Sunday, January 26, 2014

ఎడిటర్-ఇన్-చీఫ్ గా కొనసాగుతా: మూర్తి గారు

తాను జర్నలిజం నుంచి మే నెలలో రిటైర్ అవుతున్నట్లు  జరుగుతున్న ప్రచారం తప్పని ప్రముఖ సీనియర్ మోస్ట్ ఎడిటర్, హెచ్ఎం టీవీ-హన్స్ ఇండియా  ఎడిటర్-ఇన్-చీఫ్ కె. రామచంద్ర మూర్తి గారు ఆదివారం స్పష్టం చేసారు.

 "మే నెలలో మీరు జర్నలిజం నుంచి రిటైర్ అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనా, సర్?' అని నేను పంపిన ఒక మెయిల్ కు మూర్తి గారు స్పందించి ఈ సమాచారం ఇచ్చారు. మానేజింగ్ డైరెక్టర్  (ఎం డీ) పొజిషన్ ను మాత్రమే వదులుకున్నట్లు ఆయన స్పష్టం చేసారు. 

"ఎడిటర్-ఇన్-చీఫ్ పదవిని వదలబోవడం లేదని మన మిత్రులకు, శత్రువులకు అందరికీ చెప్పండి," అని మూర్తి గారు చెప్పారు.  దీనిపై వివరణ సార్ మాటల్లోనే....

It is wrongly reported. What I said was I am getting relieved from the position of MD and am going to continue as Editor-in-Chief of The Hans and HMTV. Our people have misunderstood and without cross checking with me have gone to market. Pl tell all our friends and enemies that I am not quitting as Editor-in-Chief.

నిజానికి, మూర్తి గారి నిర్ణయం తెలుగు జర్నలిజం లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేసేలా... వెంటనే స్పందించినందుకు వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి