Thursday, October 31, 2013

మూత పడుతున్న జీ 24 గంటలు

గత ఏడాదే దాదాపు మూత పడే పరిస్థితికి వచ్చి బొత్స వారి వల్ల బతికి పోయిన  జీ 24 గంటలు తెలుగు ఛానెల్ తాజాగా మూత పడడానికి దాపు రంగం సిద్ధమయ్యింది. సుభాష్ చంద్రకు చెందిన జీ గ్రూప్ తో రెండేళ్ళ ఒప్పందం మీద బొత్స ఫామిలీ ఛానెల్ ను నడుపుతున్నది. ఉద్యోగులను తొలగించి, వినూత్నత్వం కోసం ప్రయత్నం చేసి.. అప్పటి డీ జీ పీ దినేష్ రెడ్డి మీద స్టోరీ ప్రసారం చేసి ఇరుక్కుని ఈ ఛానెల్  నానా రకాల తలనొప్పుల మధ్య ఉన్నది. డబ్బు పరంగా కూడా ఇబ్బందులు చుట్టు ముట్టాయని అంటున్నారు. 

ఈ నేపథ్యం లో ఉద్యోగులకు మూడు నెలల జీతాలు ఇచ్చి... దుకాణం బంద్ చేస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే... పలువురు జర్నలిస్టులు, టెక్నీషియన్లు, యాంకర్లు ఇబ్బంది పడతారు.  పాపం వారి పరిస్థితి ఊహిస్తే బాధగా ఉంది. తెలుగులో ఇన్ని ఛానెల్స్ ఉన్నాయి కానీ... ఎక్కడి కక్కడ ఎవరి సామ్రాజ్యం వారు నిర్మించుకున్నారు. ఇక్కడ నాణ్యమైన జర్నలిస్టుల కన్నా... కులపోళ్ళు, గులాం చేసే వాళ్ళకే పోజిషన్లు.. పెద్ద జీతాలు. 

ఇప్పుడు జీ 24 గంటలు నడుస్తున్న బిల్డింగ్ ఓనర్లకు కూడా జీ యాజమాన్యం మొన్నీ మధ్యన మూసేస్తున్న సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సరుకు, సరంజామా అన్నీ ఉన్న బిల్డింగ్ లో ఎవరైనా ఛానెల్ పెట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి... అలాంటి వాళ్ళు దొరుకుతారేమో అని బిల్డింగ్ ఓనర్లు కూడా వెతుకుతున్నారు. 
  

Tuesday, October 22, 2013

'ది హిందూ' బోర్డు వివాదాస్పద తీర్మానం

'ది హిందూ' యజమాని  కస్తూరి అండ్ సన్స్ బోర్డు ఎడిటోరియల్, బిజినెస్ స్ట్రక్చర్ ను మారుస్తూ చేసిన వివాదాస్పద తీర్మానం ప్రతి ఇది.




Monday, October 21, 2013

'ది హిందూ' కు సిద్దార్థ్ వరదరాజన్ గుడ్ బై


దక్షిణాదిన కోట్ల మంది బైబిల్ గా భావించే 'ది హిందూ' ఎడిటర్ పదవికి సిద్దార్థ్ వరదరాజన్ సోమవారం నాడు రాజీనామా చేశారు.  ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఎన్. రవి, ఎడిటర్ గా మాలినీ పార్థసారధి పగ్గాలు స్వీకరించారు.  



"With The Hindu's owners deciding to revert to being a family run and edited newspaper, I am resigning from The Hindu with immediate effect."
అని సిద్దార్థ్ వరదరాజన్ తన ట్వి ట్టర్ సందేశంలో సాయంత్రం 5.28 నిమిషాలకు పేర్కొన్నారు. 

ఎడిటోరియల్ నియంత్రణ నుంచి తప్పుకుని, మరింత ప్రొఫెషనల్ గా పత్రిక ను నడపాలని కస్తూరి అండ్ సన్స్ రెండేళ్ళ కిందట తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుందని కూడా ఆయన పేర్కొన్నారు. 

Varadarajan had joined The Hindu as deputy editor. He worked as The Hindu’s Chief of National Bureau, succeeding Harish Khare, who was named Prime Minister Manmohan Singh’s Media Adviser in June 2009.
After studying economics at the London School of Economics and Columbia University, USA, Varadarajan taught at New York University for several years before joining The Times of India as an editorial writer in 1995.