Sunday, January 10, 2010

మీడియాలో రొచ్చుకు కారణం ఎవడయా?

ఈ రోజుల్లో ఎవర్ని కదిలించినా ఈ మీడియా ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యిందని అంటున్నారు. చివరకు...మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయించుకుని, పచ్చ నోట్లు, సారా పాకెట్లు పంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు సైతం మీడియా లోకువ అయ్యింది. "ఒక దశలో విలేకర్లను జనం రాళ్ళతో కొట్టే రోజులు వస్తాయి," అని నేను నా సన్నిహిత మిత్రులతో అంటే ఒక్కడంటే ఒక్కడైనా ఖండించడంలేదు. వారంతా "నిజమేరా...ఎందుకు వచ్చామురా ఈ రొచ్చులోకి అనిపిస్తున్నది," అంటున్నారు. అసలీ కారణానికి బాధ్యులు ఎవరు?


"ఈనాడు" ను స్థాపించి తెలుగు భాషను, జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన రామోజీరావు గారు, "TV-9" ద్వారా వార్తల అర్ధాన్ని "infotainment" (information+entrainment) గా మార్చిపారేసిన రవి ప్రకాష్ గారు నాకు ఈ విషయంలో దోషులుగా కనిపిస్తున్నారు. వీరు జర్నలిజానికి ఎంత మేలు చేసారో...అంతే కీడు చేసారని అనిపిస్తున్నది.


చిన్న చిన్న వ్యాపారులు కూడా అడ్వెర్టైజ్జ్మెంట్లు ఇవ్వాలనుకుంటారు...తమ చుట్టుపక్కల జరిగే పరిణామాల పట్ల జనానికి ఆసక్తి ఉంటుంది...అన్న సూత్రం ఆధారంగా రామోజీ గారు ఒక ఇరవై ఏళ్ళ కిందట జిల్లా అనుబంధాలను పెట్టారు. ఇది అద్భుతమైన వ్యాపార సూత్రం. ఇందులో భాగంగా...మండలానికొక విలేకరిని నియమించారు. కాలేజ్ డిగ్రీల పట్ల పెద్దగా నమ్మకం లేని రామోజీ గారు...పదో తరగతో, ఇంటరో చదివి ఒక నాలుగు తెలుగు వాక్యాలు రాసేవారని విలేకరులుగా నియమించారు. ఇలా...అప్పటి దాకా....పదుల సంఖ్యలో ఉన్న జర్నలిస్టులు ఒక్కసారిగా వేల సంఖ్యలో పుట్టుకొచ్చారు. పోటీ ధోరణితో... ఆ తర్వాత వచ్చిన పత్రికలన్నీ లోకల్ విలేకరులను విచ్చలవిడిగా నియమించాయి.

జిల్లా అనుబంధాలు క్లిక్ కావడంతో ఈ విలేకరుల మాట మండలాలలో పెట్రోలై మండడం ఆరంభించింది. నాయకులు-అధికారులు-పోలీసులు-విలేకరులు లోకల్ గా ఒక కాకస్ అయిపోయారు. ఇప్పుడు కొందరు మండల స్థాయి విలేకరులు...హైదరాబాద్ లో జర్నలిజాన్ని (అంటే..నెల జీతాన్ని) నమ్ముకున్న వారికన్నా ధనవంతులు, శక్తిమంతులు. లోకల్ పరపతితో వీరు యాజమాన్యాలు లోకల్ ఎడిషన్లు పెట్టుకోడానికి చాలా చౌక ధరకు భూములు కూడా ఇప్పించి....సంస్థల పెట్టుబడి వేల కోట్లకు పెరగడానికి దోహదపడ్డారు. ఈ క్రమంలో విలేకర్లు అంటే జనానికి అసహ్యం పెరిగింది. వారి బారిన పడిన చౌక దుకాణాల వారు, డీలర్లు, కాంట్రాక్టర్లు, వైద్యులు...ఈ స్థానిక విలేకరుల గురించి ఎన్నైనా చెబుతారు. అయితే....గతంలో మనం అనుకున్నట్లు అంతా..అవినీతిపరులు కారు. కొందరు అద్భుతమైన వార్తలు రాసారు, కుంభకోణాలు వెలికి తీసారు. తన కుమారుడిని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్టుమెంటులో చదివించిన రామోజీ గారు...సొంతగా ఒక జర్నలిజం స్కూల్ ఏర్పాటు చేసుకుని....సంస్థ అవసరాలకు అనుగుణంగా పర్మినెంట్ విలేకరులను, సబ్-ఎడిటర్లను తయారు చేసుకుంటున్నారు.


ఇలా తెలుగు జర్నలిజం 'ఈనాడు' వటవృక్ష ఛాయలో వర్ధిల్లుతూ ఉండగానే...రవిప్రకాష్ అనే జర్నలిస్టు వెలుగులోకి వచ్చాడు. స్ఫురద్రూపి, వాక్శుద్ధి గల విద్యావంతుడు, ఏదో చేయాలన్న తపన బలీయంగా గలవాడు కావడం చేత...రవి పెట్టించిన TV-9 అనతి కాలంలోనే వినుతికెక్కింది. వార్తలే కాదు...యాంకర్ల డ్రస్ కూడా జనంలో కేక, కాక పుట్టిన్చాలన్న పాశ్చాత్య దృక్కోణంతో రవి బృందం దూసుకుపోయింది. అప్పటికే...'ఈనాడు,' 'ఈ-టీవీ' వంటి సంప్రదాయ ఛానెల్స్ తో మొహం మొట్టిన తెలుగు జనం...TV-9 ను ఆదరించారు. జనం సమస్యలతో పాటు, సెక్స్ ను ఈ ఛానల్ ఒక అస్త్రంగా వాడుకుని...రేటింగ్స్ ఆధార ప్రోగ్రామ్స్ నిర్మించి నంబర్-1 అయ్యింది.



'ప్రజాహితం', 'మెరుగైన సమాజం' వంటి అందమైన మాటలు వల్లిస్తూ...ఫ్లోరోసిస్, అవినీతి వంటి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నట్లు చెప్పుకుంటూనే...సెక్స్ ఎలిమెంట్ ప్రతి వార్తలో చూపిస్తూ రవి ఛానల్ తిరుగులేని 'infotainment channel' అయ్యింది. ఆ ఛానల్ చూపిన విజయసూత్రం అనుసరించడం కోసం అన్ని ఛానెల్స్ పాకులాడుతూ ఒక పక్క, పొజిషన్ నిలబెట్టుకునే క్రమంలో రవి టీం ఒక పక్క తెలుగు టెలివిజన్ జర్నలిజాన్ని మరింత దిగజారుస్తూ...పరిస్థితిని ఇక్కడిదాకా తెచ్చాయన్న అపవాదు ఉంది. 

ఆయన బృందంలో కీలక సభ్యుడు కరీం గారు ..అమ్మాయిల విషయంలో బద్నాం అయి...చివరకు దారుణంగా యాసిడ్ దాడికి గురికాగా, మరొక సభ్యురాలు స్వప్న రేడియోలో తన అదృష్టం పరీక్షించుకుని ఇప్పుడు 'సాక్షి' ఛానల్ లో దర్శనమిస్తున్నారు. కరీం కూడా ఏదో ఛానల్ లో తెర వెనుక ఉండి సేవలు అందిస్తున్నారు. ఏ చర్చనైనా అవలీలగా నవ్వుతూ నిర్వహించే....రజనీకాంత్ గారు మధ్యలో TV-9 వీడి మరొక ఛానల్ లో చేరి అక్కడ తట్టుకోలేక మళ్ళీ పాతగూటికే చేరుకున్నారు.  రామోజీ లేదా రవి బృందంలో పనిచేసిన వారే...ఇప్పుడు అన్ని ఛానెల్స్ లో కీలక పదవులు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు TV-5 లో ఇన్ పుట్ ఎడిటర్ గా ఉండి...వివాదాస్పద చర్చ జరిపి జైలుకెళ్ళిన వెంకట క్రిష్ణ 'ఈనాడు', 'ఈ-టీవీ' లో చాలాకాలం పనిచేసారు. పరిశోధనాత్మక కథనాలు ఇవ్వడంలో దిట్ట అయిన ఈయన ఒకప్పుడు రామోజీ గారి ఇష్టుడు.

ఇదే కేసులో ఇరుక్కున్న N-TV లో ఉన్నకొమ్మినేని శ్రీనివాస రావు, ఏలూరి రఘుబాబు, వీ.ఎస్.ఆర్.శాస్త్రి, శ్రీరాం తదితరులు కూడా 'ఈనాడు' ప్రోడక్టులే. వీరంతా రామోజీ గారి ప్రియతముల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారే. ఈ బ్యాచ్ లోనే ఉన్న రాజశేఖర్ గారిది ఇంకొంత డైనమిక్ చరిత్ర. రామోజీ దగ్గర, రవి ప్రకాష్ దగ్గరా పనిచేసారాయన. తాను కీలక భూమిక poshinchina TV-9 నుంచి వివాదాస్పద పరిస్థితుల నడుమ వైదొలిగి...అజ్ఞాతంలోకి వెళ్ళిన రాజశేఖర్ ఆ తర్వాత మరొక రాజ కుటుంబం తో 'i-news' పెట్టించి....అక్కడా అచ్చిరాక ఈ మధ్యనే N-TV లో చేరారు.

6 comments:

keshav said...

www.apmediawarzone.blogspot.com loo january 6 th na oka item raasaaru. anduloo ys jagan NTV TV5 loo investment chesi tanu cheppinatte media grip loo pettukoovadaaniki praytnaalu chestunnatlu rasaaru. next day ade jarigindhi. TV5 modalu pettadam sakshi, ntv continue cheyadam...
cinema modalu kaaka munde battabayalayyindi.

Anonymous said...

ramu garu,
tv9 kareem aedho channel lo pani chesthun naadu annaru.aayana garu STUDIO-N lo vunna vishaya meeku telise vuntundi kaani meeru "specify" cheyya leka pootun naaru endhukani?a manna reason vundha

kvramana said...

anna
you are just showing one side of the story in this posting. i did not like it. You are also a product of Ramoji Rao's institution. Why are trying to show just those who have gone off track? So, not all those worked in Eenadu are bad. But, I agree to your point that the increase in the number of stringers in the state and certain practices of some newspapers like asking the stringers to earn their own salary by using the identity card have made the problem acute. There is an immediate need for all us to force the managements to do an introspection and over haul the system.
Ramana

Anonymous said...

రామోజీ గారి పత్రిక కాని, ఛానల్ కాని మిగతా పత్రికలు, చానళ్ళ కంటే ఉత్తమ విలువలే పాటిస్తూందన్నది జగమెరిగిన సత్యం. ఇలాంటి రొచ్చుకు కారణం ఆయననడం అసంబద్ధం. మీరూ ఈనాడు నుండే వచ్చారు. ఈ రొచ్చులో మీకూ పాత్ర ఉంది అన్నట్టు ఉంది మీ వ్యాసం.

Anonymous said...

raviprakash butunu rastravyaptam chesaru.rajasekhar(ntv)ade bapatu. inkomata... rajasekharki journalismlo gold medal vachindi. butunu, newsnu ela kalapa vachho professionalga cheppi untadu. OU ki avamanam. cy chitamani, narla vanti goppa patrikeyukanu andinchina man rastramlo a chetta manushulu (manushula annadi naku doubt)undatam mana dovrbhagyam. vellanu nettina pettukunna channalsnu chuste... veallu inte anipistundi.ika viluval gurunchi mataldukovadam deniki?

friend said...

mana rashtramlo patrika viluvalu pathalaniki padipovadaniki adyudu ramoji aithe danni peak sthayiki teesukellindi ravi prakash. medialo vache scrollings, sms, stories, anchorla veshalu, varthala depth, itara tappulu choostoo janam navvukuntunnaru

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి