Monday, December 22, 2014

పారి: రూరల్ జర్నలిజానికి జీవం పోసిన పాలగుమ్మి సాయినాథ్


ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభాన్నంటూ రోజూ గొప్పలు చెబుతూ... రాయితీలు పొందుతూ... నిస్సిగ్గుగా... పచ్చిగా...  మేథోవ్యభిచారానికి పాల్పడుతూ... ధనార్జనే ధ్యేయంగా... మార్కెట్ శక్తుల మోచేతి నీళ్ళు తాగుతూ...విలువల్లేని సమాజం-నపుంసక రాజకీయ వ్యవస్థ వర్ధిల్లడానికి సహకరిస్తున్న సమకాలీన మీడియాకు  ఒక ప్రత్యామ్నాయం వచ్చింది ఇన్నాళ్ళకు. 'ది హిందూ' రూరల్ అఫైర్స్ మాజీ ఎడిటర్, రామన్ మెగసేసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్... భారత దేశానికి పట్టుకొమ్మ అయిన గ్రామీణ ప్రాంత వార్తలు, కథనాలు, విశ్లేషణలకు వేదికగా నిలిచే ఒక  ప్రయత్నం ఆరంభించారు. దానిపేరే... పీపుల్స్ ఆర్ఖైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా... పారి. 
మీరు పాశ్చాత్య బురద వరదలో కొట్టుకుపోనివారైతే....భారతీయ  గ్రామీణ సమాజంతో మానసిక సంబంధం కలవారైతే... పచ్చని పొలాల... పంచె వన్నెల అమాయకపు గ్రామీణ భారతం సర్వనాశనం అవుతున్న తీరు చూసి బాధపడేవారైతే... ఈ పోర్టల్ http://www.ruralindiaonline.org/ తప్పక దర్శించండి. మీరు కూడా మీ వంతుగా కదీనికి థనాలు అందించవచ్చు. ఇదొక అపూర్వ అవకాశం. ఈ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ... సాయినాథ్ గ్రామీణ భారతం గురించి ఇలా రాశారు. 
Rural India is in many ways the most diverse part of the planet. Its 833 million people include distinct societies speaking well over 700 languages, some of them thousands of years old. The People’s Linguistic Survey of India tells us the country as a whole speaks some 780 languages and uses 86 different scripts. But in terms of provision for schooling up to the 7th standard, just four per cent of those 780 are covered. 

ఈ నేపథ్యంలో... గ్రామీణ ప్రాంతాల గురించి పెద్దగా పట్టని మీడియాకు నిజమైన ప్రత్యామ్నాయంగా "కౌంటర్ మీడియా ట్రస్టు" ఈ సైట్ ను నిర్వహిస్తుంది. ఇందులో ఈ ఈ విభాగాల కింద అద్భుతమైన కథనాలు చదవచ్చు. 
THINGS WE DO
TONGUES
GETTING HERE
WE ARETHINGS WE MAKE
FOOTSOLDIERS OF FREEDOM
FARM CRISIS
MUSAFIR.   వీటితో పాటు గ్రామీణ ప్రజలు, పర్యావరణం, వృత్తులను ప్రతిబింబించే ఛాయాచిత్రాల కోసం PHOTOZONE  కూడా ఏర్పాటు చేసారు. ఈ పోర్టల్... విధాన రూపకర్తలకు ఒక కరదీపక కావాలని ఆశిస్తూ... ఈ బ్లాగ్ బృందం సాయినాథ్ గారి అద్భుత చొరవకు, కృషికి సలామ్ చేస్తోంది.

Sunday, December 21, 2014

'ఎక్స్ ప్రెస్ న్యూస్' కు దినేష్...'ది హన్స్' కు భాస్కర్

టీవీ-9 ఛానెల్ లో చాలాకాలం పనిచేసిన దినేష్ ఆకుల ఎక్స్ ప్రెస్ న్యూస్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఈ మధ్యన చేరారు. అదేవిధంగా, మెట్రో ఇండియా ఇంగ్లీష్ పత్రిక లో న్యూస్ ఎడిటర్ గా ఉన్నతాటికొండ భాస్కర్ రావు తాను గతంలో పనిచేసిన 'ది హన్స్ ఇండియా' కు వెళ్ళిపోయారు. 
జర్నలిస్టుగా మాంచి ప్రొఫైల్ ఉన్న దినేష్ టీవీ-9 ఎక్సిక్యూటివ్ ఎడిటర్ పదవి నుంచి కొత్తదైన ఎక్స్ ప్రెస్ న్యూస్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (ఎడిటోరియల్ అండ్ ఆపరేషన్స్) గా చేరి వారి వెబ్ సైట్ల నిర్వహణ బాధ్యత కూడా చూస్తున్నారు. ఈ నియామకం నేపథ్యంలో అక్కడ అన్నీ తానై వ్యవహరిస్తున్న నేమాని భాస్కర్ పరిస్థితి ఏమిటో తెలియరాలేదు. ఆయన.... మళ్ళీ ఎన్-టీవీ కి వచ్చే అవకాశం లేకపోలేదట. 

ఇక... రామచంద్ర మూర్తి అండ్ నాయర్ ల నేతృత్వంలో 'హన్స్ ఇండియా' లో పనిచేసిన భాస్కర్ గారు అప్పరసు శ్రీనివాసరావు (ఎక్సి క్యూటివ్ ఎడిటర్) గారి ఆధ్వర్యంలోని 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రికలో ఆరంభం నుంచి పనిచేసారు. హన్స్ డిజైన్ దారుణంగా ఉన్నదని భావిస్తున్న దాని ఎడిటర్ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్... భాస్కర్ పునరాగమనం లో కీలక పాత్ర పోషించారట. అయితే... మెట్రో త్రిమూర్తులుగా పేరుపొందిన ఏఎస్ రావ్, ఎస్ ఆర్కే, భాస్కర్ లలో చివరి ఇద్దరూ తనను, ఆ పత్రిక ను వీడి వెళ్ళిపోవడం తో రావు గారు ఒంటరి అయ్యారు. అ పత్రికలో పనిచేస్తున్న ఉత్తరా వర్మ గారికి యజమాని సీ ఎల్ రాజం పదోన్నతి కల్పించి న్యూస్ ఎడిటర్ చేశారు.  

ఎక్స్ ప్రెస్ న్యూస్ లో ఇంతకాలం పనిచేసిన సీనియర్ జర్నలిస్టు పత్రి వాసుదేవన్ కూడా మెట్రో ఇండియా లో కార్పోరేట్ అఫైర్స్ రిపోర్టర్ గా చెరినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా... ఎన్ టీవీ నుంచి వెళ్లి 10 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా చేరిన వడ్డే వెంకటేశ్వర రావు గారు సీ పీ ఎం నేత తమ్మినేని వీరభద్రం గారి ఆశీస్సులతో అక్కడ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారు. 

Tuesday, December 16, 2014

ఓరి దేవుడా .... ఇదేమి అఘాయిత్యం రా?

పొరుగునున్న పాకిస్థాన్ లోని పెషావర్ లో మిలిటరీ స్కూల్ లో చొరబడిన తాలిబాన్ తీవ్రవాదులు సృష్టించిన నరమేధంలో దాదాపు వంద మంది విద్యార్థులు మరణించడం, పెద్ద సంఖ్యలో పిల్లలు గాయపడడం తీవ్రంగా కలచివేస్తోంది. ఇంతకన్నా పైశాచిక చర్య మరొకటి ఉండదు. 

మత పిచ్చి, రాజకీయ వెర్ర్రి ఉంటే ఉండవచ్చు గాక! దీన్నంతా చిన్నారి భావి పౌరుల మీద చూపించడం దుర్మార్గం, హేయం. వీళ్ళకు ఇదేమి పోయే కాలం?

"మేము అప్పుడు పరీక్ష గదిలో ఉన్నాం. అప్పుడే ఉన్నట్టుండి ఫైరింగ్ మొదలయ్యింది. నిశ్శబ్దంగా నేల మీద పడుకోండని టీచర్లు చెప్పారు. ఒక గంట పాటు బిక్కుబిక్కున అలాగే ఉన్నాం. సైన్యం వచ్చి మమ్మల్ని రక్షించింది,"  అని ఒక విద్యార్థి చెప్పారు.  ముందుగా గాల్లోకి కాల్పులు జరిపి.... తర్వాత ఏరికోరి ఎంపిక చేసిన చిన్నారులను ఈ నికృస్టులు కాల్చి చంపారట. చాలా మంది పిల్లలను బందీలుగా చేసుకున్నారట. 
"మా ఆత్మాహుతి దళం స్కూల్లోకి వెళ్ళింది. పిల్లలకు హాని చేయవద్దని, సైనికులను లక్ష్యంగా చేసుకోండని ఆదేశాలు ఇచ్చాం. ఉత్తర వజీరిస్థాన్ లో సైనిక చర్యకు ప్రతీకారంగా ఈ దాడి చేశాం," అని తాలిబాన్ ప్రతినిధి ఒకడు ప్రకటించాడు. 
దేశాల మధ్య విద్వేషాలను వదిలి, ఓటు బ్యాంకు రాజకీయాలు మాని అన్ని దేశాల అధినేతలు ఈ మతిలేని తీవ్రవాదాన్ని ఖండించి పాకిస్తాన్ కు అండగా ఉండాల్సిన తరుణమిది. 

Monday, December 15, 2014

వామన రావు కు వై.రా. బై....బై

తెలుగు టెలివిజన్ లో తనకంటూ భయంకరమైన డిమాండ్ సృష్టించుకున్న వై.రాజశేఖర్ (వై.రా.) హెచ్ఎం-టీవీ వీడారు. హైదరాబాద్ మీడియా హౌస్ మానేజింగ్ డైరెక్టర్ పదవికి ఈ రోజు (డిసెంబర్ 15, 2014) న వదిలేసారు. "ఇక్కడ ట్యూన్ కాలేకపోయాను. ఇవ్వాళే ఇక్కడ ఆఖరి రోజు," అని హెడ్స్ సమావేశంలో ఈ రోజు సాయంత్రం వై.రా. ప్రకటించి వెళ్లిపోయారని ఆ సంస్థ వర్గాలు దృవీకరించాయి.  

బంగారు బాతు లాంటి వామన రావు గారి హైదరాబాద్ మీడియా హౌస్ ని రాజశేఖర్ వీడుతున్నట్లు   
ఈ బ్లాగు బృందం నవంబర్ 26, 2014 న "హెచ్ ఎం టీవీ వీడి... మళ్ళీ ఎన్-టీవీ గూటికి రాజశేఖర్" అన్న శీర్షికతో ఒక పోస్టు ప్రచురించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. 

ఇప్పటికే హెచ్ ఎం టీవీ లో రాజశేఖర్ అకౌంట్స్ సెటిల్మెంట్ కార్యక్రమం ఆరంభమయ్యిందని,  డిసెంబర్ ఒకటి, రెండు వారాల్లో చౌదరి గారి పక్కన ఆయన ఉంటారని రాశాం. ఇందులో ఫస్టు పార్టు నిజమయ్యింది. రెండో పార్టు  కూడా దాదాపు ఖాయమైనట్లు సమాచారం. "రాజశేఖర్ గారు ఎన్-టీవీ కి వెళ్ళ డం లో అనుమానం ఎవ్వరికీ లేదు. వైట్ అండ్ వాచ్," అని ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు. 

Thursday, December 11, 2014

''ది గార్డియన్' ఎడిటర్ పదవి వీడనున్న అలెన్ రస్ బ్రిడ్జర్

అద్భుతమైన, నాణ్యమైన 'ది గార్డియన్' ఆంగ్ల పత్రిక ఎడిటర్-ఇన్-ఛీఫ్ గా రెండు దశాబ్దాల పాటు సేవలందించిన అలెన్ రస్ బ్రిడ్జర్ (Alan Rusbridger) ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే వేసవిలో ఈ పదవి నుంచి వైదొలిగి... గార్డియన్ మీడియా గ్రూప్ ను నిర్వహించే 'స్కాట్ ట్రస్ట్' చైర్మన్ గా 2016 లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన అలెన్ 'కేంబ్రిడ్జ్ ఈవ్నింగ్ న్యూస్' లో పనిచేస్తూ 1979 లో గార్డియన్ లో చేరారు.  అది వదిలి 'అబ్సర్వర్' పత్రిక లో టెలివిజన్ విమర్శకుడిగా, ఆ తర్వాత 'లండన్ డైలీ న్యూస్' వాషింగ్టన్ ఎడిటర్ గా కొద్దికాలం పనిచేసారు. కొద్ది కాలంలోనే మళ్ళీ 'గార్డియన్' లో చేరిన ఆయన  1995 లో పీటర్ ప్రెస్టన్ తర్వాత ఎడిటర్ బాధ్యతలు స్వీకరించారు. 'మాంచెస్టర్ గార్డియన్' గా 1821 లో మొదలైన  గార్డియన్ కు అలెన్ పదో సంపాదకుడిగా ఉన్నారు.  

అలెన్ నుంచి తెలుగు మీడియా ఓనర్లు నేర్చుకోవాల్సినవి: 1) పెట్టుబడి పెట్ట చేతనైన ప్రతి వెధవా ఎడిటర్ పదవి ఆక్రమించుకోకుండా నిజమైన జర్నలిస్టులకు ఆ  బాధ్యత ఇస్తే బాగుండదు. 2) సీనియర్ జర్నలిస్టుల ను ఉద్యోగాల నుంచి పీకడం దీర్ఘ కాలంలో నాణ్యత పై ప్రభావం చూపుతుంది. 3) నాణ్యమైన జర్నలిస్టులను నమ్మి  పదవులు ఇస్తే మంచి పేరు (దాంతో పాటు డబ్బు) సంపాదించి పెడతారు. 
పదవీ విరమణ సందర్భంగా తన సహోద్యోగులకు అలెన్ బుధవారం నాడు రాసిన లేఖ ఇది:
Dear all,
This is to let you know that next summer I will be stepping down as editor-in-chief of the Guardian before succeeding Liz Forgan as chair of the Scott Trust when she reaches the end of her term in 2016.
In February I’ll have been editor for 20 years. It’s been quite an extraordinary period in the life of the Guardian. In February 1995 newspaper websites were, if they existed at all, exotic things: we were still four years off launching Guardian Unlimited. Since 1999 we’ve grown to overtake all others to become the most-read serious English language digital newspaper in the world.
When I assumed the editorship in 1995, the senior team at the Guardian was debating whether we should switch to using colour photography in the paper. (There were quite a few distinguished voices believing black and white was the proper métier for news.) Today we are doing our journalism in words, (colour!) pictures, video, data, animation, audio; on mobile and other platforms and in social … and every possible combination of the above.
The past two decades have been marked out by wonderful Guardian writing, photography, innovation and editing. There have been gruelling court battles, dogged campaigns and tough investigations. The Guardian – always the outsider – has won a global reputation for its willingness to fight for the right causes. We have strong future leaders in place with unparalleled news and digital experience. We have built up – and banked – a considerable financial endowment to secure future innovation and build on our quality journalism. The GMG Board is prepared to invest significantly in what we do because of the extraordinarily strong global position for which we (editorial, commercial and digital together) have fought and won.
Each editor is told – this is literally the only instruction – to carry the Guardian on “as heretofore”. That means understanding the spirit, culture and purpose of the paper and interpreting it for the present. All that is only possible because of the unique Scott Trust, set up in 1936 to ensure the Guardian survives in perpetuity.
Since 1936 the Trust has always appointed a chair from within – in every case a member of the Scott family or a former Guardian journalist or editor. I’ve felt very lucky to have Hugo Young and Liz Forgan beside me and/or guarding my back. The Trust is one of the most important liberal institutions in the world and I was very honoured to be asked to succeed Liz as chair when she steps down in 2016.
But the best thing about working here – the thing I’ll miss most – are my colleagues. We are a team and the strongest of communities – one which includes our readers. The community includes people from all areas, in and outside editorial. The Guardian and the Observer are bursting with extraordinarily bright, talented, brave, kind, knowledgeable, resourceful, imaginative, thoughtful and delightful people. I know our journalism – and our “perpetuity” – will be in the best possible hands.
I am currently visiting the Guardian Australia team in Sydney, Melbourne and Canberra – another amazing Guardian success story – but I will be back in Kings Place on Monday and will talk to you then.
ఫోటో కర్టసీ: బీబీసీ డాట్ కామ్

'ద కారవాన్' పత్రికలో రామోజీ మీద

సూక్ష్మంలో మోక్షం చూపించడం జర్నలిజం సూత్రమైన ఈ రోజుల్లో సుదీర్ఘ (లాంగ్ ఫామ్) జర్నలిజంతో సంచలనం సృష్టిస్తున్న 'ద కారవాన్' అనే పత్రికను జర్నలిజం మీద ఆసక్తి ఉన్నవారు కొనుక్కుని ఉంచుకోవచ్చు. 

ప్రముఖ ఎడిటర్ శేఖర్ గుప్తా కవర్ పేజీ వ్యాసం (ఆయన జీవిత చరిత్ర పై నిశిత విమర్శనాత్మక కథనం)గా ఉన్న డిసెంబర్ సంచికలో 'ఈనాడు' వ్యవస్థాపకుడు, మీడియా రారాజు రామోజీ రావు పైన "చైర్మన్ రావ్" అన్న శీర్షికతో ఒక వ్యాసం ఉంది. "How Ramoji Rao of Eenadu wrested control of power and politics in Andhra Pradesh" అన్న డెక్ తో ఉన్న ఈ వ్యాసాన్ని ప్రవీణ్ దొంతి అనే జర్నలిస్టు రాసారు.

Tuesday, December 9, 2014

ఈ కుల జాడ్యం, కుల గజ్జి పోయేవేనా?

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) అనే సంస్థ భారత దేశంలో కులం మీద జరిపిన తాజా సర్వే ఫలితాలు సంచలనం కలిగిస్తున్నాయి. భారత రాజ్యాంగం 64 ఏళ్ళ కిందటే అస్పృస్యతను రద్దు చేసినా...భారతీయుల్లో పావు సగానికి పైగా జనం తాము ఇప్పటికీ దీన్ని పాటిస్తున్నట్లు తేలింది. కులాన్ని బట్టి ఇతరులను ముట్టుకోకూడదని అనుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉండడం బాధాకరం. "ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వంటింట్లో కి రానిస్తారా? మీ పాత్రలు ముట్టుకోనిస్తారా?"  అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానం ఈ కింది బొమ్మల్లో చూడవచ్చు (మూలం:  India Human Development Survey (IHDS-2) 
బ్రాహ్మణులు, ఓ బీ సీ లు అస్పృస్యతను ఎక్కువగా పాటిస్తున్నారని... ముస్లింలు, ఎస్సీ లు, ఎస్టీలలో కూడా ఇది ఉందని సర్వే లో తేలింది. 


యూనివెర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మద్దతుతో వివిధ రాష్ట్రాల్లో 42 వేల ఇళ్ళలో ఈ సర్వే చేసారు.  పూర్తి సర్వే ఫలితాలు 2015 లో విడుదలవుతాయి. 
అస్పృస్యత జాడ్యం ఎక్కువగా హిందీ హార్ట్ లాండ్ లో ఉందని  ఇందులో తేలింది. మధ్యప్రదేశ్ (53 శాతం), హిమాచల్ ప్రదేశ్ (50), చత్తీస్ గడ్  (48), రాజస్థాన్, బీహార్ (47), ఉత్తర ప్రదేశ్ (43), ఉత్తరాఖండ్ (40) ఈ జాబితాలో ముందువున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో ఒక్క శాతం మంది అస్పృస్యతను పాటిస్తున్నట్లు సర్వే లో తేలింది. కేరళ (2 శాతం), మహారాష్ట్ర (4), ఈశాన్యం (7), ఆంధ్రప్రదేశ్ (10) ఆ తర్వాతి స్థానాన్నిపొందాయి. 
"ఒక కోటీశ్వరుడైన ఎస్సీ ని వంటింట్లోకి రానిస్తారా? ఆయనతో కరచాలనం చేయడానికి ఇష్టపడరా?" అని కూడా జనాలను అడగాలి. భారతీయ సమాజంలో జనాలు కులం విషయంలో ఫక్తు స్వార్ధం తో బతుకున్నారు. డబ్బు, అధికారం ఉన్న నిమ్న కులస్థులను అహో ఓహో అని ఆలింగనం చేసుకోవడానికి, ఇంటికి ఆహ్వానించి వంటింట్లో కలిసి తినడానికి ఏ సో కాల్డ్ అగ్రవర్ణాల వారూ ఎవ్వరూవెనుకాడరు. అదే... రోజు కూలీ తో పొట్ట పోసుకుని చిరిగిపోయిన బట్టలతో ఉండే ఎస్సీ ని అగ్ర కులాల వాళ్ళే కాదు... అదే సామాజిక వర్గానికి చెందిన ధనిక స్వాములు సైతం ఇంట్లోకి రానివ్వరు. ఇక్కడ ముఖ్యం సోషల్ స్టేటస్, పర్స్. అదే సమయంలో....అవసరాన్ని బట్టి, కలగచేసే మేలును బట్టి కులం కార్డును అంతా నిస్సిగ్గుగా వాడుకుంటారు. తరచి చూస్తే... ఇప్పుడు ఏర్పడినవి రెండే కులాలు: ఉన్నోళ్ళు, లేనోళ్ళు... అని అనిపిస్తుంది.  ఈ విషయంలో వాదోపవాదాలు ఎలా ఉన్నా.... కులం ప్రాతిపదికన సాటి మనిషిని ఇంట్లోకి రానివ్వకపోవడం, తాకకుండా ఉండడం,  మనిషిగా చూడలేకపోవడం పరమ ఘోరం. కుల గజ్జి ఈ స్థాయిలో పెట్టుకుని మనం ఎంత అభివృద్ధి సాధించినా అది సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి కాదు, కాబోదు. 

Monday, December 8, 2014

జర్నలిస్టు బతుకులు

సీనియర్ జర్నలిస్టు కూర్మనాథ్ గారు డిసెంబర్ 2 న  ఫేస్ బుక్ పేజీలో 

పెట్టిన "అంతరంగాలు" ఇది.
 
జర్నలిస్టు: చిన్నపుడు బాగా చదువుకుని వుండాల్సింది. 
ఈ బతుకు తప్పేది.
జర్నలిస్టు తండ్రి: వీడిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది.
 వీడి జీవితం నా వల్లే పాడైంది.

జర్నలిస్టు తల్లి: అయ్యో, నా తండ్రికి 
స్థిమితమైన జీవితం లేదు కదా.
జర్నలిస్టు భార్య: పెళ్ళికి ఒప్పుకునే 
ముందు కొంచెం ఆలోచించాల్సింది. 
అమ్మా నాన్నల మాటవినివుండాల్సింది.
జర్నలిస్టుల అత్త మామలు: మన కుటుంబంలో ఇంకెపుడూ
 జర్నలిస్టుకు పిల్లనివ్వకూడదు.
జర్నలిస్టు పిల్లలు : నాన్న ఇంకేదైనా ఉద్యోగం చేసుంటే సాయంత్రాలు
 హాయిగా ఆడుకుని వుండేవాళ్ళం.
జర్నలిస్టు బాసు: ఏమీ చదవకుండా ఫీల్డ్ లోకి వచ్చేస్తారు. 
ఇంకేదైనా పని చూసుకోవాల్సింది.
జర్నలిస్టు ఇంటి ఓనరు: జన్మలో జర్నలిస్టుకు ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు.
"నా పిల్లలను జర్నలిస్టు కానివ్వ ను...." అని జర్నలిస్టు  భార్యలు 
అనుకుంటారన్న విషయాన్ని కూడా రాయమని కూర్మనాధ్ గారి సతీమణి
చెప్పారట. దీనికి ఓ 170 లైకులు, యాభై కి పైగా కామెంట్లు వచ్చాయి. 

Monday, December 1, 2014

'సాక్షి టీవీ'లో కూడా ఉద్యోగుల తొలగింపు కసరత్తు?

'సాక్షి టీవీ' నుంచి మా బృందానికి వచ్చిన ఒక లేఖ ఇది: 
మిత్రమా,
'సాక్షి టీవీ'లో ఇప్పుడు ఉద్యోగుల తొలగింపు పక్రియ ప్రారంభం కానుంది. ముప్పై శాతం మంది ఉద్యోగులను తొలగించాలని, రెండు రాష్ట్రాల్లో కలిపి 23 జిల్లాలకు గాను 8 మంది స్టాఫర్లను మాత్రమే ఉంచి మిగిలిన వారిని తీసేయాలని మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆదేశాలు జారీ చేశారు. అందరు హెచ్ వోడీలను పిలిచి తీసేసేవారి లిస్టు ఇవ్వమన్నారు. దాదాపు 150 మందిని అన్నిశాఖల్లో తగ్గించాలని, లేకుంటే ఖర్చులు భరించలేమని యాజమాన్యం చెబుతోంది. 
మరో వైపు హెచ్ వోడీలు మాత్రం ఇది అన్యాయం అంటూ వాదిస్తున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకంటే ఎక్కువగా పనిచేసి, భార్యా బిడ్డలను వదిలి నెలలకు నెలలు ఓదార్పు, పాదయాత్రలు చేసి...ఎన్నికల్లో ఇతర సమయాల్లో టీడీపీ వారితో తిట్లు, తన్నులు తిన్న వారిని...అన్ని చానళ్ల వారికంటే ఇచ్చే జీతం కంటే మూడు రెట్లు వాళ్లతో పనిచేయించుకుని ఈ రోజు రోడ్డున నిలబెట్టడం భావ్యంకాదని చెబుతున్నారట. కానీ నెలకు కోటి రూపాయల లాస్ వస్తోంది ఏం చేయమంటారు? అంటూ యాజమాన్యం చెప్తోంది. దీంతో జిల్లాల్లోని ఉద్యోగులతో సహా అందరూ గత నాలుగు రోజుల నుంచి కంటి మీద కునుకులేకుండా బాధ పడుతున్నారు. ఇప్పటికే డిఎస్ ఎన్జీలు, డ్రైవర్లు, ఇంజనీర్లను తొలగించేశారు. మళ్లీ ఇప్పుడు ఇలా చేస్తున్నారు. 
చానల్ మొత్తాన్ని పేపర్ ఆధీనంలోకి తెచ్చి...రెండు మూడు జిల్లాలకు కలిపి ఒక టీవీ రిపోర్టర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. రిపోర్టర్ లేని చోట పేపర్ వాళ్లే టీవీ బాధ్యతలు చూస్తారట. మొత్తం మీద ఆటలో అరటిపండులా వాడుకుని వదిలేసేందుకు సిద్ధపడ్డారు.