Saturday, October 10, 2009

బాలగోపాల్ స్మృతి వ్యాసం ఖూనికి గురైన వైనం..

స్మృతి వ్యాసాలను ఇంగ్లీషులో 'obituaries' అని అంటారు. ప్రముఖులు మరణించినపుడు వారి గురించి చెప్పే నాలుగు మంచి మాటల మాలికే స్మృతి వ్యాసం. ఇలాంటి  వ్యాసాలు రాయటం ఒక కళ. ఇది అబ్బాలంటే కొంత లోతైన అధ్యయనం, భాషా సామర్ధ్యం, రాసే ముందు ఒక ప్రణాళిక చాలా అవసరం. పొంతన లేని నాలుగు పేరాలు రాసి అతికించి ఇదే స్మృతి వ్యాసం అంటే కుదరదు. అది పోయిన వారిని కించపరచడం అవుతుంది.



మానవహక్కుల సేనాని డాక్టర్ బాలగోపాల్ హఠాత్తుగా మరణించిన తర్వాత 'ఆంధ్రజ్యోతి' మేనేజింగ్ డైరెక్టర్ (ఎం.డి.) ఆ పేపర్లోనే October 10, 2009 నాడు రాసిన స్మృతి వ్యాసం సుదీర్ఘంగా వుంది కానీ..పస లేకుండా సాగిపోయింది. కష్టపడి పైకివచ్చిన రాధాకృష్ణ గారు రాసారంటే అది చాలా బాగుంటుంది కాబోలు అనుకున్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ విషాదంలో ఆయన మనసు చలించి పకడ్బందీగా రాయలేకపోయారేమో లేక తీరిక లేక వేరే వారితో రాయించి తన పేరిట అచ్చు వేయించారేమో అనిపించింది. ఎందుకు నాకు ఆ భావన కలిగిందంటే..
1) బాలగోపాల్ ను తాను ఎన్నడూ కలవలేదని..డెడ్ బాడీ ని చూసినప్పుడే చూడటమని వ్యాసం ఆరంభంలో రాధాకృష్ణ రాసారు. ఇది మంచి ఒప్పుకోలు. కానీ, బాలగోపాల్ గారిని కలవకుండా 30 ఏళ్ళ జర్నలిస్టు జీవితం గడిపిన వారు ఆంధ్ర ప్రదేశ్ లో వుంటారని...ఈ వ్యాసం చదివినంత వరకూ నేను అనుకోలేదు. ఇది నిజంగా విడ్డూరమే. ప్రచారం కోసం పాకులాడకపోయినా...జిల్లాల్లో జర్నలిస్టులకు కూడా బాలగోపాల్ సార్ సుపరిచితుడు. 

నేను "Mail Today" పత్రికకు హైదరాబాద్ లో Special Correspondent గా వున్నప్పుడు చాలా విషయాలలో అవగాహన కోసం సార్ కు ఫోన్ చేశాను. కొన్ని సార్లు కలిసాను. నల్గొండ లో "The Hindu" కోసం పనిచేసినప్పుడు పలువురు రిపోర్టర్లు ఆయన్ను విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు కలిసేవారు. బాలగోపాల్ మరణంతో ఎంతొ దిగులు, వెలితిగా ఫీల్ అయిన రాధాకృష్ణ గారు ఆయన బతికి వుండగా కలుసుకోలేక పోవడం నిజంగా చాలా చాలా మిస్ అయినట్లే. బాడ్ లక్.

2) సార్ గురించి స్పర్శా మాత్రంగా ఏదేదో రాసారు కానీ...వారు చేసిన కనీసం రెండు మూడు అద్భుతమైన పనులనైనా వివరించలేదు. బూటకపు ఎన్ కౌంటర్ లపై ధైర్యంగా గళం ఎత్తిన వ్యక్తి మహోన్నత వ్యక్తి ఆయన. నాకు తెలిసి దాదాపు అన్ని ఎన్ కౌంటర్ సైట్ లనూ సార్ తిరిగి వచ్చారు. ప్రతికూల పరిస్థితులలో "నిజ నిర్ధారణ బృందం" పేరిట కొండలు కోనలు తిరిగి వివరాలు సేకరించి మీడియాకు అందించే వారు. నయీం ముఠా బెదిరింపుల వంటివి, పోలీసుల హెచ్చరికలు ఈ బృంద సభ్యులకు కొత్త కాదు. తెలుగు దేశం, కాంగ్రెస్ హయాంలలో విచ్చలవిడిగా "సెజ్" ల పేరిట సాగిన భూ పందారాన్ని బట్ట బయలు చేసి బాధితుల పక్షాన పోరాడిన యోధుడు బాలగోపాల్ సార్. ఈ వివరాల జోలికి పోకుండా...పైపైన పెద్ద వ్యాసం రాశారేంటి? 

నక్సలైట్లతో ఆయనకు అభిప్రాయ బేధాలు...దరిమిలా ఆయనపై వారు ఒక పుస్తకమే వేయడం..ఇవన్నీ ఆయన గురించి అనుకోవాల్సిన ప్రాథమిక అంశాలు. సార్ పై మా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో దాడి జరిగినప్పుడు (1991 అనుకుంటా) ఆ వార్తను నేను కవర్ చేసాను--ఈనాడు కోసం. అది ఆ రోజు 'ఆంధ్ర జ్యోతి" మొదటి పేజిలో బాక్స్ వార్త గా వేసినది నాకు బాగా గుర్తు. సార్ నిర్బంధం మధ్య ఎంత ధైర్యంగా పనిచేసినదీ రాస్తే అది నిజమైన నివాళి అయి వుండేది.  



౩) మూడో పేరాలో...తాను అల్లం నారాయణ గారికి మాధవ్ "ఎన్ కౌంటర్" అప్పుడు చెప్పిన మాటలను కొటేషన్ గుర్తుల మధ్య చెప్పారు. "ఇలా అందరూ వెళ్ళిపోతే నోరులేని వాళ్లకు దిక్కు ఏమిటి.." అన్న మాట అందులో వుంది. దీని అర్థం నాకు బోధపడలేదు. అక్కడ స్పష్టత లోపించింది. 


4) బాలగోపాల్ గారు తల సరిగా దువ్వుకోరని, దాని గురించి తాను ఆయన భార్య వద్ద ప్రస్తావిస్తూ-"మీరన్నా పట్టించుకోవచ్చు కదా?" అన్నట్లు రాధాకృష్ణ రాసారు. ఇది ఎంత హాస్యాస్పదం! అసలు ఇదేమి సూచన? తిండీ గిండీ గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాడు...కాస్త ఆరోగ్యం సంగతి చూసుకోమని చెప్పండి మీరైనా..అని రాధాకృష్ణ సూచిస్తే బాగుండేది. అలా కాకుండా..ఆ విప్లవ మూర్తి భార్యతో..చొక్కా గుండీలు..చక్కగా లేని జుట్టు గురించి మాట్లాడారా ఈయన?    


5) వై.ఎస్. రాజశేఖర రెడ్డి తో సార్ ను పోల్చే ప్రయత్నం చేసారు. వై.ఎస్. దేవుడైతే..బాలగోపాల్ దేవదేవుడని రాధాకృష్ణ భావిస్తున్నారు. ఒక రాజకీయ వేత్తతో సార్ ను పోల్చడం బాగోలేదు. పోలీసులు, రాజకీయులు ఆయన్ను ఎన్నడూ మేధావిగా కాదు కదా ఒక స్పందించే మనిషిగా అయినా చూడలేదు. 


6) బాలగోపాల్ బాడీ ని వుంచిన ఆసుపత్రికి రాజకీయ నాయకుడు ఒక్కడూ రాలేదని రాధాకృష్ణ బాధపడ్డారు. అధికారంలో వున్నప్పుడు రాజ్యాన్ని గుడ్డిగా  సమర్ధించి దండుకునే వాళ్ళు రాక పోవడమే సార్ కు మంచిది. అయినా..బతికివుండగా రాధాకృష్ణ గారి లాంటి సీనియర్ జర్నలిస్టు సార్ ను కలవలేదంటే..చనిపోయిన తర్వాత రాజకీయులు పరామర్సిస్తారని ఎలా అనుకోవాలి? 


7) ఆసుపత్రి వద్ద సబ్ ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారినైన బందోబస్తు కోసం రాకపోవడం విషాదం..అని రాధాకృష్ణ ఈ వ్యాసంలో రాసారు. బాలగోపాల్ కు బందో బస్తు ఎందుకసలు? పోలీసులు తన బాడి దగ్గర కాపలా వుండక పోవడం బాలగోపాల్ గారికి ఆనందం కలిగించే అంశమే. 


8) బాలగోపాల్ విగ్రహం ప్రస్తావన  చేసి రాధాకృష్ణ మంచి పని చేసారు. దీన్ని ఈ పాలకులు పడనివ్వరు కాబట్టి..ఆంధ్ర జ్యోతి కార్యాలయం దగ్గర ఎం.డి.గారు పూనుకొని సార్ విగ్రహం ప్రతిష్ఠిస్తే చాలా బాగుంటుంది. 

3 comments:

Anonymous said...

రాము గారు...
ఈ వ్యాసంలో మీరు ప్రస్తావించిన అంశాలు అక్షర సత్యాలు ....
స్పందించే ప్రతి హృదయానికి ఆ మహా మనిషి మరణం బాధ కలిగిస్తుంది. నాకు కూడా అయన పరిచయమే. ఇలాంటి వారి గురించి కాస్త మనసుతో రాస్తే.... కనీసం ఒక మనిషైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కదా?
నిజానికి ప్రజల సమస్యలను వెలికి తీసేవారికి అండగా మేము ఉన్నామని చెప్పుకుంటున్న ఎలెక్ట్రానిక్ మీడియా ... మానవ హక్కులు కాపాడటం కోసం నిరంతరం శ్రమించిన బాలగోపాల్ గారి మరణానంతరం ఆయన మరణ వార్తకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి వుంటే బాగుండేది..
సంగీత

Mitra said...

Annaiah
Well said,
AJ MD RK gari vyasam pai Postmartum bavundi
urs
Padma Kranthi

venkat....nalgon.... said...

guruji its very nice......first of all congratulations...its very nice blog....useful for all ......i am really happy to see ur blog....
thank u sir.....
all the best....
jayahoooo..........

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి