Tuesday, October 24, 2017

రామోజీ రావుతో జగన్ మోహన్ రెడ్డి భేటీ

తన తండ్రి రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చిన మహా పాదయాత్ర లాంటి పాదయాత్రకు నవంబర్ 6 నుంచి సిద్ధమవుతున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సాక్షి మీడియా అధిపతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం (అక్టోబర్ 23, 2017) సాయంత్రం...  ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీ రావు గారిని కలుసుకున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీ కి వెళ్లిన జగన్ పెద్దాయన యోగక్షేమాలు తెలుసుకున్నాక... తన పాదయాత్ర ఉద్దేశాన్ని వివరించినట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. "పాదయాత్ర కు ఫెయిర్ కవరేజ్ ఇవ్వాలని అడగడానికి జగన్ వెళ్లారు. రామోజీ కూడా మర్యాదపూర్వకంగా వ్యవహరించారు," అని ఆ వర్గాలు తెలిపాయి. ఒక గంట పాటు ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు.

2015 అక్టోబర్ లో ఒకసారి గుంటూరు లో తలపెట్టిన నిరశనకు ముందు జగన్ వెళ్లి రామోజీ రావు గారిని కలిసి వచ్చారు. ఈ మధ్యన  రామోజీ గారు కింద పడి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు బేగంపేట్ లోని నివాసానికి కూడా జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారని పార్టీ వర్గాలు గుర్తుచేశాయి. అపుడప్పుడు పెద్దోళ్ల పెళ్లిళ్లలో కలుసుకున్నప్పుడు కక్షలూ కార్పణ్యాలూ లేకుండా వీరిద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు.

గతంలో 'ఈనాడు' 'సాక్షి' పేపర్లు ఒక దాని మీద ఒకటి అవినీతి ఆరోపణలు చేసుకుని మొదటి పేజీల్లో పెద్ద పెద్ద వార్తలు ప్రచురించుకున్నప్పటకీ, ఇరు పక్షాలూ ఏ విషయానికి ఆ విషయం గానే వుండాలని భావిస్తున్నాయి.

ఫెయిర్ కవరేజి కోసం 'ఈనాడు' అధిపతి ని కలిసిన జగన్ గారు 'ఆంధ్రజ్యోతి' అధిపతి వేమూరి రాధాకృష్ణ గారిని ఎప్పుడు కలుస్తారన్నది తెలియరాలేదు. రామోజీ గారికున్నట్లే రాధాకృష్ణ గారికి కూడా ఒక పేపర్, దమ్మున్న ఛానెల్ ఉన్నాయి. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి