Thursday, April 30, 2015

10 టీవీ లో చేరబోతున్న పసునూరి శ్రీధర్ బాబు!

తెలుగు టెలివిజన్ రంగంలో ఉన్న అతి కొద్ది మంది నాణ్యమైన ఎడిటర్లలో ఒకరైన పసునూరి శ్రీధర్ బాబు... ప్రజల డబ్బుతో ఆరంభమైన 10 టీవీ  అసోసియేట్ ఎడిటర్ గా నియమితులయినట్లు తెలిసింది. ఈ మేరకు... ఛానెల్ యాజమాన్య బాధ్యతలు చూస్తున్న తమ్మినేని వీరభద్రం గారికి, శ్రీధర్ గారికి మధ్య చర్చలు జరిగి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 
అరుణ్ సాగర్ గారు, ఆయన బృందం వెళ్ళిపోయాక తమ్మినేని బృందం ఒక సమర్ధమైన ఎడిటర్ కోసం వెతుకుతున్న క్రమంలో శ్రీధర్ దొరికినట్లు చెబుతున్నారు. సహజంగా కవి అయిన శ్రీధర్ గారు చెన్నైలో "ఇండియా టుడే" లో సుదీర్ఘకాలం పనిచేసి కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి హెచ్ ఎం టీవీ బృందంలో కీలక సభ్యుడిగా అద్భుత సేవలు అందించారు. తర్వాత అంకం రవి గారి నేతృత్వం లోని V-6 టీవీ లో ముందుగానే చేరి ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. పరిణామ క్రమంలో మళ్ళీ హెచ్ ఎం టీవీ లో చేరిన శ్రీధర్ గారు అక్కడి నుంచి బైటికి రావాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక అద్భుత అవకాశం కోసం వేచి చూస్తూ ఈ-టీవీ లో చర్చల్లో పాల్గొంటూ పుడమి పబ్లికేషన్ వారి కోసం యువతరాన్ని ఉద్దేశించి 'యంగ్ జోన్' పేరిట ఒక మంచి ఆంగ్ల పత్రిక తెస్తున్నారు. ఈ లోపు ఆయనకు 10 టీవీ లో అవకాశం లభించింది.  
కవితలు, నిశిత భావాల ప్రకటనకు అనేక వచనం పేరిట శ్రీధర్ బాబు ఒక బ్లాగు నిర్వహిస్తున్నారు.  

వేజ్ బోర్డ్ పై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం

వేతన సంఘం సిఫార్సులు అమలు చేయకుండా జర్నలిస్టులను, పత్రికా రంగంలోని ఇతర ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాలకు వ్యతిరేఖంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు కోసం జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. వేతన సంఘం సిఫార్సుల అమలు ఎక్కడిదాకా వచ్చిందో తెలుసుకునేందుకు కోర్టు ఓకే బృందాన్ని నియమించినట్లు, మూడు నెలల్లో అది నివేదిక ఇస్తుందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐ ఎఫ్ డబ్ల్యు జె) తెలిపింది. ఫెడరేషన్ బాధ్యుల్లో ఒకరు సంస్థ ఫేస్ బుక్ పేజీలో ప్రచురించిన లేఖ ఇది. 


Dear Comrades,

The Supreme Court has virtually set-up a SIT (Special Investigative Team) to find out the status of the implementation of the Majithia Wage Awards by the newspaper proprietors and send it within three months to the court.

Contempt petitions filed by the employees of many newspapers came up for hearing yesterday in the Supreme Court before the bench of Justice Ranjan Gogoi and N.V. Ramana. Judges took strong objection at the callous attitude of the contemnors/ respondents of the newspapers for not filing the counter-affidavit to the contempt petitions. 

Displeasure of Justice Gogoi was visible on his face and he said no counter affidavits would henceforth be accepted. In fact, the contemnors/respondents have been under illusion that by engaging the expensive lawyers of the country they can get skewed the scale of justice in their favour. This is was the reason that more than one hundred lawyers led by Shri Kapil Sibbal, Shri Salman Khurseed, Shri Abhishek Manu Singhvi, Shri Dushyant Dabey and Shri Shyam Diwan, who were fielded by the contemnors/respondents, packed the courtroom. They wanted to buy the time but the court refused to grant any further time.

 IFWJ's Secretary General and Supreme Court advocate Parmanand Pandey was then asked by the court to initiate the argument in the lead contempt petition no. 411/2014 titled 'Avishek Raja and others vs. Sanjay Gupta'. In this case, the CEO of Jagran Prakashan Ltd. Shri Sanjay Gupta has been made the contemnor/respondent.

Shri Pandey started his argument by drawing the attention of two glaring facts. One; that after the filing of the contempt petitions the proprietors of the newspapers have started the chain of repression against workers. Employees are being arbitrarily transferred, suspended and terminated, without observing the basic principles of natural justice.  No show-cause notice is given, no domestic inquiry is conducted nor any charge sheet is served to them. He appealed to the Hon'ble Court that the directions should be issued to the newspaper barons and the state governments to stop the harassment and victimization of employees.

Two; the Jagran management is a habitual offender of labour laws.  What to say of the implementation of the Wage Boards Awards this newspaper has been violating all labour laws related to employees.

Shri Pandey thereafter forcefully argued that even after more than four years of the notification of the Award in 2010, the contemnor has failed to provide wages, allowances and arrears to the newspaper employees as per Wage Boards recommendations. Shri Pandey furnished the salary slips of the petitioners, which conclusively prove that the Management was guilty of the contempt of court as there was no difference in the wages and allowances, which were paid before the judgment of the hon'ble Supreme Court and after the judgment.

At this point Justice Ramana wanted to know whether it is the case only with petitioner or with all other employees. Advocate Parmanand Pandey told the hon'ble court that this is not the isolated case but it has happened with all employees of the newspaper. Shri  Pandey further said that even the contemnor  Sanjay Gupta has accepted in his counter affidavit that 738 employees of the company have given it in writing that 'they are satisfied with the present wage structure of Jagran Prakashan Ltd. They, therefore, do not want the wages and allowances as per the recommendations of the Wage Boards'.  The hon'ble bench expressed surprise over it. The bench went into huddle for a minute and Justice Gogoi asked Shri Pandey whether this condition was prevailing in other states and other newspapers; Mr. Pandey replied in affirmative.

The bench was shocked to know that why the governments  were sleeping over the judgment of the Supreme Court, when they knew it well that the newspaper establishments had not implemented the Wage Board Awards. The bench then decided to give directions to the state governments for ensuring the implementation of the Awards. At this point, the senior advocate of another contempt petition Shri Colin Gonsolvise told the court that Delhi Government was willing to do something in this regard. He also mentioned about provision of 17B of the Working Journalists Act, which empowers the Government to take necessary steps in this regards.

Shri Pandey pointed out in his argument that instead of implementing the Wage Boards Awards most of the managements including the contemnor/management of Jagran Prakashan Ltd., in the petition for which he is arguing the case, are hiding behind section 20J of the Wage Boards recommendations. Shri Pandey pointed out that section 20J is actually meant for those employees, who are already getting more than what the Wage Board has recommended but not for those who are getting far less than the recommendations. At this point Shri Kapil Sibbal, senior advocate of Jagran management said that section 20J was fully valid, as it had been provided in the Wage Board recommendations itself.

The bench again went into brief confabulation and said that we would direct the state government to appoint special officers to investigate into the state of affairs with regard to the implementations of the Wage Board recommendations. At this point senior advocates of the newspaper owners like; Shri Kapil Sibbal, Shri Abhishek Manu Singhvi, Shri Shyam Diwan sprang up on their feet and pleaded the bench that it would amount to returning to the 'inspector raj'. However, the bench refused to listen to their requests and dictated the order for appointment of the special officers by the state governments, which will prepare the report and send it directly to Supreme Court. Thus, the order of the Supreme Court is similar to the setting up of the Special Investigation Team (SIT) for the benefit of the newspaper employees.

Shri Kapil Sibbal also ridiculed the efforts being made by the Government of Delhi, which is under the rule of AAP and then one advocate retorted to him that the AAP Government would certainly do better than the Congress Government. It may be mentioned here that when the Wage Board  report was notified, Shri Sibbal and Shri Salman Khursheed were cabinet ministers in the Manmohan Singh headed Central Government.  It can be anybody's guess by watching the battery of lawyers belonging to the Congress party standing by the side of newspaper owners that whose side their sympathies lay. It is again very interesting to know that while Shri Kapil Sibbal was batting for Dainik Jagran his son Amit Sibbal, who is also a senior advocate, was to protect Dainik Bhaskar.
 
Ram P Yadav
Secretary, IFWJ

Thursday, April 23, 2015

ఉత్తమ ప్రజా సంబంధాల మ్యానేజర్-2015 అవార్డు

దాదాపుగా 20 ఏళ్ళు జర్నలిస్టుగా, ఐదేళ్ళు యూనివెర్సిటీ లో జర్నలిజం బోధకుడిగా పనిచేసి ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) లో ఎడిటర్ అండ్ పీ ఆర్ ఓ గా పనిచేస్తున్న ఈ బ్లాగు వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ ఎస్. రాము కు 'ఉత్తమ ప్రజా సంబంధాల మ్యానేజర్-2015' అవార్డు లభించింది. 

జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21 సాయంత్రం తెలుగు యూనివెర్సిటీ లో పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీ ఆర్ ఎస్ ఐ)  నిర్వహించిన  ఒక కార్యక్రమం లో తెలంగాణా శాసన మండలి చైర్మన్ కె. స్వామి గౌడ్ ఈ అవార్డు ప్రదానం చేసారు. 
"This Award is presented to Dr Ramu in recognition of his outstanding performance in the practice of public relations and for having exhibited professional qualities that served in promoting the vision, mission, goals and services of ASCI," అని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమం లో తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్, అమర్ రాజా గ్రూపు సీ ఈ ఓ సముద్రాల విజయానంద్, పీ ఆర్ గురు డాక్టర్ సీ వీ నరసింహారెడ్డి, పీ ఆర్ ఎస్ ఐ ప్రధాన సలహాదారు ఎం ఎల్ నరసింహా రావు, ఛైర్మన్ డాక్టర్ జుర్రు చెన్నయ్య, కార్యదర్శి మోహన్ రావు 
పలు జర్నలిజం పుస్తకాలను తెలుగు లోకి అనువదించి, ప్రచురించిన గోవిందరాజు చక్రధర్ గారిని కూడా ఘనంగా సన్మానించారు. 

Wednesday, April 22, 2015

వ్యవస్థతో అడుగడుగున పోరాడిన కలం: కొప్పుల నాగరాజు

మిత్రులారా... ఈ మధ్యన కాన్సర్  వల్ల కన్నుమూసిన జర్నలిస్టు మిత్రుడు కొప్పుల నాగరాజు గారు వృత్తిలో పడిన కష్టనష్టాలు వింటే గుండెతరుక్కుపోతుంది. కులగజ్జి బాగా ఉన్న ఈ పవిత్ర వృత్తిలో నాగరాజు గారు నవ్వుతూ చేసిన అలుపెరుగని పోరాటం గరించి కవి, రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ గారు రాసిన వ్యాసం ఇది. ఫోటోలు కూడా ఆయనే పంపారు. వారికి థాంక్స్. నాగరాజు గారి గురించి గతంలో ఒక్క ముక్కైనా రాయలేకపోయినందుకు క్షంతవ్యులం. ఈ కథనాన్ని మిస్ అయినందుకు విచారిస్తున్నాం. A tale of a dalit journalist శీర్షికతో "ది హూట్" లో పరంజోయ్ గుహ టాకుర్తా రాసిన వ్యాసం కూడా తర్వాత చదవండి.   
-------------------------------------------------------------------

ఆధునిక సమాజంలో దళితులకు ప్రవేశంలేని రంగాలు అనేకం ఉన్నాయి. ఐఐటీల నుండి మొదలు సినిమా, మీడియా రంగాల వరకు దళితుల సంఖ్య వేళ్ల మీదికే పరిమితం. కొన్నిరంగాల్లోకి దళితులు రావొద్దని ప్రత్యేకంగా బోర్డులేమి పెట్టరు. కానీ, వాళ్లు రాకుండా ఉండడానికి కావాల్సిన వ్యవస్థను తయారు చేసి పెడతారు. అలాంటి రంగాల్లోకి దళితులు ప్రవేశించడం సాహసమే. అలాంటి సాహసమే చేశాడు కొప్పుల నాగరాజు.

తెలుగు మీడియాలో దళిత జర్నలిస్టులు వేళ్ల మీదికే పరిమితం. ఇక ఇంగ్లీషు మీడియాలో అంజనమేసి వెతికినా దేశం మొత్తం కేవలం పిడికెడు మందే కనిపిస్తారు. మనువాద కుల వ్యవస్థను పెంచి పోషిస్తోంది ఇంగ్లీషు మీడియా. దళితులకు ప్రభుత్వ పాఠశాల విద్యను మాత్రను అందుబాటులో ఉంచాయి ప్రభుత్వాలు. ఇలాంటి విద్యను అభ్యసించిన దళితుల్లో క్షలాది మంది విద్యార్థులు కేవలం పదవతరగతి వరకే రాగలరు. అంతకుమించి మరో అడుగు ముందుకు వేయకుండా సవాలక్ష అడ్డంకులను సమస్యల రూపంలో ఏర్పాటు చేసింది వ్యవస్థ. అందుకే ప్రతీ దళిత విద్యార్థి ప్రయోజకుడు కావాలంటే కొప్పుల నాగరాజులాగే ప్రాణాల్ని ఫణంగా పెట్టకతప్పదు.

కొప్పుల నాగరాజు చనిపోతాడని అతని మిత్రులకు, జర్నలిస్టులకు తెలుసు. క్యాన్సర్ ప్రమాదకర స్థాయిలో ఉండగా నాగరాజు చేసిన రాజీలేని పోరాటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు నాగరాజు మూడేళ్లుగా క్యాన్సర్ మీద చేసిన పోరాటం మరిచిపోలేనిది. చనిపోతానని తెలిసినా, నాగరాజు ఏనాడు నిరుత్సాహపడలేదు. ప్రతీ పూట చావుతో సహవాసం చేస్తూనే చిరునవ్వులు చిందించాడు. చావును సెలబ్రేట్ చేసుకోవడం కేవలం నాగరాజుకే సాధ్యమైందేమో. ఈ తెగింపు ఎక్కడి నుండి వచ్చి ఉంటుందనేది తాత్విక ప్రశ్నే.
నాగరాజుకు బతుకంటే పోరాటమని బాల్యంలోనే అర్థమైంది. ఇక్కడ తమలాంటి వలసకూలీ కుటుంబాలకు బతుకులేదనే చేదునిజమే, తనను బాలకార్మికునిగా మార్చింది. అలా చిన్నాచితక పనులు చేసుకుంటూ తన కాళ్లమీద తాను నిలబడి, దిక్కులేని ఇంటికి ఓ ఆసరా అయ్యాడు. అలా దళితునిగా అనేక అవమానాలు భరిస్తూనే, వ్యవస్థకు ఎదురీదాడు. బతకాలంటే ఏదో ఒక నైపుణ్యం ఉంటే తప్ప మరో మార్గం లేదని గుర్తించాడు. అలా అనివార్యంగా చదువు నుండి ఆర్ట్ మీదికి మనసు మార్చుకున్నాడు. కుంచె పట్టింది అభిరుచి కోసమో, అభినందనల కోసమో కాదు. ఆకలి తీరడం కోసం. భద్రాచలం పరిసరాల్లో కూలీలుగా బతుకీడుస్తున్న తన కుటుంబానికి నాలుగు మెతుకులు పెట్టడానికి గీతలే ఆధారమయ్యాయి.

విచిత్రంగా ఆర్టిస్టుల్లో కూడా ఎక్కువ మంది కిందికులాల వాళ్లే ఉంటారు. ఇది కూడా ఈ వ్యవస్థ ఫిక్స్ చేసిన ఒక కుట్ర. చివరి బేంచీలకు పరిమితం చేసి, చదువు అబ్బకుండా చేస్తే, పదవతరగతి అయిపోయేవరకు విధిలేని పరిస్థితిల్లో కిందికులాల పిల్లలు ఆర్టిస్టులుగా మారుతారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లో చదువు ముందుకు సాగదు. అలా ఆర్టిస్టులుగా మారినవాళ్లు ఎందరో. ఈ విషయాన్ని గమనించిన నాగరాజు ఆర్టిస్టుగానే ఆగిపోకుండా చదువుకోని తన కుటుంబానికి మరింత ఆధారం కావాలనుకున్నాడు. మరింత పట్టుదలగా చదువును కొనసాగించాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. అలా ప్రతిష్టాత్మకమైన అగ్రవర్ణ స్థావరమైన సెంట్రల్ యూనివర్సిటీకి చేరాడు. పలు రాష్ట్రాల విద్యార్థుల నడుమ పీజీ పూర్తి చేశాడు. పదవక్లాసులోనే ఆగిపోవాల్సిన చదువు పీజీకి చేరేదాకా కొనసాగించాడు. కానీ, పీజీ చేయగానే ఉద్యోగం రాదు కాదా. మళ్లీ ఒక బతుకుపోరాటం నాగరాజును జర్నలిజం వైపుకు నెట్టింది. బతకాలంటే తనకో ఉద్యోగం కావాలి. అందుకు తన దగ్గర ఉన్నది ఇంగ్లీషు పరిజ్ఞానం. ఆస్తులు లేనివాళ్లకు అక్షరాలే ఆధారం.
+++
జర్నలిస్టుగా నాగరాజు రాసిన స్టోరీలన్నీ ఢిఫరెంట్ స్టోరీలే. ఎక్కువగా వైల్డ్ లైఫ్, ఆర్ఫాన్స్, సర్కార్ సవతి తల్లి ప్రేమకు నిర్వీర్యమైపోతున్న సర్కార్ దవాఖానల గురించే రాశాడు. తాను తక్కువ కులపోడని తెలిసి యాజమాన్యం రాచి రంపాన పెట్టినా, ఎక్కడ రాజీ పడలేదు. టైం టు టైం డ్యూటీ చేస్తూ తనను తాను నిరూపించుకునేందుకు ఆకలిని, అవమానాలను కూడా లెక్కపెట్టలేదు. ఇంగ్లీషు భాష మీదున్న పట్టు ఒక్కటే జర్నలిజానికి సరిపోదని నాగరాజుకు తొందరలోనే తెలిసొచ్చింది. ఇంగ్లీషు మీడియా అంటే పండిత వంశస్తుల అబ్బసొత్తు. ఇంకా చెప్పాలంటే మనువు మనవళ్ల వారసత్వపు ఆస్తి. ఇలాంటి విష కౌగిలిలోకి ఒక మాదిగోడు అడుగుపెడితే ఎలా అంగీకరిస్తారు వాళ్లు. నాగరాజు ఎంత ట్రెయిన్డ్ జర్నలిస్టు అయినా సరే, నాగరాజుకు కుల అర్హత లేదనే విషయాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకుంది యాజమాన్యం. అక్కడి నుండి నాగరాజును తక్కువగా చూడడం. అదనపు అసైన్మెంట్ల పేరుతో తిండికి, నిద్రకు దూరం చేసి కాలుష్య కాసారాల్లోకి పంపింది. ఇదేం అర్థం కానోడు కాదు నాగరాజు.


 అయినా తన కుటుంబానికి బుక్కెడు మెతుకులు పెట్టాలంటే తాను, ఇదంతా భరించాల్సిందేననుకున్నాడు. పంటి బిగువన అగ్రకుల ఆధిపత్యాలపై ఉన్న ఆగ్రహాన్ని అనుచుకున్నాడు. కులం లేనోడికి ఉద్యోగం ఇవ్వడమే ఎక్కువ అనుకున్నది యాజమాన్యం. ఇక ఆరోగ్యం పాడైందంటే సెలవులు ఎక్కడిస్తది? దళితులు చదుకోవద్దని పాలకులు సమస్యల బహుమానం ఇచ్చినా, నిరుద్యోగిగా బతకమని యూనివర్సిటీలు పట్టాలిచ్చినా వాటిని దాటుకొని వస్తే మేము వదిలిపెడతామా అన్నట్టు వ్యవహరించింది. నాగరాజు పేరు చివరన ఏ తోక లేనందుకు శిక్షగా నరకం చూపెట్టింది. హాస్పటల్కు వెళతాను సార్, పాణం బాగలేదని మొత్తుకున్నా సరే కరుణించలేదు. 

లీవు ఇవ్వడం కుదరదు అన్నది సదరు ఇంగ్లీషు పత్రికాయాజమాన్యం. ఇక చేసిది లేక నాగరాజు అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక పనిచేస్తూనే పోయాడు. సిగరేట్, మందు వంటి ఏ ఒక్క దురలవాటు లేనివాడు నాగరాజు. అయినా లోలోపల కులక్యాన్సర్ నాగరాజు శరీరాన్ని గుల్ల చేస్తూనే ఉంది. బతుకుపోరాటంలో పడి ఈ విషయం గుర్తించలేదు నాగరాజు. నాగరాజే కాదు, వైద్యులు కూడా ఆలస్యంగా గుర్తించారు. 2013 ఏప్రిల్ 1న, నాగరాజుకు కాన్సర్ అని తెలిసింది. 

ఇక అప్పటి నుండి నాగరాజు అసలు పోరాటం మొదలైంది. అప్పటి దాకా వ్యవస్థ మీద తన గీతలతో, రాతలతో మొదలుపెట్టిన పోరాటం, తనను తాను కాపాడుకునే ప్రత్యక్షయుద్ధానికి చేరింది.
దళితులకు ప్రవేశం లేని రంగంలోకి అడుగుపెట్టిన ఫలితంగా కులక్యాన్సర్ తనను ఎలా వాయిదాల పద్ధతిలో చంపడానికి సిద్ధమైందో నాగరాజుకు తెలిసివచ్చింది.

 అయినా సరే ఏనాడు కలత చెందింది లేదు. తనను నమ్ముకున్న పేదతల్లికి, కుటుంబసభ్యులకు కొండంత ధైర్యాన్ని చెప్పి ఏడ్వొద్ధన్నాడు. క్యాన్సర్ను నయం చేసుకునేందుకు పైసల్ లేవని ఆందోళన చెందొద్దన్నాడు. స్వాతి వడ్లమూడి, పడవల చిట్టిబాబు వంటి మిత్రల సహకారంతో చావును ఏ పూటకు ఆ పూట వాయిదా వేస్తూ వచ్చాడు. చనిపోతానని తెలిసిన ఆత్మవిశ్వాసాన్ని ఏనాడు వదులుకోలేదు. హైదరాబాద్ కేంద్రంగా జరిగే అన్ని దళిత, బహుజన మీటింగ్లకు హాజరవుతూనే ఉన్నాడు. అన్నీ జాగ్రత్తగా గమనించాడు. తనకు మరణశాసనం విధించిన ఇంగ్లీషు మీడియా మీద కాండ్రించి ఉమ్మేయాలనుకున్నాడు. 

జ్వరమొస్తే ప్యారసెటామోల్ గోలి కొనుక్కోలేక అకాలమరణాల బాటపట్టే మాదిగకులంలో పుట్టిన నాగరాజుకు దేశవ్యాప్తంగా స్నేహితులు అండగా నిలిచారు. ముఖ్యంగా ఉస్మానియా, ఇఫ్లూ, సెంట్రల్ యూనివర్సిటీల దళిత బహుజన విద్యార్థులు, జర్నలిస్టులు, సాహిత్యకారులు, ఉద్యమకారులెందరో అండగానిలిచారు. నాగరాజును బతికించడం కోసం దేశవ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా, వాట్సప్లను ఉపయోగించి, ఎప్పటికప్పుడు నాగరాజుకు సంబంధించిన వార్తలను షేర్ చేశారు. ప్రతీ ఒక్కరిలో ఒక కదలికను తీసుకొచ్చారు. వందలాది మందిని ఒక్కటి చేసిన ఘనత కూడా నాగరాజుదే. ఈ వ్యవస్థలో మనలాంటివాళ్లు బతకాలంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం నాగరాజు చెప్పకనే చెప్పాడు. అడుగడుగునా ఈ వ్యవస్థతో ఎలా కొట్లాడాలో ఆచరించి చూపెట్టాడు. దళితులపై ఒక అప్రకటిత యుద్ధాన్ని ప్రవేశపెట్టిన అగ్రవర్ణ మనువాదుల ఉనికిని మరోసారి బట్టబయలు చేశాడు. యావత్ ఎస్సీఎస్టీబీసీమైనారిటీ విద్యార్థులంతా ఏ లక్ష్యంతో పనిచేయాలో తెలియజేసింది నాగరాజు జీవితం.
+++
గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో నాగరాజు ఉద్యమకారులకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు, విద్యార్థులకు కూడలిగా మారాడు. తనకు జరిగిన అన్యాయం ఆధారంగా వర్తమాన వ్యవస్థపై ఒక చర్చకు తెరలేపాడు. ఏ ఇద్దరు నాగరాజు మిత్రులు కలిసినా, నాగరాజుకు జరిగిన అన్యాయం గురించే చర్చ జరిగింది. ముఖ్యంగా మీడియాలో దళితులపై కొనసాగుతున్న వివక్ష చర్చకు వచ్చింది. మీడియాలో దళితుల పట్ల ఎంతటి చిన్నచూపు ఉంటుందో నాగరాజు ఉదంతం వెలుగులోకి తెచ్చింది. యుద్ధనౌక గద్ధర్ వంటి వారి చేత దళిత జర్నలిస్టులను కాపాడుకుంటాం అని నినదింపజేసింది. తెలంగాణ సర్కార్ వరకు నాగరాజుకు జరిగిన అన్యాయాన్ని మోసుకెళ్లిన క్రాంతి లాంటి జర్నలిస్టుల కృషి, నాగరాజు కుటుంబానికి కొంత చేయూతనిచ్చింది. 

మంత్రి పద్మారావు చేత ఎనిమిది లక్షల చెక్కును ఇప్పించగలిగిన ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ వంటి వారు నాగరాజులో విశ్వాసాన్ని నింపారు. జస్టిస్ ఫర్ నాగరాజు పేరిట హైదరాబాద్ నుండి దేశరాజధాని ఢిల్లీ వరకు జరిగిన సంప్రదింపులు, చర్చలు ఒక ఉద్యమాన్ని తలపించాయంటే అతిశయోక్తికాదు. నాగరాజు మరణం మనువాద క్యాన్సర్ కులవ్యవస్థకు ఒక మచ్చుతునక. 

దళిత, బహుజనులను మే్కలుపుతున్న పొలికేక. అగ్రవర్ణ అంటరాని కులజాఢ్యాల మీద నాగరాజు చేసిన పోరాటం ఒక మేలుకొలుపు. పోరాడి పోరాడి నేలరాలిన తీరు, మిగిలిన దళిత బహుజనులంతా ఇంకా కొనసాగించవలసిన పోరాట బాధ్యతను గుర్తుచేస్తున్నది. నో ఎంట్రన్స్ ఫర్ దళిత్స్ అనే కనిపించని బోర్డులను ధ్వంసం చేయమంటోంది. దళితులు తలెత్తుకొని జీవించేందుకు రాజీలేని పోరాటం చేయమంటోంది.
+++
ప్రయివేట్ సెక్టార్లో మీడియా వంటి రంగాల్లో కొరవడుతున్న దళిత, బహుజన ఉనికిని కాపాడమంటోంది. నాగరాజుకు జరిగిన అన్యాయం మరో దళిత జర్నలిస్టుకు జరుగకుండా జాగ్రత్తపడమని హెచ్చరిస్తోంది. అలాగే నాగరాజును చంపిన మనువాద అగ్రకుల ఆధిపత్య అంటరానితనాన్ని ఇంకెంతకాలం ఈ వివక్షలంటు నిలదీస్తూనే ఉంటుంది. రేపటి చరిత్రకు నాగరాజు త్యాగం చెరగని జ్ఞాపకమై వెంటాడుతూనే ఉంటుంది.

(రెండేళ్లపాటు ప్రతీక్షణం చావును నీడలా వెంటబెట్టుకొని పోరాడి, అసువులు బాసిన దళితజర్నలిస్టు 
కొప్పుల నాగరాజుకు కన్నీటినివాళి)

Sunday, April 19, 2015

తొలి తరం యాంకర్ శాంతి స్వరూప్ తో... రచ్చ రాములమ్మ

ప్రభుత్వవార్తా ప్రచార సాధనమైన దూరదర్శన్ లో 1983 నవంబర్ 14 న సాయంత్రం ఏడు గంటలకు తెలుగులో మొట్ట మొదట వార్తా ప్రసారం ప్రారంభమయ్యింది. ఆ వార్తలు చదివే అదృష్టం, భాగ్యం, బాధ్యత దక్కిన వ్యక్తి శాంతి స్వరూప్  గారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ గారు జీవన, సాహిత్య సారాన్ని అవపోసనపట్టి యాంకర్ బాధ్యతను సమర్ధంగా నిర్వహించారు.  2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు.

1977 అక్టోబర్ 23 లోనే లాంఛనప్రాయంగా హైదరాబాద్ వచ్చిన డీ డీ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన శాంతి స్వరూప్ తెలియని నాటి తరం తెలుగువాళ్ళు బహుశా ఉండరేమో! వార్తలు చదవడం కోసం ఆయన 1978 లో ఉద్యోగం లో చేరినా ఆయన వార్తలు చదవడానికి 1983 దాకా వేచి చూడాల్సి వచ్చింది. చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత... పెంచి పెద్దచేసిన అన్నయ్య కాలం చేయడంతో కుటుంబ భారం మోసారాయన.  శ్రద్ధాశక్తులతో వార్తలు చదివిన ఆయన 1980 లో సహ సీనియర్ యాంకర్ రోజా రాణి ని జీవిత భాగస్వామి గా చేసుకున్నారు. ఆమె కూడా ఈ మధ్యనే కాలం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిద్దరూ ఐ ఐ టీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు. 
"వార్తలు చదవకండి. వార్తలు చెప్పండి....,"అని శాంతి స్వరూప్ గారు పిల్ల యాంకర్లకు సలహా చెబుతారు. 24 గంటలూ ఇచ్చే వార్తలు లేవని, అయినా వండి వార్చడం ఘోరంగా తయారయ్యిందని అని ఆయన అంటారు. తెలుగు లో మొట్ట మొదటి యాంకర్ అయిన శాంతి స్వరూప్ ఈ మధ్యన పలు టీవీ ఛానళ్లలో దర్శనం ఇస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా ఆయన పలు విషయాలు చెబుతారు. మేము తెలుగులో అద్భుతమైన యాంకర్ గా భావించే... రచ్చ రాములమ్మ.... 6 టీవీ లో శాంతి స్వరూప్ గారిని ఇంటర్వ్యూ చేశారు ఈ ఆదివారం నాడు.  అది బాగుంది. ఆ ఫోటో ఇక్కడ ఉంది.