Tuesday, March 17, 2015

హతవిధీ... వీ ఆర్ ఎస్ ప్రకటించిన 'ది హిందూ'

136 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో నాణ్యమైన జర్నలిజానికి నికార్సైన పేరని అనుకునే 'ది హిందూ' పత్రిక యాజమాన్యం (కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్-కె. ఎస్. ఎల్. ) మొట్టమొదటి సారిగా ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. జర్నలిస్టుల వేతన సంఘం సిఫార్సులు, తమిళ భాషలో ఎడిషన్ పెట్టిన దరిమిలా వచ్చిన నష్టాల నేపథ్యంలో యాజమాన్యం ఈ ప్రకటన చేసినట్లు సమాచారం. 
నలభై సంవత్సరాలకు పై బడిన వయస్సు ఉండి, పత్రికలో పదేళ్లకు మించిన అనుభవం ఉన్నవారిని ఉద్దేశించి ఈ పథకం ప్రకటించినట్లు 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక ఈ రోజు ఒక వ్యాసం ప్రచురించింది. అయితే తమకు ఇంకా అధికారిక సమాచారం రాలేదని ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు ఈ బ్లాగ్ బృందానికి చెప్పారు. ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు చాలా ఉదారంగా ప్యాకేజ్ ఉంటుందని, ఇండస్ట్రీ లో అత్యుత్తమంగా ఉండేలా చూసామని యాజమాన్యం ప్రకటించింది. అయితే... ఎంత మొత్తం ఇస్తారో స్పష్టంగా చెప్పలేదు.
2008 లో 230 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించిన కె ఎస్ ఎల్ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వేతన సంఘం సిఫార్సులు అమలు చేయడం మొదలు పెట్టడంతో లాభాల్లో ఏడాదికి నలభై కోట్ల మేర కోత పడింది. ఈ లోపు 2013 లో తమిళంలో పత్రికను ఆరంభించి చేతులు కాల్చుకుంది. 2013-14 లో దాదాపు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చినా... నష్టం 64 కోట్లుగా చూపిందని  'బిజినెస్ స్టాండర్డ్' కథనం. 

'ఆంధ్రప్రదేశ్' ఎడిటర్ గా కందుల రమేష్!

అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణాలలో మూడు మీడియాల్లో (ప్రింట్, టీవీ, ఆన్ లైన్) సమర్ధంగా పనిచేసిన అనుభవం ఉన్న ఏకైక జర్నలిస్టు కందుల రమేష్. చాలా మంది తెలుగు జర్నలిస్టులు అంతర్జాలంలో తమ మెయిల్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి ముందే రమేష్ బెంగళూరులో ఒక ఆన్ లైన్ మీడియా హౌజ్ లో పనిచేసారు. సీ వీ ఆర్ న్యూస్ లో కన్సల్టింగ్ ఎడిటర్ హోదాలో మూడు కీలక బాధ్యతలు (తెలుగు, ఇంగ్లిష్ ఛానెల్స్, హెల్త్ మాగజీన్) నిర్వహిస్తున్న ఆయన ఐ-న్యూస్, టీవీ 5 ఛానెల్స్ లో పనిచేసారు. అంతకన్నా ముందు "ది ట్రిబ్యూన్'' కు రిపోర్టర్ గా పనిచేసారు. సుప్రభాతం అనే తెలుగు మాగజీన్ లో కూడా ఆయన పనిచేసినట్లు గుర్తు. తను "సెంట్రల్ యూనివెర్సిటీ" ప్రొడక్ట్ అని చెబుతారు.
ఇప్పుడు కందుల రమేష్ చంద్రబాబు ప్రభుత్వ పత్రిక "ఆంధ్రప్రదేశ్" కు ఎడిటర్ గా నియమితులయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీని దృవీకరణకు ఆయనకు ఒక మెయిల్ ఇచ్చాం... కానీ స్పందన రాలేదు. (ఆరంభంలో బాగా స్పందించే జర్నలిస్టులు ఒకటి రెండు ఛానెల్స్ లో చేరాక, కాస్త సంపాదించాక మెయిల్స్ కు, ఫోన్ కాల్స్ కు స్పందించారు మరి!).

"సొంతగా ఒక ఛానెల్ పెట్టాలని తను అనుకున్నాడు. మరి ఈ పత్రిక బాధ్యతలు ఎందుకు తెసుకున్నారో అర్థం కాలేదు," అని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. నిజానికి కందుల మూవ్ పెర్ఫెక్ట్. ఎందకంటే... ఇప్పుడు "ఆంధ్రప్రదేశ్" ఎడిటర్ గా మూడేళ్ళు పనిచేసి వచ్చే ఎన్నికలకు ముందు ఛానల్ ప్లాన్ చేస్తే అన్నిరకాలుగా బాగుంటుంది.   

Saturday, March 14, 2015

మీడియాలో అత్యంత కీలక పరిణామాలు

'ది హిందూ' రెసిడెంట్ ఎడిటర్ గా మురళీధర్ రెడ్డి 
ప్రముఖ ఆంగ్ల పత్రిక 'ది హిందూ' హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ గా సీనియర్ జర్నలిస్టు, దక్షిణాసియా జర్నలిజంలో అగ్రశ్రేణి రిపోర్టర్ బి. మురళీధర్ రెడ్డి ఈ వారం నియమితులయ్యారు. ఆయన విధుల్లో చేరడం, ఉద్యోగులతో కాంటాక్ట్ లోకి వెళ్ళడం కూడా అయ్యింది.  సౌమ్యుడిగా, మృదు స్వభావిగా ఆయనకు పేరుంది. 
శ్రీలంక జాతుల పోరాట పరిణామక్రమాన్ని దగ్గరి నుంచి చూసిన, ఎల్ టీ టీ ఈ-లంక సైన్యం యుద్ధాన్ని ప్రత్యక్షంగా ది హిందూ, ఫ్రంట్ లైన్ పత్రికలకు విస్తృత స్థాయిలో రిపోర్ట్ చేసిన అత్యంత అనుభవజ్ఞుడు మురళీధర్ రెడ్డి గారు. ముందు సుసర్ల నగేష్ కుమార్, ఆయన అర్థంతరంగా పదవి నుంచి వైదొలిగాక బెంగుళూరు నుంచి బదిలీ మీద వచ్చిన కె. శ్రీనివాస రెడ్డి ఇదే పదవిలో పనిచేసారు. శ్రీనివాస రెడ్డి గారు కీలకమైన బాధ్యతల నిర్వహణకు చెన్నై వెళ్ళాల్సివచ్చాక... కొన్ని రోజులు జల్లెడపట్టి మరీ మురళీధర్ రెడ్డి గారిని ఈ పదవిలో నియమించారు. గతంగా ఆయన పాకిస్థాన్ లో, దేశ రాజధానికి కూడా పనిచేసినట్లు 'ది హిందూ' వర్గాలు చెప్పాయి. మురళీధర్ రెడ్డి గారి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా అట. వుయ్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. 
(Photo courtesy: www.onlanka.com)

ఏలూరు 'ది హిందూ' రిపోర్టర్ రాజీనామా?
ఇది మునుపటి 'ది హిందూ' కాదన్న వాదన మరీ ఎక్కువగా వినిపిస్తున్నది ఈ మధ్యన. మజిథియ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసినట్లేచేసి...ఉద్యోగులను నయానా భయానా కాంట్రాక్ట్ సిస్టంలోకి తీసుకువచ్చి, ప్రతిభతో కూడిన ప్రమోషన్లు ఇస్తున్న ఈ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులు అభద్రతాభావంతో ఉన్నారనడంలో సందేహం లేదు. ఏలూరు లో దాదాపు 15 ఏళ్ళుగా 'ది హిందూ' స్పెషల్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్న సిన్సియర్ జర్నలిస్టు జి.నాగరాజు రాజీనామా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 
ఆయన 'టైమ్స్ ఆఫ్ ఇండియా' విజయవాడ బ్యూరో చీఫ్ గా వెళుతున్నట్లు చెబుతున్నారు. 'ది హిందూ' వీడి ఒక సీనియర్ జర్నలిస్టు 'టైమ్స్' లో చేరడం ఈ మధ్యకాలంలో ఇదే ప్రథమం. అప్పట్లో 'ది హిందూ' లో పనిచేసిన విక్రం శర్మ ఇప్పుడు 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' లో హైదరాబాద్ బ్యూరో చీఫ్ గా ఉన్నారు. 
"కాంట్రాక్ట్ సిస్టం లోకి మారడం తో జర్నలిస్టులలో బాగా అభద్రతా భావం పెరిగింది. అక్కడా (టైమ్స్) కాంట్రాక్ట్ సిస్టమే అయినా... పదవి, దాంతో పాటు నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి... మిత్రుడు నాగరాజు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు," అని 'ది హిందూ' లో సీనియర్ జర్నలిస్టు ఒకరు ఈ బ్లాగు బృందంతో చెప్పారు. 
'ది హిందూ' యాజమాన్యం కోరినా... కాంట్రాక్ట్ పద్ధతిలోకి పోయే పత్రాల మీద సంతకాలు చేయని అతి కొద్ది మంది జర్నలిస్టులలో నాగరాజు గారు ఒకరని సమాచారం. కులం, ప్రాంతం, గాడ్ ఫాదర్లను బట్టి కాకుండా...సొంత ప్రతిభతో ఒక పధ్ధతి ప్రకారం మూడు దశాబ్దాలుగా జర్నలిజానికి సేవలు అందిస్తున్న జర్నలిస్టు నాగరాజు గారు. వారికి అంతా మేలు జరగాలని కోరుకుంటున్నాం. 
'నమస్తే తెలంగాణా' వారి ఇంగ్లిష్ పత్రిక? 
 'నమస్తే తెలంగాణా' యాజమాన్యం అతి త్వరలో 'తెలంగాణా టుడే' పేరిట ఒక ఆంగ్ల పత్రికను తీసుకురాబోతున్నట్లు సమాచారం. డెక్కన్ క్రానికల్ లో రిపోర్టింగ్ లో పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్టు ఆధ్వర్యంలో ఇది రాబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 'మెట్రో ఇండియా' పనిచేస్తున్న చోటనే కొత్త పత్రిక ఆపరేషన్స్ ఉంటాయి. 'నమస్తే తెలంగాణా' ఆఫీసు కిందనే ఉన్న మెట్రో ఆఫీసు ను ఇందుకోసం సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. ఈ మేరకు... అప్పరసు శ్రీనివాస రావు గారి నేతృత్వంలోని 'మెట్రో ఇండియా' ఆఫీసును వేరే చోటికి మార్చే ప్రక్రియకు పత్రిక అధిపతి సీ ఎల్ రాజం శ్రీకారం చుట్టారు. సీనియర్ స్టాఫ్ కోసం ఆయన చేయని ప్రయత్నాలు లేవు. 

ఊళ్ళోకి రాబోతున్న 'హన్స్ ఇండియా' 
ఎడిటర్ నాయర్ గారు వెళ్ళాక, డాక్టర్ కే నాగేశ్వర్ పగ్గాలు స్వీకరించాక 'ది హన్స్ ఇండియా' రూపు రేఖా విలాసాలు గణనీయంగా మారాయి. ముఖ్యంగా లుక్ పూర్తిగా మారి ఇప్పుడు పత్రిక కాస్త సంసార పక్షంగా ఉన్నది. మొదట్లో హన్స్ లో ఉండి... తర్వాత మెట్రో లో చేరి మళ్ళీ ఈ మధ్యన పాత గూటికి చేరిన తాటికొండ భాస్కర్ రావు గారు ఈ లుక్ మార్పులో కీలక పాత్ర పోషించారనడం లో అనుమానం లేదు. 
మరొక పక్కన... నాగేశ్వర్ సార్ ప్లానింగ్, సూపర్బ్ ఎడిటర్ పెన్నా శ్రీధర్, రామూ శర్మ తదితరులు కంటెంట్లో తెస్తున్న  మార్పిడితో ఇది సాధ్యమయినట్లు చెప్పుకోవచ్చు. 
ఈ పత్రికను, దాంతో పాటు హెచ్ ఎం టీవీ కార్యకలాపాలను...వేరే ఖండంలో ఉన్నట్లు అనిపించే ఏ ఎస్ రావు నగర్ నుంచి హైదరాబాద్ సిటీ మధ్యకు తెస్తున్నారు. ఈ ఆఫీసులు ఎల్ బీ స్టేడియం చుట్టుపక్కలకు మారుస్తున్నట్లు అధికారిక సమాచారం.

Friday, March 13, 2015

నేడు వరల్డ్ స్లీప్ డే: సుఖంగా నిద్రించండి


(వరల్డ్ స్లీప్ డే సందర్భంగా మార్చి 19, 2010 లో ప్రచురించిన వ్యాసమిది)
నేను ఏ బస్సు ఎక్కుతున్నా...మా అమ్మ...'జాగ్రత్త నాన్నా. స్టేజీ చూసుకో..." అని నవ్వుతుంది. ఆ జాగ్రత్త ఎందుకంటే...మన నిద్ర గురించి. ఏ బస్సు ఎక్కినా...పదకొండో నిమిషంలో నిద్రాదేవత ఒడిలోకి జారిపోవడం...మా నాన్నకు, నాకు అలవాటు. చిన్నప్పుడు ఒకసారి బస్సులో నిద్రపోయి పక్క స్టేజిలో దిగా కాబట్టి...అమ్మ ఆందోళనతో ఆ హెచ్చరిక చేస్తుంది. 

ఎందుకో గానీ....ఇప్పటికీ నాకు...ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ అంటే అక్కడ నిద్ర వస్తుంది... పెద్దగా పనిలేకపోతే. దూర ప్రయాణాలలో రోడ్డు పక్క చెట్టుకింద...కారు ఆపి పదంటే పది నిమిషాలే సుఖంగా నిద్రపోయి లేచి మళ్ళీ డ్రైవింగ్ ఆరంభిస్తే....'బాబూ...నువ్వు  మనిషివి కాదు...' అని ఇంట్లో రెండు జీవులు దెప్పుతుంటాయి నన్ను. తమకు నిద్రపట్టడం లేదని ఎవరైనా అంటే...నాకు భలే జాలి వేస్తుంది. 

 స్కూలు రోజుల్లో...అంతా నైట్ అవుట్లు చేస్తుంటే...గంట కొట్టినట్లు తొమ్మిది గంటలకు మనం బెడ్ హిట్టింగ్ చేయడం వల్ల ఇంట్లో అందరికీ మండేది. ఇప్పటికీ...నా అంత్యంత స్నేహితులు నన్ను రాత్రి పూట పార్టీలకు రమ్మనరు. కారణం...అక్కడే ఒక టైం అయ్యాక ఒక మూల మనం చేసే పవళింపు. 

నేను నిద్రను ఎంజాయ్ చేసినట్లు ఎవ్వరూ చెయ్యరని...ఈ బ్లాగ్ పెట్టక మునుపు దాకా అనుకునే వాడిని. ఈ బ్లాగ్ మూలంగా యేవో ఆలోచనలు...ఏదో రాయాలని, ఉద్ధరించాలని తలంపు. మెదడులో ఆలోచనా క్రమం, ధార దెబ్బతినకముందే కంపోజ్ చేయాలన్న పిచ్చి భావన వల్ల నిద్ర కొద్దిగా దూరమయ్యింది. ఈ వరల్డ్ స్లీప్ డే సందర్భంగా దీన్ని సవరించుకోవాలి. 

రాత్రి నిద్ర చేడిందా...చాలా మంది మర్నాడు ఉదయం కొంత బీభత్సం సృష్టిస్తారు. నిద్ర సరిగా లేని బాస్ లే ఉద్యోగులపై అకారణంగా విరుచుకుపడతారు. నిద్ర లేని వాళ్ళే ఇతరులపై చిర్రుబుర్రులాడుతుంటారు. నిద్రలేకపోతే...నరాల వ్యవస్థ సహకరించదు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. 

కాలం గాయాన్ని మాన్పుతుందని అంటారు కానీ...ఏ గాయాన్నైనా...జోకొట్టి నిద్రపుచ్చి మాయం చేసేది నిద్రే. ఇంత మంచి నిద్ర కోసం...ఒక దినోత్సవం ఉండడం సంతోషకరం.ఈ ఒక్క రోజైనా ఆలోచనలు, ఒత్తిళ్ళు పక్కన దిండు కింద పెట్టి...హాయిగా గుర్రుపెట్టి నిద్రపోండి. నిద్రపొయ్యేవారిని నిద్రలేపకండి. 

మిత్రులకు నేను ఒక సలహా ఇస్తుంటాను....మంచి సీరియస్ నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటే...నిద్రపొయ్యే ముందు దాని గురించి ఆలోచించి...నిద్ర లేచాక డెసిషన్ తీసుకోండి. నిద్ర చాలా విషయాలను తేలిక పరుస్తుంది. 
ఇక ఈ పై ఫోటో గురించి ఒక ముక్క. ఇది కాకినాడలో ఒక టేబుల్ టెన్నిస్ పోటీలకు నా కొడుకు ఫిదెల్తో వెంటవెళ్లి...మధ్యాన్నం కొద్దిగా తిన్నాక ఎర్రటి ఎండలో చెట్టునీడన కుర్చీలో కూర్చుని హాయిగా ఒక కునుకు తీస్తుండగా...మా వాడి ఫ్రెండ్ తండ్రి శ్రీధర్ గారు నాకు తెలీకుండా తీసి నాకు పంపిన ఫోటో. ఒక మధుర ఘడియను చిత్రీకరించిన శ్రీధర్ గారికి థాంక్స్.  


ఈ సందర్భంగా...http://worldsleepday.wasmonline.org/ నుంచి కాపీ చేసిన ఈ తీర్మానాలు మీ కోసం...

The World Sleep Day declaration is as follows:
  • Whereas, sleepiness and sleeplessness constitute a global epidemic that threatens health and quality of life,

  • Whereas, much can be done to prevent and treat sleepiness and sleeplessness,

  • Whereas, professional and public awareness are the firsts steps to action,

  • We hereby DECLARE that the disorders of sleep are preventable and treatable medical conditions in every country of the world.

Thursday, March 12, 2015

న్యూయార్క్ యూనివర్సిటీ జర్నలిజం బోధకుడిగా సల్మాన్ రష్దీ

ప్రసిద్ధ, వివాదాస్పద భారత రచయిత సర్ అహ్మద్ సల్మాన్ రష్దీ  న్యూయార్క్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 'ఆర్థర్ ఎల్ కార్టర్ జర్నలిజం ఇన్ స్టిట్యూట్' లో జర్నలిజం బోధకుడిగా నియమితులయ్యారు. 1981 లో 'మిడ్ నైట్స్ చిల్డ్రన్' అనే నవలకు బూకర్ ప్రైజ్ పొందిన రష్దీ 'Distinguished Writer in Residence' హోదాలో అక్కడ ఐదేళ్ళ పాటు జర్నలిజం విభాగానికి సేవలు అందిస్తారు. జర్నలిజం విద్యార్థులకు బోధించడం, సలహాలివ్వడం ఆయన విధులు. 
రష్దీ నియామకాన్ని ఎన్ వై యూ జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ సుకేతు మెహతా తన ట్విట్టర్ పోస్టులో ప్రకటించారు. 

"Mr. Rushdie exemplifies the mission of the Journalism Institute - a centre for research and teaching in the cultural hub and media capital that is New York City - and he will join our ranks of incredibly talented writers, reporters, producers, and critics, to engage and inform our local community in journalism and beyond," అని ఆ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.  రష్దీ ఘనతలు  ఇలా ఉన్నాయి: 
A Fellow of the British Royal Society of Literature and the American Academy of Arts and Letters, Salman Rushdie has received, among other honours, the Crossword Book Award in India, the Whitbread Prize for Best Novel (twice), the Writers' Guild Award, the James Tait Black Prize and the European Union's Aristeion Prize for Literature.
He was knighted by Queen Elizabeth II in 1997 for "services to literature".
In addition to his many essays and four non-fiction books (essays, memoir, and reportage), Rushdie is the author of a book of stories and 11 novels, including Midnight's Children, which was awarded the Booker Prize in 1981.
He also holds honorary doctorates and fellowships at six European and six American universities, is an Honorary Professor in the Humanities at MIT, and University Distinguished Professor at Emory University.

Wednesday, March 11, 2015

పోరాట యోధులకు సుప్రీం కోర్టు బాసట

మజిథియ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సుల విషయంలో మొండి మీడియా యాజమాన్యాలు సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తుండడంపై జర్నలిస్టుల వీరోచిత పోరాటం సాగుతోంది. విచారణ ను ఏప్రిల్ 28 కి వాయిదా వేస్తూ కోర్టు... వేతనాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులపై కక్ష సాధింపు వద్దని చెప్పింది. ముఖ్యంగా... ధిక్కార పిటిషన్ వేసిన జర్నలిస్టులను వేధిస్తే ఊరుకోబోమని కోర్టు చెప్పిందని, యాజమాన్యాల దాష్టీకాలకు బలయ్యే సిబ్బంది తమను సంప్రదించి సమాచారం అందించాలని  'ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్' కోరింది. మరిన్ని వివరాల కోసం ఫెడరేషన్ ఫేస్ బుక్ పేజీ (Indian Federation of Working Journalist - IFWJ) కి వెళ్ళండి. తాజా పరిణామాలపై ఫెడరేషన్ సోషల్ మీడియా సెల్ ఇన్ చార్జ్ అందిస్తున్న సమాచారం ఇది: 
Hon’ble ‪#‎SupremeCourt‬ warns ‪#‎DainikJagran‬, ‪#‎RajasthanPartika‬,‪#‎DBCorpLtd‬ & ‪#‎UshodayaPublications‬ for delay in replying to contempt notices in regard to ‪#‎MajithiaWageBoard‬
Dear Comrade,
A Bunch of contempt petitions were taken up by the Hon'ble Supreme Court of India as item no. 1 before the bench Comprising Hon'ble Justice Ranjan Gogoi and Justice N.V. Ramana. The proprietors of the newspapers who have proved to be niggardly and miserly in paying the wages and allowances as per the Majithia Wage Boards recommendations even after the clear direction of the Supreme Court fielded top notched lawyers of the country like; ‪#‎KapilSibbal‬‪#‎AnilDiwan‬,‪#‎AbishekManuSighvi‬ and ‪#‎GopalJain‬ etc.
It may be noted here, that in spite of the clear direction given by the Hon'ble Court to the Contemnor-proprietors they have failed to file their counter affidavit to the contempt petitions.
The Hon'ble Supreme Court today sternly warned the defaulters like the Rajasthan Patrika, D.B. Corp Ltd, Ushodaya Publications, that if they fail to file their reply with in fifteen days from hence, heavy cost will be imposed on them.
The petitioner's Advocate and Secretary General IFWJ‪#‎ParmanandPandey‬ has been granted two weeks time to file the Rejoinder after the received of the Counter Affidavit.
The court also made it clear that the pleadings of all cases should be completed at least a week before the next date of hearing. The court proposed before the advocates to suggest a mutually agreed upon the date so that there should not be any scope for further adjournment.
The advocate for the workers of the Jagran Prakashan Ltd., Rajasthan Patrika Ltd., Ushodaya Publication attracted the attention of the Hon'ble Court that the large scale harassment and victimization of employees is going on in these newspapers, particularly against those employees who have filed the contempt petitions. The Hon'ble Court was pleased to hear cases on the next date of hearing (28.04.2015).
Therefore, if any newspaper proprietor is indulging into malafide transfer, harassment or any other type of victimization please bring it to our notice so that we can incorporate in our Rejoinder to the Counter Affidavit.
The Hon'ble Court also consented to put all the Impalement Applications on Board.
Vishwadev Rao,
In-charge Social Media Cell
IFWJ

Sunday, March 8, 2015

సూపర్ ఎడిటర్ వినోద్ మెహతా మృతి


భారతీయ జర్నలిజం లో కురువృద్ధుడి లాంటి సీనియర్ ఎడిటర్, 40 ఏళ్ళ పాటు ఈ వృత్తిలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తి, తన పెంపుడు కుక్కకు 'ఎడిటర్' అని పేరు పెట్టుకున్న వినోద్ మెహతా ఈ రోజు దీర్ఘ కాలిక అనారోగ్యంతో దేశ రాజధానిలో కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య (సుమితా) ఉన్నారు, పిల్లలు లేరు.
భారత దేశంలో అత్యంత స్వతంత్రంగా, నిర్మొహమాటంగా పనిచేసిన జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన డెబోనైర్, ది సండే అబ్సర్వర్, ది ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పయోనీర్ లలో పనిచేసారు. జర్నలిజంలో ఎలాంటి డిగ్రీ లేకున్నా... భాషా పటిమ, విశ్లేషణా సామర్థ్యం, తెగింపు లతో అవుట్ లుక్ అనే పత్రికు వ్యవస్థాపక ఎడిటర్.

పత్రికలు మూతపడుతూ... ప్రింట్ జర్నలిజం శకం ముగిసిందని అనుకుంటున్న సమయంలో మాగజీన్ జర్నలిజాన్ని నిబద్ధతతో నిర్వహించి... కొత్తపుంతలు తొక్కించిన కలం యోధుడు వినోద్ మెహతా.  రహేజా గ్రూప్ తరఫున వినోద్ మెహతా 1995 అక్టోబర్ లో అవుట్ లుక్ ను ఆరంభించి అద్భుతమైన వ్యాసాలు అందించారు. అనారోగ్యం తో ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకుని 2012 నుంచి అవుట్ లుక్ కు ఎడిటోరియల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న రావుల్పిండి లో 1942 లో జన్మించిన ఆయన ఎడిటర్ గా జర్నలిజం ఆరంభించడం చెప్పుకోదగ్గ విశేషం. బీ ఏ థర్డ్ క్లాస్ లో పాసయినట్లు చెప్పుకునే వినోద్ మూడు పుస్తకాలు రాసారు. అందులో మూడు జీవిత చరిత్రలు (ముంబాయి, సంజయ్ గాంధీ, మీనా కుమారి), రెండు తన అనుభవాల సారం (లక్నో బాయ్, ఎడిటర్ అన్ ప్లగ్డ్), ఒకటి సంకలనం (మిస్టర్ ఎడిటర్, హౌ క్లోస్ అర్ యు టు ది పీఎం?).

టెలివిజన్ జర్నలిజాన్ని అరుపులు, కేకలు, గాండ్రింపులు, గద్దింపులతో కొత్త పుంతలు తొక్కిస్తున్న అర్నబ్ గోస్వామి లాంటి ఎడిటర్లు సైతం.. వినోద్ ను 'జర్నలిజం దేవుడి' గా భావిస్తారు, ఆరాధిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటు పలువురు సీనియర్ ఎడిటర్లు ఆయన మృతికి సంతాపం వ్యక్తంచేసారు.

2009 జనవరిలో ఉస్మానియా యూనివర్సిటీ, ప్రెస్ అకాడమీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వినోద్ మెహతా హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా ఆయనతో పిచ్చాపాటా మాట్లాడే అవకాశం లభించింది. ఆ వివరాలు సందర్భానుసారం తర్వాత...