Sunday, January 24, 2016

ఈ పీ డబ్ల్యు ఎడిటర్ గా పరంజోయ్ గుహ ఠాకూర్త

నాణ్యమైన విశ్లేషణలకు, పరిశోధన పత్రాల ప్రచురుణకు వేదికైన ఈ పీ డబ్ల్యు (ఎకానమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ) నూతన ఎడిటర్ గా జర్నలిజం లో సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు, రచయిత, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, జర్నలిజం బోధకుడు పరంజోయ్ గుహ ఠాకూర్త ఎంపికయ్యారు. 

పదకొండు సంవత్సరాల పాటు ఆ పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించి నాణ్యతను మరింత పెంచిన తెలుగు బిడ్డ సీ రామ్మనోహర్ రెడ్డి గారి స్థానంలో ఠాకూర్త ను పత్రిక యాజమాన్యం (సమీక్ష ట్రస్టు) నియమించింది. ఏప్రిల్ ఫస్టు నుంచి కొత్త ఎడిటర్ బాధ్యతలు స్వీకరిస్తారు .

పత్రిక యాభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తీసుకురాదలచిన ప్రత్యేక సంచిక విషయంలో  రామ్మనోహర్ రెడ్డి గారికి, ట్రస్టు అధిపతులకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.  రామ్మనోహర్ రెడ్డి గారి ని వదులుకోవద్దని సూచిస్తూ దేశ విదేశాల నుంచి 101 మంది మేథావులు, ప్రొఫెసర్లు, సామాజిక కార్యకర్తులు ట్రస్టు కు ఒక లేఖ కూడా రాసారు. ఈ లేఖను ది వైర్ ప్రచురించిన లింక్ ను ఇక్కడ చూడండి,
http://thewire.in/2016/01/15/a-letter-to-the-sameeksha-trust-from-the-epw-community-19389/

వివిధ పత్రికలలో వ్యాసాలు ప్రచురించే పరంజోయ్ గారు తెలుగు నేల మీద వెల్లివిరిసిన పెయిడ్ న్యూస్ జాడ్యం పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన సబ్ కమిటీ లో సభ్యుడు. ఆయనతో పాటు అప్పట్లో విశాలాంధ్ర లో సీనియర్ పొజిషన్లో ఉన్న జర్నలిస్టు యూనియన్ లీడర్ శ్రీనివాస రెడ్డి కూడా అందులోని రెండో సభ్యుడు. 'మీడియా ఎథిక్స్' మీద పరంజోయ్ గారు రాసిన పుస్తకం విశేష ఆదరణ పొందింది. http://www.paranjoy.in/ లో ఆయన వ్యాసాలు ప్రచురిస్తారు.

ఆయన నియామకంపై 'ది హిందూ'ఈ రోజు ప్రచురించిన వార్త ఇది:

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి