Thursday, May 30, 2019

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లను ప్రస్తావించిన జగన్

తమ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడును జర్నలిజం నియమాలను గాలికొదిలేసి భుజాన మోసినట్లు అభియోగం ఎదుర్కుంటున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలతో పాటు టీవీ 5ల గురించి  ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రసంగంలో ప్రస్తావన తెచ్చారు. 
ఎల్లో మీడియా గా విమర్శకులు పిలిచే ఈ సంస్థల కంటికి చంద్రబాబు తప్ప మరొకరు  కానరారని ఆయన స్పష్టంచేశారు. 
తాము చేపట్టే టెండర్ల ప్రక్రియ విషయంలో ఈ మీడియా రచ్చ చేస్తుంది కాబట్టి.. ఒక జుడీషియల్ కమిషన్ సాయం తీసుకుంటామని, అప్పటికీ ఈ పత్రికలు వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని జగన్ హెచ్చరించారు. 
ప్రమాణ స్వీకారంలో కొత్త ముఖ్యమంత్రి వ్యతిరేక మీడియా పై ప్రస్తావన చేసిన నేపథ్యంలో ఏపీ లో మీడియా పరంగా పరిణామాలు ఆసక్తి గా వుండే అవకాశం ఉంది. 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండివుంటే కనబడి వుండే ఉత్సాహం, ఊపు లేకుండా ఎల్లో మీడియా జగన్ ప్రమాణస్వీకార ఉత్సవాన్ని బాగానే ప్రసారం చేసాయి. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి