Wednesday, November 18, 2009

మరో మారు తెరపైకి ఎం.ఎన్.ఆర్.మెడికల్ వివాదం

''ఆన్ యువర్ సైడ్" అని జనానికి భరోసా ఇస్తూ....i-news ను స్థాపించిన ఎం.ఎన్.ఆర్. గ్రూప్ మరొక వివాదంలో మరొక సారి చిక్కుకుంది. మెదక్ జిల్లాలో వున్న ఎం.ఎన్.ఆర్. మెడికల్ కాలేజ్ లో తనఖీకి ఒక వున్నత స్థాయి బృందం వస్తున్న నేపథ్యంలో...ఆ యాజమాన్యం రోగులుగా నటించేందుకు ఎక్కడి నుంచో జనాన్ని తరలిస్తున్నదని ఆరోపిస్తూ 'టీ.జే.ఆర్.' అనే సంస్థ హడావుడి చేసింది.

సంస్థ సభ్యులు ఎం.ఎన్.ఆర్. ఉద్యోగి ఒకరిని దారుణంగా కొట్టారు. బండ బూతులు తిట్టారు. సెక్యూరిటీ సిబ్బందిని పక్కకు నెట్టి గందరగోళం సృష్టించారు. ఇది అక్కడి సంగారెడ్డి ఎం.ఎల్.ఏ.జగ్గా రెడ్డి మనుషుల పని అని i-news స్క్రోల్ మీద స్క్రోల్ వేస్తూ ఆయన పరువు తీసేందుకు మీడియాను వాడుకుంది. ఈ రోగుల తరలింపు వివాదం గురించి చెప్పకుండా ఆ ఛానల్...ఉద్యోగిని కొట్టడం, తిట్టడం ఒక్కటే పదే పదే చూపించి జగ్గా రెడ్డి మీద నిప్పులు చెరిగింది రాత్రి న్యూస్ లో.

సత్యం ఆగదు కదా! వైరి ఛానల్ TV-5 వారు జగ్గా రెడ్డి అనే మాట లేకుండా చాలా సేపు ఒక కథనాన్ని ప్రసారం చేసారు అదే సమయంలో. రోగుల తరలింపు విజువల్స్ తో పాటు వారిలో ఒకరి బైట్ కూడా వాడారు. ఆ కథనం చూస్తే...అర్థమయ్యేది ఏమిటంటే...ఎం.ఎన్.ఆర్. మెడికల్ కాలేజ్ వారు తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతున్నారని, దాన్ని ఒక లోకల్ సంస్థ అడ్డుకుంటుందని అర్థమవుతుంది. 

"రోగుల" తరలింపు గురించి టీ.జే.ఆర్. అనే ఆ సంస్థకు అంత పట్టింపు ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ... ఇన్నేసి ఛానెల్స్ ఉండబట్టే కదా..నాణానికి మరొక వైపు కూడా జనం చూడగలుగుతున్నారు అనిపించింది.

సరిగ్గా ఇలాంటి వ్యవహారం సందర్భంగానే TV-9 కు, ఎం.ఎన్.ఆర్. సంస్థకు మధ్య ఒక రెండు, మూడేళ్ళ కిందట పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ దరిమిలానే....ఒక సీనియర్ జర్నలిస్టు ఆ ఛానల్ వదిలి ఐ-న్యూస్ అనే దాన్ని ఎం.ఎన్.ఆర్. వారి చేత పెట్టించే వరకూ వెళ్ళింది. నిజానికి తనిఖీ కోసం ఒకటి రెండు రోజులు రోగులుగా నటించే వారిని తెచ్చుకోవడం చాలా చోట్ల జరుగుతుంది. కేంద్రం వారి పిచ్చి పిచ్చి రూల్స్ ను సంతృప్తి పరిచేందుకు...ఇలా చేయాల్సి వస్తుందని మెడికల్ కాలేజ్ వాళ్ళు వాదిస్తారు. అదేదో...పేద్ద పరిశోధనాత్మక కథనమని భావించి విలేఖరులు గొట్టాలతో వెళ్లి గొడవ పడుతుంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.
-----------------------------------------------------------------------------
సవరణ: ఎక్కడో పాత పోస్టులో ఒక చోట "నక్కకు నాగ లోకానికి" అని రాసినట్లు నేను జర్నలిజం స్కూల్ లో వుండగా...ప్రేమతో వేడి వేడి చారు చేసిపెట్టిన ఒక సీనియర్ 'ఈనాడు' నుంచి ఫోన్ చేసి చెప్పాడు. నిజమే, తప్పు నాదే. దాన్ని "నక్కకు నాక లోకానికి" అని చదువుకోగలరు. సిల్లీ తప్పునకు సారీ. చారు మిత్రుడికి 'థాంక్స్."

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి