Friday, June 27, 2014

నెగ్గిన కే సీ ఆర్ పంతం: పత్రికను వదులుకున్న రాజం

తెలంగాణ గుండె చప్పుడు "నమస్తే తెలంగాణ" పత్రికను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కట్టబెట్టకుండా బెట్టుచేసి... మాంచి వ్యూహంతో రాత్రికి రాత్రే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న లక్ష్మీరాజం మనసు మార్చుకోక తప్పలేదు. ముఖ్యమంత్రి బాబాయి... చార్టెడ్ అకౌంటెంట్ దీకొండ దామోదర్ రావు కు నిన్న లాంఛనంగా పత్రికను రాజం సమర్పయామి చేసారు. 

నమస్తే తెలంగాణ సీఎండీగా గురువారం బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌రావుకు పుష్పగుచ్ఛం అందించి అభినందిస్తున్న పూర్వ సీఎండీ సీ లక్ష్మీరాజం ఫొటో (ఈ పోస్టులో ఉన్నది) ను ఆ పత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. పత్రిక సంపాదకులు అల్లం నారాయణ, సీఈవో కట్టా శేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ ఎడిటర్ కే కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ తులసీదాస్ వివిధ విభాగాల అధిపతుల సమక్షంలో ఈ యాజమాన్య మార్పిడి జరిగింది. కే సీ ఆర్ క్యాంపు ఆఫీసు పూజకు రాజం హాజరయినప్పుడే... ఇలాంటిదేదో జరుగుతుందన్న చర్చ జరిగింది. ఈ ఫోటో లో రాజం గారి ఆంగ్ల పత్రిక 'మెట్రో ఇండియా' ఎడిటర్ ఏ శ్రీనివాస రావు గారు లేరు. ప్రస్తుతం ఆ పత్రికను రాజం-రావు గార్లకే వాదులుతారా? లేదా? అన్నది కూడా మీడియా ప్రపంచంలో ఆసక్తిగా మారింది. 
నిజానికి... 'నమస్తే తెలంగాణ' పత్రికను మొదట్లో పెట్టింది... దామోదర్ రావు గారే. కానీ ఖర్చు తడిసి మోపెడు కావడంతో... దిక్కుతోచని పరిస్థితుల్లో చంద్రశేఖర్ రావు గారి మాట మేరకు రాజం దాన్ని టేకోవర్ చేసి ఒక స్థాయికి తెచ్చారు. కానీ అధికారం లోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీల మాదిరిగానే...తమకూ ఒక పత్రిక ఉండాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన గుర్తెరిగి ఇలా చేసారు. బీజేపీ లో చేరి... డిల్లీ నుంచి వచ్చి... పదిహేను శాతం చొప్పున జీతాలు పెంచి... పత్రికలో మీకూ షేరిస్తానని వాగ్దానం చేసిన రాజం ఒక్కసారిగా పత్రికను వదులుకోవడం 'నమస్తే తెలంగాణ' జర్నలిస్టుల్లో, వర్కర్లలో చర్చకు దారితీసింది. 

రాజం గారు బీజేపీ లో చేరిన తర్వాత 'నమస్తే తెలంగాణ' కు రావడం మానేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కట్టా శేఖర్ రెడ్డి గారు మళ్ళీ నగుమోముతో పత్రిక ఆఫీసులో కనిపించారు. ఎవర్ హుషారు గా ఉండే ఆయన ఈ పత్రిక యాజమాన్య మార్పిడి లో కీలక పాత్ర పోషించారని బావిస్తున్నారు. ముఖ్యమంత్రి కి దగ్గరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి స్వయంగా బావ అయిన కట్టా శేఖర్ రెడ్డి గారి పాత్ర ఇప్పుడు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. జగదీశ్ గారి ఏకైక సోదరి రేణుక గారు శేఖర్ రెడ్డి గారి సతీమణి. 
ప్రస్తుతం 'నమస్తే తెలంగాణ' ఎడిటర్ గా ఉన్న అల్లం నారాయణ గారు ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా చేరుతున్న నేపథ్యం లో శేఖర్ రెడ్డి గారు ఆ పదవిని భర్తీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే.. అల్లం నారాయణ గారి స్థానంలో ప్రస్తుత ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, అప్పటి వార్త ఎడిటర్ టంకశాల అశోక్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో లాగా మీడియా లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.  లెట్స్ వాచ్. 
(Photo and caption courtesy: Namaste Telangana)

3 comments:

Jai Gottimukkala said...

Thanks for the update sir.

Sitaram said...

welcome sir. You've given the input.In fact I was busy with some work and failed to follow it up.
thanks
Note: A blogger sent a comment dubbing the people of Telangana as "Telabans". Please don't use such language and get into troubles. The State government is keen on booking such people. Let us use these blogs to share information and discuss ideas for the betterment of the society and people...team TMK

Unknown said...

నమస్తే సార్.. హైదరాబాదు మీడియా హౌస్ లో జరుగుతున్న పరిణామాలపై కూడా చెప్పండి.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి