Saturday, December 3, 2011

తెలుగు జర్నలిస్ట్స్ అసోనియేషన్ దశాబ్ది వేడుకలు

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్ట్స్ అసోనియేషన్ (తేజస్) దశాబ్ది వేడుకలకు సిద్ధమయింది. ఈ సందర్భంగా December పదకొండో తేదీ (ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు చెన్నైలోని టి.నగర్ లో విజయ రాఘవాచారి రోడ్ లో ఉన్న గోదావరి మహల్ "ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్"లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 

తమిళనాడు గవర్నర్ గా నియమితులైన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి డి.పురందేశ్వరి, తిరుపతి శాసన సభ్యుడు కె.చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ తిరుమలగిరి సురేందర్ తదితరులు పాల్గొంటారని తేజస్ కార్యదర్శి నర్సిం చెప్పారు.

అదేరోజు సాయంత్రం దశాబ్ది వేడుకల ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు. ప్రచురించారో లేదో తెలియదు కానీ...దాని కోసం నేను కూడా ''చక్రబంధంలో తెలుగు జర్నలిస్టు'' అనే వ్యాసం రాశాను. సాయంత్రం ఏడుగంటలకు జి.ఆనంద్ ఆధ్వర్యంలో స్వరమాధురి సంగీత విభావరి కూడా ఉంటుందట. 


దానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఇక్కడ చూడవచ్చు. అయితే...వచ్చిన అందరినీ హాల్ లోకి రానిస్తారో...లేక కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఆ అవకాశం ఉంటుందో తెలియదు.

3 comments:

Vinay Datta said...

Are you coming?

madhuri.

Ramu S said...

Dear sister,
I am not coming. My colleague Prof.Varadachari garu is coming.
My greetings to you and vinay.
Ramu

hmtv-viswanath said...

Sir!

It is open to all. Due to security problems and the size of the hall all could not be accommodated. But no restrictions for entry.

n. viswanath

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి