స్వేచ్ఛ'కు సంకెళ్ళని అరిచి గోలపెడతారు. వీళ్ళు చాలా మంది నుంచి బలవంతానా....వ్యాపార ప్రకటనలు వసూలు చేస్తారు. ఆ ప్రకటనలలో కొంతభాగం మీడియా హౌజ్ లు వీళ్ళకు ఇస్తాయి...కాబట్టి...వీళ్ళు వార్తకు, ప్రకటనకు ముడి పెట్టి బాగా సంపాదిస్తారు.

ఈ విధంగా...అన్ని జిల్లాలో...అవినీతి వర్ధిల్లుతున్నది. గూండాగిరి సాగుతున్నది. తప్పులు ఎత్తి చూపాల్సిన విలేకరులు....కిమ్మనక పోవడం వల్ల..చాలా విషయాలు వెలుగులోకి రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇది సభ్య సమాజం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఇది రానున్న రోజుల్లో మరింత వెర్రి తలలు వేసి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన 'ఫోర్త్ ఎస్టేట్' మూలాలను నిర్వీర్యం చేయబోతున్నది.

నాకు అప్పోయింట్మెంట్ లెటర్ ఇస్తూ..."బాబూ...నువ్వు విలేకరివి కాదు. సమాజ సేవకుడివి...గుర్తు ఉంచుకో," అని 'ది హిందూ'లో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీ విరమణ చేసిన దాసు కేశవ రావు గారు నాకు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఆయన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చి...ఎప్పుడూ సన్మార్గంలో నిలిపాయి. ఇప్పుడు అలా మంచి చెప్పే నాథుడు లేదు, పాటించే వాడూ లేదు. మరెలా? మీకు తెలిసిన అవినీతి విలేకరుల గురించి రాయండి. రోజూ ఈ అంశం మీద కాసేపు కన్నీళ్ళు పెట్టుకుని....గుండె బరువు తీర్చుకుందాం. అంతకన్నా....మనం చేయదగినది ఏదీ లేదు.

Sunday, March 28, 2010

'ఆంధ్రజ్యోతి'ది.....వికారపు జర్నలిజమే: అబ్రకదబ్ర లేఖ

                                                                                        హైదరాబాద్,
                                                                                   మార్చ్ 28, 2010
డియర్ వేమూరి రాధాకృష్ణ భాయీ సాబ్ గారూ....
'జ్యోతికి మసిపూయగలరా!' అన్న ప్రశ్నతో మీరు నిన్న ప్రచురించిన ఒక ప్రత్యేక వ్యాసం చదివాక మీకు ఈ లేఖ రాయకుండా ఉండలేకపోతున్నాను. నిజమే అన్నా....'జ్యోతి'కి మసి పూయలేము గానీ...మసి వచ్చేది 'జ్యోతి' నుంచే గదా బ్రదర్! ఈ తిక్క లాజిక్ వదిలి...పాయింట్ల వారీగా మీ 'ప్రత్యేక వ్యాసం' చూద్దాం... 

1)   అన్నా..."తనను ధిక్కరించిన వారిని దండించడానికి ఇది సినిమా కాదు, రాజకీయ రంగం, ప్రజాస్వామ్య యుగం!" అని మొదటి పేజీలో ఒక బాక్స్ లో మీరు సెలవిచ్చారు. ఆ బాక్స్ పైన "పెద్ద మనిషీ..ఇదేనా పధ్ధతి...ఉండవల్లిపై విరుచుకుపడ్డ రోశయ్య" అని తాటికాయ అంత అక్షరాలతో బ్యానర్ స్టోరీ చూడకుండా మీరు మీ 'ప్రత్యేక వ్యాసం'లో ఈ వాక్యం రాసుకున్నట్లు ఉన్నారు. 
మీరు వ్యాసంలో రాసుకున్న వేయిన్నొక్క సుద్దులను...ఈ బ్యానర్...తూచ్ అని తీసిపారేస్తుంది కాదన్నా. అదొక స్టోరీ...దానికి రెండు పెద్ద బొమ్మలు. రెచ్చగొట్టే డెక్స్, 'కొంచెం నిప్పు...కొంచెం మెప్పు..' అనే కసరత్తు. ఇదేమి జర్నలిజం బ్రదర్? 

ఒక సీ.ఎం.ఒక ఎం.పీ.ని అందరిముందు పట్టుకుని కాస్త కటువుగా మాట్లాడడం వార్త కాదని ఎవరూ అనరు. అది మీకు పతాక శీర్షికా? కాంగ్రెస్ కొంపలో చిచ్చు పెట్టాలన్న తెంపరితనం కాదాఇది? నెగిటివ్ వార్తల పట్ల మనకున్న పిచ్చి మమకారం. ఈ వికారపు జర్నలిజాన్ని పెంచి పోషిస్తూ....నేను పత్తిత్తునని సంపాదకీయం పేజీలో ఎంత పెద్ద వ్యాసం రాసావ్ బ్రదర్!? ఇప్పుడు ఆ 'ప్రత్యేక వ్యాసం' సంగతి చూద్దాం. 


2) "దాడులు, నిరసనలు, కేసులు ఎదుర్కోని పత్రిక ఒక పత్రికే కాదు. అలాంటిది ఉన్నా లేనట్టే.." అని ఒక మిత్రుడు చేసిన వ్యాఖ్య గమనార్హం అని రాసుకున్నారు...మొదటి సుదీర్ఘ పేరాలో. మీ లాంటి పేపర్స్ తో ఇదే సమస్య స్వామీ. మీకు తోచింది రాసి..."ఇది ఒకడు (అత్యంత విశ్వసనీయ వర్గాలు, ఉన్నత స్థాయి వర్గాలు....బొంగు... భోషాణం...) చెప్పాడు అని రాసుకుంటారు. గుండెల నిండా "దమ్మున్న ఛానల్" అని ఓ...తెగ ఊదర కొట్టుకుంటున్నారు కదా...ఎప్పుడూ ఈ పదాల మాటున ఆడుకుంటే ఎలా? ఏదో...ఉండవల్లి వ్యాసంలో...."అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలియజేసిన సమాచారం ప్రకారం..." అన్న మాట వాడారు..మీ సోర్సును కాపాడుకునే ప్రయత్నం అనుకుందాం. మీ 'ప్రత్యేక వ్యాసం' లో కూడా 'ఒక మిత్రుడు' అని రాస్తే ఎలా బ్రదర్? మనకు తోచింది...వన వాదనకు అనువైనది రాసి....ఎవడికో అనామకుడికి ఆపాదిస్తే ఎలా? మీ పేపర్తో ఇదే పెద్ద సమస్య.

2) "ఒక పత్రికలో జర్నలిస్టు గా గడిపి, ఎం.ఎల్.ఏ.గా అవతారం ఎత్తిన కన్నబాబు.." అని రాసారు. ఎక్కడ ఏ పదాలు వాడాలో సో కాల్డ్ ఎం.డీ.కి మీకే తెలియకపోతే...మీ సిబ్బందికి తెలుస్తుందని నాలాంటి బేకార్ గాళ్ళు ఎలా అనుకుంటారు? కన్నబాబు...జర్నలిస్టుగా 'గడపడం' ఏమిటి? 'ఒక పత్రిక' ఏమిటి? అడుగడుగునా....నిజాలు దాయాలన్న బుద్ధి మన రక్తంలో ఉన్నట్లుందే!
కన్నబాబు పనిచేసింది 'ఈనాడు' లో. అతను అక్కడ 'గడప'లేదు. బాగా పనిచేసాడు...చాలా మంది జర్నలిస్టులలాగా మన బీటు పార్టీ జనాల చంకలు నాకి, పైరవీలు చేసి...కులం అడ్డం పెట్టుకుని...కోట్లు దండుకోలేదు. ఏమిటీ...'ఎం.ఎల్.ఏ. అవతారం ఎత్తాడా?"--ఇది కన్నబాబునే కాక...ఒక నియోజక వర్గ ఓటర్లను కించపరచడమే. తను ఎన్నికల్లో గిలిచాడు మహాశేయా. పదాలు కాస్త డిగ్నిఫైడ్ వి వాడితే బాగుంటుందేమో!


3) మీ పత్రికకు సొంత అజెండా లు ఉన్నాయన్న ఆరోపణపై...వివరణ ఇస్తూ..."ఆయా అంశాలు, వ్యక్తులు, పార్టీలకు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి," అని మీరు రాసారు. మీరు సత్యం అంగీకరించారు. కీప్ ఇట్ అప్. బలహీనుడి పక్షం ఉండడం 'ఆంధ్రజ్యోతి' అజెండా అన్నారు. ఇక్కడొక చిక్కు ఉంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి, మీకు చంద్రబాబు బలహీనంగా కనిపిస్తున్నారు. మనం కోరుకున్నట్లు...బాబు గారు అధికారం లోకి వస్తే...తమకు ఆయనే 'మరింత బలహీనుడి'గా కనిపిస్తే...జనం గతేం కాను. మొత్తం మీద మీ అజెండా చెప్పారు..సంతోషం.

4) ఏ.బీ.ఎన్. పై దాడి తర్వాత మీకు ఒక మిత్రుడు ఫోన్ చేసి..."మీరు ఏ కాజ్ కోసమైతే కృషి చేసారో..." అని బాధపడ్డారు. మీరు ఏ కాజ్ కోసం కృషి చేసారో...నా లాంటి మందమతులకు గుర్తుకు రావడం లేదు. కుల సంఘాలపై మీరు అప్పట్లో రాసిన వార్త...'డార్క్ ఎల్లో జర్నలిజం" అని నా నమ్మకం. ఈ వార్త వెతుకుతా...దీనిమీద మీకొక లెటర్ రాస్తా. మళ్ళీ..ఒక మిత్రుడు అన్నారు. ఎవరు సార్...మీ అజ్ఞాత మిత్రులు? వాళ్ళ పేర్లు చెబితే...వాళ్ళు మహానీయులో, అమాంబాపతు గాళ్లో తెలుసుకుని తరిస్తాం.

5) ఏమిటీ...ఆయన (వై.ఎస్.) పాదయాత్ర చేపట్టినప్పుడు 'ఆంధ్రజ్యోతి' మాత్రమే స్పందించి, ప్రాధాన్యత ఇచ్చిందా?  మీరు మాత్రమే ఇచ్చారా? ఎంత పెద్ద అబద్ధం! ఆ జన స్పందన చూసి మీడియా అంతా...స్పందించాల్సి వచ్చింది...చచ్చినట్లు. అది వై.ఎస్.కు మీరు చేసిన ఫేవరా? మీ డ్యూటీ మీరు చేశారు. అంతే.


6) టీ.ఆర్.ఎస్.కు ముందు 'బాసటగా నిలిచి' తర్వాత...'చంద్ర శేఖర రావు వ్యవహార శైలి అరాచకంగా మారడం.." అని ఒక మాట రాసారు. మన దురహంకారపు జర్నలిజాన్ని ప్రతిబింబించే మాటలివి. మీకు ఎవరి 'శైలి' నచ్చితే...వారిని ఎత్తుతారు....ఎవరు "దురహంకారులో" మీరే నిర్ణయిస్తారు...వారిని కూలదోస్తారు. జర్నలిస్టులు చేయాల్సిన పని ఇదా? జర్నలిజం ధ్యేయం ఇదని మీరు అనుకుంటున్నారా? కాస్త..జనానికి కూడా చాన్స్ ఇవ్వండి సార్....


7) "కాంగ్రెస్, టీ.డీ.పీ. కి ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పక్షం ఉంటే మంచిదని పలువురు భావించినట్లుగానే 'ఆంధ్రజ్యోతి' భావించింది.."అని రాసారు.  ఎవరా "పలువురు?". ఒకవేళ...ఈ మీ "పలువురు"...రాజకీయ ప్రక్షాళనకు వేమూరి రాధాకృష్ణ గారు ఎన్నికలలో నిలబడాలంటే  సై అంటారా? అలాగే....ఈ రొచ్చు జర్నలిజంలో కమలం లాంటి 'ఆంధ్రజ్యోతి' ఉంటే పరువు తక్కువ...అని ఈ మీ 'పలువురు' భావిస్తే...పేపర్, చానెల్ మూసిపారేసి వెళ్ళిపోతారా? 

8) ఓరి నాయనోయ్. "కృతఘ్నులు" మాత్రమే అలా చేయగలరు...అని కూడా రాసారు! మీరు రాసింది ఎలా ఉందంటే...."నేను ఆ పార్టీలకు మంచి ప్రచారం ఇస్తే...వాళ్ళు కనీసం కృతజ్ఞతాభావం తో మెలగడం లేదు...ఇదేమి దారుణం?" అన్నట్లుంది. మీడియా పని...మీడియా చెయ్యాలి గానీ...ఈ కృతజ్ఞత ఆశించడం ఏమిటి? ఆశించినా....మరీ బరితెగింపుగా ఈ 'ప్రత్యేక వ్యాసం' లో రాసుకోవడం ఏమిటి? మీకు నిజంగానే...ఏదీ దాచుకోవడం రాదు సార్.


9) 'కాదూ కూడదు అనుకుంటే, ఇప్పుడు కొత్తగా ఎవరికి వారు, తమ పార్టీ ప్రచారానికై పత్రికలు లేదా చానెళ్ళు ప్రారంభిస్తున్నట్లుగానే...'చిరంజీవి అండ్ కో' కూడా ఒక పత్రిక గానీ..ఛానల్ గానీ, లేదా రెండూ గానీ ప్రారంభించుకోవచ్చు,' అని మీరు రాసారు. మీరు తప్ప మిగిలిన వాళ్ళు పార్టీ ప్రచారానికి పత్రికలు, ఛానెల్స్ పెట్టుకుంటున్నట్లు మీరు చెప్పడం వల్ల తెలిసింది. 'చిరంజీవి అండ్ కో' ఏమిటండీ? నోటికొచ్చింది రాయండి....ఇదే జర్నలిజం అనండి....తెలుగు జనం చేసుకున్న పాపం. 


10) బ్రదర్...మన నీచ నికృష్ట రాజకీయ జర్నలిజం...మన మనసులో అసలు భావాలు....'ప్రత్యేక వ్యాసం' సాగే కొద్దీ బైటపడసాగాయి. "చిరంజీవి విషయంలో మీడియా విశ్లేషకులు, మేథావులు, రాజకీయ పరిశీలకులు కూడా సరిగా అంచనా కట్టలేకపోయారు. అందుకే..అధికారానికి దూరంగా, కేవలం 18 స్థానాలకే పరిమితం చేస్తూ తీర్పు ఇచ్చారు," అని రాసారు.
రాధాకృష్ణ గారూ...ఇది ఘోరం. ఇక్కడ చిరంజీవిపై మీ అక్కసు ప్రతి అక్షరంలో కనిపిస్తున్నది. బలహీనుడి పక్షం నిలబడతామని ముందు చెప్పారు కదా....చిరంజీవి బలహీనుడే కదా...(మీ ఓట్ల లెక్కలనుబట్టి చూస్తే). మరి ఆయనకు మద్దతివ్వడం మీ అజెండా కావాలి కదా? 

ఈ రాతకూతలతో మీరు ఇచ్చిన స్ఫూర్తితో...నేను కూడా ఒక కటువైన మాట చెబుతాను, మరోలా అనుకోకండి. ఈ రాష్ట్రాన్ని రెడ్లు, కమ్మలే ఏలాలా? బడుగులు..దళితులూ..డక్కామొక్కీలు తింటూ పైకి ఎదగ కూడదా? బీ.సీ.లను మీరు ఎదగనివ్వరా? మామకు కోలుకోలేని ద్రోహం చేసి...అధికారం చేచిక్కించుకున్న నాయకుడు....మీకు ఆదర్శపురుషుడు. మిగిలిన వాళ్ళు పిచ్చ జనం. ఏమి నీతి సారు?  


రాయాల్సింది ఎంతో ఉంది రాధాకృష్ణ భాయి..ఇక ఆపుతాను. "లోపాలను ఎత్తి చూపితే సవరించుకోవడం విజ్ఞుల లక్షణం....,"అని మీరు ఈ 'ప్రత్యేక వ్యాసం' లో ఒక మాట రాసారు. ఈ లేఖలో నేను రాసిన మాటలకు కోపగించుకోరని...మీరు, మీ బృందం విజ్ఞులు కాబట్టి....లోపాలు ఉంటే...సవరించుకుని...పేపెర్, ఛానల్ లతో తెలుగునేలను తెగ ఉద్ధరించాలని  కోరుకుంటూ...
మీ
అబ్రకదబ్ర
ఫిలిం నగర్
హైదరాబాద్

Friday, March 26, 2010

'ఆంధ్రజ్యోతి'ది ఎల్లో జర్నలిజమా...కాదా?

'మీడియాను కొట్టి...మొగసాల కెక్కిన మెగాస్టార్' అనే శీర్షిక...'రివర్స్ రాజ్యం' అనే డెక్ తో... ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు మొదటి పేజీలో ప్రచురించిన వార్త ఒక పరువు తక్కువ ఛీప్ జర్నలిజం. ప్రజలకు పత్రికలు, విలేకరుల మీద గౌరవం, నమ్మకం పోవడానికి ఇలాంటి బాధ్యతారహిత కథనాలే కారణం. మనం ఏది రాసినా...భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద కొట్టుకుపోతుదన్న దుర్భ్రమతో ఈ పత్రిక సాగించిన పచ్చి ఎల్లో జర్నలిజం ఇది.  వేమూరి రాధాకృష్ణ గారిని తక్కువ చేయడం...చిరంజీవి గారిని ఎక్కువ చేయడం ఉద్దేశ్యం కాదు కానీ...ఈ కథనం లోపాల చిట్టా..అని చెప్పక తప్పదు.
 
1) ఈ శీర్షిక పూర్తి మిస్ లీడింగ్. మెగాస్టార్ మీడియాను కొట్టాడా? పీ.ఆర్.పీ.నాయకులు దాడి చేసింది 'ABN-AJ' ఆఫీసు మీద తప్ప మీడియా మీద కాదు. ఈ ఛానల్, పేపర్ మీడియాలో ఒక భాగం తప్ప ఇవే మీడియా కాదు. రాధాకృష్ణ గారి జర్నలిజం చాలా మంది జర్నలిస్టులకు అభ్యంతరకరం. చిరంజీవి పై ఆ చానెల్ కథనం, మాటలు జర్నలిజం సూత్రాలకు లోబడని ఒక పరమ అభ్యంతరకరమైన కసరత్తు. తప్పు తెలుసుకోకుండా...పేపర్, ఛానల్ ను అడ్డం పెట్టుకుని...ఒక పార్టీ పై విషం చిమ్మడం...కచ్చితంగా ఎల్లో జర్నలిజమే అవుతుంది.

2) ఈ కథనానికి, దానికి వాడిన చిరంజీవి ఫోటోకు సంబంధం లేదనేది పక్కనపెడితే...అది ఒక దారుణమైన లీడ్. "కేంద్రం ఉద్వాసన చెబితే కిమ్మనకుండా..తిరుగు టపా కట్టిన తివారీ!.."అంటూ వున్న ఒక వాక్యం బాధ్యతారాహిత రాతలకు నిదర్శనం. వీళ్ళ బాధ కేంద్రం ఉద్వాసన చెబితే...తివారీ కిమ్మనకుండా వెళ్లినందుకా? ఏమిటీ అర్థం పర్థం లేని రాతలు?

3) ఈ కథనం అంతా...వ్యాఖ్యల మాయం. దీని బదులు...వేమూరి గారు స్వసంతకంతో ఒక సంపాదకీయం రాస్తే బాగుండేది. ఆదిత్య పేరుతో...విషం చిమ్మినా...అర్థం చేసుకోవచ్చు కానీ...ఇదేమి మాటల దాడి? ఇందులో ఆద్యంతం చిరంజీవిపై విషం చిమ్మారు. "కట్లు కట్టుకుని...కట్టు కథనాలు వినిపించారు," "నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.." అని ఏదేదో రాసారు. ఇది ప్రాస వికారం, ద్వేషపూరిత వ్యాఖ్యలు. చిరంజీవి ఈ రాతల మీద కోర్టుకు వెళితే...ఆ పత్రిక మీద కోలుకోలేని అద్భుతమైన పరువు నష్టం దావా వేయవచ్చు.

4) పీ.ఆర్.పీ. ఎంఎల్యేలు ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించడాన్ని అడుగడుగునా ఎద్దేవా చేసారీ కథనంలో. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు...తమ నేత మీద ఒక మీడియా హౌజ్ దాడిని సీ.ఎం.దృష్టికి తీసుకు వెళితే...దాన్ని హుందాగా స్వీకరించకుండా...ఇలా దాడి చేయడం దారుణం. పీ.ఆర్.పీ.గుండాలు రాళ్ళతో దాడి చేస్తే...మన వేమూరి బృందం...అక్షరాలతో దాడి చేసింది. ఇది రాసిన, ప్రచురించిన జర్నలిస్టులకు సిగ్గుచేటు. షేం.

5) తివారీ విషయంలో ఈ ఛానల్ "కత్తిమొన మీద నిలబడి" ఆపరేషన్ చేసిందని రాసుకున్నారు. ఇది నిజమా?

6) ఒకప్పుడు సాధారణ పాత్రికేయునిగా ఉన్న ఛానల్ ఎం.డీ. స్వల్ప వ్యవధిలోనే కోటీశ్వరునిగా ఎదిగారని....పీ.ఆర్.పీ. నేతలు ఆరోపించారు. ఈ అనుమానం మీడియాలో, మీడియా బైట చాలా మందికి ఉన్నాయి. దానికి దమ్ముంటే...వివరణ ఇవ్వాలి గానీ...అలా అడగడం తప్పు అన్నట్లు రాస్తే ఎలా?

7) నిజానికి ఎం.ఎల్.ఏ.లు చేసిన డిమాండ్లలో తప్పేమీ లేదు. 20 నుంచి 23 వరకు జరిగిన సంఘటనలపై స్వతంత్ర విచారణ జరపాలి. దాడులు ఆగాలనే...ప్రభుత్వం నిజంగానే ఆ పని చెయ్యాలి. ఎల్లో జర్నలిజాన్ని నిరోధించాలి. 


8) చివరకు...ఒక ఐదు పంక్తుల ఎర్ర పేరాతో కథనాన్ని ముగించింది. "ఒక రాజకీయ పార్టీ మీడియా మీద దాడి చేసి..అంతటితో ఆగకుండా తగుదునమ్మా అంటూ...మళ్ళీ తానే ప్రభుత్వం దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చెయ్యడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కావచ్చు!" అన్న పచ్చి అబద్ధాన్ని రాసుకున్నారు. 


రాధాకృష్ణ గారూ...మీరు జర్నలిజంలో నైతిక విలువలు లేని కథనాన్ని ప్రసారం చేశారు....చట్టంతో సంబంధంలేకుండా పీ.ఆర్.పీ.వాళ్ళు దాడులు చేశారు. దొందూ దొందే. ఇది ఇద్దరి తరఫునా జరిగిన బాధ్యతారహితమైన పని. వై.ఎస్. బతికి ఉండగా....చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసే వరకూ....ఆయనకు అనుకూలంగా కథనాలు రాసిన మీరు....వై.ఎస్.మరణం తర్వాత ప్రసారం చేస్తున్న కథనాలు మీకేదో...రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు స్పష్టంగా  చెబుతున్నాయి. జనంలో ఉన్న అనుమానాలు నివృతి చేయకుండా....ఇలాంటి విద్వేషపూరిత రాతలతో తెలుగు జర్నలిజాన్ని మరింతగా అథఃపాతాళంలోకి తొక్కకండి.

Thursday, March 25, 2010

తారాస్థాయికి చేరిన 'ఈనాడు'--'సాక్షి' యుద్ధం

ఒక పత్రిక తప్పుడు వార్తలు ప్రచురిస్తే...ఆ పత్రికకే ఒక ఖండన (రిజాయిన్డెర్) పంపే వారు...గతంలో. ఇప్పుడు అలా కాదు...'ఈనాడు' ఒక ప్రభుత్వ వ్యతిరేక వార్త రాస్తే ఆ మర్నాడే కాంగ్రెస్ ఎం.పీ. జగన్మోహన్ రెడ్డి పత్రిక 'సాక్షి' లో మొదటి పేజీలో ఒక ఖండన లాంటి వార్త వస్తుంది. అదే వై.ఎస్.కుటుంబం మీద వచ్చిన వ్యాసం అయితే...'సాక్షి' విశ్వరూపం చూపుతుంది. 'బక్క రైతు డొక్క చించిన...లీజు మారాజులు' అన్న శీర్షికతో బుధవారం 'ఈనాడు' పతాక శీర్షికన ప్రచురించిన ఒక కథనం రెండు మీడియా హౌజుల మధ్య మరొక తాజా యుద్ధానికి తెరలేపింది.

 (విచిత్రంగా...మా పేపర్ ఏజెంట్...నిన్న 'ఈనాడు' వేయకుండా 'సాక్షి' వేశాడు. నేను నిజానికి 'సాక్షి' తెప్పించుకోను. నెట్లో చదువుతా. 'ఈనాడు' లో వై.ఎస్. కుటుంబ వ్యతిరేక వార్తలు వచ్చిన ఒకటి రెండు సార్లు...మా పేపర్ బాయ్ 'ఈనాడు' వేయలేదని నా విశ్లేషణలో తేలింది. రేప్పొద్దున వాడి డొక్క చించి డోలు కట్టాలి. మీకు కూడా అలానే జరిగితే మాకు రాయండి.)

ఇక గ'లీజు' వ్యవహారానికి వద్దాం. కర్నూలు జిల్లాలో వందలాది ఎకరాల భూమి విజయలక్ష్మి ఇండస్ట్రీస్ కు కట్టబెట్టడం, అందులో వై.ఎస్. కుటుంబ సభ్యులకు వాటా వుండడం...వంటి ఆరోపణలు ఉన్నాయి ఆ వార్తలో. ఈ వార్త లో భాగంగా వై.ఎస్.జగన్, ఆయన మామ రవీందర్ రెడ్డి, కే.వీ.పీ.రామచంద్ర రావు ఫోటోలు వాడారు. కథనానికి బలం చేకూర్చే విధంగా...'ఈనాడు' చాలా సోర్సులను ఉటంకించింది. రైతుల వివరణ తీసుకుంది. ఈ ఎవ్వరంపై విచారణ జరపాలని అన్ని పార్టీలు డిమాండ్చేసాయి. 


దీనిపై ఈ రాజీ 'సాక్షి' విరుచుకుపడింది.  మొదటి పేజీలో..."'పెన్ కాదు..డ్రాగన్'....అక్షర రాక్షసం--గ'లీజు' డొక్కనిండా  పచ్చి అబద్దాలే"...అంటూ మొదటి పేజీలో పెద్ద వార్త ప్రచురించింది. దానికి...ఈ పైన  వేసిన 'డ్రాగన్--రామోజీ' ఫోటో వాడారు.  


'బురద చల్లడమే రామోజీ పని' అన్న శీర్షికతో రవీంద్రనాథ్ రెడ్డి వివరణతో ఐదో పేజీలో ఒక వార్త ఇవ్వడమే కాక...ఎడిటోరియల్ పేజీలో...'ఈనాడు' వార్తను 'సాక్షి' ఉతికి ఆరేసింది. దానికి పెట్టిన శీర్షిక..."రామోజీ పత్రిక అంటేనే...పాలసీ నడక...తప్పుల తడక." అందులో...రామోజీ మీద ఒక కార్టూన్ కూడా వాడారు. 


ఆ పేజీలోనే "ఈనాడు గ'లీజు' రాతలు" శీర్షికన..కొందరు రైతుల వ్యాఖ్యలు ఇచ్చారు. ఈరోజు 'ఈనాడు' కూడా "గ'లీజు' బుకాయింపు" శీర్షికన రవీంద్రనాథ్ రెడ్డి వివరణ ప్రముఖంగా ప్రచురించింది. "'పెన్నా'వేసుకున్న బంధం!..ఖైమా నుంచి సాక్షి దాకా" అన్న మరొక వార్తను కూడా రెండో పేజీలో 'ఈనాడు'ప్రచురించింది. రేపు కచ్చితంగా 'సాక్షి' దీని మీద విరుచుకుపడుతుంది.

రెండు పత్రికలూ వార్తలలో ఎడిటోరియల్ భాషను వాడాయి. వీటి అక్షరాలలో నిజానిజాల మాట..ఏమోగానీ....తెలుగు నాట ఈ 'కౌంటర్ జర్నలిజం' కొత్తపుంతలు తొక్కుతున్నదన్న విషయం స్పష్టమవుతున్నది. ఈ క్రమంలో వార్తలకున్న విలువ, విశ్వసనీయత గాల్లో కలిసి పోతున్నాయేమో! రీడర్ గందరగోళ పడుతున్నాడేమో!!

Wednesday, March 24, 2010

సెక్స్ పై సుప్రీంకోర్టు మాట-- ఛానెల్స్ బూతుసీన్ల తీట

పెళ్లి కాకుండా కలిసి జీవించడం, పెళ్ళికి ముందు సెక్స్ లపై సుప్రీంకోర్టు సమాజానికి కొంత క్లారిటీ ఇచ్చిన మరుసటి రోజు హిందువులు అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణాన్ని జరుపుకున్నారు. కోర్టు వారి మాటలపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
  

పెళ్లి తర్వాత భార్య/భర్తతో మాత్రమే కాకుండా ఇష్టపడే ఆమె/అతనుతో కూడా శారీరక సంబంధం కలిగి ఉండవచ్చా? అన్న కీలకాంశంపై కూడా అత్యున్నత న్యాయస్థానం ఓపెన్గా ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుంటుందని, అప్పుడు రాముడు చేసింది తప్పో వొప్పో తెలిపొయ్యేదని అబ్రకదబ్ర అత్తెలివి స్టేట్మెంట్ ఇచ్చాడు.

మా జిల్లాలో భద్రాచలం ఉండడం వల్లనో, మా అమ్మమ్మకు చాదస్తం ఎక్కువ కావడం వల్లనో రాముడంటే నాకు "మనోడే..." అన్న దగ్గరి ఫీలింగ్ ఉంది. రాముడి వల్ల ఈ కింది విషయాలు నేర్చుకోవాలని మా అమ్మమ్మ చెప్పింది.
1) సత్యవాక్కు
2) ఆడిన మాట తప్పక పోవడం
3) తండ్రి మాట జవదాటక పోవడం
4) గురుభక్తి
5) ఏక పత్నీవ్రతం
6) జనవాక్ పరిపాలన
ఇందులో పూర్తిగా అమలు చేసేందుకు వీలున్నది నాలుగో పాయింట్ ఒక్కటే అనీ...ఐదో పాయింట్ కూడా దాదాపు పూర్తిగా అమలుచేయవచ్చని అబ్రకదబ్ర వాదించాడు. "అబద్ధం చెప్పడం శిక్షార్హమని ఎక్కడ వుందో చూపండి...శ్రీ కృష్ణుడు అబద్ధాలు చెప్పలేదా?" అని కోర్టు అడిగితే సంసారపక్షపు జనం ఏమి
చేయాలని ప్రశ్నించాడు. మనోడు వేడి మీద ఉన్నాడు. గీతారెడ్డికి రాసినట్లే జడ్జిలను ఉద్దేశించి ఒక లెటర్ రాస్తానంటే....'వద్దు బాస్...నేను పై వాటిలో ఆరో పాయింట్ కూడా ముఖ్యమనే అనుకుంటున్నా'...అని చెప్పి...పండగ సందర్భంగా చేసిన పులిహోర, దద్ధోజనం, బియ్యపు పరవన్నం పెట్టి పంపించేసాను. 
 

అసలీ పోస్టు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే....ఆ సుప్రీంకోర్ట్ ఆ మాటలు చెప్పిందే తడవుగా...మన నీలి ఛానెల్స్ బాక్ డ్రాప్ లో బూతు బొమ్మలు తెగ చూపించాయి నిన్న అంతా. చౌదరి అంకుల్ చానెల్ అయితే...ఇందిరా పార్క్ లో ప్రేమ జంటలు చెలరేగిపోవడాన్ని కూడా ఈ వార్తలో భాగంగా చూపింది. ముద్దు సీన్లకు, ఈ తీర్పుకు సంబంధం ఏమిటి?

సరే..సుప్రీం వారి ఈ వ్యాఖ్యలలో ఉన్న మాంచి ఎలిమెంట్స్ నేపథ్యంలో...ఈ ఛానెల్స్ కనీసం ఒక మూడు రోజులపాటు మాసాలా సీన్లు చూపి చర్చలు జరిపి కాలక్షేపం చేసి ఉండేవి. కానీ...ఇంతలో రాములోరి పెళ్లి. అన్ని ఛానెల్స్ భక్తి శ్రద్ధలతో దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసాయి. ఇలా అంది వచ్చిన ఒక మంచి అవకాశాన్ని రామనవమి చెడకొట్టింది...ఈ మధ్యాన్నం వరకు. ఇక రాత్రికి చెలరేగిపోతారేమో చూడాలి. 

జీతం, పీ.ఎఫ్. కోసం i-news సిబ్బంది మెరుపు సమ్మె

ఎం.ఎన్.ఆర్. విద్యాసంస్థల వారి i-news లో రెండు నెలలుగా జీతాలు అందని జర్నలిస్టులు, టెక్నీషియన్లు మంగళవారం మెరుపు సమ్మె చేశారు. కాసేపు విధులు నిర్వహించకుండా....ఆఫీసు బైటికి వచ్చి తమ నిరసన తెలిపారు. సాయంత్రానికి యాజమాన్యం హామీతో విధులు నిర్వహించారు. తెలుగు మీడియా విస్తరించిన తర్వాత జరిగిన తొలి సమ్మె గా ఈ నిరసన చరిత్రలో నిలిచిపోతుంది. 



చాలా రోజులుగా ఐ-న్యూస్ ఆర్ధిక పరిస్థితి బాగాలేదని, జీతాలు సకాలంలో అందక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని గతంలో మనం చర్చించాం. రెండు నెలలైనా జీతాలు పడకపోవడం, అంతకు మించి పీ.ఎఫ్.జమ కాకపోవడంతో దాదాపు 250 మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. 
నిన్న ఉదయం సంస్థ యజమాని వాసు రాజుతో సమావేశమైన హెడ్స్ కొద్దిగా చల్లపడినా...తర్వాత విధులు బహిష్కరించారు. ఈ నెల ఆఖరుకల్లా జీతాలు వచ్చేలా చూస్తామని యాజమాన్యం చెప్పడంతో మళ్ళీ విధులకు హాజరయ్యారు. "ఎన్.ఆర్.ఐ.లది ఈ సంస్థ" అని నమ్మబలకడం వల్ల ఐ.న్యూస్ లో చేరామని, ఈ ప్రచారం చేసిన జర్నలిస్టు మాత్రం కీలక సమయంలో చల్లగా జారుకుని N-TV లో చేరి, తన చేలాలను తెసుకుపోయి సేఫ్ సైడ్ లో పెట్టుకున్నాడని పలువురు ఆరోపించారు. 
సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ ఈ ఛానల్ లో చేరకపోయినా..రాజశేఖర్ నిష్క్రమణ తర్వాత తాము ఇక్కడ ఉండేవారం కాదని...రమేష్ లేనిపోని ఆశలు కల్పించారని... మరికొందరు ఐ-న్యూస్ సిబ్బంది చెప్పారు.

ఆరంభంలో డీ.ఎస్.ఎన్.జీ.వ్యాన్లు, తదితర కొనుగోళ్ళలో గోల్ మాల్ జరగడం వల్ల కూడా సంస్థ బాగా నష్టపోయిందని యాజమాన్యం తరఫు వ్యక్తులు సిబ్బందికి వివరిస్తున్నారు. యాజమాన్యం వాదనే నిజమైతే...మొత్తం కొనుగోళ్ళపై దర్యాప్తు జరిపి...వాటాలు మింగేసి ఉడాయించిన వారిపై కేసు పెట్టాలని కొందరు పిచ్చాపాటి చర్చలలో వాదిస్తున్నారు.  మరి యాజమాన్యం దీనిపై ఏమి నిర్ణయం తీసుకున్నదీ  తెలియరాలేదు.

మొత్తం మీద....ఇన్నాళ్ళకు గళం ఎత్తిన i-news సిబ్బందికి అభినందనలు. అన్ని ఛానెల్స్ లో ఉద్యోగులు మరీ బతుకు భయంతో వణికిపోకుండా..జీతాలు, హక్కుల సాధన కోసం క్రమశిక్షణతో పోరాడడంలో తప్పులేదు. ఈ స్ఫూర్తి అన్ని ఛానెల్స్ కు పాకాలని, వీరికి ఉమ్మడి వేదిక ఒకటి ఉండాలని ఆశిద్దాం. 

Tuesday, March 23, 2010

'మా భూమి' మళ్ళీ వస్తుందా?: ABN-AJ లో చర్చ

నిన్నంతా...PRP వారి దాడితో తిక్కతిక్కెక్కి పోయిన ABN-ఆంధ్రజ్యోతి 'మా భూమి' సినిమాపై ఒక మంచి చర్చ జరిపిందీ రాత్రి. నిన్న...గెస్టు అన్న స్పృహ లేకుండా...ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ గారిని స్టూడియోలో ఘోరంగా అవమానించిన యాంకర్ మూర్తి ఈ రోజు...ఎంతో లీనమై 'మా భూమి'పై చర్చ నిర్వహించారు. (పీఅర్పీ పై కథనాన్ని పునఃప్రసారం చేసిన సందర్భంగా చూడనిరాకరిస్తూ కొంగుకప్పుకున్న పద్మగారి ఫోటో 'ఆంధ్రజ్యోతి' పేపర్ మొదటి పేజీలో ప్రచురించడం...ఘోరం..అనైతికం...అవమానకరం.)

ఇక వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం వస్తువుగా నరసింగరావు గారు అద్భుతంగా మలిచిన 'మా భూమి' విడుదలై మూడు దశాబ్దాలు సందర్భంగా ఈ ఛానల్ ప్రత్యేక చర్చ జరిపింది. ఇది మంచి ఐడియా. ఈ సినిమాలో నవ యువకుడైన గద్దర్...సుద్దాల హనుమంతు గారు రాసిన 'బండెనక బండి కట్టి....' అనే పాట పాడుతుంటే....గుండె బరువెక్కింది. విద్యార్థి ఉద్యమాలలో తిరిగిన వారు కంజెర కొడుతూ....విప్లవ స్ఫూర్తితో ఈ పాట పాడకుండా ఉండి ఉండరు.

ఈ చర్చలో పలువురు కాలర్స్ ను ఉత్తేజపరిచిన మూర్తి...ప్రేక్షకులందరి తరఫున...మళ్ళీ 'మా భూమిని' ప్రజలకు అందించాలని నరసింగ రావు గారిని కోరారు. ఇప్పటి దర్శకులు రావు గారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. విప్లవం సంగతి కాకపోయినా...ఒక సినిమాను ఎంత బాగా తీయవచ్చో ఆయన ప్రతి ఫ్రేములో నిరూపిస్తారు.

ఎన్ని తూటాలు పేలినా...ఎత్తిన ఎర్ర జెండా దించకు...అన్న పిలుపుతో ఈ సినిమా ముగుస్తుంది. ఆ పాటతోనే ABN-AJ కార్యక్రమం ముగిసింది.

కానీ...ఈ లోపలే వచ్చిన ఒక వార్త: దేశంలో రైతాంగ సాయుధ పోరాటానికి బాటలు పరిచిన విప్లవ మూర్తి కాను సన్యాల్ ఆత్మహత్య. 

నార్త్ బెంగాల్ లోని సిలిగురిలో...ఆయన సొంత ఇంట్లో ఉరి వేసుకుని మరణించారట. చాలా రోజుల కిందటనే సాయుధ పోరును చీదరించుకున్న సన్యాల్...చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను బ్రిటిష్ సైన్యం ఉరి తీసింది ఈ రోజే కదా!

కాను సన్యాల్ ఆత్మహత్య గురించి విని నాకు మా ఆనంద రావు గుర్తుకు వచ్చాడు. ఖమ్మం జిల్లా వైరాలో విప్లవ భావాలున్న పిల్లలకు ఆనంద రావు ఒక స్ఫూర్తి. పీ.డీ.ఎస్.యూ.లో పనిచేసిన తను...ఆడి పాడే మా బ్యాచ్ తో కలిసి మెలిసి ఉండేవాడు. మాకు అతనొక నేత. సమాజ ఉద్ధరణకు పాట ఒక సాధనమని...అందుకు 'జన నాట్య మండలి' ఒక వేదిక అని నూరిపోసాడు. 

మండలిలో రహస్య శిక్షణ (?)కు సిద్ధం కావాలని ఆనంద రావు చెప్పిన మాటలకు మానసికంగా సిద్ధమవుతున్నప్పుడే....ఆయన రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్యో కాదో తెలియదు కానీ....."ఛీ...ఇంత పిరికివాడు నూరిపోస్తే...మనం విప్లవంతో ఊగిపొయ్యామా?" అని పలువురు అప్పటి నుంచి బుద్ధిగా చదువుకోవడం మొదలు పెట్టారు. చత్తీస్ గడ్ లో పర్యటించి....నక్సల్ ఉద్యమాన్ని ఒక ఆదర్శ పోరాటంగా స్తుతిస్తూ అరుంధతీ రాయ్ 'అవుట్ లుక్' లో పెద్ద వ్యాసం రాసిన వారంలోనే...ఈ పరిణామం.

ఎం.ఎఫ్.హుస్సేన్ వివాదంపై 'ది హిందూ' కు ఒక లేఖ

ఎం.ఎఫ్.హుస్సేన్ ఖతార్ పౌరసత్వం తీసుకున్నట్లు 'ది హిందూ' ముందుగా వార్త ప్రచురించింది. ఆ పత్రిక ప్రధాన సంపాదకుడు ఎన్.రామ్ కు ఈ అంశంపై 'ది హిందూ'కు ఒక క్రైస్తవ ప్రొఫెసర్ రాసిన లేఖను దిగువ ఇస్తున్నాం. ఆమె కొన్ని మౌలిక అంశాలు లేవనెత్తారు. ఈ లేఖలో ముఖ్యమైన పాయింట్లకు ఎర్ర రంగుతో ఇక్కడ హై లైట్ చేశాము. కారణం: హుస్సేన్ పై గతంలో మేము పోస్ట్ చేసిన అభిప్రాయాలు కొన్ని ఈ లేఖలో చోటుచేసుకోవడం. 
------------------------------------------------
Dear Ram,
I have taken time to write this to you Ram -- for the simple reason that we have known you for so many years -- you and The Hindu bring back happy memories. Please take what I am putting down as those that come from an agonized soul. You know that I do not mince words and what I have to say I will -- I call a spade a spade -- now it is too late for me to learn the tricks of being called a ‘secularist’, if that means a bias for one, and a bias against another.
Hussain is now a citizen of Qatar -- this has generated enough of heat and less of light. 

Qatar you know better than me is not a country which respects democracy or freedom of expression. Hussain says he has complete freedom -- I challenge him to paint a picture of Mohammed, fully clad. 
 
There is no second opinion that artists have the Right of Freedom of expression. Is such a right restricted only to Hussain? Will that right not flow to Dan Brown -- why was his film Da Vinci Code not screened? Why was Satanic Verses banned -- does Salman Rushdie not have that freedom of expression? Similarly, why is Taslima hunted and hounded and why fatwas have been issued on both these writers? Why has Qatar not offered citizenship to Taslima? 

In the present rioting in Shimoga in Karnataka against the article Taslima wrote against the tradition of burqa which appeared in the Out Look in Jan 2007. Nobody protested then either in Delhi or in any other part of the country; now when it reappears in a Karnataka paper there is rioting. Is there a political agenda to create a problem in Karnataka by the intolerant goons? Why has the media not condemned this insensitivity and intolerance of the Muslims against Taslima’s views? When it comes to the Sangh Parivar it is quick to call them goons and intolerant etc. Now, who are the goons and where is this tolerance and sensitivity? 



Regarding Hussain’s artistic freedom it seems to run unfettered in an expression of sexual perversion only when he envisages the Hindu Gods and Goddesses. There is no quarrel had he painted a nude woman sitting on the tail of a monkey. The point is he captioned it as Sita. Nobody would have protested against the sexual perversion and his orientatation to sexual signs and symbols. But would he dare to caption it as ‘Fatima enjoying in Jannat with animals’? 

 
Next example is the painting of Saraswati copulating with a lion. Here again his perversion is evident and so is his intent. Even that, let's concede, cannot be faulted -- each one’s sexual orientation is each one’s business I suppose. But he captioned it as Saraswati. This is the problem. It is Hussain’s business to enjoy in painting his sexual perversion. But why use Saraswati and Sita for his perverted expressions? Use Fatima and watch the consequence. 

Let the media people come to his rescue then. Now that he is in a country that gives him complete freedom, let him go ahead and paint Fatima copulating with a lion or any other animal of his choice. And then turn around and prove to India -- the Freedom of expression he enjoys in Qatar. 


Talking about Freedom of Expression -- this is the Hussain who supported Emergency -- painted Indira Gandhi as Durga slaying Jayaprakash Narayan. He supported the jailing of artists and writers. Where did this Freedom of Expression go? And you call him secularist? Would you support the jailing of artists and writers Ram – would you support the abeyance of the Constitution and all that we held sacred in democracy and the excessiveness of Indira Gandhi to gag the media writers - political opponents? 

Tell me, honestly why does Hussain expect this Freedom when he himself did not support others with the same freedom he wants? And the media has rushed to his rescue. Had it been a Ram who painted such obnoxious, degrading painting - the reactions of the media and the elite ‘secularists’ would have been different; because there is a different perception/ and index of secularism when it comes to Ram -- and a different perception/and index  of secularism when it comes to Rahim/Hussain. 



It brings back to my mind an episode that happened to The Hindu some years ago. [1991] You had a separate weekly page for children with cartoons, quizzes, and with poems and articles of school children. In one such weekly page The Hindu printed a venerable bearded man -- fully robed with head dress, mouthing some passages of the Koran -- trying to teach children. It was done not only in good faith but as a part of inculcating values to children from the Koran. All hell broke loose. 

Your office witnessed goons who rushed in -- demanded an apology -- held out threats. In Ambur, Vaniambadi and Vellore the papers stands were burned -- the copies of The Hindu were consigned to the fire. A threat to raise the issue in Parliament through a Private Members Bill was held out -- Hectic activities went on -- I am not sure of the nature and the machinations behind the scene. But The Hindu next day brought out a public apology in its front page. 

Where were you Ram? How secular and tolerant were the Muslims?
Well this is of the past -- today it is worse because the communal temperature in this country is at a all high -- even a small friction can ignite and demolish the country’s peace and harmony. It is against this background that one should view Hussain who is bent on abusing and insulting the Hindu Gods and Goddesses. Respect for religious sentiments, need to maintain peace and harmony should also be part of the agenda of an artist -- if he is great. If it is absent then he cannot say that he respects India and express his longing for India. 


Let’s face it -- he is a fugitive of law. Age and religion are immaterial. What does the media want -- that he be absolved by the courts? Even for that he has to appear in the courts -- he cannot run away. After all this is the country where he lived and gave expression to his pervert sadist, erotic artistic mind under Freedom of Expression. I simply cannot jump onto the bandwagon of the elite ‘secularist’ and uphold what he had done. With his brush he had committed jihad -- bloodletting. 

 
The issue is just not nudity -- Yes the temples, the frescos in Konarak and Kajhuraho have nude figures. But does it say that they are Sita, Sarswati or any goddesses? We have the Yoni and the Phallus as sacred signs of Life-of Siva and Shakthi -- take these icons to the streets, paint them -- give it a caption it becomes vulgar. Times have changed. Even granted that our ancients sculptured and painted naked forms and figures, with a pervert mind to demean religion is no license to repeat that in today’s changed political and social scenario and is not a sign of secularism and tolerance. I repeat there is no quarrel with nudity -- painters have time and again found in it the perfection of God’s handicraft. 


Let me wish Hussain peace in Qatar -- the totalitarian regime with zero tolerance. May be he will convince the regime there to permit freedom of expression in word, writing and painting. For this he could start experimenting painting forms and figure of Mohamed the Prophet-and his family. And may I fervently wish that the media -- especially The Hindu, does not discriminate goons -- let it not substitute tolerance for intolerance when it comes to  Rahim and Antony and another index for Ram. 


I hope you will read this in the same spirit that I have written. All the best to you Ram.
Dr Mrs Hilda Raja
Vadodara

Monday, March 22, 2010

ABN-ఆంధ్రజ్యోతిపై PRP గూండాగిరి తప్పే, కానీ......

ABN-ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రజారాజ్యం పార్టీ పై  ప్రసారం చేసిన ఒక కథనం ఈ రోజు సంచలనం కలిగించింది. చిరును, అల్లు అరవింద్ ను, పార్టీని టార్గెట్ చేసుకుని వేమూరి రాధాక్రిష్ణ గారి ఛానల్ ప్రసారం చేసిన కథనం... పీ.ఆర్.పీ. శ్రేణులకు బాధ కలిగించింది. వాళ్ళు...హైదరాబాద్ లో ఛానల్ ఆఫీసు మీద దాడి చేశారు, జర్నలిస్టులను గాయపరిచారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అయితే...ఈ ఉదంతం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నది. 

మీడియా హౌసు లకు జెండాలు, అజెండాలు ఉంటే ప్రమాదమని, జర్నలిస్టులు వాడే పదజాలం...చేసే సూత్రీకరణలకు ఒక ప్రాతిపదిక ఉండకపోతే అది అనైతిక జర్నలిజం అవుతుందని, అలాగే ఏ స్టోరీ విషయంలోనైనా బాధ కలిగితే రాజకీయ పార్టీలు మీడియాను కట్టడి చేసేందుకు ఉన్న వేదికలను వాడుకోకుండా...దాడులకు తెగబడడం అప్రజాస్వామికమని ఈ ఘటన తెలియజేస్తున్నది. 

చిరంజీవి పార్టీ విషయంలో కొన్ని మీడియా హౌసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాయన్నది వాస్తవం. చిరు ఒక ఛానలో, పేపరో పెట్టుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితి. కొందరు ఎం.ఎల్.ఏ.లు జరిపిన సమావేశం నుంచి కూపీ లాగి..పీ.ఆర్.పీ. దుకాణం బంద్! అన్న అర్థంలో 'ఈనాడు' బ్యానర్ ప్రచురించింది గతంలో. ఇప్పుడు ఆ పార్టీ మీద ఆంధ్రజ్యోతి చానెల్ ప్రసారం చేసిన వార్త కూడా జర్నలిజం విలువలకు కట్టుబడి లేదు. 

జర్నలిజం మౌలిక సూత్రాలు తెలియని, ప్రొఫెషనలిజం లేని వారికి పెద్ద పదవులు కట్టబట్టడం వల్ల గానీ లేదా రాజకీయ అజెండాతో కావాలని గానీ ఆ ఛానల్ ఈ వార్త ప్రసారం చేసిందని భావించాలి. ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన, కొందరు ఆ పార్టీని విడిచి వెళ్ళనంత మాత్రాన, పార్టీ నాయకులు ఏదో సందర్భంలో ఒక మాట అన్నంత మాత్రాన...ఆ పార్టీ పని అయిపోయిందని నిర్ధారణకు రావడం తప్పు. దానిపై ఇప్పటికిప్పుడు ఒక స్టోరీ చేయాల్సిన పనిలేదు. ఒక వేళ...దీని మీద ఒక పొలిటికల్ స్టోరీ చేయాల్సి వస్తే...ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా...చిరంజీవి వివరణ తీసుకోవాలి తప్పనిసరిగా. అలా కాకుండా...ఇష్టమొచ్చిన పదజాలం వాడి..వ్యాఖ్యలు చేస్తూ...జనాలలో ఒక అభిప్రాయం సృష్టించే ప్రయత్నం చేయడం ముమ్మాటికీ తప్పు.

'ఆంధ్రజ్యోతి' గతంలో టీ.ఆర్.ఎస్. మీద కూడా ఇలాంటి కథనాలే రాసింది. (అందుకేనేమో...టీ.ఆర్.ఎస్.ఒక ఛానల్ పెట్టుకుంది). ఎం.ఆర్.పీ.ఎస్. విషయంలో కూడా ఈ పత్రిక వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. ఈ నేపథ్యంలో...ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గమనించాలి. వివరణలు..గట్రా లేకుండా వార్తలు రాయడం....'బాధితులు' దాడి చేయడం...'యిది పత్రికా స్వేచ్ఛ'కు విఘాతం అని జర్నలిస్టులు ధర్నాలు చేయడం...రివాజుగా మారింది. 

ఈ మీడియా హౌజ్ ప్రసారం చేసే కథనాలు/ చర్చలలో జర్నలిజం ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయో...ఆ ఛానల్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.  సీనియర్ జర్నలిస్టు రాధాకృష్ణ గారు.. అన్నీ నాకు తెలుసు అని విర్రవీగకుండా....వెంటనే ఒక నిపుణుడైన జర్నలిస్టును 'అంబుడ్స్ మన్' గా పెట్టుకుని లోపాలు దిద్దుకోవడం మంచిది. లేకపోతే...భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని జరిగే ప్రమాదం ఉందని వారికి ఆవేదనతో విన్నవించుకుంటున్నాం.

దాడి తర్వాత ఈ ఛానల్ లైవ్ లో యాంకర్లు వాడిన భాష కూడా మెచ్చదగినదిగా లేదు. "పీ.ఆర్.పీ 'కట్టు' కథలు" అన్న శీర్షిక కింద...ఆ పార్టీ ప్రెస్ మీట్ ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. యాంకర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఒక పధ్ధతి ప్రకారం స్టోరీ వాడితే ఇలాంటి సమస్యలు రావు. అసలు రాధాక్రిష్ణ గారి దృక్కోణంలో ఒక కీలక లోపం నిన్న రాత్రి నాకు స్పష్టంగా కనిపించింది. 

కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరిని 'ఓపెన్ టాక్ విత్ ఆర్.కే.' అన్న కార్యక్రమంలో ఆయన భక్తితో అడిగిన ఒక ప్రశ్న నాకు నవ్వు తెప్పించింది. 
"ఇప్పుడు..ఎప్పటికైనా...పురందేశ్వరి ముఖ్యమంత్రి పదవి చేపడతారని జనంలో ఒక విస్తృత అభిప్రాయం ఉంది," అంటూ ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఇది ఎంత హాస్యాస్పదం! ఇక్కడే జర్నలిజంతో పెద్ద చిక్కు వచ్చింది. 'విస్తృత అభిప్రాయం' అంటే ఏమిటి? దానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోకుండా...స్వీపింగ్ ప్రకటనలు చేయడం వల్ల జనాలకు జర్నలిజం మీద నమ్మకం పోతున్నది.

'విస్తృతంగా' జనం అనుకుంటున్నారు..అన్నప్పుడు దాన్ని సమర్ధించేందుకు తాను జరిపిన సర్వేనో, డాటానో చెప్పాలి. అది జర్నలిస్టు బాధ్యత. అందుకే...మన విశ్వ విద్యాలయాలు 'రీసెర్చ్ మెతడాలజి' అన్న ఒక సబ్జెక్టు బోధిస్తాయి. కథనాలలో శాస్త్రీయత చాలా అవసరం. అప్పుడు 'బాధితుడు' సైతం కిమ్మనడు.

ఈ దాడి సంఘటన దరిమిలా...రోడ్ల మీద పీ.ఆర్.పీ., చిరులకు వ్యతిరేకంగా విలేకరులు ఆవేశంగా నినాదాలు చేశారు. వీరి ఐక్యత బాగున్నది. బాబూ...ఇలా దాడులు జరిగినప్పుడే కాకుండా...మీ యాజమాన్యాలు అపాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వనప్పుడు, చెప్పా పెట్టకుండా ఉజ్జోగాలు ఊడపీకినప్పుడు కూడా...ఇదే ఐక్యత ఉంటే...చాలా బతుకులు బాగుపడతాయి. అయినా ఇది వేరే విషయం.
ఈ రోజు జరిగిన ఘటన చిరంజీవి గారికి కూడా ఒక కనువిప్పే. వ్యతిరేక వార్త వస్తే...ఉపశమనం పొందడానికి మార్గాలు ఉన్నాయని గుర్తించాలి. ఇది సినిమా కాదు...'లేప్పారేయ్యడానికి.' ప్రెస్ కౌన్సిల్ ఉంది, కోర్టులు ఉన్నాయి. ఆ పార్టీ మీడియా నిర్వహణలో నిజానికి చాలా లోపాలు ఉన్నట్లు కనిపిస్తుంది. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని చిరు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. 

నన్నడిగితే....రాధాకృష్ణ, చిరు ఇద్దరూ ఏకాంతంగా కూర్చుని....ఒకరి బాధ ఒకరు పంచుకొని...తప్పులు తెలుసుకొని..సారీలు చెప్పుకుంటే....బాగుంటుంది. ఎందుకంటే...మనకు మీడియా ముఖ్యమే, రాజకీయ పార్టీ ముఖ్యమే. 

ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం నెరిపి శాంతిని నెలకొల్పే  ఒక వ్యవస్థ ఉంటే బాగనీ....ఆ వ్యవస్థను చిత్తశుద్ధి-నిజాయితితో మనం నిర్వహిస్తే ఎలా ఉంటుందని నాకు చాలా సార్లు అనిపించింది. కానీ...అహంకారాలు, అపనమ్మకాలు,  ఆరోపణాస్త్రాలు పుష్కలంగా ఉన్న ఈ కాలంలో మనల్ని వీళ్ళు దూరనిస్తారా?

రామోజీపై ఉండవల్లి 'ఇన్ స్టాల్మెంట్' పోరాటం!?

కాంగ్రెస్ ఎం.పీ. ఉండవల్లి అరుణ్ కుమార్ 'ఈనాడు' అధిపతి రామోజీ రావుపై ఇన్ స్టాల్ మెంట్ (వాయిదా) పద్ధతిన 'పోరాటం' చేస్తున్నారు. రెండు, మూడు నెలలకొకసారి వీలుచిక్కినప్పుడు ఆయన ఉన్నట్టుండి రామోజీ మీద ఏదో ఒక హడావుడి చేయడం...'సాక్షి' పత్రిక దాన్ని పతాక శీర్షికన ప్రచురించి బ్రహ్మాండం బద్దలై పోతున్నదన్నట్లు చిత్రీకరించడం జరుగుతున్నది. 


రాష్ట్రంలో తాను చెప్పిందే వేదం అన్న దురహంకారంతో రామోజీ చెలరేగిపోతున్న కాలంలో ఆయనకు ఉండవల్లి ముకుతాడు వేయగలిగారు. 'మార్గదర్శి'లో కంతలు లేవనెత్తి...రామోజీ ఆర్ధిక సామ్రాజ్యాన్ని ఒక కుదుపు కుదిపారు. రామోజీ లాంటి వ్యక్తిని ఇరుకునపెట్టిన నిజాయితీపరుడిగా పేరున్న ఈ ఎం.పీ.ని జనం మెచ్చుకున్నారు. అప్పటినుంచి ఉండవల్లి దీన్ని 'ఇన్ స్టాల్ మెంట్ పోరాటం'గా మార్చి ప్రచారం పొందుతున్నారు. తనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా....'రామోజీ ని వదిలే ప్రసక్తే లేదు' అన్న స్టేట్ మెంట్ ఇస్తున్నారు. ఇది బాగోలేదు.

చట్టం ముందు అందరూ సమానులే...అన్నది నిజం. ఈ రోజుల్లో డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్ళు అందరికన్నా కొద్దిగా ఎక్కువ సమానం...అని అందరికీ తెలిసిందే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే...ఉండవల్లి ఖైరతాబాద్ లోని 'ఈనాడు' ఆఫీసు ముందో, సచివాలయం ముందో ఆమరణ నిరసనకు దిగాలి...రామోజీని చర్లపల్లి జైలు పంపే దాకా పట్టు వీడకూడదు. అంతేతప్ప...'లేడికి లేచిందే పరుగు' తరహా ట్రిక్స్ కు పాల్పడకూడదు. అది జనాలను తప్పుదోవ పట్టించినట్లు అవుతుంది.


రామోజీ అంటే ఎగిరెగిరి పడే 'సాక్షి' ఉండవల్లి వార్తకు ఈ రోజు అంత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. 'కొరడా తీయండి' అని పతాక శీర్షికతో పాటు...రెండో పేజీలో మూడు పెద్ద వార్తలు ప్రచురించింది. మీ పోరాటం మీడియా కోసమా? జనం కోసమా? ఈ 'సాక్షి' అతి స్పందన వల్ల ఉండవల్లి క్రెడిబిలిటి దెబ్బతింటున్నది.


అయ్యా..ఉండవల్లి గారూ...ఎవ్వరొచ్చి న్యాయం చేయమన్నా...న్యాయ పోరాటానికి సిద్ధమని అంటున్నారు కదా! మీ కాంగ్రెస్ నేతలు నడుపుతున్న ఛానల్ లో ఉద్యోగులకు భద్రత లేదు. ABN--ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉద్యోగులకు కనీసం అప్పాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వడం లేదు. వందలమంది చిన్న ఉద్యోగులకు మీడియాలోనే కాదు...ఏ పరిశ్రమలో అయినా.. ఉద్యోగ భద్రత లేదు. ప్రైవేటు సంస్థలలో చాలా మంది ఉద్యోగుల  జీవితాలు సంక్షోభంలో ఉన్నాయి. దయచేసి ఈ యాజమాన్యాల మీద కూడా పోరాటం చేసి పుణ్యం మూట కట్టుకోండి. 

అలాగే...నిన్న వీరు ముఖ్యమంత్రి రోశయ్యకు రాసిన లేఖలో ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, విశ్వనాథ సత్యనారాయణ ల ప్రస్తావన తెచ్చారు. వాళ్ళ కుటుంబీకులు చిట్స్ లో తప్పులు చేస్తే...దానికి వీళ్ళు బాధ్యులా? రామోజీ మీద పగతో ఉండవల్లి మరీ ఇంత దిగాజారాల్సిన పనిలేదనుకుంటా. 


ఉండవల్లి గారూ...నిజంగా మార్గదర్శి  చేసింది 'ఘోర నేరం' అని మీరు నమ్మితే....అధికారపక్షంలో ఉండి, ఆ పార్టీ అధినేత సోనియా ప్రసంగాలు అనువదించే నేతగా వెలుగుతూ ఇంతవరకూ రామోజీని జైలుకు పంపలేనందుకు మీరు మీ పదవికి రాజీనామా చేయండి. ఇది నిజంగా ఒక ఎం.పీ.గా ఉన్న మీకు సిగ్గుచేటైన విషయం. లేదంటారా..ఇందాక అనుకున్నట్లు ఈ సినిమా జనం లాగా ఆమరణ దీక్షకు దిగండి. అంతవరకూ నేనులేస్తే మనిషిని కాను...అని చేసే హడావుడిని ఒక పబ్లిసిటీ స్టంట్ గా జనం భావించాల్సిఉంటుంది.

Saturday, March 20, 2010

తగువే ఊపిరి, పంచాయితీనే శ్వాస: ఛానెల్స్ తీరూతెన్నూ

ఒక భార్యా భర్తా మధ్య ఏదో తేడా వచ్చింది. ఆ సాయంత్రానికి భార్య ఇప్పుడున్న డజను తెలుగు ఛానెల్స్ లో ఒక ఛానల్ స్టూడియోలో ప్రత్యక్షమవుతారు. అక్కడ సూటూబూటూ వేసుకుని...పెద్దగా లోకజ్ఞానం (బుర్ర) లేని యాంకర్ లేదా యాంకరమ్మ ఇక రంగ ప్రవేశం చేస్తారు. ఈ లోపు..."ఈవిడతో నేరుగా  మాట్లాడదలుచుకున్నవారు ఫలానా ఫోన్ నంబర్లకు ఫోన్ చెయ్యండి," అని సదరు ఛానల్ స్క్రోల్ తిప్పుతూ ఉంటుంది. ఇక లైవ్ లో ప్రోగ్రాం మొదలవుతుంది. 


యాంకర్: అచ్చమాంబ గారూ....ఇప్పుడు చెప్పండి. అసలు మీ ఇద్దరికీ ఎక్కడ చెడింది?
అచ్చమాంబ: యేమని చెప్పమంటారు? ఆయనకు నా మీద ప్రేమ లేదని ఇవ్వాళ పొద్దున్న ఆయన మాటల్లో బాగా అర్ధమయ్యింది. పద్నాలుగేళ్ళు కాపురం చేశా..ఈ రోజు బాధపడినంత ఎప్పుడూ పడలేదు. 

యాంకర్: అయ్యో...పద్నాలుగేళ్ళు భరించారా? మీకు చాలా ఓపిక ఎక్కువండీ. ఈ విషయం మీరు మీ వాళ్లకు గానీ, పోలీసులకు గానీ చెప్పలేదా?
అచ్చమాంబ: చెప్పలేదు. ఇందులో ఏముందిలే అనుకున్నా. ఏ కుటుంబంలో అయినా...భార్య భర్తల మధ్య....(ఇంకా ఏదో చెప్పా బోతున్డగానే...)
యాంకర్: కనీసం హ్యూమన్ రైట్స్ దగ్గరకైనా వెళ్ళలేదా?
అచ్చమాంబ: అవేమో నాకు తెలియదమ్మా. 
యాంకర్: మీలాంటి వాళ్ళు హుమన్ రైట్స్ దగ్గరకు వెళ్ళాలి. సరే...డైరెక్ట్గా ఎకాయికీ మా స్టూడియోకి వచ్చి ఎక్స్ క్లూసివ్ గా మా ఛానల్ ప్రేక్షకులతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. మీ పోరాటంలో మా ఛానల్ మీ వెంటే ఉంటుంది. ఇప్పుడు..గుంటూరు నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. 


యాంకర్: గుంటూరు నుంచి సతీష్ గారు. సతీష్ గారూ... అచ్చమాంబ గారితో మాట్లాడండి.
సతీష్: హలో...హలో..అచ్చమాంబ గారు...మీ కథ వింటే గుండె కరిగింది మాకు. మా ఆవిడ ఏడుస్తున్నది కూడా. ఈ కథ వెలుగు లోకి తెచ్చిన ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా.

అచ్చమాంబ: (ఎలా స్పందించాలో అర్ధంకాక...తడుముకుంటూ) థాంక్స్ అండీ..మీ లాంటి వారి సహకారం ఉంటే...నాకు అంతకన్నా.... కావలసింది ఏముంది?
యాంకర్: థాంక్స్ సతీష్ గారు, మీ అమూల్య అభిప్రాయాలు చెప్పినందుకు. ఇప్పుడే మహిళల సంఘం నాయకురాలు పొద్దు గారు, భార్యా బాధితుల సంఘం నేత రావుగారు ఫోన్ లైన్స్ లో సిద్దంగా ఉన్నారు. ముందుగా...పొద్దు గారూ...మీరు చెప్పండి.

పొద్దు: చెప్పేది ఏముంటుందండీ...ఒకటే కథ. ఆ మగ వెధవ ఎందుకండీ అంత హింస పెట్టాలి? నేను ముందునుంచీ చెబుతూనే ఉన్నాను...చట్టాలు కఠినం చెయ్యాలని. ఇలాంటి వాళ్ళను అస్సలు వదల కూడదు. జైల్లో పెట్టాలి. లేకపోతే చూస్తూ ఊరుకోం. 

అచ్చమాంబ: (బిత్తరపోతూ) అక్కా..అంతోటి మాటలు ఎందుకులెండి. మిమ్మల్ని టీ.వీ.లలో రోజూ చూస్తూ ఉంటాను. మీరు చాలా బాగా మాట్లాడతారు.
పొద్దు: అదిగో చూసారా..ఆ ఆడతల్లి మనసు. భర్తను కనీసం మాటైనా అననివ్వడం లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అసలు స్త్రీ అంటే...


రావు: హలో..హలో...నన్ను కాస్త చెప్పనిస్తారా? ఏమిటండీ కఠిన చట్టాలు అంటున్నారు. ఎందుకండీ కఠిన చట్టాలు? ఇప్పుడు ఉన్నవి చాలవా? నేను చాలెంజ్ చేస్తున్నాను.
పొద్దు: కఠినం కాకపోతే..మీలాంటి వాళ్ళు ఉండబట్టే..ఈ రోజు పరిస్థితి ఇలా దాపురించింది. 

(ఇలా పొద్దక్క, రావు అన్నయ్యా కాసేపు ఒకళ్లది ఒకళ్ళకు...చివరకు జనాలకు అర్థం కాకుండా...పది నిమిషాలు తిట్టుకుంటారు. యాంకర్ను వారిద్దరూ పట్టించుకోరు. విధిలేక...'ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..'అని యాంకర్ అంటారు. మూడు యాడ్స్ తర్వాత మళ్ళీ కథ మొదలు)

యాంకర్: స్పెషల్ స్టోరీ కి మళ్ళీ స్వాగతం. అచ్చంమాంబ గారు పడిన నరకయాతన పై మా ఛానల్ చొరవ చూపి చేసిన ఈ లైవ్ కు విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పుడు అమెరికా నుంచి...ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. చెప్పండి..విశేష్ గారు.

విశేష్: హలో..హలో...కెన్ యు హియర్ మీ?
యాంకర్: చెప్పండి...పఫెక్ట్లీ...గో ఆహేడ్
విశేష్: అచ్చంమాంబ గారి గురించి విని చాలా ఫీల్ అయ్యామండీ. షికాగోలో ఉన్న మా సంఘం తరఫున మేము ఆమె పోరాటానికి మద్దతు పలుకుతున్నాం. మేము ఆమెకు మీ ఛానల్ ద్వారా ఒక యాభై వేలు పంపుతున్నాం. 

యాంకర్: థాంక్స్ మిస్టర్ విశేష్. వ్య్ ఫీల్ హాపీ ఫర్ దట్. మీరు నేరుగా మా ఛానల్ పేరు మీద చెక్ పంపండి...ఇప్పుడు మరొక కాలర్..

(ఇలా ఒక పది మంది ఫోన్ ఇన్ లో వచ్చి వాళ్లకు తోచింది చెబుతారు. నోటికొచ్చింది వాగుతారు. చాలా చర్చ జరుగుతుంది, దానికి యాంకర్ మసాలా యాడ్ చేస్తారు. ఒక పోలీసు పాత్ర, ఒక జడ్జి పాత్ర యాంకర్ పోషిస్తారు...లైవ్ లో. ఇంత హడావుడి ఎందుకు జరుగుతున్నదో 'బాధితురాలి'కి బోధపడదు. పొద్దున్న జరిగిన గొడవ అప్పుడే తమ ఇంటికి వచ్చిన తమ దూరపు బంధువైన ఒక చానెల్ విలేకరికి చెప్పి తప్పు చేసానేమో అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే... ఇంతలో అచ్చమాంబ గారి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది)

యాంకర్: ఇప్పుడే అందిన వార్త. తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న...మా ఛానల్లో ప్రసారమైన కథనానికి స్పందిస్తూ అచ్చమాంబ గారి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. (ఇంతలో...బ్రేకింగ్ న్యూస్..."దెబ్బకు కదిలిన అచ్చమాంబ ఫ్యామిలీ")

యాంకర్: హలో...చెప్పండి...మీరు ఎవరు? అచ్చమాంబ గారికి ఏమవుతారు? వారి భర్తను లైన్ లోకి రమ్మని చెప్పండి. ఆమె స్టూడియోలో ఉన్నారు. 
అటువైపు వ్యక్తి: నేను భర్తను కాదండీ. హలో..నేను... అచ్చమాంబక్క ఇంటిపక్క ఉంటానండి. నా పేరు సరస్వతి. అర్జెంటుగా ఆమెతో మాట్లాడాలండీ.
యాంకర్: ఆయన లేడనుకుంటా...సరే.....సరస్వతి గారు...మాట్లాడండి. 
సరస్వతి: (గాబరాగా) హలో...అచ్చమ్మక్కా...ఉన్నావా?
అచ్చమాంబ: సరస్వతి చెప్పమ్మా...మన గోవిందు స్టూడియోకు రమ్మంటే వచ్చా. ఇక్కడ అంతా గందరగోళంగా....(మధ్యలో సరస్వతి అందుకుంది) 


సరస్వతి: అది తర్వాత అక్కా...ఈ టీ.వీ.లో ఈ చర్చ చూసి భయపడి బావ కళ్ళు తిరిగి కింద పడిపోయ్యాడక్కా....ఇప్పుడే నేను 108 కు ఫోన్ చేశా. నువ్వు పొద్దున్న పట్టుపట్టి అడిగిన కంచిపట్టు చీర తెచ్చాడటక్కా. ఈ లోపు నువ్వు టీ.వీ.లో వచ్చేసరికి కళ్ళు తిరిగి పడ్డాడక్కా...నువ్వు అర్జంటుగా రావాలక్కా...

అచ్చంమాంబ: అయ్యో...అయ్యో...(గుండెలు బాదుకుంటూ) ఎంత పనయ్యిందే. చిన్న చీర గొడవ ఎంత పెద్దగయ్యిందే! ఆయన్ను తప్పుగా అనుకున్నా...ఓరి దేవుడో... ఆయనకసలే బీ.పీ., షుగరు. నేను వెంటనే వస్తున్నా. సరస్వతక్కా...ఆ బీరువాపైన యెర్ర డబ్బీలో...గోలీలున్నై...రెండు వెయ్యక్కా..వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళండి.  నేను స్టూడియో నుంచి ఆసుపత్రికి వస్తా. ఆయన మాత్రం జాగ్రత్త అక్కా. గోటితో పొయ్యేది...గొడ్డలి దాకా వచ్చింది. 

(ఇలా...అచ్చమాంబ ఆసుపత్రికి వెళ్తారు. ఈలోపు 'భార్యా భర్తలను నాటకీయ పరిణామాల మధ్య కలిపిన చానెల్ మాది.." అని తాటికాయంత అక్షరాలతో తెర నిండా వేసుకుని...మురుస్తుంది ఈ చానెల్)

యాంకర్: చూసారు కదా...మా ఛానల్ ఒకే ఒక చర్చతో క్షణాలలో ఒక కుటుంబాన్ని ఎలా కలిపిందో. మళ్ళీ ఏమైనా తేడా వస్తే...అచ్చమాంబ గారి పక్షాన పోరాడటానికి మా ఛానల్ ఏ మాత్రం వెనుకాడదని హామీ ఇస్తూ....ఈ స్పెషల్ లైవ్ ప్రోగ్రాం ముగిస్తున్నాం. మళ్ళీ...ఇలాంటి ప్రోగ్రామ్లో కలుసుకుందాం..అంతవరకూ చూస్తూనే ఉండండి ఈ ఛానల్ ను. మేము మీ తోడూ..నీడా..మీరు మా..వెలుగు నలుగు. నమస్తే.
********************------------------------------****************

బాధితులకు ఛానెల్స్ సహాయం చేయవద్దనడంగానీ....మహిళలను కించపరచడం గానీ, ఎవరినో గేలి చేయడం గానీ మా ఉద్దేశం కాదు. ఈ టీ.వీ.ఛానెల్స్ భార్యాభర్తల పంచాయితీల నుంచి లబ్ది పొందాలని చూడ్డం బాగా పెరిగిపోతున్నది. దీన్ని బాధితులు... బాధలో ఉండి, హడావుడిలో పడి గుర్తించడం లేదు. ఈ లోపు చాలా డామేజ్ జరుగుతున్నది. 

టీ.వీ.యాంకర్స్ న్యాయమూర్తి పాత్ర పోషిస్తున్నారు. జీవితాలు మరీ రచ్చ చేయడానికి తెగపడుతున్నారు. పలు సిల్లీ కేసులు లైవ్ లోకి తీసుకొని....రాజీకి ఉన్న మార్గాలను ఛానెల్స్ మూసి వేస్తున్నాయి. పనీ పాటా లేని వాళ్ళను ఫోన్ ఇన్లో తీసుకుని....కాలక్షేపం చేస్తున్నాయి. ఆ రోజు లైవ్ అయ్యాక ఆ కేసులను ఈ ఛానెల్స్ పట్టించుకోవు.  కాబట్టి....అన్యాయాలకు గురయ్యే మహిళలూ..తొందరపడి...ఆవేశంలో మీడియాకు ఎక్కకండి. వెర్రి కోపంతో టీ.వీ.స్టూడియోలకు వెళ్లి లైవ్ లలో పాల్గొనకండి. 

ముందుగా...న్యాయ పోరాటం చెయ్యండి. మహిళా సంఘాల మద్దతు తీసుకోండి. అయినా...మీకు న్యాయం జరగకపోతే...విలేకరుల సమావేశం పెట్టండి.  మీరు ఏదో ఒక ఛానల్ లైవ్ లోకి వెళితే...మిగిలిన ఛానెల్స్ మిమ్మల్ని పట్టించుకోవు. మీ పోరాటానికి బాసటగా నిలవవు. అవి పోటీ పిచ్చిలో పడి నిర్దయగా వ్యవహరిస్తాయి. మీరు నష్ట పోతారు.  

అమాయకులైన అక్కలు, చెల్లెళ్ళను ఛానెల్స్ దారుణంగా వంచిస్తున్నాయని  చెప్పడం ఈ రచన ఉద్దేశ్యం. బాధితులు మీడియాను ఎలా తెలివిగా వాడుకోవాలో సలహా...సహాయం కావాలంటే....మాకు (ఫోన్: 9347474537) ఫోన్ చెయ్యండి. మాకు చేతనైన ఉచిత సహాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాం.

కే.సీ.ఆర్.విదేశీ ఇంటర్వ్యూలు 'ఈనాడు'కు వార్త

కారణాలు ఏమిటోగానీ టీ.ఆర్.ఎస్.అధినేత కే.చంద్రశేఖర రావు గారికి 'ఈనాడు' ఒకొక్కసారి భలే ప్రాధాన్యత ఇస్తుంది. శుక్రవారం నాటి 'ఈనాడు' హైదరాబాద్ ఎడిషన్ 14 వ పేజీలో వచ్చిన ఒక వార్త అందుకు మరొక మంచి ఉదాహరణ.


ఆ వార్త శీర్షిక: "న్యూయార్క్ టైమ్స్, అల్ జజీరాలకు కే.సీ.ఆర్. ఇంటర్వ్యూ." ఈ చిన్న వార్తకు కే.సీ.ఆర్. ఫోటో కూడా వాడారు.

"అమెరికాకు చెందిన ' న్యూయార్క్ టైమ్స్' పత్రికకు బుధవారం, ఇస్లామిక్ దేశాల్లో ప్రాచుర్యం ఉన్న 'అల్ జజీరా' టీవీ చానెల్ కు గురువారం ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణా ఉద్యమం, విద్యార్థులు, యువత ఆత్మహత్యలు తదితర అంశాలను ఆయన ఈ ఇంటర్వ్యూలో ప్రసతావించారు," అని కూడా ఆ వార్తలో ఉంది.

అసలిది ఒక వార్త అవుతుందా? ఇదివరకు 'కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త' అనే వారు. ఇప్పుడు కే.సీ.ఆర్.ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం కూడా వార్త అయ్యిందంటే...'ఈనాడు' గొప్పతనమే!

Friday, March 19, 2010

నేడు...'వరల్డ్ స్లీప్ డే': అన్నీ మరిచి హాయిగా బజ్జోండి...

మీరు ఒప్పుకోరేమో  గానీ...మన TV-9 కొన్ని సార్లు మంచి స్టోరీలు ఇస్తుంది. ఈ రోజు 'World Sleep Day' అని ఆ ఛానల్ లో ఈ సాయంత్రం చూసి ఇది రాస్తున్నాను. ఇది ఆటలో అరటిపండు...కొంత స్వోత్కర్ష.

నేను ఏ బస్సు ఎక్కుతున్నా...మా అమ్మ...'జాగ్రత్త నాన్నా. స్టేజీ చూసుకో..." అని నవ్వుతుంది. ఆ జాగ్రత్త ఎందుకంటే...మన నిద్ర గురించి. ఏ బస్సు ఎక్కినా...పదకొండో నిమిషంలో నిద్రాదేవత ఒడిలోకి జారిపోవడం...మా నాన్నకు, నాకు అలవాటు. చిన్నప్పుడు ఒకసారి బస్సులో నిద్రపోయి పక్క స్టేజిలో దిగా కాబట్టి...అమ్మ ఆందోళనతో ఆ హెచ్చరిక చేస్తుంది.

ఎందుకో గానీ....ఇప్పటికీ నాకు...ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ అంటే అక్కడ నిద్ర వస్తుంది. దూర ప్రయాణాలలో రోడ్డు పక్క చెట్టుకింద...కారు ఆపి పదంటే పది నిమిషాలే సుఖంగా నిద్రపోయి లేచి మళ్ళీ డ్రైవింగ్ ఆరంభిస్తే....'బాబూ...నువ్వు  మనిషివి కాదు...' అని ఇంట్లో రెండు జీవులు దెప్పుతుంటాయి నన్ను. తమకు నిద్రపట్టడం లేదని ఎవరైనా అంటే...నాకు భలే జాలి వేస్తుంది.

 స్కూలు రోజుల్లో...అంతా నైట్ అవుట్లు చేస్తుంటే...గంట కొట్టినట్లు తొమ్మిది గంటలకు మనం బెడ్ హిట్టింగ్ చేయడం వల్ల ఇంట్లో అందరికీ మండేది. ఇప్పటికీ...నా అంత్యంత స్నేహితులు నన్ను రాత్రి పూట పార్టీలకు రమ్మనరు. కారణం...అక్కడే ఒక టైం అయ్యాక ఒక మూల మనం చేసే పవళింపు. 

నేను నిద్రను ఎంజాయ్ చేసినట్లు ఎవ్వరూ చెయ్యరని...ఈ బ్లాగ్ పెట్టక మునుపు దాకా అనుకునే వాడిని. ఈ బ్లాగ్ మూలంగా యేవో ఆలోచనలు...ఏదో రాయాలని, ఉద్ధరించాలని తలంపు. మెదడులో ఆలోచనా క్రమం, ధార దెబ్బతినకముందే కంపోజ్ చేయాలన్న పిచ్చి భావన వల్ల నిద్ర కొద్దిగా దూరమయ్యింది. ఈ వరల్డ్ స్లీప్ డే సందర్భంగా దీన్ని సవరించుకోవాలి. 


రాత్రి నిద్ర చేడిందా...చాలా మంది మర్నాడు ఉదయం కొంత బీభత్సం సృష్టిస్తారు. నిద్ర సరిగా లేని బాస్ లే ఉద్యోగులపై అకారణంగా విరుచుకుపడతారు. నిద్ర లేని వాళ్ళే ఇతరులపై చిర్రుబుర్రులాడుతుంటారు. నిద్రలేకపోతే...నరాల వ్యవస్థ సహకరించదు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.

కాలం గాయాన్ని మాన్పుతుందని అంటారు కానీ...ఏ గాయాన్నైనా...జోకొట్టి నిద్రపుచ్చి మాయం చేసేది నిద్రే. ఇంత మంచి నిద్ర కోసం...ఒక దినోత్సవం ఉండడం సంతోషకరం.ఈ ఒక్క రోజైనా ఆలోచనలు, ఒత్తిళ్ళు పక్కన దిండు కింద పెట్టి...హాయిగా గుర్రుపెట్టి నిద్రపోండి. నిద్రపొయ్యేవారిని నిద్రలేపకండి. 

మిత్రులకు నేను ఒక సలహా ఇస్తుంటాను....మంచి సీరియస్ నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటే...నిద్రపొయ్యే ముందు దాని గురించి ఆలోచించి...నిద్ర లేచాక డెసిషన్ తీసుకోండి. నిద్ర చాలా విషయాలను తేలిక పరుస్తుంది. కలల గురించి కూడా కొన్ని స్వానుభవాలు రాయాలని ఉంది గానీ...ఇప్పటికే థీంకు దూరంగా వెళ్తున్నావని అంటున్న మంచి మిత్రుల భయానికి జడిసి ఆగుతున్నాను.  

ఇక ఈ పై ఫోటో గురించి ఒక ముక్క. ఇది కాకినాడలో ఒక టేబుల్ టెన్నిస్ పోటీలకు నా కొడుకు ఫిదెల్ వెంటవెళ్లి...మధ్యాన్నం కొద్దిగా తిన్నాక ఎర్రటి ఎండలో చెట్టునీడన కుర్చీలో కూర్చుని హాయిగా ఒక కునుకు తీస్తుండగా...మా వాడి ఫ్రెండ్ తండ్రి శ్రీధర్ గారు నాకు తెలీకుండా తీసి నాకు పంపిన ఫోటో. ఒక మధుర ఘడియను చిత్రీకరించిన శ్రీధర్ గారికి థాంక్స్. 


ఈ సందర్భంగా...http://worldsleepday.wasmonline.org/ నుంచి కాపీ చేసిన ఈ తీర్మానాలు మీ కోసం...

The World Sleep Day declaration is as follows:
  • Whereas, sleepiness and sleeplessness constitute a global epidemic that threatens health and quality of life,

  • Whereas, much can be done to prevent and treat sleepiness and sleeplessness,

  • Whereas, professional and public awareness are the firsts steps to action,

  • We hereby DECLARE that the disorders of sleep are preventable and treatable medical conditions in every country of the world.

సినిమాల-జనాల బాగుకోసం అబ్రకదబ్ర బహిరంగ లేఖ....


హైదరాబాదు,
మార్చి 19, 2010

గౌరవనీయులైన మంత్రివర్యులు గీతారెడ్డి గారికి,

మేడం.. నమస్తే. నేను ఒక సగటు తెలుగోడిని. సినిమాలు చూసి కళాపోషణ చేస్తుంటా. పైరసీపై మీరు  ప్రత్యేక హామీలు ఇచ్చారని సినిమా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ అంశంపై నిరశన చేస్తున్న నిర్మాత యలమంచలి రవిచంద్ కి నిమ్మరసం కూడా తాగించారు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ మీద మీకు తెల్లారగట్ట ఈ లేఖ రాస్తున్నా...అర్థం చేసుకుంటారని మనవి. నేను పెద్దగా చదువుకున్నోడిని కాదు కాబట్టి...సమాజం కోసం మంచి కోసం ఇలా రాస్తున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి.   

1) మేడం, నా ఈ ఎదవ జీవితంలో నాకున్న ఏకైక వినోద సాధనం సినిమా, టీ.వీ. ఈ వార్తల చానళ్ళు రోజూ సగం సినిమా చూపుతాయి కాబట్టి అవి 'బుల్లి సినిమా' కిందికి వస్తాయి. నలుగురు హీరోలు, నిర్మాతల మండలి మహనీయులు వచ్చి అడగ్గానే టికెట్ ధర పెంచుతారు మీరు. మా పరిస్థితి ఏమిటి? నేను, నా భార్య, పిల్లలు కలిసి సినిమాకు వెళ్ళాలంటే....తడిసి మోపెడవుతున్నది. మల్టిప్లెక్స్ లో మాకు ఒక సినిమాకు అక్షరాలా వెయ్యి అవుతుంటే మాకు పట్టదా? 

ఇంత ఖర్చా? మాకు వినోదపు హక్కు లేదా? చిన్న హాల్ లోకి పోదామంటే పెళ్ళాం, బిడ్డలు ఊరుకోరాయే. మీరు ఖైరతాబాద్ నుంచి...లక్డి-కా-పూల్ దాకా పకడ్బందీగా రోడ్డుమధ్య గట్టి డివైడర్ పెట్టారు. అందుకే మధ్యలో మా జనం బొక్కేట్టేసి దూరుతూ రోడ్డు దాటుతున్నారు. మరి...పైరసీ సీ.డీ.కూడా మాకు అలాంటిదే.

2) సరే...ఈ సినిమా జనం దండం పెట్టి మరీ అడుగుతున్నట్లు హాలుకు వెళ్లి పాప్కార్న్ నవులుతూ సినిమా చూడాలని మాకు మాత్రం ఉండదా? అక్కడ హాల్లోకి ఆ నాయాళ్ళు మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకుపోనివ్వడం లేదు. ఇది మేము ఎవ్వడికి చెప్పుకోవాలి? వాడు అక్కడ ఎంత ధరకైనా ఏ బ్రాండ్ అమ్మినా మూసుకుని మేము కొనుక్కోవాలి. అది హక్కుల ఉల్లంఘన కాదా? మరది మావల్ల అవుద్దా? ఒక్క సీ.డీ. కొనుక్కుంటే...ఇంట్లోనే చాయ్, మిర్చి తింటూ ఛీప్ గా సినిమా చూడొచ్చుగద మేడం. ఏం...ఐడియాలు వీళ్ళు కాపీ కొట్టి సినిమాలు తీయడం లేదా? 

3) మేము హాల్ కు పోకుండా...బెడ్ రూమ్ లోనే కూచొని దొంగచాటుగా సీ.డీ. సినిమా చూడడానికి చెప్పుకోలేని ఒక కారణం ఉంది మేడం. మీకు తెలుసు...ఇప్పటి సినిమాలలో అన్నీ..బూతు సీన్లే. హీరోలు కూడా హీరోయిన్లను రేపు చేస్తున్నారు. మాటి మాటికీ వాటేసుకుని, ముద్దేట్టేసుకుంటున్నారు, మంచం మీదికి గుంజేస్తున్నారు. 

ఈ సీన్లన్నీ పిల్లలతో కలిసి చూడలేకపోతున్నాం మేడం. డబల్ మీనింగ్ డైలాగులు అర్థం కాక పిల్లలు వాటి అర్థం చెప్పమని అడుగుతుంటే చచ్చిపోతున్నాం. అందుకే...మా బామ్మర్ది చీపు రేటుకు తెచ్చే పైరసీ సీ.డీ.తెచ్చి పిల్లలు నిద్రపోయ్యక బెడ్ రూమ్లో గుట్టుగా సినిమా చూస్తున్నాం మేడం. ఈ జాగ్రత్త పాటించకుండా...దర్జాగా పిల్లలతో హాల్లో సినిమా చూసిన మా గవర్రాజు కొడుకు (పదేళ్లోడు) ఇల్లూడుస్తున్న పనిమనిషి  నడుము పట్టుకున్నాడు, టేచెరమ్మ ఒంక అదోలా చూస్తున్నాడంట.  

ఈ సినిమా వాళ్ళు పంతుళ్ళను పిచ్చోళ్ళను చేసి చూపిస్తున్నారు. అయ్యా అమ్మలను ఎగర్తించమని చెబుతున్నారు. పోలీసులను దొంగలంటూన్నారు. అందరినీ చులకన చేస్తున్నారు. లేచిపోవడం, పక్కింటి ఆంటీకి లైట్ కొట్టడం చానా గ్లామర్ గా చూపుతున్నారు. అయ్యబాబోయ్....పిల్లలను చేజేతులా పాడు చేసుకోమంటారా...హాలుకెళ్ళి సినిమా చూసి? మీరు ఒక లేడి మంత్రి కదా...మీరు చెప్పండి..టీ.వీ.వార్తా ఛానెల్స్ లాగా సినిమాలు కూడా సకుటుంబంగా చూసేటట్టు ఉన్నయ్యా?  

4) డబ్బులు లేక ఆగా కానీ ఈ రోజుల్లో సినిమా తీయడం ఏముంది మేడం? ఒక ప్రేమ కథ, మనోడు హీరో, తెలుగేతర బక్కపీచు పోరి హీరోయిన్, నాలుగు ఫైట్లు, ఒకటీ అరా విదేశీ షాట్లు, కొన్ని గ్రాఫిక్స్. ఇంతోటి దానికి హాల్ దాకా పొమ్మంటారా? బాగుందే.

5) పనిలో పనిగా మీకు కొన్ని సూచనలు చెయ్యాలని ఉంది మేడం...మీరేమి అనుకోవద్దు. ఈ సినిమా వాళ్ళు 'హై బడ్జట్' అంటూ ప్రెస్ ముందు ఓ..తెగ డబ్బా కొట్టుకుంటున్నారు కదా మేడం. పైరసీ అరికట్టేందుకు ఒక వంద మంది పోలీసోళ్ళతో స్పెషల్ టీం ఏర్పాటు చేసేముందు...మీరు వీళ్ళను ఒకటి అడగండి మేడం. సినిమా టైటిల్స్ తో పాటు...సినిమాకు అయిన ఖర్చు వివరాలు...ఎవరికెంత ఇచ్చింది..ఒక లిస్టు తెర మీద కాసేపు చూపించమని వీళ్ళకు ఆర్డర్ వెయ్యాలి మేడం. లైట్ బాయ్ కి వీళ్ళు ఎంత ఇచ్చారో కూడా చెప్పాలి. ఈ పారితోషకం తీసుకున్న వాళ్ళు ఎంత టాక్స్ కట్టారో కూడా చెప్పాలి మేడం. బట్టలిప్పి చూపిస్తారు గానీ లెక్కలిప్పి చూపించరా?

6) అసలు మీకు, రోశయ్య బాబాయికి  తెలియట్లేదు కానీ మేడం...మీరు జనాలకు సారా పోసి ఖజానా నింపుకుంటున్నట్లే...ఈ సినిమా వాళ్ళను టైట్ చేసి డబ్బు సంపాదించవచ్చు. ఆ టైట్ కాకుండా ఉండడానికే వీళ్ళు రాజకీయం వెంట, నాయకుల వెంట ఉరుకుతున్నారట. వీళ్ళలో చాలా మంది  పన్ను కట్టడం లేదట. కొందరు కట్టినా...మన రాష్ట్రంలో కాకుండా చెన్నై వెళ్లి కడుతున్నారట...ఎందుకు? వీళ్ళ లెక్కలు సరిగ్గా ఉన్నాయా? అని చూడడానికి ఈ ఫీల్డు లో ఏరులై పారుతున్న నల్లధనం అరికట్టడానికి ఆ పోలీసు టీం సేవలు ఉపయోగించుకోవాలి. అలాగే...బైటికి రావడం లేదు కానీ చిన్న ఉద్యోగులకు వీళ్ళు సరిగా జీతాలు ఇవ్వడం లేదట. ఈ సందర్భంగా ఇవన్నీ మనం చూడాలి మేడం.

7)  మనోళ్ళ బ్రైన్స్ అమెరికా వాడు ఐ.టీ.లో వాడుకుంటున్నాడు. మన తెలుగు బాడీ లు మాత్రం మన సినిమా వాళ్ళకు పనికిరావడం లేదు మేడం. హీరోయిన్ సహా అందరూ తెలుగు యాక్టర్లను పెట్టుకోండని, తెలుగు రాని డబ్బింగ్ భామలను తీసుకుంటే ఊరుకోబోమని ఒక ఆర్డినన్స్ తేవాలి మేడం...యమ అర్జంటుగా. మన తెలుగు అమ్మాయిలు ఎంత బాగుంటారో మీకు తెలియదా చెప్పండి.  ఆ బాపుగారినో, విశ్వనాథ్ గారినో అడగండి. ఏ.. టూ.. జడ్ లోకల్ టాలెంట్ వాడుకుని, సముద్రపు ఒడ్డు-భామల బొడ్డు చూపని సినిమాకు కొన్ని రాయితీలు ఎక్కువ ఇవ్వాలి. 

8) మానవ సంబంధాలు దెబ్బతీసే సినిమాలు, మహా చెడ్డ హారర్ మూవీలు తీసే నిర్మాతలను, నటీ నటులను 'గూండా యాక్ట్' కింద బుక్ చేయాలి లేదా ముంబాయ్ పంపెయ్యాలి మేడం. కొన్నేళ్ళ పాటు బీచ్ సీన్లు, ముద్దుల సీన్లు, ముంబాయ్-చెన్నై--బెంగాల్ భామల బుకింగులు నిషేధించాలి.  ఇతర రాష్ట్ర హీరోయిన్ను తీసుకుంటే...హీరో కూడా ఇతర రాష్ట్రం వాడి ఉండాలని ఒక క్లాజు పెట్టండి....అంతా సెట్టవుద్ది ఆటోమాటిగ్గా.
9) 'హై స్కూల్' లాంటి సినిమా తీసిన వాళ్ళకు ఎర్రగడ్డలో ప్రత్యేక చికిత్స ప్రభుత్వ ఖర్చుతో ఇప్పించాలి మేడం. దర్శకులకు అప్పుడప్పుడు మానసిక వైద్యులతో పరీక్షలు జరిపి...వాళ్ళు తదుపరి సినిమాకు పనికివస్తారో లేదో చూడాలి. తేడా వస్తే వాళ్ళను ఆపాలి. తెలీకుండా...వీళ్ళు సమాజాన్ని పాడు చేస్తున్నారు. మీ గొడవ మీది కాబట్టి మీకు ఈ ముఖ్య అంశం పట్టదు.

10) ఒక ఫ్యామిలిలో ఇద్దరికన్నా ఎక్కువ మంది హీరో వేషం వెయ్యకూడదని  కూడా ఒక రూల్ ఉండాలి మేడం. 

11) సినిమా మా లాంటి వాళ్లకు ఊపిరి మేడం. అందులో బట్టలే మా దుస్తులు, అందులో మాటలే మా పలుకులు. అందులో సంస్కృతి మాకు ఆదర్శం. మళ్ళా రాస్తున్నా అనుకోకండి కానీ...సినిమాలో బూతును అరికట్టడానికి ఏదైనా చేయండి మేడం. ప్లీజ్. 
అది మీ వల్ల కాకపోతే....ఒక్క హీరోయిన్, ఇతర ఆడ పాత్రధారులే కాకుండా....హీరోలు, విలన్లు, బ్రహ్మానందం సహా అంతా బోసిమొలతో సినిమా తీసుకునే పర్మిషన్ ఇవ్వండి మేడం. ఇది 'దిగంబర సినిమా' అని ఒక ముద్ర వేస్తే...పిల్లలను ఇంట్లో ఉంచి పెద్దోళ్ళం హాలుకెళ్ళి చూసొస్తాం. ఆ పనైనా చేసి పుణ్యం కట్టుకోండి మేడం.

12) ఇంకో చిన్న సజెషన్. ముందుగా దర్శక నిర్మాతలు నటీ నటులు అంతా వాళ్ళ అమ్మానాన్నలు, పిల్లాపాపలతో కూచొని చూశాక వాళ్ళ అభిప్రాయాలు పరిగణనలోకి తెసుకుని...సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వాలి. 
ప్రజలు ఈ సినిమా వద్దని కోరగానే...ఆ సినిమా ప్రదర్శన కూడా ఆపాలి. 'జనం చూస్తున్నారు...అందుకే చూపుతున్నాం," అని వాదించే అత్తెలివి సినీ జనాలను దేశద్రహం చట్టం కింద అరెస్టు చేసి అండమాన్ జైలుకు పంపాలి.
సారీ మేడం ఆవేశం ఎక్కువయ్యిందా?
నిజానికి ఇంకా చాలా చెప్పాలని ఉంది.
ఇప్పటికి ఈ డజను చాలు. సెలవ్, ఉంటాను
మీ
అబ్రకదబ్ర
ఫిలిం నగర్
హైదరాబాద్

Thursday, March 18, 2010

సినిమాలు ఆడంది...అవి బాగోలేకనా? పైరసీ వల్లనా?

ఈ సినిమా అన్నయ్యలు ఉన్నట్టుండి పైరసీ మీద పడ్డారు. ఒకరేమిటి....చిరు, రాజశేఖర్, జీవిత, పరుచూరి, నాగార్జున, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్...తదితరులంతా ఇప్పుడు పైరసీ మీద మండిపడుతున్నారు. 'పైరసీ భూతానికి' వ్యతిరేకంగా శుక్రవారం తెలుగు చలన చిత్ర పరిశ్రమ బంద్ చేస్తుందని ప్రకటించారు కూడా. 

ఒక్క హిట్టు కూడా లేని ఈ తరుణంలో ఈ సినీ జనం పైరసీ సమరం చేస్తున్నారేమిటి? ఇది ఫ్లాప్స్ ను కప్పిపుచ్చుకునే చచ్చు తెలివా? ఇంతకూ... వీళ్ళ సినిమాలు మూడు వారాలకు మించి ఆడకపోవడానికి కారణం పైరసీనా? నాణ్యతా లోపమా?  నాకైతే వీళ్ళు నానా హడావుడితో మనకు సినిమా కథ చెబుతున్నారనిపిస్తున్నది.

మొన్నామధ్య...ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ప్రకటనతో చర్చ ప్రారంభించడం సముచితం. 'తారే జమీన్ పర్' లాంటి సినిమాలు తీసే మొగోళ్ళు మన తెలుగు చిత్ర పరిశ్రమలో లేరని ఆయన అన్నారు. అందులో ఈ భూమ్మీద పుట్టిన ఎవ్వడికీ అనుమానం ఉండాల్సిన పని లేదు. గత ఐదేళ్ళల్లో మన తెలుగు శూరులు తీసిన మంచి సినిమాలు ఒక ఐదింటి పేర్లు తడుముకోకుండా చెప్పండి. ట్రై చేయకండి, ఇది చాలా కష్టమైన ప్రశ్న. 

సముద్రం ఒడ్డు, బికినీలో అమ్మాయి, నడుము గిర్రుగిర్రున తిప్పడం, ద్వందార్ధపు బూతు డైలాగులు...హింస... లేని ఒక్క తెలుగు సినిమా చూపించండి. అందుకే తెలుగు సినిమాను మా అబ్రకదబ్ర మూడు మాటల్లో చెప్పాడు: "సముద్రపు ఒడ్డు...ముంబాయ్ భామ బొడ్డు...పోరంబోకుగా తిరిగే ఒక బడ్డు (అంటే చింపాంజీ మొహపు హీరో అన్నమాట)."

పైరసీ నిజానికి ప్రపంచ వ్యాప్త సమస్య. దానిపై పోరాడాలి గాని మనోళ్ళు ఇంత హడావుడి చేయాల్సిన పనిలేదు. ఒక పక్క ఇంగ్లిష్, హిందీ సినీ పరిశ్రమలు  ఏడాదికి కనీసం నాలుగైదు మంచి సినిమాలు తీస్తుంటే...మన 'బడ్లు' ఒకే కథను అటుతిప్పి, ముంబాయ్ భామతో తిప్పించి 'ఓహో...చిన్చేసాం' అని ఎవడి భుజం వాడు చరుచుకుంటున్నాడు. మూస కథ, మూస నటులు, మూస దర్శకులు. అంతా భావదారిద్ర్యం. ఇది నిజం కాదని....అక్కినేని, చిరు, రామానాయుడు తదితర సినిమా కుటుంబాలను గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పమనండి. 

ఒక్కడు వెళ్లి ఒక కత్తితో వంద మందిని ఇరుకైన ప్రదేశంలో ఎగిరెగిరి చంపుతాడు. అది గొప్ప సీనని వాళ్ళ అయ్య చెబుతాడు, ఓహో...'మగధీర' అని మనం చప్పట్లు కొట్టాలి. ఇంకొకడు...నువ్వు ఒప్పుకున్నా..లేకున్నా...నువ్వు ఎవ్వరని ప్రేమిస్తున్న...నేను నిన్నే ప్రేమిస్తా...ఫీల్ మై లవ్..అంటాడు. దాన్ని మనం పొగడాలి. మోహన్ బాబు కొడుకులు, రామానాయుడు కొడుకు, నాగార్జున మనమడు...అందరూ హీరోలే. 

పనికి మాలిన కథలు, దిక్కుమాలిన యాక్షన్. ఇవి సినిమా హాల్స్ లో ఆడడం లేదని...పైరసీ మీద ఏడుపు. ఆడలేక మద్దెలను దెప్పినట్లుంది. కమల హాసన్ సినిమాలు వస్తే టికెట్లు ఎందుకు దొరకవు సార్? రాష్ట్రంలో ధియేటర్స్ అన్నీ కొంత మంది చేతులలో ఉన్నాయని, ఇది చిన్న నిర్మాతలకు ఇబ్బందికరమని నటుడు-కం-కాంగ్రెస్ లీడర్ రాజా చెప్పిన కొన్ని రోజుల లోపే మనోళ్ళు పైరసీ మీద పడ్డారు. ఈ సినీ జనం సినిమాల మీద కాకుండా...రాజకీయాల మీద...తమ కులపోళ్ళ ప్రభుత్వం తేవడం మీద దృష్టి పెట్టబట్టి నాణ్యత చంకనాకిపోతున్నదని విశ్లేషకులు మొత్తుకుంటున్నారు కూడా.  


'త్రీ ఈడియట్స్' లాంటి కథను ఒక్కదాన్ని సృష్టించి...తీయమనండి మన తురుంఖాన్లను. నిజానికి ఈ 'వారస, వానర హీరో'ల వల్లనే మన రాష్ట్రంలో హిందీ సినిమాలు, డబ్ చేసిన ఇంగ్లిష్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. వాటికి లేని పైరసీ బెడద మీ తెలుగు సినిమాలకు ఎందుకొచ్చింది సార్?


మన తెలుగు సినిమా వాళ్ళు తెలివిగా ఒక పని చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ప్లస్ ముంబాయ్ సుందరితో సినిమా తీస్తారు. కావాలని ఒక వివాదం అందులో ఉండేలా చేస్తారు. వివాదాలంటే పడిచచ్చే రవిప్రకాష్ మార్క్ టీ.వీ.వాళ్ళు ఈ సినిమా వాళ్ళను స్టూడియోలలో కూచోబెట్టి దాని మీద తెగ చర్చలు జరుపుతారు. లేకపోతే...హీరో, హీరోయిన్ (ఉదా: జగపతి బాబు, ప్రియమణి) లను రాసుకుపూసుకునేలా పక్కపక్క కూచోబెట్టి ఇంటర్ వ్యూ చేసి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు.  'ఈనాడు' వంటి పేపర్లు కూడా సినిమా తాలూకు బూతు బొమ్మలు వేసి ప్రమోట్ చేసే పరిస్థితి. 

"మా మేధో హక్కును వాళ్ళు (పైరసీకార్లు) దొబ్బెస్తే ఎలా?" అని నోటికొచ్చింది మాట్లాడే తేజ అనే దర్శకుడు అమాయకంగా టీ.వీ.గొట్టాల ముందు అంటుంటే నవ్వు వచ్చింది. అరె అన్నయ్యా...మీ మేధో హక్కుతో మీరు సమాజాన్ని దొబ్బండి...పైరసీకార్లు వాళ్ళ అతి మేధోహక్కుతో మిమ్మల్ని బాగా..బాగా దొబ్బుతారు. Survival of the fittest అన్న మాట. 


ఈ మధ్య సినిమా వాళ్ళు...ఈ నీతి మాలిన టీ.వీ.యాజమాన్యాలను బుట్టలో వేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. సినిమా--టీ.వీ.పెద్దలు ఒకటై జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మంచి ఫిలిం రివ్యులు రాకపోవడానికి కారణం ఇదే. 'ఇండియా టుడే' లో ఆ రెంటాల జయదేవ వంటి వాళ్ళు రాసే సమీక్షలు తప్ప నిష్పాక్షిక సమీక్షలు మీకు కనిపిస్తే...చెప్పండి.

సినిమా ఆడకపోయినా...బాగా ఆడుతున్నట్లు జిల్లాల నుంచి రిపోర్టర్ లతో స్టోరీ చేయించి జనాలను దారుణంగా తప్పుదోవ పట్టిస్తున్నాయి...టీ.వీ.యాజమాన్యాలు. "అదుర్స్ సినిమా బాగా ఆడిందని స్టోరీ చేసి పంపమన్నారు. జనం లేకపోయినా...బాగా ఆడినట్లు చచ్చినట్లు స్టోరీ చేశా. రిపోర్టర్ లకు ఇలాంటి పనులు చెప్పడం గతంలో లేదు," అని ఒకానొక చౌదరి గారి చానెల్లో బతకలేక పనిచేస్తున్న ఒక విలేకరి చెప్పాడు.

కాబట్టి...సినీ పరిశ్రమ బాబులూ.... దొంగ మాటలొద్దు గానీ...మీరు పిలుపు ఇచ్చినట్లు..పరిశ్రమను ఒక వారానికి తగ్గకుండా మూసిపారేయ్యండి. ఇళ్ళలో కూర్చుని...రాగ ద్వేషాలు లేకుండా తప్పుల లిస్టు రాసుకోండి. మనోళ్ళను (అంటే...మీ కొడుకులు, బామ్మర్ది పిల్లలు గట్రా)...కొన్నిరోజులు ఇళ్లలోనే ఉండమని...రాష్ట్రంలో టాలెంట్ ఎక్కడ ఉందో చూడండి. 

మీకు భజన చేసే....తిక్క రచయితలకు రెస్టు ఇచ్చి...కొత్త రక్తాన్ని ప్రోత్సహించండి. కాసుల పిచ్చ మాని....కాస్తంత సృజనాత్మకంగా ప్లాన్ చేయండి. స్టార్డం కోసం కాకుండా....మంచి కథల కోసం తపన పడి వెతకండి. ఒక్క చాన్సివ్వండి...బైట జనానికి. పైరసీ ఉన్నా.....అప్పుడు గానీ ఆ మంచి సినిమాలకు హోస్ ఫుల్ కాదు. మిమ్మలను రక్షించేది నాణ్యతే. ఆల్ ది బెస్ట్.