Wednesday, June 5, 2019

రవిప్రకాశ్ అంటున్న అమ్రిష్ పురి ఎవరు?

ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఈ రోజు సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు హీరో లా వచ్చారు. నింపాదిగా కారు దిగి ప్యాంటు జేబులో చెయ్యి దూర్చి ఫోటోలకు ఫోజు ఇచ్చి... మీడియాతో క్లుప్తంగా మాట్లాడి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం కార్యాలయం లోపలికి  వెళ్ళారు.  ఇరవై ఏడు రోజుల పాటు పోలీసుల కళ్లుకప్పి తప్పించుకు తిరిగిన ఆయన, అంతకు ముందు మీడియాకు పంపిన వీడియోలో కన్నా, చాలా కూల్ గా ఉన్నారు. పోతూపోతూ వీర విప్లవ యోధుడిలాగా... విప్లవం వర్ధిల్లాలి టైపులో పిడికిలెత్తి 'నేను మీ సహకారం కోరుతున్నా' అని చెప్పారు.   

భూకబ్జా తో పోలుస్తూ... ఇప్పుడు మీడియా కబ్జా జరుగుతున్నదని రవిప్రకాశ్ ఆరోపించారు.  మీడియాకు, మాఫియాకు యుద్ధం జరుగుతోందని, ప్రజలంతా మీడియా వైపు ఉండాలని ఆయన కోరారు. తన మానసపుత్రిక అని ప్రచారం జరుగుతున్న మోజో టీవీ ప్రస్తావన తెచ్చారాయన. ఒక్క రూపాయైనా ఇవ్వకుండా దానిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన అమ్రిష్ పురి వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. ఉచితంగా తీసుకోవాలని చూస్తున్నారని ఆవేదనతో చెప్పారు. 

పలు మీడియా సంస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఒక భవన నిర్మాణ సంస్థ అధిపతిని ఉద్దేశించి రవిప్రకాశ్ ఈ వ్యాఖ్య చేసినట్లు భావిస్తున్నారు.  ఇవ్వాళ మాత్రం రవిప్రకాశ్ సానుభూతి పొందేలా మాట్లాడారని అనిపించింది.  పాలకులకు దగ్గరగా ఉండే వాళ్ళతో పెట్టుకున్న రవిప్రకాశ్ ను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తాపీగాప్రకటించే అవకాశం ఉంది.  

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి