Sunday, June 2, 2019

జగన్ కు ఆంధ్రజ్యోతి వే.రా. కౌంటర్!



ప్రమాణ స్వీకారం రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు మీడియా హోస్ ల ప్రస్తావన తెచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 లు బాబుకు ప్రాధాన్యత ఇస్తున్నాయని అయన చెప్పదలచుకున్నారు. దాని మీద...ఈ మూడు సంస్థల స్పందన ఎలా ఉంటుందోనని ఎదురుచూశాం. 'ఈనాడు' వ్యూహాత్మక మౌనం పాటించినట్లుంది. టీవీ-5 ఏమన్నదో తెలియదు.

మూడు సంస్థల పేర్లు ప్రకటించడం ద్వారా "వీళ్లంతా నా శత్రువులని జగన్ డైరెక్ట్ గా ప్రకటించార"ని సీనియర్ ఎడిటర్ ఐ వెంకట్రావ్ మహా న్యూస్ ఛానెల్ లో వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తప్ప మరొకరు కంటికానని ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ గారు తన వారాంతపు కాలమ్ 'కొత్తపలుకు' చివర్లో లో స్పందించారు (ఈ పక్క బాక్స్ చూడండి). కేసులు కొత్తకాదని ఆయన కౌంటర్ ఇస్తూ.. కక్ష సాధింపు ఆలోచనలు మానుకుని ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించి మంచి పేరు తెచ్చుకోవాలని వే.రా. చెప్పారు. 

నిజానికి ఈ బాక్సులో మొదటి లైన్ లోనే రాధాకృష్ణ గారి విషప్రచారపు ధోరణి కనిపిస్తుంది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసి పత్రికలు, ఛానెళ్ల పై కేసులు పెడతానని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు ఇందులో రాసింది అబద్ధం.  జగన్ ఆ నాడు చెప్పిన మాటలు వేరు, దానికి  వే. రా.  భాష్యం వేరు. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి